English | Telugu

అసలు మనసెలా ఒప్పిందంటూ ఫైర్‌ అవుతున్న ఆలియా!

దేనికైనా హద్దుంటుంది.. ఉంటుందా? ఉండదా? కొన్ని పనులు చేయడానికి ముందు ఆలోచించాలి. ఆలోచించాలా? వద్దా? అంటూ ఫైర్‌ అవుతున్నారు ఆలియా. ఆమె అలా అవడంలోనూ తప్పు లేదంటూ ఆమెకు సపోర్ట్ నిలుచుంటున్నారు సెలబ్రిటీలు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కనిపించే ఆలియాకు అసలు కోపం ఎందుకు వచ్చింది? అనేది ఇంపార్టెంట్‌ టాపిక్‌. ఆలియా మధ్యాహ్నం తన ఇంట్లో కూర్చుని ఉన్నారట. తనపై ఎవరో ఫోకస్‌ చేస్తున్నట్టు అనుమానం వచ్చిందట. తదేకంగా తననే చూస్తున్నట్టున్న వైపు చూస్తే ఇద్దరు వ్యక్తులు కెమెరాలతో తనను ఫోకస్‌ చేస్తున్న విషయం తెలిసిందట. వెంటనే వారిని పట్టుకున్నారు ఆలియా. ఆ వార్తలను పబ్లిష్‌ చేస్తున్న సంస్థ మీద ఫైర్‌ అయ్యారు. 'అసలు ఇలాంటివి ఎందుకు చేస్తారు? ఇంట్లో కూడా ప్రైవసీ లేకుంటే ఎలా? నా ప్రమేయం లేకుండా నన్ను ఫొటోలు తీయడం భావ్యమేనా' అంటూ ప్రశ్నించారు. దాంతో పాటు పోలీసులను కూడా ట్యాగ్‌ చేశారు ఆలియా.

వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ ఈ టాపిక్‌ గురించి ఆమెకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. తనయుడు జే విషయంలోనూ గతంలో కరీనాకపూర్‌ చాలా మంది పత్రికల వారికి ఇలాంటి రిక్వస్టులే పెట్టారు. ఆలియా పోస్ట్‌ని షేర్‌ చేస్తూ జాన్వీ కూడా ఇంట్రస్టింగ్‌ విషయాలను జతచేశారు. ''నాకు తెలియకుండా నా జిమ్‌ ఫొటోలను షేర్‌ చేశారు. నాలుగు గోడల లోపు మన పర్మిషన్‌ లేకుండా ఎందుకు ఫొటోలు తీస్తారో అర్థం కాదు. జూమ్‌ లెన్స్ వాడి ఇలా ఫొటోలుతీయడం సరికాదు'' అని అన్నారు. అనుష్క శర్మ, కరణ్‌ జోహార్‌, అర్జున్‌ కపూర్‌, షహీన్‌ భట్‌ కూడా ఆలియాకు మద్దతుగా మాట్లాడారు. అసలు ఇలాంటి చర్యలకు ఎవరు అనుమతి ఇచ్చారంటున్న ఆలియా ఆవేశం సబబైనదే అని అంటున్నారు. ఇవన్నీ సిగ్గుచేటు చర్యలని అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.