English | Telugu

షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకున్న మహేష్‌... ఎందుకో తెలుసా?

మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా అభిమానిస్తారో జంతువుల్ని కూడా కొందరు అంతే ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కొంతమంది అంతకు మించి అన్నట్టుగా కూడా తమ పెట్‌ యానిమల్స్‌ పట్ల ప్రేమను పెంచుకుంటారు. వాటికి చిన్న అనారోగ్యం కలిగినా తట్టుకోలేరు. ఆ పెట్‌ యానిమల్‌ చనిపోతే.. వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో కదా! అలాంటి పరిస్థితే సూపర్‌స్టార్‌ మహేష్‌కి వచ్చింది. ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో ఉండగా తను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెట్‌ డాగ్‌ ప్లూటో చనిపోయిందన్న విషయం తెలిసి చలించిపోయారు మహేష్‌. ఉన్నపళంగా షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకొని వెళ్లిపోయారు మహేష్‌. కళాకారుల మనస్తత్వాలు ఎంత సున్నితంగా ఉంటాయో, జంతువులతో సైతం వారి ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్స్‌ ఎంత డీప్‌గా ఉంటాయో ఈ ఘటన వల్ల మరోసారి తెలిసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.