English | Telugu

మృణాల్‌కి సీన్ టు సీన్ నేర్పిందెవ్వ‌రో తెలుసా?

మృణాల్ ఠాకూర్ అనగానే ఆమె చేసిన సీతారామ‌మ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు నానితో చేస్తున్న హాయ్ నాన్న గుర్తుకొస్తుంది. వెంట‌నే ఆమెకు సీన్ టు సీన్ నేర్పిన న‌టులుగా దుల్క‌ర్ స‌ల్మాన్, నాని పేర్లు ఇలా ఫ్లాష్ అవుతాయి. కానీ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ చెబుతున్న‌ది న‌యా జాన‌ర్ గురించి. అందులోనూ, ఆమె చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి. సౌత్‌లో హ్యాండ్ ఫుల్‌గా మూవీస్ ఉన్నాయి క‌దా అని, నార్త్ ని ప‌క్క‌న పెట్ట‌డం లేదు మృణాల్ ఠాకూర్‌. అక్క‌డా, ఇక్క‌డా బ్యాల‌న్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆమె న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఆంఖ్ మైఖోలి. ఈ ప్రాజెక్టులో ప‌రేష్ రావెల్‌తో క‌లిసి ప‌నిచేశారు మృణాల్ ఠాకూర్‌.

బాలీవుడ్‌లో ఆల్రెడీ ల‌వ్ సోనియా, సూప‌ర్ 30, బాట్లా హౌస్ సినిమాల‌తో ఫేమ్ తెచ్చుకున్నారు మృణాల్‌. లేటెస్ట్ గా ఆమె ఆంఖ్ మైఖోలిలో న‌టించారు. ఇందులో ప‌రేష్ రావ‌ల్ ద‌గ్గ‌ర చాలా నేర్చుకున్నాన‌ని అన్నారు మృణాల్‌. ఈ ప్రాజెక్టు చేస్తున్న‌న్ని రోజులూ త‌ను క్లాసుల‌కు వెళ్తున్నంత బుద్ధిగా వెళ్లాన‌ని చెప్పారు మృణాల్‌. కామెడీ క్లాసుల‌కు వెళ్తే ఎన్ని విష‌యాలు నేర్చుకుంటానో, ఈ క్లాసుల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా అన్నే విష‌యాలు నేర్చుకున్నాన‌ని అన్నారు మృణాల్‌. అయితే ఇక్క‌డ నేర్పించి, డ‌బ్బులు ఇచ్చార‌ని అన్నారు. ప‌రేష్ రావ‌ల్‌తో చేసిన ప్రతి స‌న్నివేశం త‌న‌కు ఎంతో నేర్పింద‌ని చెప్పారు ఈ బ్యూటీ. అభిమ‌న్యు దాసానితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఆస‌మ్ అని అన్నారు.

మామూలుగా తాను నేర్చుకున్న లైన్ల‌ను య‌థాత‌థంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు మృణాల్‌. అయితే ఈ విష‌యం గురించి ప‌రేష్ ఇచ్చిన స‌ల‌హాని తాను జీవితాంతం మ‌ర్చిపోన‌ని అంటారు. కొన్ని సంద‌ర్భాల్లో లైన్ల‌ను మ‌ర్చిపోయి ప్రాంప్టింగ్ తీసుకుంటున్న‌ప్పుడు, ఎదుట ఉన్న న‌టుడు ఆ సీన్‌ని టేకోవ‌ర్ చేసేస్తార‌ని, మంచి న‌టులు ఆ అవ‌కాశాన్ని ఎప్పుడూ ఇవ్వ‌కూడ‌ద‌ని ప‌రేష్ స‌ల‌హా ఇచ్చార‌ట మృణాల్‌కి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.