English | Telugu

మృణాల్‌కి సీన్ టు సీన్ నేర్పిందెవ్వ‌రో తెలుసా?

మృణాల్ ఠాకూర్ అనగానే ఆమె చేసిన సీతారామ‌మ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు నానితో చేస్తున్న హాయ్ నాన్న గుర్తుకొస్తుంది. వెంట‌నే ఆమెకు సీన్ టు సీన్ నేర్పిన న‌టులుగా దుల్క‌ర్ స‌ల్మాన్, నాని పేర్లు ఇలా ఫ్లాష్ అవుతాయి. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ చెబుతున్న‌ది న‌యా జాన‌ర్ గురించి. అందులోనూ, ఆమె చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి. సౌత్‌లో హ్యాండ్ ఫుల్‌గా మూవీస్ ఉన్నాయి క‌దా అని, నార్త్ ని ప‌క్క‌న పెట్ట‌డం లేదు మృణాల్ ఠాకూర్‌. అక్క‌డా, ఇక్క‌డా బ్యాల‌న్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆమె న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆంఖ్ మైఖోలి. ఈ ప్రాజెక్టులో ప‌రేష్ రావెల్‌తో క‌లిసి ప‌నిచేశారు మృణాల్ ఠాకూర్‌.