షాకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన 'ప్రేమమ్' డైరెక్టర్
2015లో విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నివిన్ పౌలీ, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. భాషతో సంబంధం లేకుండా విశేష ఆదరణ పొందింది. అయితే తాజాగా ఈ చిత్ర దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రెన్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు 39 ఏళ్ళ ఆల్ఫోన్స్ ప్రకటించాడు.