English | Telugu

అల్లు అరవింద్ బాటలో దిల్ రాజు.. త్వరలో కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్!

కొంతకాలంగా ఓటీటీల హవా నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, 'ఆహా'తో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలతో పాటు, ఇతర చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, షోలు ఆహాలో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ బాటలో మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పయనించబోతున్నట్లు తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా టాలీవుడ్ లో దిల్ రాజుకి ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలను ఆయన నిర్మిస్తుంటారు, పంపిణీ చేస్తుంటారు. అలాంటి దిల్ రాజు ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు, ఓటీటీ కోసం రూ.5 కోట్ల లోపు బడ్జెట్ తో ఒకేసారి 25 సినిమాలను నిర్మించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. దిల్ రాజు స్థాపించనున్న కొత్త ఓటీటీ వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశముంది అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయట. దిల్ రాజు కొత్త ఓటీటీ ప్రారంభమైతే.. ఆయన నిర్మించే సినిమాలతో పాటు, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలు కూడా అందులోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా అల్లు అరవింద్, దిల్ రాజు వంటి నిర్మాతలు ఓటీటీలు స్థాపించడం అనేది అప్ కమింగ్ యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ కి వరమని చెప్పొచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.