జింబాబ్వేను ఓ ఆటాడుకున్న టీమ్ ఇండియా.. 71 పరుగుల తేడాతో సునాయాస విజయం

సూపర్ 12 లో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై ఇండియా ఘన విజయం సాధించి గ్రూప్ 2లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ఘనంగా సెమీస్ కు చేరింది.  ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం సాధించి 71 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  ఫామ్ లోకి వచ్చిన రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ లో హై లైట్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే. సూర్యకుమార్ యాదవ్ పాతిక బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ స్కోరులో నాలుగు సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.  స్కిప్పర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ సాధికారికంగా ఆడి 26 పరుగులు చేశాడు. దినేష్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. హార్ధిక్ పాండ్యా 18 పరుగులు చేశాడు.   జింబాబ్వే బౌలర్లు ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసినా.. ఆ తరువాత చేతులెత్తేశారు.  మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చిన తరువాత బౌలర్లు బౌండరీలు ఇవ్వడానికే బౌల్ చేస్తున్నారా అన్నట్లుగా సీన్ మారిపోయింది.  187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో  17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటర్లలో సికందర్ రజా 24 బంతుల్లో 34 పరుగులు, రియాన్ బర్ల్ 22 బంతుల్లో 35 పరుగులు మాత్రమే రాణించారు. మెరుపు బ్యాటింగ్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

ఏపీ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు!

మోడీ విశాఖపర్యటన బీజేపీలో విభేదాలను బయటపెట్టింది. సోము వీర్రాజుపై పార్టీ సీనియర్లలో ఉన్న అసంత‌ృప్తి భగ్గుమంది. వైసీపీ మోడీ రాష్ట్ర పర్యటనను  హైజాక్ చేస్తే ఏం చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజుపై మాటల దాడి చేశారు. పార్టీ నేతలకు కనీస సమాచారం లేకండా వైసీపీ ప్రధాని కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేస్తున్నదనీ, మీరేం చేస్తున్నారనీ విమర్శలతో సోముపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రమేయం  లేకుండా ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా సమీక్షిస్తారంటూ సోము వీర్రాజును పార్టీ సీనియర్లు నిలదీశారు. ఈ సీన్ కు బీజేపీ కోర్ కమిటీ సమావేశం వేదికైంది. సీనియర్ల విమర్శలకు ఆగ్రహించిన సోము వీర్రాజు వారిపై ఎదురుదాడికి దిగారు.     ఎవరి బతుకులేమిటో నాకు తెలుసంటూ విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ కోర్ కమిటీ సమావేశం రసాబాసగా మారిపోయింది. సోము వీర్రాజు, సీనియర్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ దశలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్ చార్జి మురళీధరన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అదే సమయంలో అందరినీ కలుపుకుని పోవాలని సోము వీర్రాజుకు హితవు చెప్పారు. ఈ నెల11న ప్రధాని మోడీ విశాఖకు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటనపై చర్చించేందుకు జరిగిన కోర్ కమిటీ భేటీలో  ప్రధాని కార్యక్రమం గురించి ముందుగా తెలియాల్సింది వైసీపీకా? బీజేపీకా అని ఏపీ బీజేపీ సీనియర్లు సోము వీర్రాజును ప్రశ్నించారు. దీంతో సీనియర్లు, సోము వీర్రాజు మధ్య వాగ్వాదం జరిగింది.     

దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆశలు గల్లంతు.. నెదర్లాండ్స్ చేతిలో చిత్తు

వరల్డ్ కప్ విజయం దక్షిణాఫ్రికాకు మరో సారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి వైదొలగింది. పసి కూన నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగు తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఔటైపోయింది. ఇన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన  వరల్డ్ కప్ ను ఈ సారి ఎలాగైనా సాధించి తీరాలని, ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికాకు  మరోసారి నిరాశే మిగిలింది. గ్రూప్ బిలో నిన్నటి (నవంబర్ 5) వరకూ అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆదివారం(నవంబర్ 6)న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాలో పరాజయం పాలయ్యింది. దీంతో సఫారీల వరల్డ్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో మ్యాచ్ ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సఫారీలకు వరల్డ్ కప్ అందని ద్రాక్షే అన్న సంగతి మరో సారి రుజువైంది. అద్భుతమైన బ్యాటింగ్ తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచిన నెదర్లాండ్ బ్యాటర్ ఆకెర్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ఉత్కంఠ రేపుతున్న మునుగోడు కౌంటింగ్.. రౌండ్ రౌండ్ కూ మారుతున్న ఆధిక్యత

మునుగోడు ఉఫ ఎన్నిక కౌంటింగ్ ప్రతి రౌండ్ కూడా హార్స్ రేస్ ఫొటో ఫినిష్ లా ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తే, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇలా రౌండ్ రౌండ్ కూ ఫలితం దోబూచులాడుతూ ఉత్కంఠను పెంచేస్తోంది. మొదటి నుంచీ పరిశీలకులు అంచనా వేసినట్లు గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్, అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని అంటున్నారు. ఆ పార్టీ ఆశించినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కమలం గూటికి చేరకపోవడం.. అలాగే కాంగ్రెస్ ఓటు పెద్దగా బీజేపీకి అనుకూలంగా టర్న్ కాకపోవడం ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ బీజేపీ కంటే 613 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఉంది.  టీఆర్‌ఎస్ కు 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితం సరళిని బట్టి చూస్తూ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నిది చివరి వరకూ తేలే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఐదో రౌండ్ ఫలితం వెలువడటంలో జాప్యంపై హై డ్రామా నడిచింది.  టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తే తప్ప ఫలితం వెలువరించరా అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు.  ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది నైతిక ఓటమి అన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన రౌండ్ల ఫలితాలను గమనిస్తే బీజేపీ గెలవబోతున్నదని స్పష్టమౌతున్నదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించిందన్నారు. అలాగే మంత్రులు ఇన్ చార్జీలుగా ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ ఆధిక్యత కనబరిచిందని చెప్పారు.  అలాగే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో అనుకున్నంత మెజారిటీ రాలేదని అంగీకరించారు. ప్రస్తతానికి టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నా.. రౌండ్ రౌండ్ కూ ఫలితం మారుతోందనీ, బీజేపీ విజయం తథ్యమనీ అయితే చివరి వరకూ హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పారు. 

రాటుదేలిన షర్మిల రాజకీయం.. ప్రతి అడుగులోనూ అన్న జగన్ కు చెక్!

ఏదీ ఏమైనా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీని స్థాపించి ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర  ద్వారా సాధించిన గుర్తింపు కంటే.. తెరాస అధినాయకత్వంపై విమర్శలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసి ఫిర్యాదుల ద్వారానే ప్రాచుర్యం పొందారని చెప్పారు. అయితే.. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ప్రస్థానాన్ని గమనిస్తే ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనే తన తండ్రి రాజశేఖరరెడ్డిని స్ఫురింప చేస్తున్నారన్న చర్చ అయితే రాకీయ వర్గాలలోనూ, జన బాహుల్యంలోనూ జోరుగా సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆహార్యాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా.. ఆయన ప్రదర్శించిన రాజకీయ చాణక్యాన్ని సైతం ఆమె ప్రదర్శిస్తున్నారన్న భావన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తమౌతోంది.   షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించి.. పాదయాత్ర ప్రారంభించడం.. అలాగే రైతులు, నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడాన్ని తొలుత అంతా  లైట్‌ తీసుకున్నప్పటికీ, ఇటీవల వైయస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కేసీఆర్ ప్లస్ మెగా కృష్ణారెడ్డిల అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి రావడం... ఆ తర్వాత అంటే పక్షం రోజులకే  షర్మిల హస్తినకు పోయి ఇదే అంశంపై ఫిర్యాదు చేయడాన్ని జనం ప్రస్తావిస్తున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగానే వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐకి  షర్మిల స్వయంగా వాంగ్మూలం ఇవ్వడంపై  ఆమె ధైర్యాన్ని, చిత్తశుద్ధని, పట్టుదలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుందని.. ఈ నేపథ్యంలో   జగన్ ఫ్యామిలీలో చోటు చేసుకొన్న పరిణామాలను   చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల తరువాత ఏం చేయబోతోందన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. షర్మిల తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి... నమ్మితే ప్రాణాలు ఇస్తారని.. అదే తోక జాడిస్తే మాత్రం కత్తిరించేస్తారని..షర్మిల తీరు కూడా  అచ్చు గుద్దినట్లు.. తండ్రి లాగే ఉందన్న మాట ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తోంది.   జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయకోసం జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడమే కాదు.. బై బై బాబు లాంటి నినాదాలు ఇచ్చిన షర్మిలను ఆ తర్వాత   జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమెను దూరం పెట్టడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.  ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు నీరు గార్చే ప్రయత్నం సోదరుడు జగన్ చేస్తున్నారన్న విషయంపై   షర్మిల వాంగ్మూలం ఇవ్వడం నిజంగా సాహసమేననీ, అదే సమయంలో వాస్తవాలు వెలికిరావాలన్న ఆమె పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడం జగన్ గట్టి దెబ్బేనని కడప జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు.. రాబోయే రోజుల్లో ఈ ఇంటి గుట్టు తాడేపల్లి ప్యాలెస్‌కు చేటు అన్నట్లుగా ఉండవచ్చునని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మటికి మహానేత రాజకీయ చతురత అని చెబుతున్నారు. దీంతో సోదరుడిని సీఎం పీఠం ఎక్కించడమే కాదు.. అవసరమైతే ఆ పీఠం మీద నుంచి కిందకు దింపడం కూడా..  షర్మిలకు తెలుసుననే గుసగుసలు ఇప్పటికే కడప జిల్లాలో వివవస్తున్నాయి.   మరోవైపు తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ షర్మిలలోని పోరాట పటిమను.. పట్టుదలను ఈ సందర్భంగా ఆమె తల్లి వైయస్ విజయమ్మ గుర్తు చేసిన విషయాన్ని సైతం ఉమ్మడి కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  గతేడాది జులై 8న వైయస్ఆర్ తెలంగాణ పార్టీని వైయస్ షర్మిల స్థాపించి.. అదే ఏడాది అక్టోబర్ 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైయస్ షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. కానీ వైయస్ షర్మిల పాదయాత్రకు ప్రజల్లో మైలేజ్ రావడం లేదని.. ప్రజల్లో ఆమెకు అదరణ కరువైందనే ఓ చర్చ అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజంలో కొనసాగింది.  కానీ ప్రస్తుతం వైయస్ షర్మిల పాదయాత్రే కాదు.. ఢిల్లీ యాత్రను సైతం తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారనే వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా మహానేత తనయగా.. షర్మిల తన రాజకీయాన్ని మరింత పదును పెడుతోందని.. అందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఉమ్మడి కడప జిల్లా వాసులు చెబుతున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో వాంగ్మూలం వరకూ ఆమె వేస్తున్న అడుగులు జగన్ కు చెక్ పెట్టేవిగా ఉన్నాయని కూడా అంటున్నారు. అన్నిటికీ మించి హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షోకు ఆమె హాజరు కావడానికి అంగీకరించడం అంటే జగన్ తో అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కింగ్ కోహ్లీ కటౌట్ అదిరింది !

రాజు ఒక్కడే ఉంటాడు.. క్రికెట్ లోనూ అంతే.. యుగానికి ఒకడు లా ఈ తరానికి కోహ్లీ యే కింగ్.. సచిన్, ధోనీ, దాదా లు వెనకంజలో పడిపోయారు. ఇప్పటి అత్యాధునిక ధనాధన్ క్రికెట్ కి వీరుడు, కింగ్ అనదగ్గ వాడు కోహ్లీయే అని క్రికెట్ లోకం లక్షనోళ్ల పొగుడుతోంది... ఆరాధిస్తోంది.  అత్యాధునిక రాజుకి, క్రికెట్ భగవాన్ కి నిలువెత్తు.. 36 అడుగుల కటౌట్ తో హైదరాబాద్ వీరాభిమానులూ వీరాభిమానం చాటుకుం టున్నారు.  క్రికెట్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే వీరబాదుడు.. పరుగుల వరద అంటే అతనితోనే సాధ్యం.  ఆమధ్య కొంత ఫామ్ కోల్పోయా డని నీరసపడిన క్రికెట్ అభిమానులకు మళ్లీ సరిగ్గా టీ20 ప్రపంచకప్ సమయానికి ఫామ్ లోకి తిరిగి వచ్చా సత్తా ప్రదర్శిస్తున్నాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ అత్యధికంగా 1065 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇది ఆషా మాషీ వ్యవహారం కాదు. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించడంతో పాటు ఆ రికార్డును నెలకొల్పడం గమనార్హం. జట్టులో రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి హేమా హేమీలు ఉండవచ్చుగాక కోహ్లీ రూటే వేరు.. అతని రాక పరుగుల వరద. అతని జోరు పరుగుల హోరు.. ప్రేక్షకుల ఆనంద కెరటం. అదంతే గురూ.. అక్కడ అవతల ఎవరున్నా సరే.. ఇటు మనోడు బ్యాట్ తో రెచ్చిపోవడం ఖాయం అన్న ధీమా జట్టుకే కాదు.. ప్రేక్షకుల్లో ఉండడమే వారి గమనార్హం. ఇంతటి వీరాభిమానం పొందడం గతంలో సచిన్ కి ఆ తర్వాత దాదాకి ఆ తర్వాత ధోనీ కే సాధ్యమయింది. కానీ ఇప్పుడు క్రికెట్ లోకమంతా కోహ్లీ నామస్మరణతోనే గడిచిపోతోంది. అతను క్రికెట్ పిచ్చాడు.. భారీ స్కోర్ చేస్తేనే నిద్రపోతాడు.. అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  కుటుంబ సభ్యులకు దూరంగా జట్టు సభ్యులతో కలిసి ఉంటున్న కోహ్లీ... తన బర్త్ డే వేడుకలను కూడా జట్టు సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా శనివారం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... టీమిండియా మెంటల్ కండిషనింగ్ ఎక్స్ పర్ట్ ప్యాడీ అప్టాన్ తో కలిసి కోహ్లీ బర్త్ డే కేక్ ను కట్ చేశాడు.  ఇదిలా ఉంటే...బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో స్థాయి ఎలివేషన్ ను కోహ్లీ అందుకున్నాడు. కోహ్లీ బర్త్ డేను పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అతడి 50 అడుగుల ఎత్తున్న కటౌట్ వెలిసింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను లిఖిస్తూ సాగుతున్న కోహ్లీకి మరిచిపోలేని గుర్తుగా హైదరాబాదీ అభిమా నులు ఈ కటౌట్ ను ఆవిష్కరించారు.

సెమీస్ కి ఇంగ్లండ్... ఆసీస్ ఆశలు గల్లంతు

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీరవిహారంతో ఇంగ్లండ్ లంకపై 4 వికెట్ల తేడాతో  గెలిచి సెమీస్ సీటు ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ విజయంతో టోర్నీ ఆతిథ్య మిస్తున్న ఆసీస్ కు సెమీస్ ఆశలు గల్లంతయినట్టే. లంక 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.  టాస్ గెలిచిన లంక ముందుగా బ్యాట్ చేయడానికి ఆసక్తి చూపింది. మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద గౌరవప్రద స్కోర్ చేసి ప్రత్యర్ధిని తన బౌలర్లు, ఫీల్డింగ్ సామర్థ్యంతో నిలువరించవచ్చని కెప్టెన్ దశున్ శంక అనుకున్నాడు.  లంక ఇన్నింగ్స్ లో పథుమ్ నిస్సంక తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి 45 బంతుల్లో 67 పరుగులు చేయడంలో జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశాలు కల్పించాడు. అలాగే భానుక రాజపాక్స 22 బంతుల్లో 22 పరుగులు చేయడంలో జట్టు స్కోర్ ను పరుగులుపెట్టించాడు. అయితే వారిద్దరు తప్ప మిగతావారెవ్వరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనలేక పోయారు. మార్క్ ఉడ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, ఆదిల్ రషీద్, సామ్ కురన్, స్టోక్స్ చేరో వికెట్ తీసుకు న్నారు.  గ్రూప్ 1లో ఈ మ్యాచ్ లంకకు అత్యంత కీలకంగానూ మారింది. కానీ భారీ స్కోర్ చేయలేకపోవడంతో ఇంగ్లండ్ ను బౌలర్లు, ఫీల్డింగ్ సామర్ధ్యంతో అడ్డుకోవాలని ప్రయత్నించింది. 142 పరుగుల లక్ష్యంతో దిగిన  ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీర బాదుడుతో లంక బౌలర్లు బెంబేలెత్తారు. వారి ధాటికి ఇంగ్లండ్ మొదటి వికెట్ కు 75 పరుగులు లభించాయి. కానీ  ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం లంక ఫీల్డింగ్ ఎంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేపట్టింది అర్ధమవుతుంది. ముఖ్యంగా లంక బౌలర్లు వానిందు హసరంగ, ధనంజయ డి సిల్వా, లహిరు కుమార ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను దెబ్బతీయగలిగారు. కానీ బెన్ స్టోక్స్  ఎప్పటిలానే దాడి చేసి జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టడంలో 36 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కానీ అందులో కేవలం రెండే ఫోర్లు ఉన్నాయి. చివరగా క్రిస్ ఓక్స్ కొట్టిన ఫోర్ తో ఇంగ్లండ్ విజయం సాధించింది.  దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ లో గెలచినప్పటికీ రన్ రేట్ లెక్కన చూపినపుడు ఇవాళ ఇంగ్లండ్ రన్ రేట్ బాగా మెరుగ్గా ఉండడం తో ఆస్ట్రేలియా కు సెమీస్ చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి.

గోవా వెళ్లండి... రమ్ మిక్స్ టీ  తాగి తూగండి!

టీ అనేక రకాలు.. వాటిలో గ్రీన్ టీ ఆరోగ్యానికి మరీ మంచిది అంటున్నారు. భారీ ప్రచారాలు జరుగుతు న్నాయి. కానీ టీ లో మరేదయినా కలిపితే? ఎప్పుడూ ఒకేలా టీ, కాఫీ తాగడం దేనికి. ఏదో కొత్తదనం ఉండాలనుకునే కుర్రాళ్లకి ఒక రెస్టారెంట్ వారు కొత్తరకం టీ తయారుచేస్తున్నారు. దాని పేరు మాంక్ టీ అంటున్నారు. ఇదేదో ఫారిన్ డ్రింక్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది పక్కా ఇండియన్ బ్రాండ్ టీ. అవును కాబోతే దీని కోసం గోవా వెళ్లాలి.  ఒక్క కప్పు టీ తాగడానికి గోవా వెళ్లాలా అంటే మరి కొత్తరకం కాంబినేషన్ టీ  సామాన్యమైనది కాదు.. ఓల్డ్ మాంక్ తో కలిసిన టీ. అవును మీరు చదువు తున్నది కరష్టే.  అసలు గోవా అంటేనే సరదాల మయం. గోవా ట్రిప్ అంటేనే కుర్రాళ్లకి, సరదాగా కొద్దిరోజులు గడపాలను కునే టూరిస్టులకు పెద్ద ఎంటర్టైన్మంట్ సెంటర్. అక్కడ అన్నీ తమాషాలే. అన్నీ వింతలే. దానికి ఇప్పుడు కొత్తగా కొత్తరకం టీ ఒకటి యాడ్ అయింది. వింతల్లో వింత కాదు.. మందు మార్బల్యంలో కొత్త సరదా.  గోవా కాండోలిమ్లోని సింకెరిమ్ బీచ్ వద్ద ఒక చిన్న టీ డాబా. ఇప్పుడది పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. కారణం ఓల్డ్ మాంక్ టీ. అక్కడ మామూలు టీ, కాఫీ లతొ పాటు ఈకొత్తరకం టీ, కాఫీ లనూ అమ్ము తున్నారు. చిన్న మట్టి పాత్రను కాస్త వేడి చేసి అందులో కొద్దిగా ఓల్డ్ మాంక్ రమ్ పోస్తారు. తర్వాత బాగా కాచిన టీని అందులో కలుపుతారు. తర్వాత మట్టిపాత్రలోని ఈ వింత పానీయాన్ని మరో మట్టిపాత్రలో పోసి దాన్ని తాగడానికి ఇస్తారు. అన్నట్టు ఇదంతా ఒక టీ కప్పు సైజు టీ మాత్రమే ఉంటుంది. కాఫీ లోకూడా అంతే ఒక స్పూన్ ఓల్డ్ మాంక్ రమ్ వేడి కాఫీలో కలుపుతారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారుగా.. ఇదో కొత్త పానీయం.. దీన్ని మాంక్ టీ అంటున్నారు. దీన్ని తయారీ కూడా వీడియో తీసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.గోవా వెళితే ఇక జనం తప్పకుండా మాంక్ టీ తాగకుండా తిరిగిరారేమో.  

జగన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పీకే వ్యూహాలు?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను, వైసీపీని బలహీన పర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారా? కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో తాను విభేదిస్తుంటే.. తమ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఆ బీజేపీతోనే అంటకాగుతుండడం కేసీఆర్ కు ఏమాత్రం నచ్చడం లేదా? అటు నదీ జలాల విషయంలో ఇటు ప్రాజెక్టుల విషయంలో మరో పక్కన విద్యుత్ బకాయిల విషయంలో ఉమ్మడి ఆస్తుల వ్యవహారంలో ఏపీతో ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే యోచనలో  కేసీఆర్ ఉండి ఉండొచ్చని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దాంతో పాటు కేసీఆర్ ఇటీవలే తమ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా పోటీ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు సంపాదిస్తేనే.. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీలో దిగాలంటే.. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలి.. లేదంటే దానితో సర్దుబాటు అయినా చేసుకోవాలి. కానీ ప్రస్తుతం 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైసీపీ బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు జగన్ ఏమాత్రం చోటిచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం (నవంబర్ 3)  కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా ఏపీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకు ముందే.. ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గత ఎన్నికల్లో జగన్ పదవీ దాహానికి అనవసరంగా సాయం చేశానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అనడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం పతనమయ్యేలా పీకే, కేసీఆర్ ల ఏదైనా ప్రణాళిక రూపొందించారా అన్న అనుమానాలు సైతం వారు వ్యక్తం చేస్తున్నారు.   ఎన్నికల వ్యూహాలు వేసేందుకు ఐప్యాక్ సంస్థను ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేశారు. అటు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో రావడానికి, ఇటు ఢిల్లీలో కేజ్రీవాల్ కు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడానికి, తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చేందుకు ఇంతకు మందు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచించారు. అయితే.. తాను ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారిపోయి.. బీహార్ లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో  ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్- ప్రశాంత్ కిశోర్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పరిశీలకలు చెబుతున్నారు. వీరిద్దరూ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే. దాంతో శత్రువకు శత్రువు మిత్రుడంటారు కదా? అలా అన్నమాట.  ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నారంటున్నారు. దీంట్లో భాగంగానే వారిద్దరూ ప్రగతి భవన్, ఫాంహౌస్ లలో పలు మార్లు భేటీ అయ్యారు. పలు వి  వ్యూహాలు రచించారు. పనిలో పనిగా ఏపీలో జగన్ ను, వైసీపీపి కూడా బలహీనం చేసే వ్యూహం ఏదో రచించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరి నోటా జగన్ మాట వినిపించిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్న జగన్ ను  ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. బీజేపీకి దూరం కావాలని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాను జగన్ తిరస్కరించి ఉండొచ్చని, అందుకే పీకే జగన్ కు సహాయం చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.   మొదట్లో కేసీఆర్, జగన్  బీజేపీకి మద్దతుగానే నిలిచారు. పెద్ద నోట్ల రద్దు,  370 ఆర్టికల్ రద్దు, జీఎస్టీ,  ఉమ్మడి పౌరసత్వం, వ్యవసాయ చట్టాలు వంటి మోడీ నిర్ణయాలకు అప్పట్లో పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీ, టీఆర్ఎస్ కూడా పూర్తి సహకారం, మద్దతు అందించాయి.   కానీ ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీతో టీఆర్ఎస్ విభేదించింది. కానీ.. జగన్ మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. ఇదే కేసీఆర్ కు నచ్చడం లేదని అంటున్నారు. నిజానికి అన్ని విధాలా తమతో కలిసి వస్తున్న జగన్  సర్కార్ ను కూల్చే అవసరం బీజేపీకి లేదని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ చెప్పడం వెనుక ఇరు పార్టీల మధ్యా చిచ్చు రగల్చాలన్న లక్ష్యమే ఉందని అంటున్నారు. మొత్తానికి బీజేపీపైన, ఆ పార్టీ పెద్దల పైన జగన్ లో అనుమానం బీజాలు నాటడం ద్వారా ఇటు కేసీఆర్, అటు ప్రశాంత్ కిశోర్ ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోదీజీ...మహిళా శక్తి అంటే ఇదేనా?

పొద్దుటే అమ్మాయి ఇంటికి రాగానే తల్లిదండ్రులు చెప్పాపెట్టక ఇలా వచ్చేసేవేమిటే.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. కాఫీ తాగి తీరిగ్గా మా ఆయన తిట్టాడు వచ్చేశానంది అమ్మాయి.. అంతే అల్లుడి ఇంటి మీదకు దండయాత్రకి వెళ్లినట్టు వెళ్లారు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని పక్కింటివారూ తోడయ్యారు. అం దర్నీ చూసి ఖంగారుపడ్డాడు సదరు అల్లుడుగారు. తినకుండా కూచుంది తిట్టానన్నా డు.. అంతేగదా..అని నవ్వుకున్నారు.  మొన్నామధ్య ఒకతను పెళ్లం మీద కోపగించుకుని ఇంట్లోంచి వెళి పోయాడు. ఆ సంగతి విని అతని తల్లితో పాటు ఊరంతా నవ్వుకుంది. మొగాడివి ఏడుస్తూ వచ్చే డమేమిటని హేళనా చేశారంతా. మగవాడు బాధపడితే ఎందుకు నమ్మరో తెలీదు గాని, ఇటీవలి కాలంలో భార్యాబాధితులు కూడా తయారయ్యారు. కానీ కోర్టు దాకా ఎవరూ వెళ్లరు. పోనీ వెళ్లినా కోర్టంతా బామ్మగారిలా నవ్వుతుంతే.  కర్ణాటక బెంగుళూరుకి చెందిన యదునందన్ అనే వ్యక్తిది దాదాపు ఇదే అవస్థ. అతని బాధలు అంా యింతా కాదట. డబ్బుకి, స్థిరాస్తులకు ఇబ్బంది పెట్టడం కంటే ఎక్కువట.  తిట్టడం, కొట్టడం స్థాయి దాటి ఏకంగా కత్తితో దాడి చేసిందట అతని భార్య. అరచేయి కోసుకుపోయిందిట. రోజూ తనను ఏదో ఒక కారణంతో చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోతు న్నాడు. ఎవ్వరూ తనకు మద్దతుగా మాట్లాడలేక పోతున్నారు. అది కుటుంబ సమస్య అని, భార్యాభర్తలు మీరే తేల్చుకోవాలని చెప్పి తప్పించుకుం టున్నారు. ఇదే భార్య మీద చిన్న మాటతో రెచ్చిపోయినా ఊరంతా మీదపడే కాలంలో ఇలాంటి మగవారికి ఏమాత్రం మద్దతు లభించదన్నది యదునందన్ గోడు తెలియజేస్తోంది.   ఇక లాభం లేదని యదునందన్ ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయానికి ట్వీట్  చేశాడు.. తనను భార్య నుంచి కాపాడ మని. అసలే దేశ రాజకీయాల్లో తలమునకలయిన ప్రధానికి ఇలాంటి భార్యాబాధితుల గోడు సీరియస్ గా పట్టించుకుంటారా  అను మానమే అంటున్నారు యదునందన్ సంగతి తెలిసినవారు. పైగా తనలాగా ఎందరో భార్యాబాధితులు ఉన్నారని వారిని రక్షించే బాధ్యత తీసుకోవాలన్నాడు. ఆ పురుష పుంగవుడు చేసిన ట్వీట్, పీఎంఓనూ ఆలోచనలో పడవేసిందట. అంతేకాదు,  మీరు చెప్పే నారీ శక్తి అంటే ఇదేనా? అని ఆవేశపడి.. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి?ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? లేదా?అని అమాయకంగా పీఎంఓనే సలహా అడిగాడు.  ఇప్పుడు ఈ ట్వీట్  సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయి, సాటి పురుష పుంగవుల సానుభూతిని టన్నుల కొద్దీ దోచేస్తోంది. ఇక యదునందన్ భావీజీవితం పీఎంఓ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడిందనాలేమో. అసలే రాజకీ యాలతో సతమతమవుతున్న ప్రధాని, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, సమాచారాలతో బిజీగా ఉన్న పీఎంఓ మరి యదునందన్ కు మద్దతునిస్తుందో లేదో చూడాలి. 

ఇప్పటం కూల్చివేతలపై చంద్ర నిప్పులు

ఏపీలో వైసీపీ దుర్మార్గాలతో పాటు అసాధ్యాలను చేస్తామంటూ అరాచకాలకూ పల్పడుతోంది. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత ఆ కోవలోకే వస్తుంది. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన స్థితిపై రోజూ వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమంలో ప్రభుత్వ నిర్వాకాన్ని ఏకి పాడేస్తున్నా ఖాతరు చేయడంలేదు. కానీ అవసరం లేని చోట్ల రోడ్ల విస్తరణ అంటూ ఇళ్లను కూల్చేస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో 53 ఇళ్ల కూల్చివేత. ఇళ్ల కూల్చివేతను అడ్డుకోవాలంటూ ఆ గ్రామస్తులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు నిర్ణయం వెలువరించడానికి ముందే దౌర్జన్యంగా పోలీసుల పహారాతో గ్రామంలో ఇళ్లను కూల్చేశారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ కు పోయే కాలం దాపురించిందనీ, అందుకే దిక్కుమాలిన పనులన్నీ చేస్తోందనీ నిప్పులు చెరిగారు. తప్పులు చేయడంలో జగన్ శిశుపాలుడిని దాటేశాడని దుయ్యబట్టారు. వంద తప్పులు చేసిన శిశుపాలుడికి శిరచ్ఛేదన జరిగిందనీ, వంద తప్పులు దాటేసిన జగన్ ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారు. అరాచకపాలకు, విధ్వంసాలకు ఏపీని కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని అన్నారు. సీఎం జగన్ అధికార మదానికి, అహంకారానికి, దౌర్జన్యాలకీ, దుర్మార్గాలకూ చరమ గీతం పాడేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. నిండా 600 గడప కూడా లేని ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు నిర్మిస్తారా? అసలు మీవి రోడ్లేసే మొహాలేనా అంటూ చంద్ర నిప్పులు చెరిగారు. ఇప్పటం వెళ్లకుండా జనసేనానిని అడ్డుకునే ప్రయత్నాల ద్వారానూ, విద్యుత్ సరఫరా నిలిపివేసి మాపై రాళ్ల దాడి చేస్తేనో మిమ్మల్ని చూసి భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు. కూల్చవేతలకు కాదు.. ఏదైనా నిర్మించి చూడండి అని సవాల్ చేశారు.  

భూమికి తిరిగి వచ్చేసిన రిసాట్2

భారతదేశ మొట్టమొదటి 'ఐ ఇన్ ది స్కై' ఒక దశాబ్దానికి పైగా కీలక సహాయక పనులు పూర్తి చేసిన తర్వాత భూమికి తిరిగి వచ్చేసింది. ఇస్రో  రాడార్-ఇమేజింగ్ ఉపగ్రహం రిసాట్-2 భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, అక్టోబర్ 30 న జకార్తా సమీపంలో హిందూ మహాసముద్రంలో పడింది, ఇది భారత్ మొట్ట మొదటి  'గూఢచారి' లేదా నిఘా  ఉప గ్రహం, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత దేశం దానిని నిలుపుకోవడం కోసం ప్రారంభించింది. సరిహద్దులు, సము ద్రాలు సురక్షితంగా ఉన్నాయి.  పాకిస్తాన్‌పై రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రారంభించడానికి దాని చిత్రాలే ఎంతో ఉపకరించాయి. 30 కిలోల ఇంధనాన్ని మోసుకెళ్లిన రిసాట్-2, 13.5 సంవత్సరాల పాటు అనేక చొరబాట్లు , ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో కీలకపాత్ర పోషించింది. ఆశించిన జీవిత కాలానికి మించి తన విధిని నిర్వహించింది. 2016లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లోని టెర్రర్ లాంచ్‌ ప్యాడ్‌ లపై సర్జికల్ స్ట్రైక్ మరియు ఫిబ్రవరి 2019లో బాలాకోట్ వైమానిక దాడిని ప్లాన్ చేయడంలో ఈ ఉపగ్రహంలోని చిత్రాలు భద్రతా మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సహాయ పడ్డాయి. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అందించిన ఎక్స్-బ్యాండ్ సింథటిక్-ఎపర్చర్ రాడార్ ప్రధాన సెన్సార్  కాబట్టి రిసాట్-2 ఇజ్రాయెల్ సహాయంతో నిర్మించారు. రిసాట్-1 ఉపగ్రహం కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన సి- బ్యాండ్‌లో జాప్యం కారణంగా 2008లో 26/11 ఉగ్రదాడుల తర్వాత రిసాట్-2 ప్రయోగం వేగవంతమైంది. అందుకే  ఏప్రిల్ 26, 2012న రిసాట్-1 ప్రయోగానికి మూడేళ్ల ముందు ఏప్రిల్ 20, 2009 న రిసాట్-2ను ప్రయోగించారు. ఈ  ఉప గ్రహం పగలు-రాత్రి  అన్ని వాతావరణాలను పర్యవేక్షించే సామ ర్థ్యాన్ని కలిగి ఉంది. హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో భద్రతా ముప్పుగా భావించే శత్రు నౌకలను ట్రాక్ చేయడానికి కూడా ఇది ఉపయోగించబడింది. సెప్టెంబరు 2, 2009న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు తోటి ప్రయా ణీకుల ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్ క్రాష్ యొక్క శిధిలాలను వెతకడానికి, గుర్తించడానికి ఉప గ్రహాన్ని రెస్క్యూ మిషన్లలో కూడా ఉపయోగించారు. అక్టోబర్ 30న జకార్తా సమీపంలోని హిందూ మహా సముద్రంలో అంచనా వేసిన ఇంపాక్ట్ పాయింట్ వద్ద రిసాట్-2 భూ వాతావరణంలోకి నియం త్రణకు వీలులేకుండా చేరిందని ఇస్రో తెలిపింది. ఇస్రోలోని స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్ బృందం కక్ష్య, మిషన్ ప్లానింగ్  సరైన నిర్వహణతో  ఇంధనం  ఆర్థిక వినియోగం ద్వారా, రిసాట్-2 13 సంవత్సరాలకు పైగా చాలా ఉపయోగకరమైన పేలోడ్ డేటాను అందిం చింది. దాని ఇంజెక్షన్ నుండి, రిసాట్-2 యొక్క రాడార్ పేలోడ్ సేవలు వివిధ అంతరిక్ష అనువర్తనాల కోసం అందించబడ్డాయి, ఏజెన్సీ తెలిపింది. “రీ-ఎంట్రీలో, శాటిలైట్‌లో ఇంధనం మిగిలి లేదు మరియు అందువల్ల కాలుష్యం లేదా పేలుడు లేదు... ఏరో-థర్మల్ ఫ్రాగ్మెంటేషన్ కారణంగా ఉత్పన్నమయ్యే ముక్కలు రీ-ఎంట్రీ హీటింగ్‌లో ఉండవని అధ్యయనాలు నిర్ధారించాయి మరియు అందువల్ల శకలాలు లేవు. భూమిపై ప్రభావం చూపాయని పేర్కొంది. రిసాట్-2 భూమిపైకి తిరిగి ప్రవేశించినప్పుడు, అంతరిక్ష శిధిలాల కోసం అవసరమైన అన్ని అంతర్జాతీయ ఉపశమన మార్గదర్శ కాలను ఇది పాటించింది, బాహ్య అంతరిక్షం దీర్ఘకాలిక స్థిరత్వం పట్ల ఇస్రో  నిబద్ధతను చూపిస్తుంది.

ఇప్పటంలో ఏం జరుగుతోందసలు?

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణ నెపంతో 53 ఇళ్లు, ప్రహారీగోడలను అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలు ఇప్పుడు ఏపీలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇప్పటం గ్రామంలో అనేక మంది జనసేన మద్దతుదారులు ఉన్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వారు ధైర్యంగా ముందుకు వచ్చి స్థలం ఇవ్వడమే ఇప్పుడు ఈ కూల్చివేతలకు కారణమని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ‘కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంద’ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ విధ్వంసానికి ఇది పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఫైరయ్యారు. ఇప్పటంలో రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చివేశారని బాధితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటంలో అసలు ఏమి జరుగుతోందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటంలో బాధితులను పరామర్శించి, వారికి మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం ఆ గ్రామానికి బయలుదేరారు. అయితే.. అంతకు ముందే పవన్ కళ్యాణ్ వాహనం వెళ్లే దారికి అడ్డంగా పోలీసులు కంచెలు వేశారు. అయినప్పటికీ పవన్ తన వాహనంలో ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పవన్ వాహనం దిగి కొంతదూరం నడిచి వెళ్లారు. ఈ క్రమంలో వేలాది మంది ఆయన మద్దతుదారు వచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడిచార. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పవన్ మరో వాహనంలో ఇప్పటం చేరుకుని, ఇళ్లు కూలగొట్టిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులను పరామర్శించి, సంఘాభావం తెలిపారు. ‘ఇప్పటం చిన్న గ్రామం. కాకినాడా లేదా రాజమండ్రీయా.. రోడ్లు వెడల్పు చేయడానికి? ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి ఎందుకు విస్తరించడం లేదు?  బాధితులతో కనీసం మాట్లాడకుండా ఆపేందుక మీరెవరు? మా సభకు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కుట్ర చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారు.  వైసీపీ నేతలూ.. ఇడుపులపాయలో మేము హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు. రోడ్లు వేయలేరు గానీ.. విస్తరణ కావాలా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా. కూల్చివేస్తున్నవారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా జనసైనికులు మౌనంగా ముందుకు నడవండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా.. మా మట్టిని కూల్చారు. మీ కూల్చివేత తథ్యం’ అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను అమరావతిలో నిర్వహించాలని సభాస్థలి కోసం ఆ పార్టీ నేతలు అన్వేషించిన సమయలో సభకు ఎక్కడా చోటు దొరకకుండా అధికార వైసీపీ నేతలు బెదింపులకు పాల్పడ్డారు. హెచ్చరికలు కూడా చేశారు. ఆ సందర్భంలోనే ఇప్పటం గ్రామస్తులు ధైర్యంగా ముందుకు వచ్చి జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారు. దాంతో జనసేన ఆవిర్భావ సభ జరిగిపోయింది. అప్పటి నుంచీ ఇప్పటం తమకు అధికార పార్టీ నుంచి వేధింపులు, బెదిరింపులు మొదలయ్యాయని బాధితులు వాపోతున్నారు. మార్చిలో జనసేన సభ జరిగిన తర్వాత ఏప్రిల్ లోనే రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇప్పటం గ్రామస్తులకు నోటీసులు ఇచ్చారు. నిజానికి ఇప్పటం ప్రధాన రహదారికి కాస్త దూరంగా ప్రశాంతంగా ఉండే గ్రామం. ఇప్పటం మీదుగా వాహనాల రాకపోకలు కూడా ఉండవు. అయినప్పటికీ గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. దాన్ని ఇప్పుడు 120 అడుగులకు విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధి ఉవ్విళ్లూరిపోతున్నారట. అయితే.. ఆ ప్రజాప్రతినిధి ఉత్సాహానికి, ఉవ్విళ్లూరడానికి కారణం కక్ష సాధింపు ఒక్కటే అంటున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారి ఇళ్లను రోడ్డు విస్తరణ వంకతో తొలగించాలని ఆ ప్రజాప్రతినిధి, వైసీపీ సర్కార్ కుట్ర చేయడమే ఈ మొత్తం విధ్వంస కాండకు కారణం అంటున్నారు. ప్రధాన రహదారి నుంచి ఇప్పటం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు కేవలం 15 అడుగులు మాత్రమే ఉంది. మరో రెండు మార్గాలు కూడా ఇరుకుగానే ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు వైసీపీ సర్కార్ కూల్చేసిన ఇళ్లున్న రోడ్డు 70 అడుగులు ఉంది. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డును వెడల్పు చేసే యోచన చేయని వారికి ఇప్పటికే చాలినంత వెడల్పుతో ఉండే గ్రామంలోని రోడ్డును 120 అడుగులకు వెడల్పు చేయాలనడం వెనకు కుట్ర, కక్ష తప్ప మరేమీ లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకునేందుకు యత్నించిన జన సైనికులు, వీర మహిళలను అదుపులోకి తీసుకుని, సర్కార్ దుర్మార్గానికి అండగా నిలవడం ఏమిటని పోలీసులపై ఇప్పటం బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇప్పటంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సందర్శించి, గ్రామ సభలో ప్రసంగిస్తున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపేసిన జగన్ సర్కార్ కుటిల బుద్ధి గురించి జనం చెప్పుకుంటున్నారు. కూల్చివేత నోటీసులపై ఇప్పటం గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఏ క్షణంలో అయినా హైకోర్టు ఆదేశాలు రావచ్చని.. ఆగమేఘాల మీద ఈ నెల 4వ తేదీన కూల్చివేతలకు తెగబడడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న వైసీపీ సర్కార్ ఇప్పటంలో విశాలంగా ఉన్న రహదారిని విస్తరించే నెపంతో ఇళ్లు, ప్రహారీ గోడలను కూల్చివేయడం కక్షపూరితం, కుట్రలో భాగం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన గ్రామాల్లోని రోడ్లు ఇప్పటంలోని రహదారికన్నా ఇరుకుగానే ఉన్నా తమ గ్రామంలోనే విస్తరించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో తమను వైసీపీ సర్కార్ భయాందోళనలకు గురిచేస్తోందని ఇప్పటం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

హిమాచల్, గుజరాత్ లలో మళ్లీ కమల వికాసమే.. తేల్చేసిన సర్వే

హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో మరోసారి కమలమే విజయకేతనం ఎగుర వేసి అధికారాన్ని నిలబెట్టుకోనుందని సర్వే వెల్లడించేసింది. ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి  ఈ నెల 12 ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీకే విజయావశాకాలున్నాయని ఇటీవల ఇండియా టీవీ-మాట్రిక్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హిమాచల్ లో తొలి సారిగా ఆనవాయితీకి భిన్నంగా ఆ రాష్ట్రంలో వరుసగా రెండో సారి కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందని సర్వే పేర్కొంది. అలాగే గుజరాత్ లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొంది.   రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని సర్వే పేర్కొంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ వరుసగా రెండు సార్లు ఒకే పర్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ప్రతి సారీ ఆ రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని ఓడించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. అయతే ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీని అధిగమించి హిమాచల్ లో మరో సారి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందని సర్వే ఫలితం చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్ల మెగ్గుతో బీజేపీ, 41 విజయం సాధిస్తుందని  ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన సర్వే వెల్లడించింది.  ఇక కాంగ్రెస్ పాతిక స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదని సర్వే తేల్చింది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వేలో గుజరాత్ లో మరో సారి అధికారం బీజేపీదేనని పేర్కొంది. రాష్ట్రంలో ఆ పార్టీ 125 నుంచి 135 స్థానాల వరకూ కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.  కాంగ్రెస్ 29 నుంచి 31 స్థానాలు,  ఆమ్ ఆద్మీ పార్టీ  20-24 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితం పేర్కొంది. 

21 రోజుల పసిబిడ్డ గర్భం లో 8 పిండాలు

రాంచీ రాంఘర్ లో దంపతులు తమ నవజాత శిశువు ఏడుపు తట్టుకోలేక ఆస్పత్రికి తీసికెళ్లారు. పసి కందు కడుపునొప్పితో బాధపడుతోందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షించగా ఆశర్యర్యకర సంగతి తెలిసింది. వైద్యులు స్కానింగ్‌ తీయగా.. శిశువు కడుపులో కణితి ఉన్నట్లు భావించారు. ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఈ నెల 1వ తేదీన ఆపరేషన్‌ చేయగా.. వైద్యులకు శిశువు కడుపులో కణితి బదులు 8 పిండాలు కనిపించాయి. ఇదెలా సాధ్యమని డాక్టర్లు కుటుంబసభ్యులు, బంధువులు అంతా విస్తు పోయారు. పసికందు ప్రాణాలతో గట్టెక్కు తుందా అని భయపడ్డారు. పసికూన సురక్షితంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పసికందు గర్భంలో 8 పిండాలు ఎక్కడైనా కన్నామా విన్నామా? ప్రపంచంలోనే అరుదైన ఘటనగా నిపు ణులు పేర్కొంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ఫిఫ్ అంటారు. అంటే పిండంలో పిండం ఉండటం. ఇది ప్రపచంలోనే అరుదైన ఘటన స్థితిగా పేర్కొన్నారు. అదీకాక వెన్నుపూసలో పిడం ఉండ డం డాక్టర్స్ గుర్తించారు. ఇప్పటిదాకా ప్రపంచలో ఇలాంటి అరుదైన కేసులు 200లోపే వెలుగు చూశా యని.. భారత్‌లో 10 మాత్రమే నమోదయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. పదిలక్షల మంది పిల్లల్లో ఇలా ఒకరికే జరిగే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు. ఫిఫ్ పిండంలో పిండం అన్నది చాలా అరుదైన  స్థితిగా పేర్కొన్నారు. శరీరం లోని వెన్నుపూసలో రెండు పిండాలు ఉండడాన్ని గమనించినట్లు డాక్టర్స్ తెలిపారు.రాంచి నగరానికి చెందిన పిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, 5 లక్షల మందిలో ఎవరూకరికి మాత్రమే వస్తుందని  ఈ అంశం అంతర్జాతీయ  జర్నల్ లో ఫిఫ్ ఒక కేసు మాత్రమే ఉంటుందనిఅయితే చాలా పిండాలు ఉండ డం చూడలేదని డాక్టర్ పేర్కొన్నారు.

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయ్యా కొడాలి నానీ!

‘ఒళ్లు బలిసిన కోడి మిద్దెనెక్కి పిచ్చికూతలు కూసిందట’ అన్న చందంగా ఉంది మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీరు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు ఏర్పాటు చేసిన వలయం ఉందని, పవన్ కళ్యాణ్ కు మంచి జరిగినా.. చెడు జరిగినా చంద్రబాబే కారణం అని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కోడి కూతల సామెతను గుర్తు చేస్తున్నాయంటారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు ‘పవన్ కళ్యాణ్ మీద దాడులు చేస్తారా? చంపేస్తారా?’ అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే. దీనిపై బూతులు అలవోకగా మాట్లాడి, బూతుల మంత్రిగా ప్రసిద్ధుడైన కొడాలి నాని స్పందన బలిసిన కోడి   సామెతలా ఉందంటున్నారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, బైక్ లపై కూడా ఫాలో అవుతున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రెక్కీ చేసిన విజువల్స్ కూడా కొన్ని మీడియాల్లో ప్రసారం కావడం కలకలం రేపింది. తనను, తన భార్యా, పిల్లలను చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని పవన్ కళ్యాణే స్వయంగా తన పార్టీ నేతల సమావేశంలో చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ నివాసం   కొందరు యువకులు అర్ధరాత్రి పూట కారు నిలపడమే కాకుండా ఇదేమిటని అడిగిన ఆయన భద్రతా సిబ్బందిని దూషించిన వైనం మీడియాలో విజువల్స్ తో సహా ప్రముఖంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతోందంటూ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళ్లినా.. బయటి నుంచి ఇంటికి వచ్చినా కార్లలో   కొందరు వెంబడించడమే కాకుండా పవన్ రాకపోకలను నిశితంగా పరిశీలిస్తున్నారని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లపై సమీపం నుంచి ఫాలో అవుతుండడం కలకలం రేపిన సంగతి విదితమే. ఈ అంశంపై కొడాలి నాని స్పందిస్తూ.. ‘నాదెండ్ల మనోహర్ ఎవడు..? జనసేన పార్టీనా గాడిదగుడ్డా..? జనసేనలో చంద్రబాబు నియమించిన ఏజెంటు నాదెండ్ల మనోహర్. పవన్ పై రెక్కీ నిర్వహిస్తున్నారని నాదెండ్ల మనోహర్ అనటం హాస్యాస్పదం.  పవన్ కల్యాణ్ కోసం ఎవరైనా రెక్కీ నిర్వహించినా.. ఆయనను చంపాలనుకున్నా తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయుడే చేస్తారు. చంద్రబాబు నాయుడు సానుభూతి రాజకీయాల్లో ఆరితేరిపోయారు. పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు వలయం ఉంది. పవన్ కు ఏం జరిగినా.. అంటే మంచి జరిగినా.. చెడు జరిగినా.. చంద్రబాబుదే బాధ్యత’ అన్నారు. పవన్ పై కుట్ర చేస్తే.. అది చంద్రబాబే చే అన్నారు. ‘పవన్ కళ్యాణ్ చుట్టూతా ఉండేది ఎవరు? నాదెండ్ల మనోహర్. చంద్రబాబుకు సలహాలు చెప్పేది రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు. పవన్ కళ్యాణ్ కు సలహాదారులు ఎవరు? పవన్ కళ్యాణ్ ఎలా నడవాలి? ఎలా ఉండాలని ఎవరు చెబుతారు. పవన్ చుట్టూ ఎవరి వలయం ఉంది? నా వలయం ఉందా? చంద్రబాబు నాయుడి వలయం ఉంది. పవన్ కళ్యాణ్ ను ముంచినా.. తేల్చినా.. బతికించినా.. చంపేసినా.. ఏం చేసినా చంద్రబాబు నాయుడే.. చంద్రబాబుకు ఏది ఎడ్వాంటేజ్ అంటే అదే చేస్తాడు. ముక్కుసూటిగా వెళ్లి గుద్దడమే జగన్ కు తెలుసు. ఈ రెక్కీలు నిర్వహించడం.. రిహార్సల్స్ చేయడాలు, డైలాగ్ ట్రైనింగ్ లు ఇవ్వడాలు.. ఇవన్నీ సినిమా పరిశ్రమలో ఉంటాయి’ అనడాన్ని జనం తప్పుపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చీఫ్ ఎంతకైనా వెళ్తారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయనపైన కూడా ఆరోపణలు వస్తున్న విషయం కొడాలికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మృతికి కారణంటూ ఆయన బంధువులు కొడాలి నానిని శ్మశానంలోనే నిలదీసిన వైనాన్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదంటున్నారు. అలాగే అడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ ఆత్మహత్యతో కూడా కొడాలికి లింక్ ఉందనే ఆరోణలున్నాయి. ఎన్నో తప్పులు తన కింద పెట్టుకున్న కొడాలి నాని నిస్సిగ్గుగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై రెక్కీ జరగడాన్ని చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఖండిస్తుంటే.. కొడాలి నాని కనీసం మనిషిగా స్పందించకపోగా ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్‌...ఓవర్ కి ఐదు బంతులేనా? 

ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా తప్పనిసరిగా గెలవాల్సిన గేమ్‌లో భారీ అంపైరింగ్ తప్పిదం హైలైట్ అయిం ది. శుక్రవారం, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఇప్పటికే తొలగించబడిన ఆఫ్ఘనిస్తాన్ మధ్య  గ్రూప్ 1 చివరి గేమ్‌లో, భారీ అంపైరింగ్ లోపం జరిగిపోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 12 దశలోని గ్రూప్ 1లో సెమీ-ఫైనల్ స్థానం కోసం జరిగిన పోరును నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్)కి తగ్గించింది. టోర్నమెంట్  ఆరంభ దశలో వర్షం ప్రభావం చూపడంతో కీలకమైన మ్యాచ్‌లు వాష్ అవుట్ అయినందున, గ్రూప్‌లో తదుపరి ఫలితాలు సెమీస్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోరాడేందుకు దారితీశాయి.  అటువంటి సందర్భాలలో, ప్రతి పరుగు మరింత ముఖ్యమైనది, ఇది అంతిమంగా ఎన్ఆర్ఆర్ ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఒక చిన్న అంపైరింగ్ లోపం  జట్టుకు చాలా ఖరీదైనదే అవుతుంది. అడిలైడ్‌లో జరిగే మ్యాచ్ ఆస్ట్రేలియాకు తప్పక గెలవాల్సిన గేమ్, అయితే, వారు ఎన్ఆర్ఆర్ లో భారీ తేడాతో గెలవాలని కోరుకున్నారు.  ఆట  నాల్గవ ఓవర్ సమయంలో, ఆస్ట్రేలియా బ్యాటర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ కలిసి ఓవర్‌లో కేవలం ఐదు బంతులు ఎదుర్కొన్నారు. మార్ష్ మూడో బంతికి బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా బౌండరీ కోసం హాఫ్-వాలీని ఛేదించే ముందు బ్యాటర్‌లలో ఎవరైనా మొదటి రెండు బంతుల్లో ఒక్క స్కోర్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి కొంత అలసత్వపు ఫీల్డింగ్ కారణంగా మార్ష్ తర్వాతి బంతికి మూడు పరుగులు చేసి ఓవర్‌త్రోకి దారితీసాడు. ఐదో డెలివరీ డాట్ బాల్. ఆ ఓవర్‌లో ఆరో బంతి వేయలేదు. ఎన్ఆర్ఆర్ పరంగా ఇంగ్లండ్‌తో జరిగే పోరులో ముందుండాలనుకునే ఆస్ట్రేలియాకు ప్రతి బంతిని ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో, తిరస్కరించిన డెలివరీ  ఖరీదైనదిగా మారవచ్చు. న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. గ్రూప్ 1లో ఇప్పుడు ఇంగ్లండ్, శ్రీలంక  ఆస్ట్రేలియాల మధ్య యుద్ధం ఉంది. ఆస్ట్రేలియా గెలవాలి , ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ తేడాతో విజయం సాధించాలి. 

విపక్ష నేతపై దాడి జరిగితే చర్యలు పక్కన పెట్టి కాకమ్మ కబుర్లా..?!

తెలుగుదేశ అధినేత చంద్రబాబు నందిగామ పర్యటనలో  జరిగిన సంఘటనపై పోలీసులు ఒకలా, అధికార వైసీపీ నేతలు ఒకలా స్పందిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరి స్పందనా ఆయనపై దాడిని సమర్ధించేందుకు చేస్తున్న ప్రయత్నంగానే ఉంది. విజయవాడ సీపీ అయితే దూడ మేత కోసం తాటిచెట్టు ఎక్కారన్న చందంగా బాబుపై పూలవర్షం కురిపించారనీ, ఆ సమయంలో పొరపాటుగా రాయో, రాయిలాంటి వస్తువో పడి ఉంటుందని అన్నారు. ఇక వైసీపీ వాళ్లయితే ఏకంగా ఈ దాడి సానుభూతి కోసం చంద్రబాబే స్వయంగా చేయించుకున్నారని పేర్కొన్నారు. నందిగామలో జరిగిన సంఘటనను ఒక సారి పరిశీలిస్తే.. ఇది ఉద్దేశపూర్వకంగా, పక్కా ప్రణాళికతో బాబును గాయపరచడమే లక్ష్యంగా జరిగిందని అవగతమౌతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు రోడ్ షోకు అసంఖ్యాకంగా జనం తరలి వచ్చారు. పక్కన ఉన్న భవనాలపై నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నిలుచున్నారు. రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఎత్తైన భవనం నుంచి ఓ రాయి సూటిగా చంద్రబాబు వైపు దూసుకు వచ్చింది. దానిని గమనించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ క్షణంలో స్పందించి చంద్రబాబుకు అడ్డుగా నిలబడటంతో ఆయన చేతికి గడ్డానికి గాయమైంది. కాగా ఈ దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంటే దాడి చేసింది ఎవరన్నది గుర్తించకుండా ఉండేందుకు ప్రణాళిక ప్రకారమే ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నలిపివేశారని పరిశీలకులు అంటున్నారు. ఒక వేళ చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మెరుపు వేగంతో స్పందించలేకపోయి ఉంటే.. ఆ రాయి నేరుగా చంద్రబాబుకే తగిలి ఉండేది. ఏడు పదుల వయస్సు పైబడిన వ్యక్తికి ఆ రాయి తగిలితే తీవ్ర గాయం అయ్యేదని అంటున్నారు. ఇంతటి తీవ్ర విషయాన్ని సీరియస్ గా తీసుకుని దాడికి పాల్పడిన వారెవరన్నది ఆరా తీయాల్సిందిపోయి.. పోలీసులు పూలవర్షం అంటూ, వైసీపీ నాయకులు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం దారుణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఒణికిస్తున్న చలిపులి, మంచుపొగ భూతం!

అరచేతులు రాసుకుంటూ పరుగున వెళ్లి వేడి వేడి మొక్కజొన్నపొత్తు తినేయడానికి సరదాపడడంలో సరదా పోయేంతగా చలి క్రమేపీ పెరిగిపోతోంది. ఇంట్లోనే పకోడీలు, ఆరు బయట కుంపటి , కర్రల మంట చుట్టూ చేరి కూచోడాలు అలవాటు చేసేసుకున్నవారందరికీ ఈసారి మరింత ఆటపాటలు అవసరమవుతాయేమో. ప్రతీ ఇంట్లొ జలుబు దగ్గుతో తుమ్ములతో తిరిగే వారి సంఖ్యా పెరుగుతోంది. చలి అమాంతం పట్టేసి ఇంట్లోంచి కదలనీయడం లేదు. చల్లగాలిలో అలా బండి మీద తిరగాలనుకునే జంటలకీ ఈసారి చలి పులి భయపెడుతోంది.  చలి ఒణికించేస్తోంది.. చలిమంటలు కాసుకోవలసివస్తోందని పల్లెప్రజలు అంటున్నారు. అయితే ఈసారి మరీ  ఎక్కువగా ఉంది. పొగమంచుతో జలుబు, దగ్గు మించి జ్వరాలకు దారితీసేంతగా చల్లదనం పట్టే స్తోంది. చలి పులిని  వది లించుకునే మార్గాలన్నీ వెదకడం మొదలయింది. మామూలుగా పల్లెల్లో అతిగా చలి అనిపిస్తుంది. కానీ ఈసారి పట్టణాల్లోనూ చలిపులి ప్రవేశించి ఇబ్బందికరంగా మారింది.  ఏ కాలానికి ఆ కాలం కవ్విస్తుంది, కొంత భయపెడుతుంది.  కానీ చాలా కాలం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చా యనే వాతావరణ నిపుణులూ చెబుతున్నారు. మరీ ఇటీవలి కాలంలో ఊహించని మార్పులేచోటుచేసుకుంటు న్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో స్థాయి  పొగమంచు, చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి. దీనికి తోడు ఊహించని విధంగా హఠాత్తుగా మబ్బులు కమ్మేయడం అమాంతం భారీ వర్షం పడటం చలి ఒణికించేస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాలను పొగమంచు మేఘంలా కమ్మేస్తోంది. రమణీయ దృశ్యాలు ఓ వైపు ఆహ్లాదపరు స్తున్నా..మరోవైపు వాహనదారులకు నరకం చూపుతున్నాయి. విజయవాడ, రాజమండ్రి, ఆదిలాబాద్, మెదక్ వంటి ప్రాంతాలనే కాదు ఇతర పట్టణాలను కూడా పొగమంచు క్రమేపీ కప్పేస్తోంది. ముఖ్యంగా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దారి సరిగా కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు.  విజయవాడ మచిలీపట్నం, రాజమండ్రి రైల్‌కమ్‌ బ్రిడ్జిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. పచ్చని ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో.. చలి, పొగమంచు తీవ్రత మరింత పెరిగింది.