విశాఖ వారాహి యాత్రలో పొత్తు పొడుపులపై కొత్త చర్చకు తెర లేపిన పవన్ ప్రసంగం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అధికార వైసీపీ అవినీతి, అక్రమాలు, ఆర్థిక అరాచకత్వంపై విమర్శలు గుప్పించారు. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా ఆయన విశాఖలో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. వాలంటీర్ వ్యవస్థపై తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఏపీ ప్రజల డేటా అంతా హైదరాబాద్ కు చేరుతోందన్నారు. వలంటీర్లపై తనకేం ఆగ్రహం లేదంటూనే  వలంటీర్ల వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో వివరించారు. ఇక్కడి వరకూ అంతా బానే ఉంది.. కానీ ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించడం, తాను చెబితే చాలు జగన్ అక్రమాలకు, అన్యాయాలకు, అరాచకత్వానికి మోడీ సర్కార్ చరమ గీతం పాడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడంపైనే పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఇన్నేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉండి ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టికి రాష్ట్రంలో సాగుతున్న దుష్టపాలన గురించి పవన్ కల్యాణ్ తీసుకువెళ్లలేదా అని ప్రశ్నిస్తున్నారు. తీసుకువెళ్లినా మోడీ అండ్ కో పెడచెవిన పెట్టారా, పట్టించుకోలేదా? లేక కేంద్రంలో మోడీ సర్కార్ కు రహస్య మిత్రుడిగా.. కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ చెప్పినట్లు మోడీకి పుత్ర సమానుడైన జగన్  రాష్ట్రంలో సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి చెప్పడానికి జనసేనాని సంకోచించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే దానిని  పక్కన పెడితే  వారాహి మూడవ విడత యాత్ర విశాఖలో ఆరంభమైంది. ఊహించినట్లే.. జనసేనాని  జగన్ టార్గెట్ గా  నిప్పులు చెరిగారు. సవాళ్లు విసిరారు. హెచ్చరికలూ చేశారు.   విశాఖలోని జగదాంబా సెంటర్ వద్ద జరిగిన భారీ సభలో పవన్ కల్యాణ్.. జగన్ మీద విమర్శల దాడి స్థాయిని పెంచారు. ఇన్నాళ్ళూ  విమర్శలు మాత్రమే చేస్తూ వస్తున్న పవన్ ఈసారి కార్యాచరణకు దిగుతానని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వైసీపీ అవినీతి చిట్టా ఉందని ఇక జగన్ కు చుక్కలేనని ప్రకటించారు.  కేంద్ర హోం మంత్రి విశాఖ వచ్చి వైసీపీ ప్రభుత్వ అవినీతి గురించి చెప్పారని  తాను కూడా కేంద్రం సాయంతో జగన్ కట్టిస్తానన్నారు.  వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తోందనీ, అందుకు సంబంధించిన ఫైల్ కేంద్రం దగ్గర ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ఇలా మైనింగ్ అక్రమంగా చేస్తున్న ఎమ్మెల్యేల చిట్టా కూడా కేంద్రం వద్ద ఉందన్న కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు. విశాఖ జిల్లాలోనే మైనింగ్ కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగే కేంద్రం ఇచ్చిన నిధులతో పనులు చేస్తూ దానికి జగన్ తన సొంత బొమ్మ వేసుకుంటున్నారు అని విమర్శించారు. విశాఖలో పాతిక వేల కోట్ల విలువ చేసే ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అని పవన్ ఆరోపించారు ఇక దేశంలోనే పేరెన్నిక కలిగిన ఆంధ్ర యూనివర్సటీ పూర్తిగా భ్రష్టు పట్టి ర్యాంకులు లేక దిగజారిపోయిందనీ,  ఏకంగా క్యాంపస్ లో సెక్యూరిటీయే గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనీ ఆరోపించారు. ఏయూ వీసీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని గ్యాడ్యుయేట్లపై ఒత్తిడి తేవడం వ్యవస్థల దిగజారుడుకు నిలువెత్తునిదర్శనంగా పవన్ అభివర్ణించారు.  ఈ విమర్శలలో కొత్తవేమీ లేకపోయినా.. పవన్ కల్యాణ్ స్వరంలో వాడీ వేడి పెరిగి నిప్పుల బాణాల్లో ఆయన మాటలు దూసుకు వచ్చాయి. అలాగే ఇప్పటి వరకూ  ఎక్కడా ఆయన అధికారంలోకి వచ్చాకా అన్న మాట అనలేదు. రాష్ట్రంలో జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఇంత కాలం చెబుతూ వచ్చిన పవన్ విశాఖలో తొలి సారిగా జనసేన అధికారం గురించి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటే సరిపోదనీ, మీరు కూడా అంటే జనం కూడా కోరుకోవాలని పిలుపు నిచ్చారు. జనసేన అధికారంలోకి వచ్చాకా.. ఆంధ్రా యూనివర్సిటీని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పడం ద్వారా రాష్ట్రంలో పొత్తు పొడుపులకు సంబంధించి కొత్త చర్చకు ఆయన తెరలేపారు.  జగన్ని ఏకంగా వ్యాపారిగా అభివర్ణించారు. ఆయన వద్దకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే యువతకు ఉద్యోగాలు  అడగడం మాని.. తనకు ఎంత కమిషన్ అని అడుగుతారని తీవ్ర ఆరోపణలు చేశారు.  

అజారుద్దీన్ .. ఎమ్మెల్యే ఇన్నింగ్స్‌.. అడ్డుగా మాజీ..?

మొన్నటి భారత్ జోడో యాత్ర.. నిన్నటి కర్ణాటక గెలుపు.. మొత్తం మీద యమ బోరుగా ఉన్న కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసింది. ఈ సమయంలో చేరికలతో, సరికొత్త ఎత్తులతో సందడి చేస్తోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎంటరయ్యాడు. అసెంబ్లీకి పోటీ  చేసి..ఎమ్మెల్యే అయ్యేందుకు తహ తహ లాడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికలల్లో చక్కని ఇన్నింగ్స్‌ కోసం కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నాడాయన. దీంతో స్థానిక నేత అనుచరులు ఆందోళనలకు దిగి తున్నారు. పార్లమెంట్ సభ్యునుగా అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున  ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తనకు తానుగా ప్రకటించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి వెళ్లిన అజారుద్దీన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వెళ్లిన ఆయన... నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనే వివాదానికి కారణమైంది. దీంతో... పీ.జనార్థన రెడ్డి తనయుడయ.. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి మద్దతుదారుల నుంచి నిరసన వ్యక్తం అయింది. జూబ్లీహిల్స్‌ తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఫలితంగా... విష్ణు మద్దతు దారులు అజాహరుద్దీన్ పర్యటనకు అభ్యంతరం చెప్పారు. పైగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై జూబ్లిహిల్స్ నుంచి పోటీచేసి గెలవాలని విష్ణువర్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ పెద్దలతో మంతనాలు జరిపారని అంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో గతకొంతకాలంగా చురుకుగా ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో అజారుద్దీన్ ఎంటరయ్యారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని సోమాజీ గూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేసారు. దీంతో విష్ణు వర్గీయులు అజార్దుద్దీన్ పై ఫైరవుతున్నారు. అయితే.. అజాహరుద్దీన్ ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపాలని మరి కొందరు నేతలు సూచిస్తున్నారు. విష్ణు అనుచరులు మాత్రం ఏంటి పరిస్థితి   అంటూ తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ సమయంలో అధిష్టానం పెద్దలు అజారుద్దీన్ ని ఒప్పిస్తారా.. లేక, విష్ణుని పక్కన పెడతారా..అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతోందా..?

దేశానికి మరో చండ శేషణుడు కావాలి!

ఏ అధికారిని చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ తప్ప అనే భావన ప్రజల్లో ఉంది. అలా ఎవరి చేతుల్లో కీలుబొమ్మ కాకుండా.. ప్రభుత్వాలను, ప్రధాన రాజకీయ పార్టీలను గడగడలాడించి.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా నిలిచిన వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, దివంగత టీఎన్‌ శేషన్. పదవీకాలం ముగిసి ఏళ్ళు గడిచినా, ఆయన ఈ లోకాన్ని విడిచినా.. ఇప్పటికీ ఆయనను తలచుకుంటున్నాం అంటే అది ఆయన గొప్పతనం. సుప్రీం కోర్టు సైతం ఆయనను స్మరించుకుంటున్నది. ఇంతకీ ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. దేశ ప్రజాస్వామ్య సౌథాన్నే కూల్చేసేంత దుర్మార్గమైన బిల్లును కేంద్రం గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. ఆ బిల్లు ఇప్పటికే గాలిలో దీపంగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని పూర్తిగా నాశనం చేసేదిగా ఉంది.  ఆ బిల్లు చూసిన ఎవరికైనా ఇప్పుడు శేషన్  ఉండి ఉంటేనా అనిపించకమానదు.. వివరాల్లోకి వెడితే కేంద్రం తీసుకువచ్చిన బిల్లుతో..విపక్షాల భయాలే నిజమౌతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోడీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయిపోయింది. ఇందు కోసం సుప్రీం కోర్టు  తీర్పునకు భిన్నంగా బిల్లు రెడీ చేసింది. గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టేసింది కూడా. ఈ బిల్లు ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం పట్టును, జోక్యాన్ని పెంచేదిగా ఉంది. ఎంపిక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేసే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ పంజరంలో చిలుకలా కేంద్రం చేతిలో  కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు కనుక సభ ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అంటే 2019 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవీఎంల నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసుల వరకూ అన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విపక్షాలు ఆరోపించాయి. ఆ తరువాత కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ప్రతి అంశమూ కూడా మోడీ కనుసన్నలలో జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని లాగేసుకుని తానే ఆధిపత్యం చెలాయించాలని  చూస్తున్నదన్న విపక్షాల ఆరోపణలు అక్షర సత్యాలేననడానికి కేంద్రం తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు రుజువు చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లోనే బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వాని అప్పటి ప్రధానికి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  చోటు కల్పించాలని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ ఏడాది మార్చిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై విస్ఫష్ట తీర్పు ఇచ్చింది. ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాలు జరపాలని స్పష్టంగా పేర్కొంది. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం గురువారం(ఆగస్టు 10) రాజ్యసభలో  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా ఆ స్థానంలో ప్రధాని ఎంపిక చేసే కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లును  ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో  ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, ప్రధాని ఎంపిక చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ  ఎన్నికల కమిషనర్లుగా నియమించేందుకు అర్హత ఉన్న ఐదుగురిని ఎంపిక చేస్తుంది. వారిలో నుంచి ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, కమిషనర్లను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. అదీ సంగతి.  ఇప్పటికే కేంద్రం ఆడించినట్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటి  దాడులు ఏ లక్ష్యంతో ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నాయో అందరికీ తెలుసుననీ, ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయనీ, ఇక ఈ బిల్లు ప్రవేశ పెట్టడంతో కేంద్రం అవన్నీ ఆరోపణలు కావు, అక్షర సత్యాలని తేల్చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వ వ్యవస్థలపైనా పెత్తనం చెలాయించి అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రలో భాగమే ఈ బిల్లు అని కాంగ్రెస్ విమర్శించింది. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇది న్యాయపరీక్షకు నిలబడదని అంటున్నారు. మొత్తం మీద కేంద్రం తీసుకువచ్చిన బిల్లు మాత్రం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించేలా మోడీ సర్కార్ చట్టాలను రూపొందిస్తోందనీ, మంద బలంతో వాటిని సభలో ఆమోదింప చేసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యవస్థలపై పెత్తనమే లక్ష్యంగా మోడీ సర్కార్!

విపక్షాల భయాలే నిజమౌతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోడీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అయిపోయింది. ఇందు కోసం సుప్రీం కోర్టు  తీర్పునకు భిన్నంగా బిల్లు రెడీ చేసింది. గురువారం (ఆగస్టు 10) రాజ్యసభలో ప్రవేశ పెట్టేసింది కూడా. ఈ బిల్లు ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం పట్టును, జోక్యాన్ని పెంచేదిగా ఉంది. ఎంపిక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి చోటు లేకుండా చేసే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ పంజరంలో చిలుకలా కేంద్రం చేతిలో  కీలుబొమ్మలా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు కనుక సభ ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే.. కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా అంటే 2019 ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవీఎంల నుంచి ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసుల వరకూ అన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విపక్షాలు ఆరోపించాయి. ఆ తరువాత కూడా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ప్రతి అంశమూ కూడా మోడీ కనుసన్నలలో జరిగిందని విపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. మొత్తంగా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని లాగేసుకుని తానే ఆధిపత్యం చెలాయించాలని  చూస్తున్నదన్న విపక్షాల ఆరోపణలు అక్షర సత్యాలేననడానికి కేంద్రం తాజాగా లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు రుజువు చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2012లోనే బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వాని అప్పటి ప్రధానికి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి  చోటు కల్పించాలని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ ఏడాది మార్చిలో దేశ సర్వోన్నత న్యాయస్థానం  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకంపై విస్ఫష్ట తీర్పు ఇచ్చింది. ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాలు జరపాలని స్పష్టంగా పేర్కొంది. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం గురువారం(ఆగస్టు 10) రాజ్యసభలో  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం లేకుండా ఆ స్థానంలో ప్రధాని ఎంపిక చేసే కేంద్ర మంత్రికి స్థానం కల్పిస్తూ రూపొందించిన బిల్లును  ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో  ప్రధాని, లోక్ సభలో విపక్ష నేత, ప్రధాని ఎంపిక చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ  ఎన్నికల కమిషనర్లుగా నియమించేందుకు అర్హత ఉన్న ఐదుగురిని ఎంపిక చేస్తుంది. వారిలో నుంచి ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, కమిషనర్లను ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. అదీ సంగతి.  ఇప్పటికే కేంద్రం ఆడించినట్లే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటి  దాడులు ఏ లక్ష్యంతో ఎవరిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నాయో అందరికీ తెలుసుననీ, ఇప్పటి వరకూ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయనీ, ఇక ఈ బిల్లు ప్రవేశ పెట్టడంతో కేంద్రం అవన్నీ ఆరోపణలు కావు, అక్షర సత్యాలని తేల్చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వ వ్యవస్థలపైనా పెత్తనం చెలాయించి అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రలో భాగమే ఈ బిల్లు అని కాంగ్రెస్ విమర్శించింది. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఇది న్యాయపరీక్షకు నిలబడదని అంటున్నారు. మొత్తం మీద కేంద్రం తీసుకువచ్చిన బిల్లు మాత్రం కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని పెత్తనం చెలాయించేలా మోడీ సర్కార్ చట్టాలను రూపొందిస్తోందనీ, మంద బలంతో వాటిని సభలో ఆమోదింప చేసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీమలో బాబు, ఉత్తరాంధ్రలో పవన్.. అవే ఆంక్షలు, అదే టెన్షన్!

ఏపీలో వైసీపీ పరిస్థితి చూస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతిపక్షాలు గుక్క తిప్పుకోకుండా మూకుమ్మడిగా దాడి చేస్తుంటే ఎదుర్కోవడం ఎలాగో తెలియక ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని వారిని ఎదుర్కొనే ఎత్తులు వేస్తున్నది. ప్రతిపక్షాలు లేవనెత్తే ఒక్కో అంశం ప్రభుత్వానికి ఊహించని రీతిలో డ్యామేజ్ చేస్తుంటే సమాధానమే లేక మీరే మాకు దిక్కని పోలీసులను ఉసిగొల్పుతున్నట్లు అర్ధం అవుతున్నది. నిన్నటి వరకూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల సందర్శన జరిగింది. సీమలో మొదలైన ఈ యాత్ర గోదావరి జిల్లాలలో ముగిసింది. అయితే  మొత్తం చంద్రబాబు యాత్రలో అడుగడుగునా ఆంక్షలే కనిపించాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏ స్థాయిలో ఘర్షణలు జరిగాయో తెలిసిందే. ఒకవైపు పోలీసులు ఆంక్షలు విధించడం.. మరోవైపు వైసీపీ కార్యకర్తలను దాడులకు దిగడం షరా మామూలుగా మారిపోయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రాయలసీమ జిల్లాలో పర్యటిస్తుండగా పోలీసులు  అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఎక్కడిక్కడ టీడీపీ కార్యకర్తలను రాకుండా ఎన్ని చేయాలో అన్నీ చేశారు. కానీ, పోలీసులు, వైసీపీ చర్యలేవీ ఫలించలేదు. సునామీలా దూసుకొచ్చిన  తెలుగుదేశంకార్యకర్తల ముందు ఆ పప్పులేవీ ఉడకలేదు. దీంతో ఎలాగైనా ఈ యాత్రను భగ్నం చేయాలని  పుంగనూరులో రౌడీయిజానికి దిగారు. అయినా వెనుదిరగని టీడీపీ కార్యకర్తలు దీటుగా తిప్పికొట్టారు. మొత్తంగా పుంగనూరు ఘర్షణ అనంతరం నెల్లూరు, ప్రకాశం మీదుగా వెళ్లి గోదావరి జిల్లాలలో ఈ యాత్ర ముగిసింది. చివరికి పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం కనిపించింది. చంద్రబాబు వెళ్లే గంట ముందు వరకూ కూడా ప్రభుత్వం నుండి అనుమతి రాలేదు. ఏది ఏమైనా పోలవరం వెళ్లాల్సిందేనని చంద్రబాబు తెగింపుతో ఉండడంతో చివరికి అనుమతి ఇవ్వక తప్పలేదు. కాగా, చంద్రబాబు సీమ యాత్రలాగానే ఇప్పుడు ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా పోలీసులు సవాలక్ష కొర్రీలు పెట్టారు. పవన్ మూడవ విడత వారాహీ యాత్ర గురువారం (ఆగస్టు 10) విశాఖలో మొదలైంది. ఈ  యాత్రకు కూడా పోలీసులు  ఆంక్షలు విధించారు. పవన్ ఈ యాత్రలో భాగంగా ఎక్క‌డా రోడ్ షో చేయ‌డానికి వీల్లేద‌ని పోలీసులు పేర్కొన్నారు. అదే విధంగా అభిమానుల‌తో క‌ర‌చాల‌నాలు, వాహ‌నం (ఓపెన్ టాప్) పైకి ఎక్కి అభివాదాలు లాంటివి కూడా చేయ‌డానికి వీల్లేద‌ని, చివరికి విశాఖ విమానాశ్ర‌యంలోనూ ఎవ‌రినీ క‌లిసేందుకు కానీ, అభివాదాలు, నినాదాలు చేసేందుకు కూడా అనుమ‌తి లేద‌ని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే విమానాశ్రయంలో దిగి కారు ఎక్కి సభ స్థలం వద్ద కారు దిగడం వరకే అనుమతి ఇచ్చారు. అంతేకాదు, అది కూడా విశాఖ విమానాశ్ర‌యం నుంచి కేవ‌లం పోర్టు రోడ్డు ద్వారా మాత్ర‌మే ప‌వ‌న్ కాన్వాయ్ వెళ్లాల‌ని, కాన్వాయ్ వెళ్తున్న స‌మ‌యంలో ఈ రోడ్డులో ఎక్కడా ఎలాంటి ఆర్భాటాలు, నినాదాలు, జెండా ఎగ‌రవేత‌లు వంటివి చేయడానికి వీల్లేద‌ని, పవన్ కారు దిగడం కానీ, అభివాదం చేయడానికి కానీ వీలు లేదని.. ఒకవేళ పోలీసుల ఉత్తర్వులను కాదని అలా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఫైనల్ గా పవన్ విమానాశ్ర‌యం నుంచి నేరుగా జ‌గ‌దాంబ సెంట‌ర్‌కు చేరుకుని, అక్క‌డ స‌భ నిర్వ‌హించుకుని, అక్కడ నుండి నేరుగా బస చేసే ప్రాంతానికి వెళ్లిపోవాలని, ఇందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు విశాఖ‌ప‌ట్నం పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం విస్పష్టంగా పేర్కొంది. అలాగే  ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చేవారికి పాస్‌లు మంజూరు చేయాల‌ని ఒక్కో పాస్‌పై కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే అనుమ‌తిస్తామ‌ని, ఆక‌స్మిక త‌నిఖీలు చేసి.. పాస్‌లేని వారిని అదుపులోకి తీసుకునే అధికారం త‌మ‌కు ఉంద‌ని ఆదేశాల్లో పేర్కొంది. వైసీపీ ఏ స్థాయిలో ప్రతిపక్షాలకు భయపడుతున్నదో ఆ ఉత్తర్వులను చూస్తేనే అర్ధమవుతున్నది.  కాదనలేక ఉత్తర్వులు ఇవ్వడం..వైసీపీ నేతల మెప్పు కోసం సవాలక్ష ఆంక్షలు పెట్టడం చూస్తుంటే ఏపీ పోలీసులు ఏ స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారో తెలిసిపోతుంది.

ప్రపంచంలోనే తొలి రోబో టీచర్.. ఏఐ నిపుణుల అద్భుత సృష్టి

ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్ బెంగళూరు, హైదరాబాద్ లలో  ఇండస్ స్కూల్స్ లోపాఠాలు మొదలు పెట్టేసింది. 5 అడుగుల 7 అంగులాల ఎత్తు ఉన్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ పాఠాలను సమర్ధవంతంగా చెబుతుంది.   ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో  టీచర్ ప్రపంచంలోనే తొలి సారిగా ప్రవేశపెట్టిన ఇండస్ స్కూల్స్ యాజమాన్యం.. బోధనలో కచ్చితత్వం, వంద శాతం ఫౌల్ ప్రూఫ్ అని చెబుతోంది. ఈ రోబో టీచర్ ను ఏఐ నిపుణులు రావు, రాహు లు సంయుక్తంగా రూపొందించారు. ఇరువురూ బెంగళూరుకు చెందిన వారే. కాగా ఈ రోబో టీచర్ బోధన పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోబో టీచర్ పాఠాలను బహు చక్కగా, అర్ధమయ్యేలా చెబుతోందని అంటున్నారు. తమ సందేహాలను కమాండ్ ద్వారా అడిగి రోబో టీచర్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవడంతో చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా అర్ధవంతంగా చదువు సాగుతోందని అంటున్నారు. ఈ రోబో టీచర్ల వల్ల భవిష్యత్ లో టీచర్ రిక్రూట్ మెంట్ గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో టీచర్ల సెలవులు, ట్రాన్స్ ఫర్లు అంటూ బోధనకు అవరోధాలు, ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉండవని అంటున్నారు.  

జగన్ చిన్నారికి పెట్టిన పేరు దేవుడు.. పిచ్చి పీక్స్ అంటూ సెటైర్లు

అదేంటో పాపం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏం చేసినా తెగ వైరవల్ అయిపోతోంది. జగన్ కు ఇప్పుడు బహుశా బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. అందుకే అనుకోకుండా వెళ్లి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలలో అనుభవం లేమితో ఎక్కడకి వెళ్లినా తెగ ట్రోల్ అయిపోతున్నారు. స్క్రిప్ట్ ప్రకారం జరిగే కార్యక్రమాలను ఎలాగోలా కిందా మీద పడి మేనేజ్ చేస్తున్న జగన్.. స్క్రిప్ట్ లేని కార్యక్రమాలంటే తెగ సతమతమైపోతున్నారు. దీంతో ఏదో చేయబోయి ఇంకేదో చేయడం.. ఏదో మాట్లాడాలని వెళ్తే తనకేమీ తెలియదని దొరికిపోవడంతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సందర్భం కూడా అలాంటిదే. సీఎం వస్తున్నాడని ఆనందపడిన ఆ దంపతులు ఆయనతో చిన్నారికి పేరు పెట్టాలని నిర్ణయించుకుని.. చిన్నారిని ఆయన చేతుల్లో పెడితే.. ఏం చేయాలో అర్ధం కాని జగన్ తనకి దేవుడు అని పేరు పెట్టి ఒక ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇంత ట్రెండీ కాలంలో దేవుడు పేరు ఎలా వచ్చిందయ్యా సామీ నీకు అంటూ ఇప్పుడు తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. వరదలన్నీ ఉభయగోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను ముంచేసి అక్కడ ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అంతా అయిపోయాక వరదలు తగ్గాక మన సీఎం సాబ్ అక్కడకు వెళ్లారు. యధావిధిగా ఆయన ఓదార్పు యాత్ర ఆయన చేసుకున్నారు. ఇక్కడే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ జంట తమ పసికందును సీఎం జగన్ చేతుల్లో పెట్టి, తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని సీఎం మీకు నచ్చిన పేరు ఏంటని తిరిగి ఆ దంపతులను అడిగారు. దానికి ఆంగ్లంలో డీ అనే అక్షరంతో ఆ పేరు మొదలయ్యేలా మీకు ఇష్టమైన పేరు పెట్టండని ఆ దంపతులు తెలిపారు. కాస్త ఆలోచించిన సీఎం జగన్ 'దేవుడు' అంటూ ఆ బిడ్డకు నామకరణం చేశారు. బిడ్డను ముద్దాడి, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  ఈ మధ్య కాలంలో పిల్లల పేర్లు ఎంత ట్రెండీగా ఉంటున్నాయో అందరికీ తెలిసిందే. మారు మూల పల్లెల్లో కూడా తమ పిల్లలకు కొత్త కొత్త పేరు వెతికి మరీ పెడుతున్నారు. పుట్టినరాశి, నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టాలనుకునే వారు కూడా ఇంటర్నెట్ మొత్తం వెతికి మరీ ట్రెండ్ కి తగ్గట్లు పేర్లు పెట్టుకుంటున్నారు. గతంలో మాదిరి తమ తాతల పేర్లని సుబ్బయ్య, వెంకయ్య అని పెట్టడం పక్కన పెట్టేసి రేపు భవిష్యత్ లో తమ వారసులు ఎగతాళి కాకుండా కొత్తదనం ఉండేలా పేర్లు వెతుకుతున్నారు. మరోవైపు ఈ పాతకాలపు పేర్లపై సినిమాలలో కూడా కామెడీ సీన్లు, సెటైర్లు ఉండడం తెలిసిందే. తమకి పాతతరం పేర్లు పెట్టిన తమ తాతనో, నాన్నానో సినిమాలో పాత్రలు హేళన చేయడం కూడా ప్రజలు  చూసిందే. కానీ, ఇలాంటి సందర్భంలో కూడా సీఎం జగన్ ఆ చిన్నారికి దేవుడు అని పెట్టడం విశేషం.  చిన్నారికి దేవుడు అని పేరు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. సీఎం జగన్ మరీ ఇంత వెనకబడి ఉన్నాడా అని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు, ఖలేజా సినిమాలో నువ్వు దేవుడివి స్వామీ అంటూ మహేష్ బాబుకి గ్రామ ప్రజలు చెప్పే క్లిప్పులను కట్ చేసి పెడుతూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అదే ఖలేజా సినిమాలో సేమ్ ఇప్పుడు జగన్ పేరు పెట్టిన సీన్ కూడా ఒకటి ఉంటుంది. చిన్నారిని చిచూ అని మహేష్ బాబు లాలించే ప్రయత్నం చేస్తే అదే పేరని.. ఆ ఊరి ప్రజలు చిచూ పేరు భలే ఉందని వెళ్ళిపోతారు. ఆ సమయంలో మహేష్ ఓర్నియబ్బ పెద్దయ్యాక వాడు నన్ను తిట్టుకుంటాడని ఫన్నీగా తిడతాడు. ఈ సీన్ క్లిప్ తో కూడా జగన్ పేరు పెట్టిన వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.  నిజానికి దేవుడు అనేది జగన్ ఊతపదం. ఎక్కడ ఎలాంటి సభలు, సందర్భం అయినా దేవుడు అనే మాట ఆయన నోట కనీసం ఒక్కసారైనా వస్తుంది. దేవుని దీవెనలు, ఆ దేవుడు చల్లగా చూస్తే, ఆ దేవుని దీవెనలతో ఇలా ఆయన ప్రసంగంలో రెగ్యులర్ గా వినిపిస్తుంటుంది. పాపం ఆ సమయానికి ఆ పదమే గుర్తు వచ్చినట్లుంది.. ఆ చిన్నారికి అదే పేరుగా పెట్టేశారు. కాగా, జగన్ కు పిచ్చి పట్టిందని.. ఎక్కడో విదేశాలలో ఈ పిచ్చికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆ మధ్య కొందరు నేతలు విమర్శించగా.. సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ దేవుడు పేరుతో ఆ పిచ్చి పరాకాష్టకు చేరిందని సోషల్ మీడియాలో మరింత ప్రచారం జరుగుతున్నది.

ఇంకా జగనన్న వదిలిన బాణమేనా?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు  షర్మిల వ్యవహార శైలి.. హస్తం పార్టీ అగ్రనేతలకు ఏ మాత్రం అంతుపట్టని విధంగా ఉందని  ఢిల్లీ పోలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీకి వెళ్లి రాజకీయం చేయమంటే వెళ్లను.. తెలంగాణలోనే ఉండి.. రాజకీయం చేస్తానని  షర్మిల చెబుతున్నారనీ,  అయితే ఏపీలో పార్టీ బలోపేతం కోసం పని చేయమంటే   షర్మిల ఎందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్న  అంశంపై హస్తిన  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. రాష్ట్రానికి చెందిన కీలక నేతల నుంచి సమాచారం సేకరిస్తున్నట్ల ఆ పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఆ సందర్భంగా అందులో అధిష్ఠానం దృష్టికి పలు ఆసక్తికర విషయాలు  వస్తున్నట్లు తెలుస్తున్నది.  ముఖ్యంగా అటు   జగన్, ఇటు షర్మిలల మధ్య బంధం గట్టిగానే ఉందని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. వీరిద్దరు పైకి కుస్తీ.. లోన దోస్తి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  ఓ వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా  షర్మిలను నియమిస్తే.. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్ర.. తన సొంత సోదరుడు  జగన్ పాలనతో మరింత బాగా వెనుక పడిపోయిందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా చెప్పాల్సి ఉంటుందని.. అలాగే సోదరుడు  జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ.. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, నవరత్నాలు, రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని.. కానీ అదే సోదరుడు  ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత.. ఈ అంశాలన్నీ   మరిచిపోయారని.. వీటిని సైతం ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత   షర్మిలపై ఉంటుందని.. ఇక జగనన్న వదిలిన బాణమంటూ... అటు పాదయాత్ర, ఇటు బస్సు యాత్ర చేసి... 2019 ఎన్నికల్లో గద్దెనెక్కించిన సొంత సోదరుడిని.. మళ్లీ అధికారానికి దూరం చేయాల్సి ఉంటుందని... ఈ నేపథ్యంలో ఏపీకి వెళ్లి సొంత సోదరుడు వ్యతిరేకించే పార్టీలో చేరి.. ఫ్యాన్ పార్టీపై బురద జల్లడం కంటే.. పక్క రాష్ట్రంలో ఉండి తన రాజకీయం తాను చేసుకొంటే మంచిదనే ఓ అభిప్రాయంలో వైయస్ షర్మిల ఉన్నారని రాష్ట్రంలోని  కాంగ్రెస్ వర్గాల ద్వారా ఢిల్లీలోని  పార్టీ అగ్రనేతలకు సమాచారం చేరిందని అంటున్నారు.   అన్నా చెల్లెళ్ల మధ్య బంధం ఏ మాత్రం చెడలేదని.. ఇప్పటికే సీఎం వైయస్ జగన్ సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్  సీనియర్ నాయకుడు ఎన్ తులసీ రెడ్డి మీడియా ఎదుటే గతంలోనే వివరించారని.. ఈ విషయం సైతం హస్తం పార్టీ అగ్రనేతల వద్దకు చేరిందని తెలుస్తోంది.  మరో వైపు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు  షర్మిల తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేసేందుకు ఢిల్లీ వేదికగా కసరత్తు జరుగుతోందనీ.. అందులోభాగంగా ఆమె గత వారం రోజులుగా బెంగళూరులోనే ఉంటూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో చర్చల మీద చర్చలు జరుపుతోంది.    అయితే తాను తెలంగాణలోనే ఉంటానని.. ఇక్కడే రాజకీయం చేస్తానని డీకే శివకుమార్ ద్వారా.. హస్తం పార్టీ అధిష్టానానికి   షర్మిల క్లియర్ కట్ సందేశం పంపినట్లు సమాచారం. మరోవైపు  షర్మిల రాక వల్ల తెలంగాణలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. పార్టీ అధిష్టానానికి వివరణ ఇవ్వడంతో... ప్రస్తుతం వైఎస్సార్టీపీని హస్తం పార్టీలో విలీనం చేయాలని.. ఆ తర్వాత అంటే.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని.. కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తే.. మీ తండ్రికి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కాయో.. అలాంటి గౌరవమే మీకూ దక్కుతుందని వైయస్ షర్మిలకు పార్టీ అధిష్టానం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో వచ్చే వారం డీకే శివకుమార్‌తోపాటు  షర్మిల ఢిల్లీ వెళ్లి... పార్టీ అగ్రనేతల సమక్షంలో వైయస్ఆర్‌టీపీని హస్తం పార్టీలో విలీనం చేసి... ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీ   కోసం ఆమె కృషి చేయనున్నారనే ఓ ప్రచారం   పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.

ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా బాబాయ్ కు ఇక కడలి ఈతే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బాబాయి, టీటీడీ బోర్డ్   చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి త్వరలో బ్యాడ్ టైం స్టార్ట్ కానుందనే ఓ చర్చ అయితే ఉత్తరాంధ్రలోని పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోన్నట్లు తెలుస్తోంది.  తిరుమలలో శ్రీవారి సేవ నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సేవకు వెళ్లేందుకు వై వీ సుబ్బారెడ్డి ముహుర్తం ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఆయన పదవి కాలం ఆగస్టు 12తో ముగియనుందని.. దీంతో ఆ వెంటనే... లేదా అమావస్య వెళ్లిన తర్వాత అంటే.. ఆగస్ట్ 17వ తేదీన ఆయన.. తన మకాంను ఉత్తరాంధ్రకు మార్చేయనున్నారనే  చర్చ అయితే  ఆ సర్కిల్‌లో కొనసాగుతోంది.  ఆ క్రమంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా ఆయన  రాజకీయాలపై ఆయన పూర్తిగా ఫోకస్ చేయనున్నారని చర్చ సైతం హల్‌చల్ చేస్తోంది.  అయితే ఉత్తరాంధ్ర రాజకీయం అంటే  ఆషామాషీ వ్యవహారం కాదని..  ఇప్పటి వరకు తిరుపతిలో లడ్డు, వడ, చక్ర పొంగలి తరహా ప్రసాదాల కోసమో, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు కోసమో, వీఐపీలకు శ్రీవారి దర్శనం కోసమో, ప్రోటోకాల్‌ తదితర అంశాల సిఫార్సు లేఖలు శ్రీవారి ఆనంద నిలయం చుట్టూ... లేదా.. తిరుమల కొండల చుట్టూతా మాత్రమే ఉంటాయని.. కానీ ఉత్తరాంధ్ర రాజకీయం అంటే మాత్రం లెక్కపక్కా గా ఉంటుందని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే సదరు ప్రాంతంలో రాజకీయం అంటే పైకి అంతా ఠండా ఠండా కూల్ కూల్ అన్నట్లుగా ఉన్నా.. సదరు జిల్లాల రాజకీయంతో వైవీ సుబ్బారెడ్డి తల బొప్పి కట్టడం మాత్రం ఖాయమ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మను ఎన్నికల బరిలో దింపగా... ఆమె ఓటమి పాలైయ్యారని.. ఇక 2019 ఎన్నికల్లో అదీ కూడా ఈ జగన్ వేవ్‌లో విశాఖ ఎంపీ స్థానం ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడినా.. విశాఖపట్నం నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రం సైకిల్ పార్టీ ఖాతాలోకి ఎగిరి పడ్డాయని... మరి వచ్చే ఎన్నికల్లో ఈ మొత్తం స్థానాలు.. హోల్ సేల్‌గా జగన్ పార్టీ ఖాతాలో పడతాయా? అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోన్నట్లు తెలుస్తోంది.  అదీకాక ఇటీవల విశాఖ ఎంపీ, ఫ్యాన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైందని... ఈ నేపథ్యంలో సదరు ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక్కడ మాత్రం వ్యాపారం చేయలేనని.. పక్కా రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసుకొంటానంటూ ప్రకటించేశారని... అదికార పార్టీ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యడి పరిస్థితి ఏమిటనే ఓ ప్రశ్న అయితే ఉత్పన్నమైందని ...ద తో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఈ సందర్బంగా తీవ్ర చర్చకు వచ్చినట్లు  సదరు సర్కిల్‌లో ఓ చర్చ వైరల్ అవుతోంది.     ఇక ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ప్యాన్ పార్టీ కీలక నేత పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే అధికార పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాం రాం చెప్పేసి.. మరో పార్టీలోకి వెళ్లీపోయారని.. దీంతో ఉత్తరాంధ్రలోని పలువురు ఫ్యాన్ పార్టీ నేతలు.. పంచకర్ల దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయని ఓ చర్చ సైతం వాడి వేడిగా కొన... సాగుతోంది.  అలాగే సిక్కోలు జిల్లాలోని ఫ్యాన్ పార్టీలో రేగిన అసమ్మతి సెగ.. నివ్వురుగప్పిన నిప్పులా ఉందని.. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో వర్గ పోరు తారస్థాయికి చేరిందని.. అలాగే టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా తొలుత దువ్వాడ శ్రీను పేరును గతంలో సీఎం జగన్ స్వయంగా ప్రకటించారని.. ఆ తర్వాత అతడి భార్య దువ్వాడ వాణి పేరు తెరపైకి వచ్చిందని.. అయితే ఇటీవల దువ్వాడ వాణి బూతు పురాణం తాలుక ఆడియో టేపులు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయని.. అలాగే పలాస ఎమ్మెల్యే ప్లస్ మంత్రి సిదిరి అప్పలరాజు వ్యవహారశైలిపై నియోజకవర్గ ప్రజలే కాదు.. జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఇక పాతపట్నంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కారణంగా.... నియోజకవర్గంలో రేగిన ఆశాంతి అంతా ఇంతా కాదని సదరు వర్గంలో ఓ చర్చ అయితే నడుస్తోంది. ఇక విజయనగరం జిల్లాలో కూడా దాదాపుగా ఇటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయనే ఓ ప్రచారం సైతం ఫ్యాన్ పార్టీలో రంజు రంజుగా నడుస్తోంది.    మరోవైపు టీటీడీ చైర్మన్‌గా సోమవారం అంటే ఆగస్టు 7వ తేదీన పాలక మండలి అధ్యక్షుడి హోదాలో వైవీ సుబ్బారెడ్డి చిట్ట చివరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హోదాలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్ రెడ్డి చేతులు మీదగా ఘనంగా సత్కారించారు.  అయితే ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఉంటూ.. మరోవైపు ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరించిన తీరు వేరని.. కానీ ఆయన ప్రస్తుతం టోటల్‌గా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి.. ఈ ప్రాంతంలో సీట్లన్నీ ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడేలా కసరత్తు చేయాలని.. అయితే సదరు జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. సదరు బాబాయి గారి వీపు విమానం మోత మోగడం ఖాయమనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతోంది. ఏది ఏమైనా.. ఇప్పటి వరకు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా బాబాయి వై వీ సుబ్బారెడ్డి చాలా ఆరామ్‌గా గడిపేశారనీ, కానీ తాజాగా ఆయనకు బ్యాడ్ టైం స్టార్ అయిందనే ఓ చర్చ సైతం ఉత్తరాంధ్ర పోలిటికల్ సర్కిల్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

నివురు గప్పిన నిప్పులా పుంగనూరు.. అసలేం జరుగుతోంది?

ఉన్నట్లుండి ఇక్కడ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మాయమవుతున్నారు. రాత్రికి రాత్రి టీడీపీ నేతల జాడ కనిపించకుండా పోతున్నది. వారి కుటుంబ సభ్యులేమో పోలీసులమంటూ వచ్చిన వారు  మా వాళ్ళని తీసుకెళ్లారని చెప్తున్నారు. పోలీసులేమో వారిని అదుపులోకి తీసుకున్నట్లు, అరెస్ట్ చేసినట్లు ఎక్కడా పేర్కొనడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా తెలుగుదేశం నేతలు, వారి అనుచరులు, కార్యకర్తలు కనిపించకుండా పోతున్నారు.  దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయనను అడ్డుకొనేందుకు వైసీపీ వర్గం ప్రయత్నించడంతో తెలుగుదేశం శ్రేణులుతిరగబడ్డాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  ఈ ఘర్షణలకు సంబంధించి ఇప్పటికే  తెలుగు అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులతో పాటు ఏడుగురిపై కేసులు నమోదు చేయగా.. స్థానిక తెలుగుదేశం  నేతలు, కార్యకర్తలు మొత్తం 74 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, పుంగనూరులో దాదాపు 150 మందికి పైగా  తెలుగుదేశం సానుభూతిపరుల ఆచూకీ కనిపించడం లేదట. ఇందులో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి, పలమనేరు ఇంచార్జ్ చ‌ల్లా బాబు లాంటి బడా నేతలు కూడా ఉన్నారు. వీరంతా  అరెస్టుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండగా.. వీరి కుటుంబ సభ్యులు మాత్రం తమ వాళ్ళని పోలీసులే తీసుకెళ్లి రహస్య ప్రాంతంలో ఉంచి చిత్రహింసలు పెడుతూ విచారిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పలమనేరు ఇన్ చార్జ్ చల్లా బాబులపై  ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని.. అప్పటి వరకూ వారిని రహస్య ప్రాంతాలలోనే ఉంచనున్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. నిజానికి పుంగనూరు అల్లర్ల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇక్కడ భారీగా మోహరించారు. దీంతో ఆ రాత్రికే ఇక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. కానీ మరుసటి రోజు నుండి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండడంతో మళ్ళీ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సుమారు 200 మంది పోలీసులు ఇంటింటినీ జల్లెడ పడుతూ తెలుగుదేశం  సానుభూతి పరులను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఘర్షణ సమయంలో పోలీసులు గాయపడడం, పోలీసు వాహనాలు ధ్వంసం కావడంతో పోలీసులు కక్షకట్టి తెలుగుదేశం  కార్యకర్తలను ఈడ్చుకెళ్తున్నారని ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే అరెస్ట్ చేసిన 74 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయగా.. మరో వంద మందికి పైగా కార్యకర్తలు, నేతలను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు అక్రమ అరెస్టులు, మరోవైపు వందల మంది పోలీసులు ఇళ్లపై సోదాలు చేస్తుండడంతో పుంగనూరు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. తమ వారిని పోలీసులు ఎక్కడకి తీసుకెళ్లారో.. ఏం చేస్తున్నారో కూడా అర్ధంకాని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు ఆవేదన చేస్తుండగా.. అసలు తమ వాళ్ళని ఎక్కడకి తీసుకెళ్లారో చెప్పాలని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వైఖరి ఇలాగే కొనసాగితే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవాలని వైసీపీ సానుభూతి పరులు ప్రయత్నించినా, చంద్రబాబుపై రాళ్ల దాడికి దిగినా వైసీపీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమపై పోలీసులు జులుం చూపడాన్ని పుంగనూరు తెలుగుదేశం  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ క్రమంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం లేదని, పోలీసుల చర్యలతోనే మరోమారు ఇక్కడ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.

కొత్త రూపంలో ఓమిక్రాన్ వైరస్!? జాగ్రత్తలు తప్పని సరి!

కరోనా పేరు చెబితే ఇప్పటికీ వణికిపోయే వారు చాలామంది ఉన్నారు. ప్రపంచం మీద మృత్యు  తాండవం చేసిన ఈ వైరస్ దేశదేశాలకు తలపెట్టిన ప్రాణనష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తం మహమ్మారి దెబ్బకు కుదేలైపోయింది. లాక్ డౌన్ లు, క్వారంటైన్లతో అల్లాడిపోయింది. కరోనా వైరస్ తగ్గిందని అనుకునేలోపు ఓమిక్రాన్ వైరస్ గా తిరిగి ప్రజలమీదకు దండెత్తి వచ్చింది. ఇది కూడా కొన్నిరోజుల పాటు ప్రజలను నానాతిప్పలూ పెట్టింది. ఓమిక్రాన్ వైరస్  తగ్గిపోతోంది కరోనాను  ఇక  తరిమికొట్టిశాం అని  ఊపిరిపీల్చుకునేలోపు ఒమిక్రాన్ కొత్త రూపంలో మానవాళిపై దాడికి రెడీ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. దాదాపు  ప్రపంచం అంతా కోవిడ్, దాని వేరియంట్ల భయం నుంచి బయటపడి ప్రశాంతంగా, స్వేచ్ఛగా గడుపుతున్న సమయంలో  ఓమిక్రాన్  కొత్త వేరియంట్  విజృంభణ ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది.  వివిధ పరిశోధనలలో  ఎరిస్ వేరియంట్ ఓమిక్రాన్ కు వారసత్వం అని  నిర్ధారణ అయ్యింది. అంటే  కరోనా తరువాత ఓమిక్రాన్, ఓమిక్రాన్ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ మానవాళిపై దాడికి రెడీ అవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ అమెరికాలో  కరోనా తరువాత అక్కడివారిని ప్రభావితం చేస్తున్న రెండవ అతి ప్రమాదకమైన వైరస్ గా గుర్తించారు. ఈ వైరస్ ను ఇండియాలో కూడా గుర్తించారు. మహారాష్ట్రలో  ఈ వైరస్ బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది.  ఈ  కొత్త వైరస్ ఎరిస్ వైరస్  బారిన పడినా కొంచం ముందుగా గుర్తించి తగిన చర్యలు, చికిత్స తీసుకోవచ్చు. ఇంతకూ ఎరిస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...   ఎరిస్ వైరస్ లక్షణాలు ఇప్పటివరకు ఓమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినప్పుడు గొంతునొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఒళ్ళు నొప్పులు, పొడిదగ్గు , వాసన లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కరోనాలో ,ఆ తరువాత ఓమిక్రాన్ లో ఆ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ సోకినప్పుడు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ఈ వైరస్ ఇక్కడ మహారాష్ట్రలో కనిపించినా దీని ప్రభావం దేశంలో అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ విషయం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఆరోగ్య నిపుణుల చేతుల్లో కాదు ప్రజలు తీసుకునే జాగ్రత్తల్లో, ప్రజల ఆరోగ్య దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎరిస్ వైరస్ వ్యాప్తి భారతదేశంలో  ఎంత తీవ్రంగా ఉంటుందన్నది పక్కన నెడితే..  కరోనా సమయంలో అందరూ ఎలలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, అలాంటి జాగ్రత్తలే.. అంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, సానిటైజర్ వాడటం. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఎరిస్ వైరస్ మాత్రమే కాదు వేరే ఏ వైరస్ వచ్చినా ఎవరినీ ఏమీ చేయదు.

సినీ పరిశ్రమపై జగన్ సర్కార్ కక్ష సాధింపు!

ఇంత కాలం జగన్ సినీ ఇండస్ట్రీ పట్ల ఎంత వివక్షతో వ్యవహరించినా.. రాజకీయాలతో మనకెందుకు అనుకున్నారో ఏమో సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. జగన్ సర్కార్ తీరు పట్ల కనీసంగా కూడా నిరసన వ్యక్తం చేయలేదు. అదే సమయంలో జగన్ పంచన చేరిన కొందరు పరిశ్రమకు చెందిన నటులు మాత్రం నేల విడిచి సాము చేసిన చందంగా రాజకీయంలో జగన్ కు వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచిన వారిపై విమర్శలతో చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు సినీ పరిశ్రమలో గుర్తింపు ఉన్న ఒక్కొక్కరూ ఏపీలో జగన్ సర్కార్ తీరు పట్ల కన్నెర్ర చేస్తున్నారు. నిర్మొహమాటంగా ఇండస్ట్రీ జోలికొస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల నాటికే ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే అయినా ఎక్కడా సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ రాజకీయం చేసిన సందర్భం లేదు. అయితే అప్పటి ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, పార్టీ టికెట్ ఆశించి.. అన్ని పార్టీల తలుపూ తట్టి చివరికి జగన్ గూటికి చేరిన అలీ, ఇంకా పోసాని వంటి వారు మాత్రం జగన్ మనసెరిగి పవన్ కల్యాణ్ సహా జగన్ ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకు ప్రతిఫలమేమిటన్నది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అంతే కాదు స్వయంగా వారు అనుభవిస్తున్నారు కూడా. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకీ, అధికార వైసీపీకి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లకు పైబడి సాగిన జగన్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతున్న సంగతిని గ్రహించిన వైసీపీ నేతలలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యధాలాపంగా ప్రభుత్వ విధానాలపై చేసిన వ్యాఖ్యలను కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. అధికార పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా సినీ నటుల పారితోషకాలపై చేసిన కామెంట్లపై ఓ సినీ ఫంక్షన్ లో హీరో చిరంజీవి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క సారిగా దూషణలతో విరుచుకుపడటం చూస్తుంటూ అధికార పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. ఇంత కాలం చిరంజీవిని భుజాన మోసిన వారే ఇప్పుడు ఆయనను తూలనాడటం చూస్తుంటే.. చిన్న పాటి వ్యతిరేక వ్యాఖ్యను కూడా సహించలేనంతగా అధికార పార్టీ నాయకులలో  అహం, అసహనం ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  పైగా చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్ లో విమర్శలు చేయలేదు.. అధికార పార్టీ సినీ పరిశ్రమపై పడి ఏడవడం కాదు.. అంత కంటే పెద్ద పనులు ఉన్నాయి వాటిని చేయాలని హితవు మాత్రమే పలికారు.   లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం సినీమా హీరోల పారితోషకాల గురించి మాట్లాడటమేమిటని సహజంగానే జన బాహుల్యంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అలాగే రజనీకాంత్ గతంలో అంటే ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో రెండు ముక్కలు చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడినందుకే ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ విమర్శలకు సూపర్ స్టార్ రజనీకాంత్  తన స్టైల్ లో దీటుగా సమాధానం ఇచ్చారు.  సరే అదలా ఉంటే.. ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ మూవీ  భోళా శంకర్ ఆగ‌స్ట్ 11న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏపీ స‌ర్కార్‌కి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు.  అయితే  భోళా శంకర్ కు ఏపీ ప్ర‌భుత్వం షాకిచ్చింది. టికెట్ ధరల పెంపుకోసం వచ్చిన అనుమతిని కనీసం పరిశీలను కూడా తీసుకోవద్దంటూ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు.  గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా జగన్ సర్కార్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద జగన్ సర్కార్ సినీ పరిశ్రమపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందన్న మెసేజ్ ఇప్పటికే బలంగా ప్రజలలోకి వెళ్లింది.  ఇది జగన్ సర్కార్ కు ఎంత మాత్రం మేలు చేయదు. సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవించే  లక్షలాది మందే కాకుండా ఆయా హీరోల అసంఖ్యాక అభిమానలను కూడా వైసీపీ దూరం చేసుకున్నట్లేననీ, వచ్చే ఎన్నికలలో ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనీ అంటున్నారు. 

షర్మిల పాదాలు ఎక్కడికి... ఏపీకా.. తెలంగాణాకా?

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల కారణాలు ఏవైనా, రెండేళ్ళ క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ)  ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైఎస్ పాలన అందిస్తామని ప్రజల్లోకి వెళుతున్నారు.  అయితే, అప్పటి నుంచీ... ఆమె ఏపీ గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదాన్ని బలంగా వ్యతిరేకించిన సంగతి తెలంగాణ వాదులందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి కుమార్తె.. తెలంగాణలో వైఎస్ పాలనను అందిస్తానంటూ  రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడమే విశేషం అనుకుంటే.. అంతటితో ఆగకుండా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు.   జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కే మద్దతు పలికారు. అక్రమాస్తుల కేసులో  అన్న జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే  ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. లేదా బాణమే జగనన్నను వదిలేసిందో తెలియదు కానీ  పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణలో అధికారంలో ఉన్న   బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తనదైన ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు.  అయితే  ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   అయితే షర్మిల మాత్రం ఇంత కష్టపడి పార్టీని నడిపించిన తాను, పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నా.. ఆమె ‘అడుగులు’ మాత్రం విలీనం దిశగానే కదులుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  అలాగే టీపీసీసీ నేతలు  షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అన్న అంశంపై చర్చోపచర్చలు చేస్తున్నారు.   కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు సాగిన ఈ  ప్రచారం మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంది. కానీ, ఇప్పడు తాజాగా   మరో మారు ఆ ప్రచారం జోరందుకుంది. అంతే కాదు షర్మిల చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. హస్తినలో సోనియాగాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీని విలీన ప్రకటన చేస్తారని చెబుతున్నారు.  కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు వీహెచ్ లు తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల వేలు పెడితే అంగీకరించేది లేదని ఇప్పటికే కుండబద్దలు కొట్టేశారు. అయితే పార్టీలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పావులు కడుతున్న.. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ ఫ్యామిలీపై ఉన్నగౌరవంతో షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే బీఆర్ఎస్ ను మరింత బలంగా ఢీకొనే అవకాశాలు మెరుగౌతాయని అంటున్నారు. దీనికి తోడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలోకి రెడ్ కార్పెట్ పరిచినట్లే అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే  కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది,  దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు  ఎలా స్పందిస్తారు, అనేది తెలియ వలసి వుంది. అయితే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు  షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని భీషణ ప్రతిజ్ణ  చేశారు. అయితే, షర్మిల పైకి ఏమి చెప్పినా, నాలుగు  దిక్కుల నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు చకచకా పావులు కదుపుతున్నారనే పరిశీలకులు అంటున్నారు.  ఇక పోతే కాంగ్రెస్ అధిష్ఠానం, మరీ ముఖ్యంగా  వైఎస్ ఆత్మగా అంతా చెప్పే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మాత్రం షర్మిల కాంగ్రెైస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టాలనీ, తద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశలు ఉంటాయనీ భావిస్తున్నారు. ఆ దిశగా షర్మిలను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మొదలు రాహుల్ గాంధీ వరకు, పొంగులేటి, కోమటి రెడ్డి మొదలు ఇతర సీనియర్ నాయకులు అందరితోనూ వైఎస్ కుటుంబ బంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు షర్మిల సాగిస్తున్నారు. గతంలో బెంగుళూరు వెళ్లి మరీ డీకేకు వెళ్లి మరీ   అభినందనలు తెలిపిన షర్మిల, గతంలో ఎప్పుడు లేని విధంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే, షర్మిల పాదాలు కాంగ్రెస్ దిశగా నడక సాగిస్తున్నాయన్నది తేటతెల్లమౌతోంది. అయితే.. వైఎస్ వారసురాలిగా.. ఆమె ఏపీలో  ఎక్కువ ప్రభావం చూపగలుగుతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. జగన్ సర్కార్ విధానాల కారణంగా ప్రజలలో  వైసీపీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత.. షర్మిల కాంగ్రెస్ నాయకురాలిగా ఏపీలో అడుగుపెడితే అది కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపునకు మళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.   

మంగళవారం జగన్ కు అప్పుల వారం!

2019 ఎన్నికలలో విజయం 151 స్థానాలలో విజయం సాధించి   ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం చేపట్టిన జగన్ పార్టీ వైసీపీ నాలుగేళ్ల తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే.. ఆ పార్టీలోముఖ్యమంత్రి జగన్ వినా మరో పేరు గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రాని పరిస్థితి. మొత్తంగా వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరాఖరికి మంత్రులూ కూడా డమ్మీలే.  మొత్తంగా ప్రస్తుతం 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురిని మినహాయిస్తే మిగిలిన వారంతా అదే పార్టీలో ఇప్పటికీ ఉన్నారు. వారిలో   ఓ పాతిక మంది  మంత్రులు. ఆ మంత్రులలో ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు. వీరికి తోడు ముఖ్య సలహాదారు, వందల సంఖ్యలో సలహాదారులు.. అయితేనేం అందరూ జీరోలే. ఎవరికీ నిర్ణయాధికారం ఉందని భావించలేం. రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయి. అభివృద్ధి అడుగంటింది.  గతంలో పోలవరం కోసం చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మారిస్తే.. ఇప్పుడు జగన్ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చి తన హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పకనే చెబుతున్నారు.    రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్నపాటి అధికారం కూడా జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందని, జనం తమను ఎలా నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపగడపకూ కార్యక్రమంలో తాము ఎదుర్కొంటున్న నిరసన సెగలకు ఇదే కారణమని అంటున్నారు.  ఏ ప్రభుత్వమైనా సరే  రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి కానీ,  గన్ సర్కార్ మాత్రం ఆదాయం సంగతి గాలికొదిలేసి అప్పుల కోసం వెంపర్లాడుతోందని విమర్శిస్తున్నారు.   అ దేశం మొత్తంలో ఇలాంటి తిరోగమన విధానాలను అనుసరిస్తున్న, అవలంబిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమేననీ అంటున్నారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ ఒక్క జగన్ పార్టీ మాత్రమేనని చెబుతున్నారు.   వాస్తవానికి జగన్ హయాంలో మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాత్రమే కాదు వ్యవస్థలు కూడా ఉనికిని కోల్పోయి డమ్మీలుగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు.  జగన్ ప్రభుత్వ విధానాలపై విపక్షాల విమర్శలకు మంత్రుల నుంచి దూషణలే సమాధానంగా వినిపిస్తాయి. పాతిక మంది మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వ విధానాలపై  మాట్లాడరు. అధికారుల నోటి నుంచి మాటలే రావు. ఇక రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా? కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసి.. ( కాంట్రాక్టర్ ను మార్చాల్సిన అవసరం లేదనీ, పనులు వేగంగా జరుగుతున్నాయనీ పీపీఏ ( పోలవరం ప్రాజెక్టు అథారిటి  చెప్పినా కూడా వినకుండా) చివరికి ఇప్పుడు కట్టలేమ చేతులెత్తేసే పరిస్థితికి జగన్ సర్కార్ దిగజారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిని అటకెక్కించేసిన  వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విపక్షాల సభలకు తండోపతండాలుగా పోటెత్తుతున్న జన సందోహం కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది.గతంలో పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చంద్రబాబు సోమవారాన్ని పోలవారంగా మార్చేస్తే.. ఇప్పుడు జగన్  మంగళవారాన్ని  అప్పుల వారంగా మార్చేశారని వెల్లువెత్తుతున్నాయి.  ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా  తెస్తున్నారంటే.. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిందనడాకి ఇంత కన్నా రుజువేం కావాలన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.  

ఈనెల 12న ఢిల్లీకి షర్మిల.. విలీనం ఖాయమేనా?

మాజీ సీఎం వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో కలవబోతున్నారా? షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా? అంటే తెలంగాణ రాజకీయ వర్గాలలో అవునని గట్టిగానే వినిపిస్తుంది.  షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది అప్పట్లో ప్రచారంగానే ఉండిపోయింది. జులైలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడ వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు.  కాగా, ఈసారి షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం ఖారైరైందంటూ మరో సారి రాజకీయవర్గాలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ముందుగా షర్మిల సోనియా గాంధీతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఈనెల 12వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటన వెలువడే  అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కొంతకాలంగా షర్మిల పార్టీ విలీనం అవుతుందా? లేక పొత్తులతో ముందుకు వెళ్తారా అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతుంది. మొదట్లో షర్మిల పొత్తుకు మొగ్గు చూపితే కాంగ్రెస్ నేతలు విలీనానికే పట్టుబట్టారు. అయితే రెండు పద్దతుల్లో లాభనష్టాలను బేరీజు వేసుకున్న తరువాత   షర్మిల కూడా విలీనానికే సిద్ధపడ్డారని కాంగ్రెస్, వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి.  షర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,   కర్ణాటక నుండి డీకే శివకుమార్ మాట్లాడుతుండగా.. ఈ భేటీతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం చేసేయాలని.. అందుకు ప్రతిఫలంగా ఆమెని రాజ్యసభకి పంపించడం.. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా షర్మిలకే అప్పగించడం వంటి ప్రతిపాదనలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయని అంటున్నారు.   కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని.. అది కూడా కేవలం తెలంగాణలోనే తన ప్రమేయం ఉంటుందని షర్మిల చెబుతున్నారని అంటున్నారు.   మరి ఈ రెంటిలో  ఏది ఫైనల్ అవుతుంది? కాంగ్రెస్ షర్మిలను విలీనానికి ఒప్పించగలుగుతుందా? ఒకవేళ షర్మిల ఒకే అంటే ఆమె ఏపీకి వెళ్తారా.. తెలంగాణలోనే ఉంటారా అన్నది ఈ భేటీతో తేలే అవకాశం కనిపిస్తుంది.  నిజానికి షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేసి పార్టీ పగ్గాలను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే ఆమెకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని నమ్ముతోంది. అయితే అందుకు షర్మిల అంగీకరించలేదనీ, తాను తెలంగాణకే పరిమితమౌతానని భీష్మించారనీ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   తన రాజకీయం ఇక తెలంగాణలో అంటూ షర్మిలనే స్వయంగా చెప్పిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలో మరో మూడు రోజులలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో షర్మిల భేటీ కానున్నట్లు  వస్తున్న వార్తలతో వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ ల మద్య విలీనంపై ఒక అవగాహన కుదిరిందనే భావించాల్సి ఉంటుంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక వర్గం షర్మిల రాకను ఆహ్వానిస్తుంటే మరొక వర్గం ఆమెని ఏపీకి వెళ్లి రాజకీయం చేసుకోమని బహిరంగంగానే చెప్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో తాను ఉన్నంత వరకూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలలో షర్మిల వేలు కూడా పెట్టలేరని అన్నారు. ఆమె ఏపీలో రాజకీయం చేస్తే తెలంగాణ పీసీసీ అధినేతగా తాను ఆమెతో చర్చలు జరుపుతానని అన్నారు. మరి ఇప్పుడు సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం, ఆమె పార్టీలో చేపట్టబోయే బాధ్యతలపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అన్నిటికీ మించి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశంగా చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి జగన్ రాజకీయమే కారణమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం గట్టిగా నమ్ముతోంది. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తే జగన్ కు అది కచ్చితంగా ప్రతికూలంగా మారి వైసీపీకి పూడ్చుకోలేని నష్టం చేకూరుస్తుందని కూడా భావిస్తోంది. అదే సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పరోక్షంగా తెలుగుదేశం కు ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా  జగన్ కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న బీజేపీని  కూడా దెబ్బతీసినట్లు అవుతుందనీ కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల బేటీ ఔట్ కమ్ ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. 

పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబు ఏ1.. ఎఫ్ఐఆర్ నమోదు

టీటీడీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. పుంగనూరులో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల ఘర్షణలు, చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ వర్గం రాళ్లు రువ్విన ఘటనలలో తిరిగి తెలుగుదేశం నేతలపైనే కేసులు పెట్టారు. ఈ ఘర్షణలకు సంబంధించి ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పీఎస్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమా, A3గా అమర్నాథ్‌రెడ్డితో పాటు FIRలో మరో 20 మంది తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో చంద్రబాబు పోలీసులను హెచ్చరిస్తూ.. కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నది ఈ కేసులో ప్రధాన అభియోగం.  కురబలకోట మండలం, దాదం వారిపల్లికి చెందిన ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదుచేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. క్రైమ్ నెంబర్ 79/2023 120బి 147, 145, 153, 307, 115, 109, 323, 324, 506 R/w149 ఐపీసీ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయగా విచారణ చేపడతామని ముదివేడు ఎస్సై షేక్ మొబిన్ తాజ్ తెలిపారు. మరోవైపు పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై వరస కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ ఘర్షణలకు సంబంధించి 74 మందిని అరెస్ట్ చేయగా.. వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉండగా.. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని చల్లాబాబు పీఏ గోవర్ధన్‌రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్లు రిమాండ్‌ రిపోర్టు సిద్ధం చేశారు.  అంగళ్ళు, పుంగనూరులో జరిగిన దాడుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా మంత్రులు ఆరోపిస్తూ వచ్చారు. విధ్వంసం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికే హోం మంత్రి తానేటి వనిత చెప్పుకొచ్చారు. మిగతా మంత్రులు కూడా తెలుగుదేశం నేతలే అల్లర్లకు కారణమని ఆరోపిస్తున్నారు. పుంగనూరు ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకే ఇప్పుడు ఇలా కేసులు కూడా నమోదు చేశారు. అయితే, వైసీపీ సానుభూతి పరులు దాడులు చేయడం, చంద్రబాబుపై రాళ్లు రువ్విన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా వైసీపీకి చెందిన ఒక్కరిపైన కూడా కేసులు పెట్టకపోవడం, ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ తెంపరితనానికి, విశృంఖలతకు నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  కాగా, గతంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేసి ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేసి ఆఫీసు అద్దాలు పగలగొట్టి రణరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటనలపై చంద్రబాబు కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. తమకు దేవాలయంతో సమానమైన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులకు కూడా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకూ చట్టపరమైన చర్యల్లేవు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. చంద్రబాబు డీజీపీకి ఫోన్ చేసినా సమాధానం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ ఘర్షణలు రెండు పార్టీల   అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు అప్పుడు చేతులెత్తేశారు.  నిజానికి అప్పుడు టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి వైసీపీ గుండాలు చేసిందేనని అందరికీ తెలుసు. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ఖండించాయి. కానీ, పోలీసులకు మాత్రం అది రెండు పార్టీల మధ్య ఘర్షణగా కనిపించింది. అదే ఇప్పుడు ప్రతిపక్ష నేతను ఉద్దేశ్య పూర్వకంగా వైసీపీ సానుభూతిపరులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగితే పూర్తిగా టీడీపీ నేతలు, కార్యకర్తలదే తప్పని, చంద్రబాబు కుట్రపన్ని ఈ ఘర్షణలు రేకెత్తేలా చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు టీడీపీ ఆఫీసులు, పట్టాభి ఇంటిపై వైసీపీ వర్గం చేసిన దాడులు.. ఇప్పుడు పుంగనూరు ఘర్షణలను పోల్చి చూస్తే ఏపీ పోలీసులు ఎంత బయాస్డ్ గా ఉన్నారో స్పష్టంగా తెలిసిపోతుంది.  

శక పురుషుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం విడుదల 28న

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల కాయిన్ ను విడుదలకు ముహూర్తం ఖరారైంది.  ఆగష్టు 28న ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్ విడుదల చేయనున్నారు. పురందేశ్వరి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ ఎన్టీర్ బోమ్మతో ఉన్న వందరూపాయల నాణెం విడుదల కానున్నది. ఈ నాణెం విడుదలకు సంబంధించిన ఆహ్వానాన్ని  పురంధేశ్వరి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నెల 28న భారత రాష్ట్రపతి చేతుల మీదగా ఎన్టీఆర్ రూ.100 కాయిన్ విడుదల కానున్నట్లు తెలిపారు. పురంధేశ్వరి పంచుకున్న కాయిన్ రిలీజ్ వేడుక ఆహ్వానాన్ని మిగతా కుటుంబ సభ్యులు కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండగా.. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  ఇక, ఎన్టీఆర్ రూ.100 కాయిన్ విషయానికి వస్తే..  44 మిల్లీమీటర్లు చుట్టు కొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. అంతేకాదు ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని, 1923-2023 అని ముద్రించి ఉంటుంది. ఈ విషయాన్ని గతంలో భారత ప్రభుత్వం ఇచ్చిన గెజిట్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్‌ చిత్రంతో ఉన్న కాయిన్ ఎవరికైనా కావాలంటే రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్‌ చిత్రంతో కూడిన నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న బుక్‌లెట్‌ రూపంలో 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ రూ.100 నాణెం రాబోతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.