English | Telugu

యంగ్‌ డైరెక్టర్‌కు యాక్సిడెంట్‌.. అరగంట వరకు అక్కడే!

రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగితే.. స్థానికులే కాదు, రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా ఆగి బాధితుడికి సాయం చెయ్యాలని చూస్తారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ, ఢల్లీిలోని ప్రజల్లో మానవత్వం నశించిందో ఏమో తెలీదుగానీ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో ఒకరు గాయపడి రక్తపు మడుగులో అరగంట సేపు వ్యధ అనుభవించాడు. అటుగా వెళ్తున్న వారెవరూ అతనికి సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతను ఒక ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌. పేరు పీయూష్‌ పాల్‌(30). సోమవారం రాత్రి ఆయన తన విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా మరో బైక్‌ అతనికి డాష్‌ ఇచ్చింది. దాంతో దగ్గరలోని చెట్టుకి ఢీకొని పడిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతని గురించి అరగంట తర్వాత పోలీసులకు సమాచారం అందింది. మొహానికి, తలకి తీవ్ర గాయాలవడంతో బాగా రక్తస్రావం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకొస్తే తప్పకుండా బ్రతికేవాడని డాక్టర్లు చెప్పారు.

ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన పీయూష్‌కు ఫిల్మ్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యం ఉండేదట. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం పట్ల అతని కొలీగ్స్‌, కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. సకాలంలో ఎవరైనా సాయం చేసి ఉంటే పీయూష్‌ బ్రతికేవాడని, మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ దిగజారిపోతోందని వారు అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.