English | Telugu

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం!

లేటెస్ట్ గా విజయ్ నటించిన లియో మూవీ సక్సెస్ మీట్ జరిగింది. విజయ్ ఫాన్స్ భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమం లో విజయ్ తన రాజకీయ ప్రస్థానం గురించి హింట్ ఇచ్చాడంటూ అని వస్తున్న వార్తలతో తమిళ చిత్ర రంగంతో పాటు తమిళనాడు రాజకీయాలని కూడా వేడెక్కిస్తుంది. ఇంతకీ విజయ్ ఏమన్నాడో చూద్దాం.

ఎంతో అంగ రంగ వైభవంగా లియో సక్సెస్ మీట్ చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరిగింది. ఈ వేడుకులో ఎంతో అద్భుతంగా ప్రసంగించిన విజయ్ వెళ్తూ వెళ్తూ తన అభిమానులని ఉద్దేశించి నేను జనాలని నడిపించే దళపతిని అవుతా అని అనడంతో విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పకనే చెప్పినట్టయ్యిందని అంటున్నారు. అంతకంటే ముందే విజయ్ నోటితోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పించాలనే విధంగా యాంకర్ విజయ్ తో 2026 గురించి మీరేమంటారు అని అడిగింది. ఎందుకంటే 2026 లో తమినాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో విజయ్ ఏం సమాధానం చెప్తాడు అని అందరు టెన్షన్ తో ఎదురు చూస్తే విజయ్ మాత్రం చాలా కూల్ గా 2025 తర్వాత 2026 వస్తుందని అలాగే
ఆ సంవత్సరం ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. చివరగా యాంకర్ సీరియస్‌గా సమాధానం చెప్పండి అని అడిగితే కప్పు ముఖ్యం బిగిలూ అంటూ తన బిగిల్ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాడు.
తమిళనాడులో సినిమాలకి ,రాజకీయాలకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. సినిమా రంగం నుంచి వెళ్లిన ఏంజి రామచంద్రన్ ,జయలలిత ,కరుణానిధి లు గత 40 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులుగా తమిళనాడు ని ఏలుతూ ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు ని ఏలుతున్న రాజకీయ పార్టీ ,ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు స్థాపించిన పార్టీ లే. కాబట్టి తమిళ సినిమా వాళ్ళు రాజకీయాల నుంచి దూరం అవుదామని అనుకున్న అవ్వలేరు.కాబట్టి విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని అంటున్నారు. విజయ్ అభిమానులు మాత్రం దళపతినయ్యి జనాలని ముందుకు నడిపిస్తాను అని విజయ్ చెప్పడంతో మా విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.