కలియుగం కరోనా.. ఇన్ని కేసులా..!
దేశం లో రోజు రోజు కరోనా దాటికి హద్దులు లేకుండా పోతుంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. కేంద్రం మాత్రం కరోనా మరణాలను చూస్తూ ఉండడం తప్పిటిస్తే చేసేదేమి లేదని చేతులు ఏతేసింది. మోడీ పాలనలో ప్రజా ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. కరోనా కారణంగా దేశ వ్యాపితంగా మరణాలకు స్మశానాలు సైతం కన్నీరు పెడుతున్నాయి గని మోడీ హృదయం మాత్రం చలించడం లేదు. మొదటి దాప కరోనా లాక్ డౌన్ పెట్టినప్పుడు వలస కార్మికుల ప్రాణాలు తీశాడు. ఎప్పుడు ఆక్సిజన్ అందక, వ్యాక్సిన్ ఇవ్వక ప్రాణాలు తీస్తున్నారు. ఈ విషయమై సుప్రీమ్ కోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసిన మూతి పక్కకు తిప్పడం తప్పితే మోడీ చేసింది ఏం లేదు.
దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు.
తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ల సంఖ్య 2,10,77,410కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2,30,168 మంది మరణించగా.. 1,72,80,844 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 16,25,13,339 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇలా..
గడిచిన 24 గంటల్లో 6026 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 6,551 మంది కోలుకోగా.. మరో 52 మంది మరణించారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. వీరిలో 3,96,042 మంది కోలుకున్నారు. కోవిడ్ బారినపడి 2579 మంది మరణించారు. కరోనా సెకండ్ వేవ్లో రికవరీ రేటు కాస్త పడిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 83.24గా ఉంది. మరణాల రేటు 0.54గా ఉంది. ఇక జాతీయ స్థాయిలో రికవరీ రేటు 82శాతం, మరణాల రేటు 1.1గా నమోదయింది. తెలంగాణలో బుధవారం 79,824 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 1,33,47,076 టెస్ట్లు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 3,58,599 మంది పరీక్షలు చేశారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో నిన్న 1115, మేడ్చల్లో 418, రంగారెడ్డిలో 403, నల్గొండలో 368, సంగారెడ్డిలో 235, సిద్దిపేటలో 231, వరంగల్ అర్బన్లో 224, కరీంనగర్లో 223, నాగర్కర్నూలులో 206, ఖమ్మంలో 205, మహబూబ్నగర్లో 204 కేసులు నమోదయ్యాయి.