English | Telugu

ప‌వ‌న్ పుణ్యానైనా ఆమె కోరిక నెర‌వేరుతుందా?

వింక్ బ్యూటీ కి అదృష్టం తలుపు తట్టింది. ఎంత క్రేజ్ ఉన్నా కొన్నిసార్లు కొంతమందికి కమర్షియల్ గా సక్సెస్ లు  రావు. క్రేజీ ఆఫర్లు రావ‌డం జ‌ర‌గ‌దు.  అదృష్టం తలుపు తట్టదు. వ‌చ్చిన ఒక‌టి రెండు అవ‌కాశాలు కూడా   సక్సెస్ కాక పోవడంతో వారికి క్రేజ్ సొంతం కాకుండా పోతుంది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. మలయాళం లో ఓరు ఆధార్ లవ్ మూవీ తో తెరంగేట్రం చేసింది. ఓ సీన్‌లో హీరోకి కన్నుకొడుతూ  దేశవ్యాప్తంగా వైరల్ అయింది. భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. తేజస‌జ్జ‌తో  ఇష్క్ నాట్ ఎ  లవ్ స్టోరీ లో నటించింది. అదృష్టం అవకాశాల రూపంలో తలుపు తట్టిన సక్సెస్ మాత్రం ఆమెకి ద‌క్క‌లేదు. ఈ రెండు చిత్రాలు ఆమెకి తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి. 

పెళ్లైనా త‌ల్లైనా త‌గ్గేదేలే అంటున్నారు!

పెళ్లయిన తల్లైనా డిమాండ్ ఉన్న లేకున్నా తగ్గేది లే అంటున్నారు. తమ రేంజికి ఒక్క రూపాయి తగ్గమంటున్నారు కొందరు హీరోయిన్లు. టాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటే కొందరు భామలు ఒక అమౌంట్ కి ఫిక్స్ అయిపోతారు. ఆ మాటపై స్ట్రాంగ్ గా నిలబడతారు. నయనతార, సమంత, కాజల్, అగర్వాల్, హన్సిక, కీర్తి సురేష్ ఈ వరుసలో ముందుంటారు. నయనతార రేంజి రోజు రోజుకు పెరుగుతోంది. పెళ్లయింది అయినా ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు ఒక్క సినిమాకు ఐదు నుంచి 6 కోట్లు ఛార్జ్ చేసింది. కానీ ఇప్పుడు పారితోషకం రెట్టింపు చేసింది. అన్ని త‌రహా చిత్రాల‌కు, ఏ జోన‌ర్ అయినా, చివ‌ర‌కు లేడీ ఓరియంటెడ్ అయినా, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్, క‌మ‌ర్షియ‌ల్, మాస్ మ‌సాలా ఇలా ఏ జోన‌ర్ అయినా స‌రే బెస్ట్ ఆప్షన్ కావడంతో రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది. 

రెండు నెల‌ల‌కు ఓ చిత్రం... ప్ర‌భాస్ ప్లానింగ్‌!

బాహుబలి ఫ్రాంచైజీతో   దేశ విదేశాలలో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు చిత్రాలు వేగంగా పూర్తి చేస్తున్నారు.  ఆయన చేతిలో ఆరేడు చిత్రాలున్నాయి. మొదటగా మూడింటిని పూర్తి చేయనున్నారు. ఆది పురుష్ ని  ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ గ్రాఫిక్స్ లో ఆలస్యం కావడం వల్ల జూన్ 16 కి షిఫ్ట్ చేశారు. ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ సలార్.  ఈ చిత్రానికి కేజిఎఫ్ ఫ్రాంచైజీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.  స‌లార్ ని  ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ  అంచనాలు పెట్టుకున్నారు.