ఈటల తర్వాత హరీషే టార్గెటా? టీఆర్ఎస్ చీలిపోనుందా?

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా  ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. అంతేకాదు 'రాజు తలుచుకోవాలే గానీ' .. అన్నట్టుగా ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు  పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది.  కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూవ్యవహారంలో ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈటల ఎపిసోడ్ తో తెలంగాణలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఈటల తర్వాత కేసీఆర్ టార్గెట్ ఎవరుంటారనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల తర్వాత మంత్రి హరీష్ రావే.. గులాబీ బాస్ టార్గెట్ అనే ప్రచారం జరుగుతోంది.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు హరీష్ రావు, రాజేందర్. ఉద్యమంలో కీలక పాత్ర వీరిదే. ముఖ్యమైన కార్యక్రమాలన్ని ఈ ఇద్దరు చేతులమీదుగానే సాగేవి. 2004 నుంచి 09 వరకు అసెంబ్లీ టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ లో ఈ ఇద్దరికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. ఈటలకు కీలకమైన ఆర్థిక శాఖ, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ అప్పగించారు. అయితే 2018 వచ్చే సరికి సీన్ మారిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హరీష్ , ఈటలను దూరం పెట్టారు కేసీఆర్. మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ వీరిద్దరి పాత్ర తగ్గిపోయింది. దీంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు హరీష్ రావు, ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలను దూరం పెట్టడంపై ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో హరీష్, ఈటలకు చోటు దక్కింది. కేబినెట్ విస్తరణలో చోటు కల్పించిన కేసీఆర్ .. హరీష్ కు ఆర్థికశాఖ, ఈటలకు వైద్య శాఖ కట్టబెట్టారు. ప్రజల్లో తిరిగే హరీష్ కు ఆర్థికశాఖ ఇచ్చి అతని కాళ్లకు బంధం వేశారనే ప్రచారం జరిగింది. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నా హరీష్ రావు.. కేవలం సిద్ధిపేట జిల్లా వరకే పరిమితమయ్యారు. కేసీఆర్ ఆదేశాల వల్లే అతను ఇతర జిల్లాలకు వెళ్లలేదని చెబుతారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ హరీష్ సిద్దిపేట వరకే పరిమితమయ్యారు. దీంతో పార్టీలో హరీష్ కు అవమానం జరుగుతుందని, ఆయనకు పొమ్మనలేక పొగ బెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. హరీష్ రావు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారనే వార్తలు కూడా చక్చర్లు కొట్టాయి. దీని వెనుక కూడా కేసీఆర్ వర్గం హస్తం ఉందనే చర్చ జరిగింది. ఈటల, హరీష్ ను కావాలనే పార్టీలో అవమానిస్తున్నారని తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. హరీష్, ఈటల కలిసి పొత్త పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారాలు కూడా జరిగాయి.   తాజాగా ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ఈటల రాజేందర్ ను సాగనంపే ప్రయత్నాలు టీఆర్ఎస్ లో జరుగుతున్నాయని అంటున్నారు. భూకబ్జా ఆరోపణలతో ఈటలను తప్పించడం ఖాయమంటున్నారు. ఈటలను సాగనంపాకా .. హరీష్ రావు టార్గెట్ గా గులాబీ ఆపరేషన్ మొదలవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా తప్పిస్తున్నారని , అందులో భాగంగానే మొదట ఈటలను టార్గెట్ చేశారంటున్నారు. ఈటల తర్వాత హరీష్ రావుకు చెక్ పెట్టేలా ఇప్పటికే వ్యూహం సిద్ధమైందని అంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ లో ఊహించని పరిణామాలు జరుగుతాయని, గులాబీ పార్టీ చీలిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

కేటీఆర్ కు తగ్గని ఫీవర్! యశోద హాస్పిటల్ లో అడ్మిట్

కరోనా సోకిన తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత నెల 23న కేటీఆర్ కు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కేటీఆర్.. అప్పటినుంచి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే  రెండ్రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతుండడంతో కేటీఆర్ ను హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేటీఆర్ ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

పొడుస్తున్న కొత్త పొద్దు? ఆ న‌లుగురితో పోరు తెలంగాణ‌మా?

రేపే, మాపో టీఆర్ఎస్ నుంచి ఈట‌ల అవుట్‌. ఇది ప‌క్కా. మ‌రి, వాట్ నెక్ట్స్‌? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ పొద్దుపై కొత్త పార్టీ పొడుస్తోంది. పోరుబిడ్డ ఈట‌ల‌.. కొత్త పార్టీ స‌న్నాహాల్లో ఉన్నార‌ట‌. పార్టీ ఏర్పాటుకు ఎప్ప‌టి నుంచో స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అందుకే, గులాబీ బాస్ కేసీఆర్ నియంతృత్వంపై తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తున్నార‌ని చెబుతున్నారు. గులాబీ జెండాకు గులాంలు కాదు.. ఓన‌ర్లం అనేంత సాహ‌సం ఆయ‌న అందుకే చేశార‌ని అంటున్నారు. ఈట‌ల కొత్త పార్టీ ఏర్పాట్ల‌పై వివిధ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారంతోనే ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించే కార్య‌క్ర‌మం మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఆప‌రేష‌న్ ఈట‌ల‌లో భాగంగానే.. ఈట‌ల‌పై మీడియాలో భూక‌బ్జా ఆరోప‌ణ‌లు.. విచార‌ణ‌.. ఆ త‌ర్వాత దోషిగా నిర్ధార‌ణ జ‌రిగిపోతుంద‌ని అంటున్నారు.  కేసీఆర్ అటాక్ ఇలానే ఉంటుంద‌ని తెలియ‌నంత అమాయ‌కుడేమీ కాదు ఈట‌ల రాజేంద‌ర్‌. పార్టీ ఏర్పాటు నుంచి గులాబీ బాస్‌తో క‌లిసి ప‌ని చేసిన నేత‌. టీఆర్ఎస్ ఉనికే లేని రోజుల్లో కూడా పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపించిన లీడ‌ర్‌. కేసీఆర్ కుటుంబం హ‌వాలో ఈట‌ల ప్రాధాన్యం క‌నుమ‌రుగైంది కానీ.. ఈట‌ల చాలా గ‌ట్టి పిండ‌మేన‌ని తెలంగాణ‌వాదులంద‌రికీ తెలుసు. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా కేసీఆర్ ముందు తాను మినుగురు పురుగులా ప‌డి ఉండ‌టం ఈట‌ల‌కు అస్స‌లు ఇష్టం లేద‌ట‌. కేసీఆర్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జా వ్య‌తిరేక‌ నిర్ణ‌యాలు, పాల‌నా తీరుపై ఆయ‌న ఎప్ప‌టి నుంచో అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నార‌నేది ఆయ‌న స‌న్నిహితుల మాట‌. దొర‌ల‌ పాల‌న‌లో బీసీల‌కు ఎన్న‌డూ న్యాయం జ‌ర‌గ‌ద‌ని.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అధికారం ద‌క్కాల‌ని ఈట‌ల బ‌లంగా కోరుకుంటున్నారు. అందుకే, బీసీ ఎజెండాతో త్వ‌ర‌లోనే ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌ని అంటున్నారు. కొత్త పార్టీపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఆయ‌న ప‌లుమార్లు మంత‌నాలు జ‌రిపార‌ని.. వారంతా క‌లిసి.. తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నార‌ని చెబుతున్నారు. ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ముఖుల పేర్లు ఆస‌క్తిగా ఉన్నాయి.  ఈట‌ల రాజేంద‌ర్‌.. కోదండ‌రాం.. తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. న‌లుగురూ హేమాహేమీలు. ఆ న‌లుగురు కలిసి ఇప్పుడు కొత్త పార్టీ స‌న్నాహాల్లో ఉన్నార‌ని స‌మాచారం. కొంత కాలంగా వీరి మ‌ధ్య ర‌హ‌స్య స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈట‌ల వీరికి స‌హ‌క‌రించార‌ని చెబుతున్నారు. సరిగ్గా.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముందు.. కీల‌క స‌మ‌యంలో.. ఈట‌ల రాజేంద‌ర్ త‌న గ‌న్‌మెన్ల‌కు మ‌స్కా కొట్టి ఇంట్లో నుంచి ర‌హ‌స్య ప్ర‌దేశానికి వెళ్లారంటూ అప్ప‌ట్లో వార్త‌లు రావ‌డం వెనుక కార‌ణం ఇదేన‌ని అంటున్నారు. అందుకే, ఈట‌ల భూక‌బ్జాల‌పై ఆరోప‌ణ‌లు రాగానే.. కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న‌లు వెంట‌నే స్పందించారు. కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి తాము సిద్ధ‌మ‌ని కోదండ‌రాం ప్ర‌క‌టించారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న వారంద‌రితో క‌లిసి ఉద్య‌మాన్ని ప్రారంభించాల్సి ఉంద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా పార్టీ ఏర్పాటుపై లీకుల‌ని అంటున్నారు. ఉద్య‌మ కాలం నుంచి కోదండ‌రాం సార్‌కు, ఈట‌ల‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సార్‌ను కేసీఆర్ తొక్కేయ‌డంపై ఈట‌ల ప‌లుమార్లు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని అంటారు. కోదండ‌రాం.. ఏ ఒక్క వ‌ర్గానికో ప‌రిమిత‌మైన నాయ‌కుడు కాదు. తెలంగాణ‌వాదులంద‌రికీ ఇప్ప‌టికీ ఆయ‌న సారు.  కోదండ‌రాంతో పాటు అటు తీన్మార్ మ‌ల్ల‌న్న సైతం ఈట‌ల‌తో మొదటి నుంచి ట‌చ్‌లో ఉన్నార‌ని చాలా మంది అంటుంటారు. తీన్మార్ మ‌ల్ల‌న్న యూట్యూబ్ ఛానెల్‌లో వ‌చ్చే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌ ఇన్‌సైడ్ న్యూస్‌కు మేట‌ర్‌ అంతా ఈట‌ల నుంచే వ‌స్తుంటుంద‌నేది కొంద‌రి మాట‌. మ‌ల్ల‌న్న సైతం చాలాసార్లు ఈట‌ల ఆధ్వ‌ర్యంలో బీసీల పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టైమ్‌లో మ‌ల్ల‌న్న‌కు ప‌రోక్షంగా ఈట‌ల చాలా సాయం చేశార‌ని కూడా అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌, తీన్మార్ మ‌ల్ల‌న్నల‌ను బీసీ ఎజెండా ఏకం చేసింద‌ని చెబుతారు. పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాల‌పై ఈ ఇద్ద‌రి మ‌ధ్య అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం.  ఇక‌, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో నిఖార్సైన నాయ‌కుడిగా పేరున్న కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి సైతం ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న‌లో త్వ‌ర‌లో కొత్త పార్టీ ఏర్పాటు దిశ‌గా ఆలోచిస్తున్న‌ట్టు బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ కొత్త పార్టీ వెనుకున్న‌ది ఈట‌లేన‌ని అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రింత క్లారిటీ వ‌స్తోంది. అటు టీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేక ప్ర‌స్తుతానికి త‌ట‌స్థంగా ఉన్న కొండా.. ఈట‌ల పార్టీతో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌నేది టాక్‌.  ఇలా.. ఈట‌ల‌, కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న‌, కొండా.. న‌లుగురు భావ‌సారూప్య నేత‌లంతా క‌లిసి కొత్త పార్టీతో తెలంగాణ రాజ‌కీయాల‌ను మార్చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల‌, మ‌ల్ల‌న్న బీసీ కార్డుతో.. కోదండ‌రాం ఉద్య‌మ‌కారుల కార్డు,.. కొండా- రెడ్డి కార్డుతో.. తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ చేస్తున్నార‌ని అంటున్నారు. కొత్త పార్టీకి ఆర్‌.క్రిష్ణ‌య్య‌, గ‌ద్ద‌ర్‌లాంటి వాళ్ల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ట‌. ఇలా, తెలంగాణ‌లో అన్ని వ‌ర్గాల‌ను కూడ‌గ‌ట్టి.. త్వ‌ర‌లోనే కొత్త పార్టీతో.. కేసీఆర్ స‌ర్కారుపై దండ‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారట ఆ న‌లుగురు... ఏమో.. గుర్రం ఎగ‌రావ‌చ్చు....

ఈటల రాజేందర్ భర్తరఫ్? వైద్య శాఖను తొలగించిన సీఎం 

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్రతో శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.  వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా  ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు  పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది. 

తిరుగుబాటా? సరెండరా? ఈటల దారెటు..

మంత్రిపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు. అదీ ప్ర‌తిప‌క్షం నుంచి కాకుండా సొంత మీడియా నుంచే. టీ న్యూస్ షురూ చేసింది. మిగితా పింక్ మీడియాలో హోరెత్తింది. ఇక అంతే. గంట‌ల వ్య‌వ‌ధిలోనే తెలంగాణలో అధికార పార్టీ రాజ‌కీయ ముఖ‌చిత్రం అమాంతం మారిపోయింది. ఇలా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయో లేదో.. అలా విచార‌ణ మొద‌లైపోయింది. అంతా వింత‌గా లేదూ. ఇది బ్రేకింగ్ న్యూసే అయినా.. షాకింగ్ న్యూస్ మాత్రం అస‌లు కానేకాదు. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల‌.. కొంత కాలంగా వారి మ‌ధ్య కోల్డ్‌వార్ అంద‌రికీ తెలిసిందే. అదిప్పుడు.. ఇలా బ్లాస్ట్ అయింది అంతే. వాళ్ల పార్టీ వాళ్ల ఇష్టం అనుకున్నా.. ప్ర‌స్తుత స‌మ‌యం, సంద‌ర్భం స‌రిగాలేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  క‌రోనాతో తెలంగాణ అల్ల‌క‌ల్లోలంగా మారింది. రోజుకు 10వేల వ‌ర‌కూ కేసులు వ‌స్తున్నాయి. మ‌ర‌ణాలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేష‌న్ నిదానంగా సాగుతోంది. ఆసుపత్రిలో బెడ్స్‌, ఆక్సిజ‌న్ కొర‌తలాంటి స‌మ‌స్య‌ల‌తో తెలంగాణ అల్లాడిపోతోంది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఊపిరి స‌ల‌ప‌ని ప‌నుల‌తో ఒత్తిడిలో ఉన్నారు. క‌రోనా సోకి కొంత కాలంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఆరామ్‌సే ఉన్నారు. కొవిడ్ భార‌మంతా ఈట‌ల‌పైనే ఉంది. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. ప్ర‌భుత్వం త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మంత్రి ఈట‌ల‌ను టార్గెట్ చేసింది. ఆయ‌న్ను పొమ్మ‌న‌డానికి పొగ పెట్టింది. పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి రాజేంద‌ర్ ఇష్యూపై ర‌చ్చ మొద‌లుపెట్టింది. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ షురూ చేసింది. మీడియాలో కొవిడ్ వార్త‌లకంటే.. ఈట‌ల బ్రేకింగ్ న్యూస్‌తో మారుమోగిపోయింది. ఆ వెంట‌నే అన్ని ప‌నులు మానుకొని రాజేంద‌ర్ ప్రెస్‌మీట్ పెట్ట‌డం.. అప్ప‌టి నుంచి అంతా రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్ట‌డంతో.. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు అట‌కెక్కాయి. ఈట‌ల‌కు చెక్ పెట్ట‌డం కోసం ఇలాంటి కొవిడ్‌ విపత్కర సమయాన్ని ఎంచుకోవటానికి.. ప్ర‌భుత్వ బాధ్యతా రాహిత్యానికి, పచ్చి స్వార్థానికి నిదర్శనం.      ప్ర‌భుత్వం ప‌క్కా ప్లానింగ్‌తో ఈట‌ల‌పై ఆరోప‌ణ‌లు సంధించింది. శుక్ర‌వారం సాయంత్రం వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్స్‌తో స‌హా ప‌లు మున్సిపాలిటీల‌కు పోలింగ్ ముగిసింది. ఇలా ఆఖ‌రి గంట మోగిందో లేదో.. అలా టీవీల్లో ఈటల రాజేంద‌ర్ బ్రేకింగ్ న్యూస్ మొద‌లైపోయింది. అంటే, అంతా ప‌క్కా టైమింగ్‌తో ముందే షెడ్యూల్ చేసిన న్యూస్‌తో ఈట‌ల‌ను కార్న‌ర్ చేసిన‌ట్టు తెలిసిపోతోంది. ఇప్ప‌టికే జీహెచ్ఎమ్‌సీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌లు ముగిశాయి. పెండింగ్ కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీ ఎన్నిక‌లూ శుక్ర‌వారంతో స‌మాప్తం అయ్యాయి. ఇక ఇప్ప‌ట్లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు లేవు. మ‌రో మూడేళ్ల వ‌ర‌కూ ఎలాంటి రాజ‌కీయ హ‌డావుడి ఉండ‌దు. అందుకే, రెండేళ్లుగా భ‌రిస్తూ వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఇక వ‌దిలించుకోవాల‌ని గులాబీ బాస్ భావించి ఉంటారు. 2019 ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం.. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్‌పై రెబెల్ జెండా ఎగ‌రేస్తూ ఉండ‌టంతో.. ఈ ద‌ఫా అస‌లు ఈట‌ల‌కు మంత్రి ప‌ద‌వే రాద‌నుకున్నారు. కానీ, ఆఖ‌రు నిమిషంలో ఆర్థికం కాకుండా ఆరోగ్యం ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయినా.. ఈట‌ల అసంతృప్తి ప‌లుమార్లు పైకి త‌న్నుకొస్తూనే ఉంది. తాము గులాబీ జెండాకు బానిస‌లం కాదు.. అస‌లైన‌ ఓన‌ర్ల‌మంటూ.. కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్స్‌తో కాక రేపారు. అదే స‌మ‌యంలో పార్టీ, ప్ర‌భుత్వ అంత‌ర్గ‌త స‌మావేశ విష‌యాలు మీడియాకు, ప్ర‌త్య‌ర్థుల‌కు లీక్ చేస్తున్నారంటూ ఈట‌ల‌పై అనుమాన‌పు చూపులు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశానికి రాజేంద‌ర్‌ను దూరం చేశాయి.  కొత్త పార్టీ పెట్ట‌డం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదంటూ అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన కామెంట్లు ఈట‌ల‌ను ఉద్దేశించేన‌ని ఇప్పుడే ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఈట‌ల అవుట్ అనే ప్ర‌చారం స్టార్ట్ అయింది. పోలింగ్ ముగిసిన కొన్ని నిమిషాల‌కే.. ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా.. ఆప‌రేష‌న్ ఈట‌ల మొద‌లైపోయింది. ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంపై ఓ వార‌మో.. ఓ నెలో.. హ‌డావుడి జ‌రిగి ఆ త‌ర్వాత అంతా సైలెంట్ అయిపోతుంది. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే మూడేళ్ల‌లో రాజేంద‌ర్‌ను అంతా మ‌ర్చిపోయేలా చేయాల‌నేది కేసీఆర్ స్కెచ్‌లా క‌నిపిస్తోంది. అయితే.. గ‌ట్టి పిండ‌మైన ఈట‌ల‌.. ఈ మేట‌ర్‌ను ఇక్క‌డితో వ‌దిలేస్తారా? గ‌తంలో న‌క్స‌లిజం చ‌రిత్ర ఉండ‌టం.. వంద‌ల కోట్లకు అధిప‌తి అవ‌డం.. ఆయ‌న్ను ఊరికే ఉండ‌నిస్తాయా?  త్వ‌ర‌లోనే ఈట‌ల నేతృత్వంలో.. బీసీ ఎజెండాతో.. తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త పార్టీ పొద్దు పొడ‌వ‌బోతుంద‌నేది ఆఫ్ ది రికార్డ్ మాట. మ‌రి, ఇలాంటి నాయ‌కుల కోస‌మే ఎదురుచూసే క‌మ‌ల‌నాథులు.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లుపెడ‌తారా? మరోవైపు మేడే సందర్బంగా సీఎం కేసీఆర్ ఫోటోతో కార్మికులకు విషెస్ చెబుతూ సందేశం విడుదల చేశారు ఈటల రాజేందర్. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు... కాని ఎక్కడా కేసీఆర్ ను విమర్శించలేదు. ఆయనకు గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో ఈటల తిరుగుబాటు చేస్తారా లేక సరెండర్ అవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది.  ఏమో.. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...

ఈటలకు పోటీగా కొత్త నేత! ఏడాదిగా గులాబీ స్కెచ్

తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకజ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా ఈటల చుట్టే సాగుతోంది. ఈటలను మంత్రివర్గం నుంచి కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? రాజేందరే మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారా? ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? వీటిపైనే రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్‌ను ప్ర‌భుత్వం నుంచే కాదు.. పార్టీ నుంచి కూడా బ‌య‌ట‌కు పంపించేందుకు సీఎం కేసీఆర్ ప‌కడ్బందీ ప్లాన్ వేసిన‌ట్టుగా తెలుస్తోంది.  ఈటల రాజేందర్ సొంత  నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ హుజురాబాద్‌లో ఆయ‌న‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక‌ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. వారం క్రిత‌మే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను క‌లిసిన‌ట్టుగా స‌మాచారం. దీన్ని బ‌ట్టి ఈటల‌ను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ‌ బాధ్యతలు  అప్పజెప్పాలనే ఆలోచ‌న‌తో కేసీఆర్ ఉన్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత దేవేంద‌ర్ గౌడ్‌తో క‌లిసి న‌వ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని ప్ర‌జారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మ‌ళ్లీ టీడీపీలోకి తిరిగివ‌చ్చారు. తెలంగాణ వ‌చ్చాక టీడీపీ బ‌లం త‌గ్గిపోవ‌డంతో.. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీలో చేరారు. నిజానికి ఈట‌ల రాజేంద‌ర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన కేబినెట్ లో ఈటలకు మొదట చోటు దక్కలేదు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు అవకాశం కల్పించారు కేసీఆర్. ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఉద్యమకారులను దూరం పెట్టారనే ఆరోపణలు ఎక్కువ కావడంతో బలవంతంగానే ఆయన్ను తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రిపదవి ఇచ్చినా ఈటలతో కేసీఆర్ గ్యాప్ కొనసాగిందని తెలుస్తోంది. చాలాకాలం పాటు ఈటలకు కేసీఆర్ .. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ జరిగిన సమయంలో ప్రగతి భవన్‌కు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసినా.. ఈట‌ల‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేద‌ని తెలుస్తోంది.  2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈటలకు హుజురాబాద్ అసెంబ్లీ టికెట్ రాదనే ప్రచారం జరిగింది. తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి... తాను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదంటారు. అయితే చివరి నిమిషంలో ఈటలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలకు వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. పార్టీ పెద్దల ఆశిస్సులు ఉన్న నేతలే ఇలా చేశారని ఈటల బహిరంగానే చెప్పారు. ఆ కోపంతోనే పలు సార్లు రాజేందర్.. టీఆర్ఎస్ , కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లమని ఏడాది క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే ఈటలను సాగనంపాలని కేసీఆర్ డిసైడయ్యారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్ కల్లోలం లేకుంటే ఏడాది క్రితమే ఈటలను సాగనంపే వారంటున్నారు. 

కర్ణాటకలో కమలానికి షాక్.. బళ్లారిలో గాలికి భంగపాటు 

కర్ణాటకలో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 10 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ ఏడు చోట, రెండు చోట్ల జేడీఎస్ గెలవగా.. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఒకే ఒక్క స్థానంలో గెలిచి పరువు పోగొట్టుకుంది. సీఎం యడియూరప్ప సొంత జిల్లా శివమొగ్గలో కూడా బీజేపీ ఘోరంగా ఓడింది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి కంచుకోటగా చెప్పుకునే బళ్లారి కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కైవసం  చేసుకుంది. బళ్లారిలో గాలి సోదరులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. బళ్లారి మహానగర పాలికె (కార్పొరేషన్‌)లో మొత్తం 39 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఐదుగురు కాంగ్రెస్ రెబెల్స్ గెలవగా బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది.  18వ వార్డులో బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కుమారుడు శ్రవణ్ కుమార్ ఓడిపోయారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది. రామనగరలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. హసన్ జిల్లాలోని బేలూరు పురసభలోనూ బీజేపీ భారీ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జేడీఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక్క స్థానం దక్కింది. ఇక ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లాలోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలోనూ బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ 23 వార్డులకు గాను జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

రేపు కూతురి బర్త్ డే.. ఈ రోజు ఫాదర్ డెత్ డే 

ఓపెన్ చేస్తే.. వరంగల్‌ రూరల్‌ జిల్లా మడికొండ. అతని పేరు బండి రంజిత్ కుమార్. అతను పుట్టు మూగ. నాలుగేళ్ళ క్రితం  రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్‌ ఓవర్‌హాలింగ్‌షెడ్డులో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. మూడు సంవత్సరాల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి ఒక కుతురు ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో తన భార్య, కూతురును పుట్టింటికి పంపించారు.    రేపు ఆ పాప పుట్టినరోజు . ఆ వేడుకల్లో బంధువులంతా నిమగ్నమయ్యారు. అతను ఉద్యోగం చేస్తూ ఒక్కడే ఒంటరిగా కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉంటున్నారు. రేపు తమ కూతరు పుట్టిన రోజంటూ తన తోటి ఉద్యోగులకు చెబుతూ తప్పకుండా రావాలంటూ చెప్పాడు.  కట్ చేస్తే.. విధినిర్వహణలో ఉండగా తనకు గుండె పోటు వచ్చింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. విషయం తెలసుకున్న భార్య, తన కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లారితే తన కూతరు పుట్టిన రోజు వేడుకలను చూద్దామనుకున్న అతడిని మృత్యువు వెంటాడింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తెల్లారితే తన కూతురు మొదటి పుట్టిన రోజు ఉండగా తన భార్యకు ఫోన్ చేసి రామగుండం రావాలని  చెప్పాడు. ఇంతలో ఇలా జరగడంతో తన భార్య బోరున విలపించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. రంజిత్ కుమార్ మూగ అయినా అందరితో కలిసిమెలిసి ఉండేవాడని తన తోటి స్నేహితులు తెలిపారు. 

ఈటల భూమిపై విచారణ ప్రారంభం.. కేసీఆర్ ఫోటోతో మంత్రి మేడే సందేశం 

తెలంగాణలో సంచలనంగా మారిన వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలకు సంబంధించి విచారణ ప్రారంభమైంది. మెదక్ జిల్లా అచ్చంపేట  గ్రామంలో లో  విచారణ జరుపుతున్నారు విజిలెన్స్ అధికారులు. రైతుల నుండి పిర్యాదు లు తీసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు.  సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన రైతుల నుండి సమాచారం సేకరిస్తున్నారు విజులెన్స్ ఎస్పి మనోహర్, సీఐ సతీష్ రెడ్డి. మంత్రి ఈటలపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక అందించాలని శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో విజిలెన్స్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ఆదేశించిన కొన్ని గంటల్లోనే అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లా హుజురాబాద్ నుంచి మంత్రి ఈటలను కలిసేందుకు  హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు హైదరాబాద్ బయలదేరారు. భూ కబ్జా ఆరోపణలు నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ కు సంఘీభావం ప్రకటించేందుకు ఆయన సొంత నియోజకవర్గంలోని హుజురాబాద్ నుంచి హైదరాబాద్ తరలి వెళ్లారు పలువురు కార్యకర్తలు అభిమానులు.కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన కుట్రలో భాగమే భూ కబ్జా ఆరోపణలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయి అంటున్నారు ఈటల అభిమానులు. కష్టపడే తత్వం, ప్రజాభిమానం ఉన్న ఈటల రాజేందర్ ను తప్పించాలనే కుట్రలో భాగమే ఈ అసత్య ఆరోపణలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి అనుచరులు.  మరోవైపు కేసీఆర్ ఫోటోతో మే డే శుభాకాంక్షలు చెబుతూ సందేశం విడుదల చేశారు మంత్రి ఈటల రాజేంద. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఈటల రాజేందర్ సొంతూరు కమలాపూర్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఈటల సహా నలుగురు అవుట్? కేబినెట్ లోకి కవిత, పల్లా, సండ్ర ? 

తెలంగాణ మంత్రివర్గం పునర్ వ్యవస్థికరణకు రంగం సిద్ధమవుతోంది. కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని చాల కాలం నుంచి ప్రచారం జరుగుతుండగా.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో  అతి త్వరలోనే మార్పులు ఉంటాయని తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ముగియగానే.. తెలంగాణ రాజకీయాల్లో , అధికార టీఆర్ఎస్ పార్టీలో సంచలన పరిణామాలు వెలుగు చూశాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం కలకలం రేపగా.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడం మరింత ఆశ్చర్యంగా మారింది. ఈటల ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూవ్యవహారంలో ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఈటల రాజేందర్ తో పాటు మరో ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించవచ్చని తెలుస్తోంది. ఈటలతో పాటు మహబూబ్ నగర్, మేడ్చల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన ఉండవచ్చంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ దాదాపుగా నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ కవితకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు. కొత్తవారిని తీసుకోవాలంటే మంత్రివర్గంలో నుంచి ప్రస్తుతం ఉన్నవారిని తొలగించాల్సి ఉంటుంది.  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పల్లాను కేబినెట్ లోకి తీసుకుంటే.. ఆయన సామాజికవర్గానికే చెందిన మంత్రికి ఉద్వాసన ఖాయమంటున్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డికి షాక్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. భూదందాల్లోనూ ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కమిషన్ కోసం మంత్రి బెదిరిస్తున్న ఆడియో లీకై వైరల్ గా మారింది. మేడ్చల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతోనూ మల్లారెడ్డికి పొసగడం లేదు. అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో మల్లారెడ్డి అల్లుడికి ఎంపీ టికెట్ ఇచ్చినా.. గెలిపించుకోలేకపోయారు మల్లారెడ్డి. దీంతో పల్లాను తీసుకోవడం కోసం మంత్రివర్గం నుంచి మల్లారెడ్డిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. మల్లారెడ్డిని తొలగించే గులాబీ వ్యూహంలో భాగంగానే ఆయన ఆడియో లీకైందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.  ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రిపదవిపై ఇప్పటికే కేసీఆర్ సంకేతమిచ్చారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి  విజయం సాధించారు సండ్ర. కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టాకా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా పార్టీ మారకపోవడంతో.. టీడీపీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి సాంకేతికంగా ఇబ్బంది వచ్చింది. ఇటీవలే  మచ్చా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో సండ్రను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దళిత కోటాలో  ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్న కేసీఆర్... అతన్ని తప్పించి సండ్ర వెంకట వీరయ్యను తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు.  నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డికి గండం ఉందంటున్నారు. జిల్లాలో జూనియర్ అయినా కేసీఆర్ అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ప్రశాంత్ రెడ్డి మాత్రం జిల్లా నేతలతో సఖ్యతగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డిని తొలగించి.. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను కేబినెట్ లోకి తీసుకోవాలని.. ఆ జిల్లా నేతలు కోరుతున్నారట. కవిత కూడా మంత్రిపదవి కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి స్థానంలో కవితకు కేబినెట్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు.  కొన్ని నెలల క్రితం వివాదాల్లో చిక్కుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు ఊస్టింగ్ ఖాయమంటున్నారు. ఆడియో రచ్చ జరిగినప్పుడే గంగులను తొలగిస్తారని భావించారు. అయితే అప్పుడు గండం నుంచి గంగుల బయటపడ్డారు. ఈసారి మాత్రం ఆయనను తొలగించి... అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రివర్గంలో కేసీఆర్ చోటు కల్పిస్తారని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ను తొలగిస్తారని అంటున్నారు. అయితే ఒకేసారి ముగ్గురు మంత్రులను తొలగించే సాహసం కేసీఆర్ చేస్తారా అన్నది ప్రశ్నగా మారింది. శ్రీనివాస్ గౌడ్ ను తప్పిస్తే.. ఆయన సామాజికవర్గం నుంచే మరొకరికి అవకాశం రావచ్చు.  హైదరాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన సురభి వాణిదేవీకి కీలక పదవి ఇస్తారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. పలు విద్యాసంస్థలకు అధినేతగా ఉన్న వాణిదేవీకి విద్యాశాఖ మంత్రి అయితే సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితాఇంద్రారెడ్డిని రెండో దశలో కేబినెట్ లోకి తీసుకున్నారు. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమె నిలిచారు. దీంతో ఆమెను తప్పిస్తే బాగుండదనే చర్చ గులాబీ నేతల్లో జరగుతుందట. కేబినెట్ బెర్త్ కాకుండా వాణిదేవీకి శాసనమండలి చైర్మెన్ పదవి ఇవ్వాలని సూచన కొందరు నేతలు చేశారంటున్నారు. ప్రస్తుతం మండలి చైర్మెన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డికి రెస్ట్ ఇచ్చి.. వాణిదేవీకి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. 

అందరి చరిత్ర విప్పుతా! నిప్పుతో పెట్టుకోవద్దన్న ఈటల

తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.  ముందస్తు ప్రణాళికతో దుష్ప్రచారం చేశారని, తనపై కట్టుకథలు అల్లారని ఆరోపించారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకున్నానని... అయితే, కొన్ని టీవీ ఛానళ్లు తనపై కట్టుకథలు అల్లుతూ వార్తలను ప్రసారం చేశాయని అన్నారు. ఇది దుర్మార్గమైనదని, అసహ్యకరమైనదని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో ఈ వార్తలను ప్రసారం చేశారని దుయ్యబట్టారు.  అంతిమ విజయం దర్మానిదేనని తెలిపారు. తాత్కాలికంగా న్యాయం అపజయం పొందవచ్చని వ్యాఖ్యానించారు.   2016లో ఒక పెద్ద హ్యాచరీ పెట్టాలని తాను అనుకున్నానని... చదువుకుని వచ్చిన తన కుమారుడిని కూడా తమ వ్యాపారంలో కొనసాగించాలని జమునా హ్యాచరీస్ ను ప్రారంభించానని చెప్పారు. హ్యాచరీస్ కోసం 40 ఎకరాల భూమిని కొన్నామని వెల్లడించారు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 100 కోట్ల లోన్లు కూడా తీసుకున్నానని తెలిపారు. హ్యాచరీస్ కు చుట్టుపక్కల అసైన్డ్ భూములున్నాయని, అవి  ఎందుకూ పనికి రాని భూములు  అని చెప్పారు. ఆ భూములను తీసుకొమ్మని రైతులు కోరితే ఎవరూ ఆ భూములను  కొన కూడదు.. మీరే  ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పానని, దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మార్వో వద్దే ఉన్నాయి అని చెప్పారు. 2004లోనే తన కోళ్ల ఫారాలలో దాదాపు 10 లక్షల కోళ్లు ఉండేవని ఈటల తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజవర్గంలో కూడా లక్ష కోళ్లు ఉండే ఫారం ఉండేదని... దాన్ని అమ్మేశానని చెప్పారు. 2004కు ముందే తనకు 120 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. జమున హాచరీస్ కోసం రైతుల దగ్గర నుంచి తాను ఒక్క ఎకరా భూమిని కూడా లాక్కోలేదని... వారే తన వద్దకు వచ్చి భూమిని అప్పజెప్పారని అన్నారు. తాను ఆత్మను అమ్ముకునే మనిషిని కాదని చెప్పారు. ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తినని తెలిపారు. తన ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలిగే ఉంటుందని... లక్షల మంది ఇక్కడ భోంజేశారని... అన్నం పెట్టకుండా ఎవరినీ పంపించమని చెప్పారు.తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో కరీంనగర్ ప్రజలకు తెలుసని అన్నారు. తన భూములు పోయినా పర్వాలేదని... ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోనని చెప్పారు. తాను ముదిరాజ్ కులంలో పుట్టానని... తనది భయపడే జాతి కాదని ఈటల అన్నారు. చిల్లరమల్లర మాటలకు తాను భయపడనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాత్రికి రాత్రే ఎందరో కోట్లకు పడగలెత్తారని, స్కూటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి వందల కోట్లకు ఎలా పడగలెత్తారని ఈటల ప్రశ్నంచారు. తనకు అందరి చరిత్రలు తెలుసని, అయితే ఎవరి పేర్లను తాను బయటపెట్టదలుచుకోలేదని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని చూసుకున్న చరిత్ర తనదని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై అన్ని విచారణ సంస్థలతో పాటు, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. తాను తప్పు చేసినట్టు ఒక్క విచారణలో తేలినా... ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు.

ఈటల రాజేందర్ రాజీనామా?  మరికొందరు నేతలు కూడా.. 

తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాలపై వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం.. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే తనపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై మీడియాకు వివరణ ఇవ్వబోతున్నారు ఈటల రాజేందర్. శామీర్ పేటలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే తన రాజీనామాను ఈటల ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఈటల సిద్ధం చేసుకున్నారని, తన సన్నిహితులతోనూ చర్చించారని చెబుతున్నారు. మంత్రి పదవితో పాటు టీఆర్ఎస్ పదవులకు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజేందర్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఈటలతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారని చెబుతున్నారు.   ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ  కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు వస్తుండటం చర్చగా మారింది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ జరుగుతోంది. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది.  ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.  కొంత కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు సార్లు ఆయన ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. గత సంవత్సరం గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా రాజేందర్ మాట్లాడారు. బీసీ సంఘం సమావేశంలోనూ తనను అణగదొక్కాలని చూస్తున్నారనే సంకేతం ఇచ్చేలా ఈటల మాట్లాడారు. తమను వరుసగా టార్గెట్ చేస్తున్నరన్న కసితో అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే భూకబ్జాలతో పేరుతో కథ నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

బరువు పెరిగితే ముప్పే! కరోనాపై షాకింగ్ రిపోర్ట్ 

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా వైరస్ ప్రభావంపై యూకే రీసెర్చర్లు అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. నిర్ధారిత బరువు కంటే కొంత ఎక్కువ బరువున్నా కరోనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం వెల్లడైంది.  ముఖ్యంగా యువతలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.  వరుస లాక్ డౌన్ల వల్ల జనాలు ఇళ్లలోనే ఉంటుండటంతో... వారు బరువెక్కుతున్నారు. వీరిపైనే యూకే రీసెర్చర్లు అధ్యయనం చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే ఎక్కువ ఉన్నవారు ఇప్పటికే హై రిస్క్ లో ఉన్నారని అధ్యయనంలో వారు తెలిపారు. బీఎంఐ ఒక్క పాయింటు పెరిగినా... ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. 40 కంటే తక్కువ వయసున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు తెలిపారు.  ఇతర జాతులతో పోల్చితే నల్లజాతీయులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని యూకే రీసెర్చర్లు చెప్పారు. 70 లక్షల మంది హెల్త్ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారు బరువు పెరిగినప్పటికీ... వారిపై ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు 'ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.   

కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ అవుట్?

కరోనా కల్లోల సమయంలోనూ తెలంగాణలో రాజకీయ సంచలనాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ  కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు వస్తుండటం చర్చగా మారింది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ జరుగుతోంది.  మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది.  ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.  మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం  మీడియాలో వైరల్​గా మారింది. టీఆర్​ఎస్​ పార్టీ అధికారిక ఛానల్​గా గుర్తింపు ఉన్న టీ న్యూస్​లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.  కొంత కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు సార్లు ఆయన ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. గత సంవత్సరం గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా రాజేందర్ మాట్లాడారు. బీసీ సంఘం సమావేశంలోనూ తనను అణగదొక్కాలని చూస్తున్నారనే సంకేతం ఇచ్చేలా ఈటల మాట్లాడారు. తమను వరుసగా టార్గెట్ చేస్తున్నరన్న కసితో అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే భూకబ్జాలతో పేరుతో కథ నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

టీకాలేక్కుండా వ్యాక్సినేషన్ ఎలా? రెండు రోజుల్లో 3 కోట్ల రిజిస్ట్రేషన్లు..

మే 1 వతేదీ మూడో దశ వ్యాక్సినేషన్‌కు అనుమతించింది కేంద్రం. 18 ఏండ్లు నిండిన వారినీ టీకాకు అర్హులుగా ప్రకటించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు స్పందన లభిస్తోంది. గురువారం వరకే 2.45 కోట్ల మంది లబ్ధిదారులు కొవిన్‌  ద్వారా పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28న 1.37 కోట్లకుపైగా పేర్లను నమోదు చేసుకోగా.. 29న 1.04 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  వ్యాక్సినేషన్ నమోదు ముమ్మరంగా సాగుతోంది కాని.. టీకా పంపిణి మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. చాలా రాష్ట్రాల్లో 45 ఏండ్లు నిండినవారికే ప్రస్తుతం టీకాలు వేసే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు లేక టీకా కేంద్రాలనే మూసేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో చాలా వ్యాక్సినేషన్ సెంటర్లు క్లోజ్ చేశారు. టీకాలు లేకపోవడంతో మహారాష్ట్ర లోని ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సి నేషన్‌ నిలిపివేస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌  ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి చేపట్టాల్సిన టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. టీకాలు వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తామని తెలిపింది. ఢిల్లీ సర్కార్‌ వద్ద ప్రస్తుతం వేయటానికి టీకా అనేదే లేదని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్‌ ప్రకటించారు. ఉన్న వ్యాక్సిన్‌ నిల్వలు మొత్తం అయిపోయాయని వెల్లడించారు. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ప్రైవేటు కంపెనీలకు విజ్ఞప్తులు చేశామని, వాటి నుంచి స్పందన లభించిన తర్వాతే టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియజేయగలమని పేర్కొన్నారు. టీకాలు అందుబాటులో లేనందున  గుజరాత్‌, పంజాబ్‌, ఏపీ, తెలంగాణలోనూ 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ వాయిదా పడింది. 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే టీకా వేస్తున్నప్పుడే పరిస్థితులు ఇలాఉంటే.. ఇక వారికి 18-44 ఏండ్లలోపు వాళ్లు కూడా కలిస్తే.. అసలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇప్పుడున్నంత సజావుగానైనా జరుగుతుందా అని ఆరోగ్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  18-44 ఏండ్ల వయసువాళ్లు టీకా తీసుకోవాలంటే కొవిన్‌ పోర్టల్‌ ద్వారాగానీ, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం తప్పనిసరి. అయితే, టీకా కోసం నిర్ణయించిన స్లాట్లు అందుబాటులో ఉంటేనే వారికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం వీలవుతుంది. టీకా అందుబాటులో ఉంటేనే స్లాట్‌లు కేటాయిస్తారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా కోసం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కోట్లాదిమంది యువతీ యువకులు, నడి వయస్కులు వ్యాక్సిన్‌ కోసం తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇంతటి డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయా? కంపెనీలు సరఫరా చేయగలవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఏప్రిల్‌ 19న వ్యాక్సినేషన్‌ కొత్త నిబంధనలను ప్రకటించింది. అప్పటివరకూ 45 ఏండ్లు నిండినవారే కరోనా టీకా తీసుకోవటానికి అర్హులుకాగా.. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హుల వయస్సును 45 నుంచి 18 ఏండ్లకు తగ్గించింది. అంతేకాదు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి టీకాలను స్వయంగా కొనుగోలు చేసుకోవటానికి రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు దవాఖానలకు అనుమతించింది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం.. ఏప్రిల్‌ 28 నుంచి కొత్త లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 19 నుంచి మే 1 వరకూ 11 రోజుల గడువున్నా.. కేంద్రం ఇటు రాష్ట్రాలను, అటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలను సమన్వయం చేసుకొని, ప్రణాళికలను సిద్ధం చేసుకోలేదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కడికక్కడ సమన్వయంతో టీకాల పంపిణీ, సరఫరా, వ్యాక్సినేషన్‌పై పని చేసి, పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే విస్తృత వ్యాక్సినేషన్‌ సాధ్యమతుందని నిపుణులు సూచిస్తున్నారు.  

ఉద్యోగం పోయింది. దొంగతనం చేసిన 21 ఏళ్ళ యువతి..

ఆమె ఓ యువతి. వయసు 21 సంవత్సరాలు. గతంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కారణం ఏంటో తెలియదు గానీ ఆ యువతి ఉద్యోగం పోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకోసం ఆమె ఒక కొత్త అవతారం ఎత్తింది. అదేంటని అనుకుంటున్నారా.. ? మీరే చూడండి ఏం చేసిందో..     ఆమె ఓ జ్యూయలరీ షాప్‌కు వెళ్ళింది. ఓనర్ తో అది చూపించండి.. ఇది చూపించండి  అంటూ మాటల్లో పెట్టింది. ఓనర్ అమ్మాయి కదా అని ఆమెను ఏం అనలేదు. కానీ ఆమె మాత్రం బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఇక అంతే ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకున్నాడు. చుట్టుపక్కన ఉన్నవారందరినీ పిలిచాడు. ఈ యువతి షాప్‌లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నానని వాళ్లకు చెప్పాడు. అక్కడ వచ్చిన చుట్టుపక్కల వారందరి ముందే ఆ యువతిని రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశారు. ఆమె చేతులను తాళ్లతో కట్టేసిన తర్వాత ఆ యువతిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు.  కట్ చేస్తే..ఈ సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన జరుగుతున్న స్థలానికి  వచ్చారు. పోలీసులు వెళ్లే సరికి ఆమెను స్తంభానికి కట్టేసి మాకు ఏం సంబంధం లేదన్నట్లు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అసలు అప్పటిదాకా ఏమీ జరగనట్టు, ఆమెను ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయినట్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆమెకు కట్లు విప్పిన పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో.. ఆమె అసలు నిజం బయటపెట్టింది. దొంగతనానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. కానీ దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె చెప్పింది. తాను అంతకు ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని చెప్పింది. కొన్నిరోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి ‘నవ్‌కర్ ఆర్నమెంట్స్’‌లో చోరీ చేయమని చెప్పి తనను ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది. షాప్‌లోకి వెళ్లి మత్తు మందును ఓనర్‌పై స్ప్రే చేసి జ్యూవెలరీని దొంగిలించి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పింది. తాను చెప్పినట్లు చేయకపోతే.. నీకున్న అఫైర్ గురించి బయటపెడతానని తనను బెదిరించాడని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ బెదిరింపు వ్యవహారం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఓ వ్యక్తితో తనకు కొంతకాలంగా అఫైర్ ఉందని ఆ యువతి అంగీకరించింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బంది అవుతుంది చెపింది.  ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  కరోనా వచ్చి ప్రాణం తియ్యడమే కాదు. ఉద్యోగం కూలిపోయి నిరుద్యోగం కొంత మంది పాలిట శాపంగా మారింది. 

పరువు తీసుకున్న విజయసాయి రెడ్డి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ పనితీరు ఎలా ఉందో విజయసాయి సాక్షిగా బహిర్గతమైంది. ప్రభుత్వం చెబుతున్నదానికి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతనే లేదని తేలిపోయింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో 104 కాల్ సెంటర్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్  ఆదేశాలిచ్చారు. అయితే 104 సేవలు మాత్రం రోగులకు అందడం లేదు. ఈ నేపథ్యంలో 104 సర్వీసుల పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కలెక్టరేట్‌లోని 104 కంట్రోల్‌ రూమ్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్‌కూడా రాకపోవడంతో.. స్వయంగా 104కి ఫోన్‌ చేశారు. దీంతో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిరెడ్డి  104 కేంద్రానికి స్వయంగా ఫోన్ చేశారు. అయితే దాదాపు 20 నిమిషాల వరకు అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విజయసాయి అసహనానికి గురయ్యారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న విజయసాయి... 104 నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే సాంకేతిక లోపాల కారణంగా ఈ సమస్య వచ్చిందని 104 నిర్వాహకులు విజయసాయికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నవేళ లోపాలు చక్కదిద్దుకుని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విజయసాయి స్పష్టం చేశారు. అనంతరం కేజీహెచ్‌లో వైరాలజీ లాబ్‌ను విజయసాయి సందర్శించారు. టెస్టింగ్, నిర్వహణ తీరును వైద్యుల నుంచి అడిగి ఆయన తెలుసున్నారు. 

బాధితులు కష్టాలు చెప్పుకుంటే తప్పేంటి! కేంద్రానికి సుప్రీంకోర్టు చివాట్లు 

సోషల్ మీడియాలో కరోనా బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటూ ఇతరులకు సమాచారం చేరవేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవద్దని.. ఒకవేళ అలా చేస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో బాధలు చెప్పుకోవడాన్ని అణచివేయడం తగదని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు.ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.  ఓ పౌరుడిగా, న్యాయమూర్తిగా అది తనకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. తమకు బెడ్లు కావాలనో లేదంటే ఆక్సిజన్ కొరత ఉందనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరం కాదని, అలా తమ గోడు వెళ్లబోసుకున్న పౌరులను హింసిస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పౌరులు సోషల్ మీడియాలో లేవనెత్తిన బాధలు తప్పు అని అనుకోవడం తగదన్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే హోటళ్లు, ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలను కొవిడ్ సేవల కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు.  వ్యాక్సిన్లపైనా కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు జస్టిస్ డి.వై. చంద్రచూడ్. ఇలాంటి తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పూర్తిగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు ధరలు ఎందుకని నిలదీశారు. రాష్ట్రాలు 50 శాతం డోసులను కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇందులో సమానత్వం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నోళ్లు 59 కోట్ల మంది ఉన్నారని, పేద ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే ఇప్పుడూ అనుసరించాలని ప్రభుత్వానికి సూచించారు. ‘‘ఆక్సిజన్‌ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని ఆసుపత్రులకు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు సరఫరా చేస్తున్నారు? లాక్‌డౌన్‌ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలు ఏవి? నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉందా? మరి అలాంటి వారికి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా చేయిస్తున్నారు? స్మశానవాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారు? పేటెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 92ను కేంద్రం అమలు చేస్తోందా? వ్యాక్సిన్‌ డోసులను కేంద్రమే 100శాతం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే టీకాల ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి పంపిణీ వికేంద్రీకరణ చేయవచ్చు కదా? వ్యాక్సిన్‌ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదు? 18-44 ఏళ్ల మధ్య జనాభా ఎంత? వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత?’’ అంటూ ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.    కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తున్నారు? ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడిగింది. ఈ కేసు విచారణలో అమికస్‌ క్యూరీగా న్యాయవాదులు మీనాక్షి అరోరా, జైదీప్‌ గుప్తా కూడా కోర్టుకు హాజరయ్యారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. 

కరోనా వార్డ్ లో డాన్సులు.. 

సరిగ్గా సంవత్సరం కింద ప్రశాంతగా ఉంది ప్రపంచం. ఎక్కడి నుండి వచ్చిందో మాయదారి కరోనా ఒక్కసారి  పెను ఉప్పెనలా ప్రపంచాన్ని కబళించింది. జీవం తో ఉన్న ప్రజా సముదాయాన్ని నిర్జీవులను చేసింది. ఒకటి కాదు రెండు కాదు కొన్నీ లక్షల మంది ప్రాణాలను తీసింది.   దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విధ్వంసం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో  రోజుకు 3.5 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు వచ్చాయి. దీంతో, ఏ హాస్పిటల్​ చూసినా కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతుండు. దీంతో వైద్య సిబ్బంది, అంబులెన్స్​ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా కట్టడిలో ముందున్న వారంతా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు 24 గంటలు హాస్పిటల్​లోనే ఉండి సేవలందిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒత్తిడి పోగొట్టుకోవడానికి, పేషెంట్లలో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు రిలాక్స్​ అయ్యేందుకు డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా హెల్త్​ వర్కర్లు పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. బహుశా మన ధైర్యానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేడకున్నారో ఏం కొత్తగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు.  కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించే సిబ్బందికి సెలవులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఒత్తిడిని దూరం చేసేందుకు, పేషెంట్లలో ధైర్యాన్ని నిపేందుకు వైద్య సిబ్బంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కరోనా రోగుల్లో సానుకూల ఆలోచనలు నింపుతాయని వారు చెబుతున్నారు. తాజా వీడియో ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారుతోంది. హెల్త్ వర్కర్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. సోషల్​ మీడియాలో వైరల్​.. వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. కరోనా సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పీపీఈ కిట్లను ధరించి భాంగ్రా స్టెప్పులేయడం మనం చూడవచ్చు. వైద్యులు డాన్స్​ చేస్తూనే.. రోగులను కూడా వారితో పాటు డాన్స్​ చేయాలని ప్రోత్సహించారు. దీంతో కొంతమంది రోగులు బెడ్​పైనే చిటికెలు, చప్పట్లు కొట్టడుతూ భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. ఈ వీడియోను గుర్మీత్ చాధా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్లేబ్యాక్ సింగర్, గేయ రచయిత షారీ మన్ పాడిన జిందగీ అనే పంజాబీ సాంగ్​కు వారు డ్యాన్స్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా యూజర్లు ఇంటర్​నెట్​లో ఈ వీడియోను చూసిన తరువాత వైద్యులను మరింతగా ఉత్సాహపరిచారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సానుకూల భావాలను పెంపొందిస్తున్న హెల్త్​ వర్కర్ల​ను ప్రశంసిస్తున్నారు.