స్పీడ్ న్యూస్ 2
తిరుమలలో భక్తుల రద్దీ
11.తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 74 వేల 24 మందిదర్శించుకున్నారు. 32 వేల 688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నేడు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
.......................................................................................................................................................
నిలిచిన వాట్సాప్ సేవలు
12. ప్రపంచ వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి దాదాపు అరగంట సేపు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత కంపెనీ సేవలను పునరుద్ధరించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.
...................................................................................................................................................
టమాటాలతో వెడుతున్న లారీ బోల్తా
13. టమాటాలతో వెళ్తున్న లారీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు శివారులోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. జనం టమాటాలను ఎత్తుకెళ్లకుండా ఆ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ టమాటా కిలో 150కి పైగా ఉండటంతో డ్రైవర్ గాయాలను సైతం లెక్క చేయకుండా కాపలాగా నిలబడ్డాడు.
.......................................................................................................................................................
ఈటల, అరుణ గృహ నిర్బంధం
14. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలనకు బీజేపీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల ను హైదరాబాద్ లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
................................................................................................................................................
అవసరమైతే తప్ప బయటకు రావద్దు
15. హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు.
.........................................................................................................................................
పని చేయని వాలంటీర్లు మాకొద్దు: ధర్మాన
16. శ్రీకాకుళంలో జగనన్న సురక్షా పథకం కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయని వాలంటీర్లు మాకు అవసరం లేదన్న ఆయన వారిని తక్షణమే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
.............................................................................................................................................
విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు
17. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం రెండు రోజులు సెలవు ప్రకటించింది. నేడు రేపు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవలు ఇచ్చినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
.........................................................................................................................................................
తెలంగాణలో భారీ వర్షాలు
18. తెలంగాణ రాష్ట్రంలో నేడూ, రేపూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు నిలిచిపోయింది.
...............................................................................................................................................................
మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘనే: సుప్రీం
19. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రం, మణిపుర్ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని సుప్రీం చేసింది.
...................................................................................................................................................
సిగ్గుపడాల్సిన విషయం: మోడీ
20.మణిపుర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను మెడీ సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని మోడీ తేల్చి చెప్పారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
.................................................................................................................................................
విపక్షాల కూటమికి ఇండియా పేరా: విజయశాంతి
21. విపక్షాల కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ లో ఓటములు ఎక్కువై విపక్షాల తెలివి ప్రమాదం అంచులు దాటిందని పేర్కొన్నారు. ఆ కూటమి ఓడితే ఇండియా ఓటమి అనాలా అని ప్రశ్నించారు.
.....................................................................................................................................................
జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు: పురందేశ్వరి
22. జగన్ పాలనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో చేసిన అప్పు రూ.2,65,365 కోట్లు అయితే జగన్ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పు రూ.7,14,631 కోట్లని చెప్పారు. జగన్ స్వర్ణాంధ్రను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.
........................................................................................................................................................
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి
23. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి వేగంగా పెరుగుతోంది. అప్రమత్తమైన యంత్రాంగం కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ ,చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
..........................................................................................................................................................
ఉస్మానియా పరిధిలో పరీక్షలు వాయిదా
24. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో గురు, శుక్ర వారాల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.
............................................................................................................................................
రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి
25. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమానాశ్రయం నుంచే డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు బాటసింగారానికి బయల్దేరారు. అయితే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించారు.
............................................................................................................................................
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం
26. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం.. యూనిఫాం సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మణిపూర్లో హింస, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా పలు అంశాలను విపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తాయి.
...............................................................................................................................................................
వినియోగదారులకు నెట్ ఫ్లిక్స్ షాక్
27. ప్రముఖ స్ట్రీమింగ్ మీడియా కంపెనీ నెట్ ఫ్లిక్స్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు నుంచి నెట్ వర్క్ పాస్వర్డ్ను షేర్ చేసుకునే వెసులుబాటును తొలగించింది. పాస్ వర్డ్ షేరింగ్ వల్ల సంస్థ ఆదాయానికి గండి పడుతోందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
.......................................................................................................................................
మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండం : రాహుల్
28. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అంటే ఇండియా మౌనంగా ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్ లో ప్రధాని మోడీ నిష్క్రియాపరత్వమే మణిపూర్ ను అరాచకత్వం వైపు నెట్టిందని పేర్కొన్నారు.
....................................................................................................................................
మిజోరంలో కంపించిన భూమి
29. మిజోరంలో ఈ తెల్లవారు జామున భూమి కంపించింది రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
..........................................................................................................................................
30. అహ్మదాబాద్లోని ఇస్కాన్ వంతెనపై ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వంతెనపై జరిగిన స్వల్ప ప్రమాదం వద్ద ప్రజలు గుమికూడి ఉండగా వేగంగా వచ్చిన కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.