English | Telugu

బుచ్చి బాబుతో చిట్టిబాబు కలిసేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15 మూవీ చేస్తున్నారు.  భారీ బడ్జెట్ తో దీల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన  ఎపిసోడ్స్‌ని  చిత్రీకరిస్తున్నారు.ఈ మూవీ తర్వాత రామ్ చరణ్  ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి ప్రతి నాయకుడిగా విజయ్ సేతుపతిని రంగంలోకి దించడానికి బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నారు... 

బాలయ్య రేటు 20 కోట్లు!

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన  స్టార్ హీరోలు పారితోషకాలను బాగా పెంచేస్తున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు అదే తరహాలో టాలీవుడ్ అగ్ర  కదా నాయకుడు బాలకృష్ణ తన రెమ్యూనేషన్ భారీగా పెంచేశారు. 2021 వరకు టాప్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ని ఫ్లాప్ ల‌ను ఎదుర్కొన్నారు. అయితే బోయపాటి శ్రీను తో చేసిన అఖండతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసారు. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ 50% ఆక్యుపెన్సిలోనూ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. బాలయ్య పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని అందించింది. బాలయ్య సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది.

ఆ విషయంలో నాగార్జున కరెక్ట్ అంటున్న జగపతిబాబు!

జగపతిబాబు... టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా మహిళా అభిమానులను ఆ రేంజ్ లో సొంతం చేసుకున్నారు. విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. క్షేత్రం తరువాత హీరో పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.  సరికొత్త ఇన్నింగ్స్ శ్రీకారం చుట్టారు. బాలకృష్ణ నటించిన బోయపాటి శ్రీను చిత్రం లెజెండ్ సినిమాతో పవర్ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇందులో జగపతిబాబు నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ మూవీతో విలన్ పాత్రల‌కు  కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.  జగపతిబాబు ఇప్పటికీ అదే తరహా పాత్రలో నటిస్తూ వస్తున్నారు. ప్రభాస్- ప్రశాంత నీల్  కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో  పవర్ఫుల్ విల‌న్  రాజమానారుగా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అందరు ప్రేమ్ రక్షిత్ కావాలంటున్నారు!

మట్టిలో మాణిక్యాలు అనే ఊత‌ప‌దం ఊరికే రాలేదు. ఈ సామెత‌కు ఎంద‌రినో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డందే పైకి రారు. ఇక విషయానికి వ‌స్తే మ‌ట్టిలో మాణిక్యం అనే  ఆ కోవలోకి చెందిన వ్యక్తి ప్రేమ రక్షిత మాస్టర్ కూడా. నాటు నాటు సాంగ్ తో  ప్రపంచం మొత్తం మారుమోగేలా చేసిన  సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని మరో మెట్టెక్కించింది. అయితే దేశం మొత్తం గర్వించేలాగా చేసిన ప్రేమ్  రక్షిత్ మాస్టర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇప్పుడు ఆయన తన సక్సెస్ తో ప్రస్తుతం వ‌రుస  సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. భారీ అవకాశాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో  రూపొందుతున్న స్టార్ హీరోల చిత్రాలకు పని చేస్తున్నారు. దర్శక నిర్మాతలు హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.వరుస చాన్సులతో ఖాళీ లేకుండా ఉన్నారు.