English | Telugu

సలార్ తో జగపతిబాబు మరో మెట్టు ఎక్కబోతున్నాడా!


'సలార్' సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక పెను సంచలనం అవుతుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ఒక బజ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పండగే అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో జగపతి బాబు నటిస్తున్నాడనే విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. హీరో, హీరోయిన్ లకే కాదు విలన్లకి ఫ్యాన్స్ ఉంటారు. అవును నిజమే.. సోను సూద్ సినిమాలల్లో విలన్ రోల్స్ ఎక్కువ చేస్తాడు. కానీ బయట మంచి పనులు చేస్తూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే కోవలోకి జగపతి బాబు చేరాడు.

తొంభైల్లో అతని సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫాదర్ రోల్స్, గెస్ట్ రోల్ ఇలా మెల్లి మెల్లిగా విలన్ రోల్స్ చేశాడు. ఇక నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవలో ఇతని నటనకి ఇండస్ట్రీతో పాటు అందరు ప్రశంసలు కురిపించారనే చెప్పాలి. జగపతి బాబు తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి ఏడు నంది పురస్కారాలను అందుకున్నాడు జగపతి బాబు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరు గాంచినా కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు విలక్షణంగా కనిపిస్తాయి.

జగపతిబాబు తన యాక్టింగ్ తో వేలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. అయితే అందరు ఇతడిని జగ్గుభాయ్ అంటారు. అయితే తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు జగ్గు భాయ్. ఇప్పుడు సలార్ మూవీలో నటిస్తున్నట్టుగా ఒక క్లూ ఇచ్చాడు. 'సలార్ తో ఇంకో మెట్డు ఎక్కబోతున్నాను' అంటూ షేర్ చేశాడు. మరి జగపతిబాబు విలన్ గా చేస్తున్నాడా లేక సపోర్టింగ్ రోల్ చేస్తున్నాడా అని తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు జగపతిబాబు పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.