పెళ్లైనా తల్లైనా తగ్గేదేలే అంటున్నారు!
పెళ్లయిన తల్లైనా డిమాండ్ ఉన్న లేకున్నా తగ్గేది లే అంటున్నారు. తమ రేంజికి ఒక్క రూపాయి తగ్గమంటున్నారు కొందరు హీరోయిన్లు. టాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటే కొందరు భామలు ఒక అమౌంట్ కి ఫిక్స్ అయిపోతారు. ఆ మాటపై స్ట్రాంగ్ గా నిలబడతారు. నయనతార, సమంత, కాజల్, అగర్వాల్, హన్సిక, కీర్తి సురేష్ ఈ వరుసలో ముందుంటారు. నయనతార రేంజి రోజు రోజుకు పెరుగుతోంది. పెళ్లయింది అయినా ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు ఒక్క సినిమాకు ఐదు నుంచి 6 కోట్లు ఛార్జ్ చేసింది. కానీ ఇప్పుడు పారితోషకం రెట్టింపు చేసింది. అన్ని తరహా చిత్రాలకు, ఏ జోనర్ అయినా, చివరకు లేడీ ఓరియంటెడ్ అయినా, హర్రర్ థ్రిల్లర్, కమర్షియల్, మాస్ మసాలా ఇలా ఏ జోనర్ అయినా సరే బెస్ట్ ఆప్షన్ కావడంతో రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది.