ఎమ్మెల్యేల బేరసారాల కేసు.. సమాధానం లేని ప్రశ్నలెన్నో..ఎన్నెన్నో!

 కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తే ఒకలా మాట్లాడుతారు.. విఫలమైతే మరోలా మౌనమునిలా మాట్లాడుతారు. గతంలో ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. తాజా ఉదాహరణ అయితే మొన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం. ఓ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కమలం పార్టీ హస్తిన నుంచి కుట్రలు చేస్తోందనీ, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హస్తిన నుంచి వచ్చిన దూతలను తమ ఎమ్మెల్యేలు పట్టించారనీ ఊరూ వాడా అదిరిపోయేలా ప్రచారం చేసి హంగామా చేసిన టీఆర్ఎస్ హఠాత్తుగా సైలెంటైపోయింది. ఓ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు వ్యక్తులు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వీడియోలు చూపించి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి హస్తిన దూతలు ప్రయత్నించారని హడావుడి చేసింది. పైగా ఆ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం చేసింది. భారీ కుట్రను భగ్నం చేసిన తెలంగాణ హీరోలుగా తమ ఎమ్మెల్యేలను కీర్తించేసింది. ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారంటూ ప్రగతి భవన్ నుంచి సమాచారం కూడా వచ్చింది. అంతే బస్... ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల గురించి టీఆర్ఎస్ పన్నెత్తి మాట్లాడటం లేదు..పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించవద్దంటూ పార్టీ క్యాడర్ కు ఓ పిలుపునిచ్చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతే కాదు నేరుగా కేసీఆర్ కు యాదాద్రి లో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. శుక్రవారం ఉదయమే ఆయన యాదాద్రికి వెళ్లారు. కేసీఆర్ కూడా రావాలని మరో సారి సవాల్ చేశారు. అయినా కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ నుంచి మౌనమే సమాధానమైంది. ఈ లోగా పోలీసులు మాత్రం భారీ మొత్తానికి డీల్ కుదరబోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో ఎంత నగదు స్వాధీనం చేసుకున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. నగదు ప్రస్తావన లేకుండా ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్టుకున్న ముగ్గురినీ 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆ తరువాత హడావుడిగా ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్ విధించేందుకు నో అని వారి ముగ్గురినీ విడుదల చేయాలని ఆదేశించారు.  బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని తెరాస ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.  ఇంత వరకూ బానే ఉంది కానీ.. ఆ తరువాత టీఆర్ఎస్ సైలెన్సే పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక ముందు కూడా ఇలాగే బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల నివాసంలో భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు బిల్డప్ ఇచ్చిన పోలీసులు ఆ తరువాత ఆ కేసు విషయమే మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందంటూ.. ఆ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు. మరి దీని సంగతి ఏమౌతుందో అని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తం మీద ఎమ్యెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయ్యిందా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఫాం హౌస్‌లో   నందకుమార్‌, ఆయనతో వచ్చిన సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, సింహయాజులును ట్రాప్‌ చేసిన.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ సంభాషణల ఆడియో రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? అలాగే తాము బేరసారాలకు గురయ్యామని ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా, పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్వాధీనం చేసుకున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత  లేదు. కానీ గతంలో ఇంచుమించు ఇటువంటి కేసులోనే నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫోనును, ఫిర్యాదుదారుడయిన ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌ ఫోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని  వాటిని కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో మాత్రం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు చెప్పడం లేదు. అలాగే.. మొయినాబాద్ ఫాం హౌస్ సంఘటన తరువాత పోలీసులు నిందితులుగా పేర్కొన్న  నందకుమార్‌, సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, సింహయాజులును పోలీసులు అరెస్టు చేశారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసు స్టేషన్ కు తీసుకురాలేదు.. వారి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు..వారిని నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడానికి ఎందుకు అనుమతించారు అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.  ఇలాంటి కేసుల్లో నిందితులు- ఫిర్యాదు దారులను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి, వారితో వాంగ్మూలం తీసుకోవడం తప్పని సరి.. కానీ అటువంటి తప్పని సరి అయిన, అనివార్యమైన సంప్రదాయాలను పోలీసులు పాటించినట్లు కనిపించడం లేదు. 

లోకేష్ కు చంద్రబాబు కర్తవ్య బోధ

సైన్స్ గణితం మీదా శ్రద్ధపెట్టమని చింటూకి వాళ్ల నాన్న ముద్దుగా చెప్పాడు, ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకోమని పింకీకి వాళ్లమ్మ చెప్పారు, లెక్కల మాస్టార్ని తన బాధ్యతలూ కొద్ది రోజులు చూసుకోమని హెడ్మాస్టర్ చెప్పారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు తన కుమా రుడు నారా లోకేష్కి మంగళగిరి బాధ్యతలు పూర్తిగా చేపట్టి విజేతగా నిలవమని కర్తవ్యబోధ చేశారు.  ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంతో అవకాశం ఉండడంతో తెలుగు దేశం నాయకులు రెండిం తల ఉత్సాహం తో దూసుకుపోతున్నారు. అయితే ఈపర్యాయం తప్పకుండా అధికారంలోకి రావాలంటే అందరం మరింత శ్రమించాలని, మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని  ఏమాత్రం నిర్లఓ్యం తగదని ఇప్పటికే అధినే చంద్రబాబు టీడీపీ వర్గాలకు చిన్న క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో  పార్టీ పరిస్థితిని, ఆ ప్రాంత నాయకుల పనితీరును  చంద్రబాబు సమీక్షించారు. లోకేష్ను మంగళగిరి బాధ్యతలను లోకేష్ చేతుల్లో పెట్టారు. అక్కడ చరిత్రను తిరగరా యాలని ఉత్సాహపరిచారు. అలాగే నియోజకవర్గాల ఇన్ ఛార్జ్లతో కూడా చంద్రబాబు వన్ టు వన్ సమావేశమై పరిస్థి తుల గురించి కూలంకషంగా చర్చించారు.  రాష్ట్రంలో జగన్ పాలనపట్ల విపరీత వ్యతిరేకత వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణాన్ని పూర్తిగా వినియో గించుకుని అధికారంలోకి రావాలన్న లక్ష్యం తెలుగు దేశం నాయకుల్లో ఉంది. ప్రజలు అన్ని విధాలా వైసీపీ  ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. జగన్ అన్నివిధాలా విఫలమ య్యార న్నది ప్రజల వ్యతిరేకతే  తెలియజేస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాలం గడిపేయ కుండా పార్టీని మరింత  బలోపేతం చేయడం, పార్టీని గెలిపించడం మీదనే దృష్టి పెట్టాలని  టీడీపీ పార్టీ అధినేత సూచించారు.  మంగళగిరి నియోజకవర్గంపై ఇంచార్జ్ నారా లోకేష్ తో పార్టీ అధినేత సమీక్ష జరిపారు. పార్టీ కార్యక్ర మాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని…1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే  దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంచార్జ్ లోకేష్ కు పార్టీ అధినేత సూచించారు. నాలుగు నియోజవర్గాల ఇంచార్జ్లతో ముఖాముఖీ భేటీలు జరిగాయి. కర్నూలు ఇంచార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ రివ్యూలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో ముఖాముఖి సమీక్షలు ముగిశాయి.

ఎన్ఐఏ విస్తరణ ఆంతర్యమేంటి?.. కోడికత్తి కేసు గతేంటి?

తిట్టించడానికి, కొట్టడానికి మనుషులుండాలి.. అప్పుడే రాజుగారికి ఆనందం, చేతులకు మట్టి అంటకుండా చితక్కొ ట్టించేయచ్చు, మరీ ఆసక్తి కలిగితే ఊచలూ లెక్కపెట్టించొచ్చు.  ఖర్చులేకుండా అనుకున్న పనులు చేయించేయవచ్చు. అలాంటి మహత్తర ఆలోచన ఈ ఆధునిక కాలంలో బీజేపీ వారికే వచ్చింది. ఎవరు పడితే వారు తమ మీదా, పార్టీ మీద విరుచుకుపడకుండా, తిట్టుకోకుండా చెప్పిన మాట వింటూ పడి ఉండేలా చేసుకోవడానికి ఎన్ ఐ ఏ సంస్థను జేబు సంస్థగా మార్చుకుని అన్ని రాష్ట్రాల్లోనూ తోలుబొమ్మలాట  ఆడించాలని మహత్తర మార్గం ఆలోచించిన ఘనులు బీజేపీ సీనియర్లు.. హోం మంత్రి అమిత్ షా తదితరులు.  గతకొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది. దేశంలో ఏ ఘటన జరిగినా..మూలాలు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ  తన వేటను కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, భైంసాలో సోదాలు చేపట్టారు. ఇటు ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీ ఎఫ్ ఐ) కార్యకలాపాలపై నిఘా ఉంచింది.  నిజామాబాద్‌లో మొత్తం 20 చోట్ల నాలుగు ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇటు నిర్మల్ జిల్లా భైంసాలోనూ సోదాచేపట్టారు. స్థానిక మదీనా కాలనీలో పలు ఇళ్లల్లో దర్యాప్తు చేపట్టారు.  నిజామాబాద్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో మూడు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టవర్ సర్కిల్‌లోని కేర్ మెడికల్, టీఆర్ నగర్‌లో ఓ ఇంటిలో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈసందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఏపీలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలోని ఖాజానగర్‌లో విస్తృతంగా సోదాలు చేశారు.  ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు కొనసాగుతు న్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా  రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్‌ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా  ఐసిస్‌ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.   ఇవన్నీ అంగీకరించాల్సినదే. కానీ వాటిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాల్లో మరింత నిఘా పెంచాల్సిన అవసరముందన్న మాట చెబుతూ ప్రజలకు నిద్రలేకుండా చేయడం ఎంతవరకూ సబబు? కేంద్రం, ఎన్ ఐఏ లక్ష్యాలు ఎలా ఉన్నా, సంఘ విద్రోహులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా చేపట్టాల్సి వస్తుందని, తనిఖీలు, సోదాల గురించి ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో విచారణ పట్టనట్టు వదిలేస్తే నిందితులుగా పట్టుబడినవారు జైళ్లల్లోనే మగ్గిపోవాల్సిందేనా అనే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తమ పరిధి అంతకు మించిందని చిన్నపాటి కేసులను వదిలేస్తే రాష్ట్రప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లకపోవడంతో బాధితుల కుటుంబాలు కూడా వేదనకు గురవుతున్నాయి.  ఇక ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ ఒక విభాగం పెట్టడం వల్లనే ప్రత్యేకించి ఒరిగేదేమిటన్నది ప్రశ్న. కేవలం ఉగ్రవాదులతో, సంస్థలతో సంబంధం వున్నవారిని గుర్తించి ఏరివేసేందుకు భయోత్పాతాలు కల్పించడానికి, సామాన్యులను సోదాల పేరుతో ఖంగారు పెట్టడమే జరుగుతుంది.  బీజేపీ ఇప్పుడు అందుకే శ్రీకారం చుట్టింది. దేశంలో ఉగ్ర కార్యకలాపాల నిరోధం సాకుతో 2024 తరువాత దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించంది.  హర్యానా సూరజ్ కుండ్ లో జరుగుతున్న చింతన్ బైఠక్ లో కేంద్ర హోంమంత్రి షా గారు ఎన్ఐఏకు ప్రతి రాష్ట్రంలోనూ ఒక కార్యాలయం ఉంటుందన్నారు.   నార్కోటిక్స్, సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ తమ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాంతీయ వ్యతి రేకతకు, నినాదానికీ అవకాశం లేకుండా చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నట్టు తోస్తుంది.   2008లో ముంబైలో ఉగ్రవాదుల దాడుల తర్వాత ఎన్ఐ ఏ ఏర్పాటయి అదే ఏడాది డిసెంబర్ లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది.  ఉగ్ర కార్యకలాపాల నిరోధం విషయంలోనూ.. ఉగ్ర కేసుల దర్యాప్తులోనూ ఎన్ఐఏ ప్రతిభ, చొరవలను అందరూ ప్రస్తుతిస్తున్నారనడంలో సందేహం లేదు. అయితే ఎన్ఐఏను అడ్డు పెట్టుకుని తమ వ్యతిరేకులను వేధించాలన్న ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఉదాహరణకు కోడికత్తి శ్రీను కేసే తీసుకుంటే.. అది ఏ విధంగా చూసినా ఎన్ఐఏ పరిధిలోకి రాదు.. కానీ 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది. అంతే ఇక ఆ కేసు దర్యాప్తును పక్కన పెట్టేసింది. ఎందు కంటే ఈ కేసు దర్యాప్తునకు సమయం వెచ్చించేంత తీరిక ఎన్ఐఏకు ఉండదు కనుక. దేశ ద్రోహం, ఉగ్ర కార్యకలాపాలు ఎన్ఐఏ పరిధి. కోడికత్తి కేసు ఆ పరిధిలోకి రాదు కనుక.. ఈ కేసును ఎన్ఐఏ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ జరుగుతున్నదేమిటి. ఎన్ఐఏ కేసు కనుక ఈ కేసులో కోడి కత్తి శీనుకు బెయిలు రాదు. జైళ్లో మగ్గాల్సిందే. గత నాలుగేళ్లుగా కోడి కత్తి శీని జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటైతే.. దేశమంతటా కోడికత్తి శీనుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పెట్టి కేసులను కూడా ఎన్ఐఏకి అప్పగించేసి అమాయకులను జైళ్లకు పంపే కార్యక్రమం మొదలౌతుంది. అధికారంలో ఉన్న వారు తమ ప్రత్యర్థులను వేధించడానికి ఎన్ఐఏను ఒక అయుధంగా వాడుకునే ప్రమాదం పెరుగుతుంది.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇప్పటికే కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని వేధిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటుతో ముందు ముందు రాజకీయ వేధింపులకు ఎన్ఐఏ కూడా కేంద్రం చేతికి ఒక ఆయుధమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పైశాచికత్వానికి కుప్పంలో అరాచకత్వమే నిదర్శనం.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి పైశాచికత్వానికి, ఉన్నాదానికి కుప్పంలో చేస్తున్న అరాచకత్వమే నిలువెత్తు నిదర్శనమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.  అభివృద్ధి రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం జనాలకు వైసీపీ అరాచక రాజకీయం కొత్త అని పేర్కొన్నారు. తెలుగుదేశం నియోజకవర్గాల ఇన్ చార్జ్ తో సమీక్షలో భాగంగా గురువారం (అక్టోబర్27) కుప్పం నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే కుప్పంలో ఆయన సృష్టిస్తున్న అరాచకత్వాన్ని ఓ కేస్ స్టడీగా తీసుకుంటే సరిపోతుందన్నారు. కుప్పం ప్రజలు తనను అభిమానంతో గెలిపిస్తున్నారనీ.. తానెన్నడూ పులివెందులలోలా జనాలను భయపెట్టి ఓట్లు వేయించుకుకోవడం లేదనీ చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అదే పులివెందుల నియోజకవర్గం విషయానికి వస్తే.. ఆ నియోజకవర్గంలో నేతలు, పార్టీలు, గుర్తులు   మారాయని అన్నారు. కుప్పంలో తెలుగుదేశం నేతలను, కార్యకర్తలను… కేసులు, దాడులు, కుల విద్వేషాలతో   దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని…దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.   ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ నేతల లెక్క సరిచేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు తమను భయపెట్టలేదని…..పైగా అంతా ఇప్పుడు మరింత ఐక్యంగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు చెప్పారు.   ప్రభుత్వ పోకడలతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తెచ్చినా కుప్పంలో సిఎం సభ సక్సెస్ కాకపోవడానికి స్థానికంగా వచ్చిన వ్యతిరేకతే కారణం అని నేతలు వివరించారు. కుప్పం అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టని సీఎం… తన సభకు మాత్రం కోట్ల రూపాయలను వెచ్చించారని నేతలు తెలిపారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్.. కిషన్ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై టీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మునుగోడు ఓటమి కళ్లెదుట కనిపిస్తుండటంతో దిక్కుతోచక కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడితే శిక్షనుంచి తప్పించుకోవడం సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ కు ఆయన కుటుంబానికి అర్ధమైందని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ అల్లిన కథలో దొరికిన డబ్బు కేసీఆర్ ఫాం హౌస్ నుంచి వచ్చిందా? ప్రగతి భవన్ నుంచి వచ్చిందా ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్టు చేసిన నందకుమార్ తనకు సన్నిహితుండంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రిగా తాను పలు కార్యక్రమాలలో పాల్గొంటాననీ, ఆయా సందర్భాలలో ఎవరెవరో తనతో ఫొటోలు దిగుతుంటారని అన్న కిషన్ రెడ్డి.. నందకుమార్ తనతోనే కాదు.. జోగినపల్లి సంతోష్, హరీష్ రావులతో సహా పలువురితో నందకుమార్ ఫోలోటు ఉన్నాయనీ.. వారందరికీ కూడా నందకుమార్  సన్నిహితుడేనా అని ప్రశ్నించారు. ఇక ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కేసీఆర్ ను మించిన ఘనుడు లేడని కిషన్ రెడ్డి అన్నారు. స్వయంగా కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడే టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఇతర పార్టీల నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అన్నిటికీ మించి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు  మంత్రి పదవులు ఇచ్చిన ఘనుడు కేసీఆర్ ఆని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను ఏ పార్టీ టికెట్ పై గెలిచి ఏ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారో ఇంద్రకిరణ్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్లు ఇచ్చి కొనాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. అయినా అన్నేసి కోట్లు పోయడానికి బీజేపీకి స్తోమత లేదన్న కిషన్ రెడ్డి.. తమ పార్టీ సొంత విమానాలు కొనేంత ధనిక పార్టీ కాదన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో పోలీసుల తీరు కూడా దారుణంగా ఉందన్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో తమ పార్టీ అభ్యర్థి రఘునందనరావు నివాసంలో పోలీసులే డబ్బు పెట్టిన సంగతి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందనీ, నవంబర్ 6న కేసీఆర్ కు దిమ్మ తిరగడం తథ్యమని అన్నారు.   

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు.. ఆధారాల్లేవ్.. రిమాండ్ కు నో అన్న ఏసీబీ కోర్టు

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో నిందితుల  రిమాండ్ కు ఏసీబీ కోర్టు నో అంది. ఈ కేసులో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పోలీసులు కోరిన విధంగా ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావును బీజేపీలో చేరాల్సిందిగా.. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజి అనే వ్యక్తులు ప్రలోభపెట్టారని.. రోహిత్‌ రెడ్డికి రూ.100 కోట్ల డబ్బుఇవ్వజూపారన్న  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేసిన సంగతి విదితమే.   బుధవారం(అక్టోబర్ 26) రాత్రి వారిని అరెస్ట్ చేసి.. గురువారం(అక్టోబర్ 27) రాత్రి వరకు దాదాపు 24 గంటల పాటు విచారించారు. అనంతరం సరూర్‌నగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసానికి తీసుకెళ్లి.. ఆయన ఎదుట హాజరుపరిచారు.   ఈ కేసుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ము దొరకనందున.. దీనికి అవినీతి నిరోధక చట్టం   వర్తించదనీ   వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో.. నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిని పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన నిందితులు పూజల గురించి మాట్లాడేందుకే మొయినాబాద్ గెస్ట్ హౌస్ కు వెళ్లామని స్పష్టం చేశారు. నిజానికి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు నిందితులు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చారని ప్రచారం జరిగినా.. దానికి సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఓ కారులో రెండు బ్యాగులు లభ్యమైనప్పటికీ.. అందులో ఏమున్నాయో బయటకు చెప్పలేదు.  ఇక ఈ కేసుపై టీఆర్ఎస్ నేతలెవరూ మాట్లాడకూడదని కేటీఆర్ స్పష్టం చేయడంకూడా ఈ కేసు విషయంలో టీఆర్ఎస్ బ్యాక్ పుట్ వేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయ్యో అలీ... ఇంతా చేసి దక్కిన పదవి ఇదా?

అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ మూడున్నరేళ్లు అదిగో పదవి.. ఇదిగో పదవి అని ఊరించి ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా  నియమించారు.ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలెట్టి హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో  2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరాడు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలీకి రాజ్యసభ టికెట్ హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అలీకి పదవి దక్కలేదు.. సరికదా పార్టీలో ఆయన ఒకరు ఉన్నారన్న విషయమే ఎవరికీ తెలియదన్నట్లుగా అలీ పరిస్థితి తయారైంది. ఇప్పుడు పుణ్యకాలం దాదాపుగా పూర్తయిన తరువాత ఇక తప్పదన్నట్లు తనకు ఓ సలహాదారు పదవిని అప్పగించి జగన్ చేతులు దులుపుకోవడం పట్ల అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా మెలిగే వారు చెబుతున్నారు. రాజ్యసభ లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కావాలని కోరిన తనకు ఊరించి..ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టడం పట్ల అలీ సంతోషంగా లేరనీ, తాను కోరింది, కోరుకున్నది ఇలాంటి పదవి కాదని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. అలీలో అసంతృప్తి గూడకట్టుకుందన్న విషయాన్ని గమనించి ఏదో బుజ్జగించడానికే ఈ పదవి కట్టబెట్టారని అలీ చెబుతున్నారని ఆయన సన్నిహితులే అంటున్నారు. అయితే అయితే అలీ  బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కలేదు. ఏది ఏమైనా అలీకి సలహాదారు పదవిపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ నిజ్జంగానే అలీకి పదవి ఇచ్చారు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  అలీ ఇంటికి అల్లుడు వచ్చిన వేళా విశేషమో మరేమో కానీ,(ఈ మధ్యనే అలీ తమ కుమార్తె వివాహం చేశారు)ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు పదవి కట్టబెట్టారని జోకులేస్తున్నారు. నిజానికీ ,అలీ, పోసానీలతో పాటుగా మోహన్ బాబు ఫ్యామిలీ, పృధ్విరాజ్ గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్  చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు. అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం ఇంకా పార్టీని వదల కుండా  చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిచి మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు.  ఇప్పుడు ఇంత కాలానికి అలీకి ఓ పదవి కట్టబెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా.. అదేమీ అలీకి గుడ్ న్యూస్ కాదని అంటున్నారు. ఎందుకంటే.. రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రం నుంచి ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో అలీ పేరు ప్రముఖంగా వినిపించేది. సినీ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్‌ తదితరులతోపాటు అలీని కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా పిలిపించారు.  ఆ తర్వాత అలీ మీడియాతో మాట్లాడుతూ... ‘త్వరలోనే మంచి రోజు వస్తుంది’ అని   సీఎం స్వయంగా చెప్పారంటూ ఉబ్బితబ్బిబ్బైపోయాడు.  దీంతో అలీకి రాజ్యసభ స్థానం పక్కా అని అలీతో సహా అంతా భావించారు.  అది జరగలేదు. ఆ తర్వాత   అలీని మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రభుత్వం నుంచే లీకులు వచ్చాయి. అదీ జరగలేదు. చివరకు   ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా  మరో సలహాదారుగా అలీ కంటితుడుపుగా ఒక పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే  మీడియా సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ ఉండగానే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే కొత్త పోస్టును సృష్టించి దానిని అలీకి కట్టబెట్టారు జగన్. 

స్టాంప్ పేపర్లపై అమ్మాయిల వేలం..రాజస్థాన్ ను నిల‌దీసిన‌ ఎన్‌హెచ్‌ఆర్‌సి

బాలికలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, విదేశాలకు పంపి శారీరక వేధింపులు, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా రని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) తెలిపింది. రాష్ట్రంలోని  ఏకంగా ఆరు జిల్లాల్లో ఎనిమిది నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలికలను స్టాంప్ పేపర్‌పై వేలం వేస్తారనే నివేదికలపై ఎన్‌హెచ్‌ఆర్‌సి రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కమీషన్ ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి మీడియా నివేది కను సుమోటో గా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. రెండు పక్షాల మధ్య ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, రుణాలు మొద లైన వాటికి సంబంధించిన వివాదం ఉన్నప్పుడు, 8-18 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలను వేలం వేసి డబ్బు వసూలు చేస్తారు. ఈ బాలికలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, విదేశాలకు కూడా పంపించి శారీరక వేధింపులు, హింసలు, లైంగిక వేధిం పులకు గురిచేస్తున్నారు. మీడియా నివేదికలు అటువంటి నేరాలకు గురైన చాలా మంది బాధితుల కష్టాలను నమోదు చేశా యని, అవి నిజమైతే వారి మానవ హక్కుల ఉల్లంఘనకు సమానమని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. ఈ విషయంలో తీసుకున్న చర్యల నివేదికతో పాటు, ఇప్పటికే తీసుకున్న చర్యలు, లేని పక్షంలో అటువంటి నేరాలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు వివరణల‌తో కూడిన‌ నివేదికను కోరుతూ రాజస్థాన్ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసినట్లు హక్కుల కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో మానవ హక్కులు  బాలికలు, మహిళల గౌరవానికి భంగం కలిగించే కుల ఆధారిత వ్యవస్థను నిర్మూలించడానికి రాజ్యాంగ నిబం ధనలు లేదా పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ విధులను ఎలా నిర్ధారిస్తున్నదో కూడా నివేదిక లో ఉండాలని కమిషన్ పేర్కొంది. రాజస్థాన్ పోలీసు డైరెక్టర్ జనరల్ కూడా అటువంటి నేరానికి పాల్పడిన వారిపై మరియు వారి ప్రేరేపకులు/సానుభూతిపరులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ వివరణాత్మక నివేదికను సమర్పించాల్సిందిగా కోరబడింది. అలాంటి సంఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, ఛార్జిషీట్, అరెస్ట్, ఏదైనా ఉంటే, అలాగే రాష్ట్రంలో మాంసం వ్యాపారంలో క్రమబద్ధమైన నేరాలకు పాల్పడే వ్యక్తులను పట్టుకోవడానికి ప్రారంభించిన యంత్రాంగంతో సహా కేసుల స్థితిని కూడా ఇందులో కలిగి ఉండాలి. అటువంటి సంఘటనలను శాశ్వతంగా నివారించకుండా నిర్లక్ష్యం చేసినట్లు పేర్కొన్న పబ్లిక్ సర్వెంట్(ల)పై తీసుకో వలసిన చర్యలు లేదా ప్రతిపాదిత చర్యలు కూడా నివేదిక తప్పనిసరిగా పేర్కొనాలి. రాజస్థాన్‌లో ఇటువంటి నేరాలు జరుగుతు న్న ప్రాంతాలను సందర్శించి తనిఖీ చేయాలని, మూడు నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని తమ ప్రత్యేక రిపోర్టర్ ఉమేష్ కుమార్ శర్మను కోరినట్లు కమిషన్ తెలిపింది.  అక్టోబరు 26న ప్రసారమైన మీడియా కథనాన్ని ఉటంకిస్తూ కమిషన్ భిల్వాడలో మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు, వారు సమస్యల పరిష్కారం కోసం పోలీసుల వద్దకు వెళ్లకుండా కుల పంచాయితీని ఆశ్రయిస్తారు. అమ్మాయిలను బానిసలుగా మార్చడం దీనితో ఇది ప్రారంభమ‌వుతుంది, వాటిని విక్రయించకపోతే, వారి తల్లులపై అత్యా చారం చేయవలసి ఉంటుంది. రూ.15 లక్షల అప్పును తీర్చేందుకు, ఒక వ్యక్తి తన సోదరిని ముందుగా అమ్మాలని పంచాయితీ చేసిందని, ఆ తర్వాత కూడా అప్పు తీర్చకపోవడంతో, అతను తన 12 ఏళ్ల కుమార్తెను బలవంతంగా విక్రయించాడని నివేదిక పేర్కొంది. .కొనుగోలుదారు అమ్మాయిని రూ.8 లక్షలకు కొన్నాడు. ఆ తర్వాత, ఐదుగురు సోదరీమణులు బానిసలుగా మారారు, కానీ ఇప్పటికీ వారి తండ్రి తన రుణాన్ని తీర్చలేకపోయాడు. మరొక సంఘటనలో, ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మవలసి వచ్చింది. అతని భార్య చికిత్స కోసం రూ.6 లక్షలు అప్పుగా తీసుకు న్నాడు, ఆమె తరువాత మరణించింది. తన తల్లి చికిత్స కోసం మరో రూ.6 లక్షల అప్పు తీసుకున్నట్లు సమాచారం. అప్పు తీర్చడానికి, అతను తన చిన్న కుమార్తెను ఆగ్రాకు తీసుకెళ్లిన కొంతమందికి రూ.6 లక్షలకు విక్రయించాడు. మూడుసార్లు అమ్ముడుపోయి నాలుగుసార్లు గర్భవతి అయింది.  ఇంత దారుణ‌మ‌యిన ప‌రిస్థితులు ఉన్న‌పుడు రాష్ట్ర ప్ర‌బుత్వం, కేంద్ర హోంశాఖ‌లు ఏం చేస్తున్నాయ‌ని మాన‌వ‌హ‌క్కుల నాయ కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది చాలాకాలంనుంచి జ‌రుగుతున్న ఘోర‌మే అయినా పోలీసులు, అధికారులు నిర్ల‌క్ష్యం చేయ‌డంతోనే ప‌రిస్థితులు చేజారిపోతున్నాయ‌ని, మాన‌వ మ‌నుగ‌డ‌ను వెక్కిరిస్తున్న విషసంస్కృతిని నిలువ‌రించాల‌ని, ఈ ప్రాంతాల్లో క‌ఠి నాతి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తేనే ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉండ‌గ‌ల్గుతార‌ని అంటున్నారు. 

పాకిస్తాన్‌కు ఏమ‌యింది?...మ‌ళ్లీ చివ‌రి ప‌రుగు చివ‌రి బంతి.. ఓట‌మి!!

దుర‌దృష్టం వెన్నాడితే ఎవ‌రేమీ చేయ‌లేరు. ఈసారి టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్‌కు దుర‌దృష్టం వెన్నాడింది. మ‌రీ విచిత్ర‌మే మంటే చివ‌రి ఓవ‌ర్‌, చివ‌రి ప‌రుగు ద‌గ్గ‌రే బోర్లాప‌డుతోంది. ఇది క‌నీ వినీ ఎరుగ‌ని ఓట‌మి. మొన్న చేజారడం ఏదో దుర‌దృష్ట‌మ‌నే అనుకున్నారు. కానీ గురువారం జింబాబ్వే చేతిలో కూడా ఒక్క ప‌రుగుతోనే ఓట‌మి పాల‌వ‌డం, అదీ చివ‌రి ఓవ‌ర్ చివ‌రి మూడు బంతుల్లోనే అలా సేమ్ టు సేమ్ జ‌ర‌గ‌డం ఇంకా న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేదు. కానీ వాస్త‌వం. ప‌చ్చి నిజం, ఇది జ‌రిగింది. ప్రేక్ష‌కు లంతా ముఖ్యంగా పాక్ వీరాభిమానులు ఒక్క‌సారి గిల్లి మ‌రీ చూసుకున్నారు. నిజ‌మే యే క్యా హువా మ‌సూద్ బై..అనే అను కుంటున్నారింకా. పెర్త్‌లో జ‌రిగిన గ్రూప్ 2  సూప‌ర్ 12 మ్యాచ్‌లో ముందు బ్యాట్ చేసిన జింబాబ్వే 20 ఓవ‌ర్ల‌లో 130 ప‌రుగులు చేసింది. పాక్ బౌల‌ర్ల‌లో షాదాబ్ ఖాన్ 3, వాసిమ్ 4 వికెట్లు తీసుకున్నారు.   పాక్ జ‌ట్టులో జ‌మాజ‌ట్టీలున్నారు. ఈ 131 ప‌రుగుల‌ స్కోరెంత ఊదేస్తార‌నే అనుకున్నారు. నిజంగానే అంతే వేగంగా ప‌రుగులు సాధించారు. స్కోర్ బోర్డు ప‌రుగులు తీసింది. కానీ అప్పుడ‌ప్పుడూ వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. అయినా ల‌క్ష్యం ద‌గ్గ‌రయి ఇంకెంత ఇది భార‌త్‌తో కాదు జాంబాబ్వే మ‌రో క్ష‌ణంలో అయిపోతుంది. మ‌న‌వాళ్ల‌కు సంతోషం పంచుతున్నామ‌నే అనుకున్నా రు. కానీ అదుగో ఆ చివ‌రి రెండు ఓవ‌ర్లే కొంప ముంచాయి. మ‌ళ్లీ అదే కంగాళీ.  పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మ‌సూద్ ఒక్క‌డే అత్య‌ధికంగా 44 ప‌రుగులు చేయ‌గ‌లిగాడు. మిగ‌తా ఎవ్వ‌రూ 22 ప‌రుగుల‌కు మించి చేయ‌లేక‌పోవ‌డం జింబాబ్వే ఫీల్డింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను తెలియ‌జేస్తుంది. ముఖ్యంగా బ్రాడ్ ఇవాన్స్, సికింద‌ర్ ర‌జా వంటి  బౌల‌ర్లు ముప్ప‌తిప్ప‌లు పెట్టారు. మహ్మద్ రిజ్వాన్ (14), బాబర్ ఆజం(4), షాన్ మసూద్(44), ఇఫ్తికర్ అహ్మద్ (5), షదాబ్ ఖాన్ (17), హైదర్ అలీ(0), మహ్మద్ నవాజ్ (22), మహ్మద్ వసీం జూనియర్(12 నాటౌట్), షాషీన్ అఫ్రీది (1) ఊహించ‌ని విధంగా పెవిలియ‌న్ దారి ప‌ట్ట‌డం పాక్ అభిమానుల‌ను, స్టేడియంలో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆశ్య‌ర్య‌ ప‌రిచింది.  చివ‌రి  రెండు ఓవ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 22 ప‌రుగులు కావాలి. 19 ఓవ‌ర్లో 11 ప‌రుగులు చేశారు. చివ‌రి ఓవ‌ర్లో 11 ప‌రుగులు కొట్టాలి. మొదటి బంతికి 3 ప‌రుగులు చేశారు, 2వ బంతికి సిక్స్ బాదారు. 5వ బంతికి న‌వాజ్ క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. చివ‌రి బంతికి 3 ప‌రుగులు కావాలి. ఒక్క ప‌రుగు తీశాడు.. రెండో ప‌రుగు చేయ‌డంలో  షాహీన్ అఫ్రీదీ ర‌న్ అవుట్ అయ్యాడు. అంతే పాక్ శిబిరం దిగాలు ప‌డింది, జింబాబ్వే ఆనందానికి అంతే లేదు. ఊహించ‌ని విధంగా ఇలా పాకిస్తాన్ చివ‌రి ఓవ‌ర్లోనే మ‌ళ్లీ అదీ జింబాబ్వే చేతిలో ఓడిపోవ‌డం పాక్ అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

తొలి స్నానంతో తనువు చాలించాడు

ఒక్కపూట సరిగా స్నానం చేయకుంటే మహా చిరాగ్గా ఉంటుందిరా అబ్బాయ్ అంటాడు పెద్దాయన, అబ్బా ఈ పూట కాదులేమ్మా,, రేపు తలస్నానం చస్తాలే.. అంటుంది కూతురు.. కనీసం కాళ్లన్న కడు క్కుని వచ్చి తినరా అని  బతిమి లాడుతుంది కొడుకుని తల్లి.. ఇది చాలా రోటీన్.. కానీ 94 ఏళ్ల హాజీని అలా ఎవ్వరూ అడగలేదు, వేధించనూ లేదు. హాయిగా ఇన్నాళ్లూ ఒక్క మగ్గు నీళ్లు కూడా ఒంటిమీద పోసుకోకుండానే జీవించాడు. మొన్నీ మధ్యనే స్నానం చేశాడు.. అదే తొలి, ఆఖరి స్నానం అయిందా యనకి. స్నానం చేసిన కొన్ని నెలలకు మరణించాడు.  ఇరాన్ ఫార్స్ దక్షిణ ప్రాంతంలోని డెగ్జా  గ్రామంలో ఊరికి దూరంగా ఒక గుట్టమీద ఎవ్వరికీ పట్టని చిన్న ఇటుకల గూడు లాంటి దానిలో ఉండేవాడు. ఆయనకు  స్నానం  తెలియదు, బట్టలు  ఒంటి  మీద ఉన్నవే. దుస్తులతో పాటు  రెండు పొరల మేర మురికి పట్టి ఉండేవాడు. గత అరవయ్యేళ్లుగా  ఆయన స్నానం  చేయలేదంటే నమ్మండి. అందుకే ఆయన్ను అంతా లోకంలో అందరికంటే మురికి మనిషి అన్నారు.  ఆయన 60 యేళ్లుగా స్నానం చేయకపోవడానికి కారణం ఆయన యవ్వనంలో  ఏవో సంఘటనల కారణంగా నీళ్లు, సబ్బుతో స్నానం చేయడం మానేశాడని డెగ్జా గ్రామస్తులు చెబుతుంటారు. ఎవరన్నా బకెట్ నీళ్లు ఇచ్చినా నిరాకరించే వాడట. ఫలితంగా ఒళ్లంతా పుళ్లుతో దారుణంగా తయారయ్యాడు. హాజీకి సిగరెట్లు తాగడం అంటే యిష్టం. ఎవరయినా అటుగా వెళ్లినపుడు ఒక్కటిస్తే పారేసేవాడు.. కనీసం నాలుగయిదు ఒక్కసారిగా పీల్చేయడం యిష్టం. హాజీ ఉన్న ప్రాంతంలో దొరికే జంతు అవశేషాలు తినేవాడట, ఆకులు చుట్టి సిగెరెట్లా తాగేవాడట. 2014లో  ఒకసారి డెగ్జా గ్రామస్తులు కొందరు వెళ్లి మంచి ఆహారం, నీళ్లు ఇస్తే వాటిని చూసి భోరున ఏడ్చేశాడట.  శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించినా అతనికి దిగులు కమ్ముకుంటుందిట.  నిజంగానే అతని జీవితంలో ఏదో ఊహించని పెద్ద సంఘటనే అతన్ని ఈ స్థితికి తీసుకువచ్చిందని అంటారంతా. కానీ ఎవరూ అడిగే ధైర్యం చేయరు, ఎవర్నీ దగ్గరికి రానీయడు.  కానీ కొన్ని నెలల క్రితం గ్రామస్తులు బలవంతంగా  ఆయనకు స్నానం చేయించి, మంచి ఆహారం పెట్టి, మంచినీళ్లు తాగించారు. తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. గత  ఆదివారమే మరణిం చాడు. చిత్రంగా ఉంది కదూ.. అరవయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా స్నానం చేసిన ఆనందం లేదు.. అదే చివరి స్నానం అయింది. 

బయోపిక్ కాదు.. రియల్ పిక్.. రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మ తన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. బుధవారం(అక్టోబర్ 26) నాడు తాడేపల్లి ప్యాలెస్ లో ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం సినీ, రాజకీయ వర్గాలలో వెల్లువెత్తిన ఊహాగానాలను రామ్ గోపాల్ వర్మ గురువారం (అక్టోబర్ 27) ఫుల్ స్టాప్ పెట్టారు. తాను త్వరలో ఒక రాజకీయ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తేటతెల్లం చేశారు. పార్ట్ వన్ పార్ట్ టూగా రూపొందనున్న తన కొత్త సినిమా బయోపిక్ కాదనీ, అంతకు మించిన రియల్ పిక్ అనీ చెప్పారు. ఈ చిత్రానికి తనతో గతంలో వంగవీటి సినిమా నిర్మించిన దాసరి కిరణ్ దర్శకుడని వెల్లడించారు. ఈ సినిమా మొదటి భాగం టైటిల్ వ్యూహం అనీ రెండో భాగం టైటిల్ శపథం అనీ వెల్లడించారు. ఈ రెండు భాగాలలోనూ రాజకీయ, అరాచకాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లలో అహంకారానికి ఆశయానికీ మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన కథే వ్యూహం అని వివరించారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందనీ రాచకురుపుపై వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఉంటుందనీ వివరించారు. ఇక రెండో భాగం శపథం మరింత తీవ్రంగా ఎలక్ట్రిక్ షాక్ తగిలే లా ఉంటుందనీ రామ్ గోపాల్ వర్మ వివరించారు. వర్మ ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో బుధవారం(అక్టోబర్ 26) భేటీ అయిన సంగతి విదితమే. సీఎంతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రామ్ గోపాల్ వర్మ ఆ మరుసటి రోజే అంటే గురువారం (అక్టోబర్ 27)  రాజకీయ చిత్రం రూపొందించనున్నట్లు ప్రకటించి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. 2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ కు అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న చిత్రం విడుదల చేసిన సంగతి విదితమే. కాగా వర్మ తన రాజకీయ చిత్రం పై ఉహాగానాల నేపథ్యంలో బీజేపీ ఏపీ కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారమే (అక్టోబర్26) స్పందించారు. రామ్ గోపాల్ వర్మ వ్యక్తులనూ, పార్టీలనూ టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించారనీ, మరో సారి అదే చేయబోతున్నారనీ పేర్కొన్నారు. ఆయనను ఇటువంటి  సినిమాలు తీయాలని ప్రోత్సహించే వారికి రాజకీయాలలో హత్యలు ఉండవు... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న నానుడి అతికినట్టు సరిపోతుందని ట్వీట్ చేశారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై సిట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.   టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా భారీ ఆపరేషన్ జరిగిందంటూ వస్తున్న వార్తలపై, అధికార తెరాస చేస్తున్న ప్రచారంపై సిట్ తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తునకు  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ కోరింది. అలాగే ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ.. మొయినాబాద్ ఎపిసోడ్ లో జరిగిన పరిణామాలను గమనిస్తే తెలంగాణ పోలీసు శాఖ ఈ కేసు విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. ఈ కేసులో నిజానిజాలను వెలికి తీయాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని పేర్కొంది. కాగా బీజేపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.  

ఫామ్ లోకి వచ్చిన శర్మ, సూర్య... నెదర్లాండ్స్ పై భారత్ విజయం

ఇద్దరు సూపర్ స్టార్స్ రెచ్చిపోయి ఆడితే ఎలా ఉంటుందో నెదర్లాండ్ ప్లేయర్లకు, ప్రేఓకులకు తెలి సింది. చాలా రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శించాడు. మొన్న పాకిస్తాన్తో తలపడిన మ్యాచ్ లో త్వరలోనే పెవిలియన్ దారిపట్టిన కెప్టెన్ కొంత నిరాశ పరిచాడు. కానీ గురువారం నెదర్లాండ్ తో తలపడిన మ్యాచ్ లో తన పాత ఫామ్ లోకి తిరిగి వచ్చానని అభిమానులకు తన అర్ధసెంచరీ ఢమాకాతో తెలియజేశాడు. మరో వంక కింగ్ కోహ్లీ మళ్లీ తన డాషింగ్ ప్లేను ప్రదర్శించి మరో అర్ధ సెంచరీ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ  తన ఫామ్‌పై విమర్శలు చేసేవారికి ధీటుగా బదులి చ్చాడు. కెప్టెన్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో కూడా కింగ్ కోహ్లీ  44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్  పై గెలిచింది. ముందు బ్యాట్ చేసిన  భారత్  2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 179 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.  పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా గత వారం పాక్ తో తలపడిన టీమ్ నే నెదర్లాండ్ తో తలపడేందుకు దించారు. పాక్ తో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘన విజయాన్ని చ్చిన కింగ్ కోహ్లీకి నెదర్లాండ్ మ్యాచ్ కి రెస్ట్ ఇస్తారనే అనుకున్నారు. కానీ కోహ్లీ జట్టులో ఉండడమే కాకుండా మళ్లీ అదే ధాటి ప్రదర్శించి 44 పరుగుల చేయడంలో ప్రేక్షకులను అలరించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడటం భారత్ జట్టు వీరాభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.  సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.   గత మ్యాచ్ లో ఇద్దరి వైఫల్యం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కాగా, గురు వారం మ్యాచ్ లో  ఓపెనర్ కె.ఎల్. రాహుల్ ఊహించనివిధంగా వెనుదిరిగాడు.  తన వ్యక్తిగత స్కోర్ 9 పరుగుల వద్ద లెగ్ బిఫోర్ అయ్యాడు. అయితే ఏ మాత్రం రివ్యూ కోసం ఆగకుండా వెళిపోవడమే పెద్ద పొరపాటయిందనాలి. నిజానికి తర్వాతి క్షణంలో థర్డ్ అంపైర్ రివ్యూనిపరీక్షించగా అతను నాట్ అవుట్ అని తేలింది. కానీ అప్పటికే రాహుల్ వెళిపోయాడు. ఆ విధంగా రాహుల్ మంచి స్కోర్ చేసే అవకాశం కోల్పోయాడనాలి. నెదర్లాండ్ బౌలర్లను అతను సునాయాసంగా ఎదుర్కొనగలడన్న నమ్మకం కెప్టెన్ శర్మకీ  ఉంది గనుకనే రాహుల్ అలా వెళిపోవడం శర్మను ఆశ్చర్యపరిచింది.  180 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్, మాక్స్ డౌడ్ నిరాశ పరిచారు. వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. విక్రమ్ కేవలం ఒక్క పరుగు తీసి భువనేశ్వర్ కి దొరికి పోయాడు. అలాగే డౌడ్ కూడా 16 పరుగులు మించి చేయలేకపోయాడు. లెఫ్టీ అక్షర్ పటేల్కి చిక్కి పెవిలి యన్ దారి పట్టాడు. చూస్తుండగానే భారత్ భౌలర్ల ధాటికి నెదర్లాండ్ బ్యాటర్లు క్యూ కట్టడంతో  పది ఓవర్లకు 70 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.   18వ ఓవర్ చివరికి ఎట్టకేలకు వంద పరుగులు దాటింది. కానీ అప్పటికే 8 వికెట్లు కోల్పోయి విజయా వకాశాలు కోల్పోయింది. భారత్ యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ 18 వ ఓవర్లో చివరి రెండు బంతుల్లో  రెండు వికెట్ల తీశాడు. దీంతో 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధిస్తాడని మళ్లీ అతన్నే కెప్టెన్ బౌలింగ్ కి పిలిచాడు. కానీ హాట్రిక్ సాధించలేకపోయాడు.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో  అత్యధికంగా  టిమ్ ప్రింగ్లే 20 పరుగులు, షారి జ్ అహ్మద్ 16 పరుగులు చేశారు. షారిజ్, మెకరిన్ అజేయంగా నిలిచారు. 

కేసీఆర్ దెబ్బకు అమిత్ ఠా..!

తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంపై ప్రపంచంలోని తెలుగు వారంతా తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది బీజేపీ వ్యవహారమని తెరాస అగ్ర నేతలు ఆరోపిస్తుంటే.. కాదు కాదు.. ఇది గులాబీ బాస్ కేసీఆర్ ఫ్యామిలీ గారడీ అంటూ కమలం పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు దోషులు ఎవరనే అంశం సైడ్ అయిపోయింది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీకి మాత్రం.. ఈ కొనుగోలు వ్యవహారం తాలుకు గోల చాలా పెద్ద దెబ్బే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం.. మునుగోడు ఉప ఎన్నిక మీద స్పెషల్ ఎఫెక్ట్ చూపించినా.. చూపిస్తుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ ఉప ఎన్నికలో కారు... షికారు చేసే అవకాశాలు మెరుగయ్యాయని చెబుతున్నారు.  ఇందుకు   రీజన్‌తోపాటు రీజనింగ్‌ను సైతం వారు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ ఉప ఎన్నిక అనేది.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల వచ్చిందన్న సంగతి విదితమే. అయితే మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కమల తీర్థం పుచ్చుకొన్నారు. ఆ క్రమంలో ఇదే వేదికపై నుంచి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక తర్వాత.. తెలంగాణలో   ప్రభుత్వం రద్దు అవుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత.. ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో సైతం అమిత్ షా సమావేశమయ్యారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అంత తేలికగా తీసుకోలేదని   విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్పు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం..  అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి పోయి.. దాదాపు వారం రోజులు ఉన్నా.. ఆయన ఎవరితో భేటీ అయ్యారు, ఏం చేశారు అన్న వివరాలు బయటకు పొక్కలేదు. కానీ అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందంటూ వార్తలు గుప్పుమనడం.. ఆ క్రమంలో తెలంగాణలో ఈడీ సోదాలు సైతం నిర్వహించి.. బోయినపల్లి అభిషేక్ రావును ని అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లోనే గెలవడమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  సైతం తన సత్తా చాటింది. ఆ తర్వాత కేసీఆర్.. తన కేబినెట్‌లో నుంచి ఈటల రాజేందర్ తొలగించడంతో.. ఆయన కారు పార్టీకి రాజీనామా చేసి.. కాషాయం కండువా కప్పుకోవడంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఈటల గెలవడంతో... కేసీఆర్ కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని చర్చ సైతం కారు పార్టీలో జోరుగా సాగిందని గులాబీ పార్టీలోని కీలక నేతలు నేటికి చెబుతోంటారు.  ఇంకోవైపు హైదరాబాద్ విమోచన దినోత్సవం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే... ఈ ఎనిమిదేళ్లలో  అధికార టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఘనంగా నిర్వహించిన దాఖలాలు అయితే లేవని.. కానీ ఈ ఏడాది ఈ విమోచన దినోత్సవం వేడుకలను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పోటా పోటీ పడి మరీ నిర్వహించాయని వారు గుర్తు చేస్తున్నారు.  బీజేపీ వల్లే.. తెలంగాణలో కేసీఆర్ పార్టీ సైతం విమోచనా దినోత్సవం నిర్వహించిందనే ఓ భావన రాష్ట్ర ప్రజల్లోకి చాలా బలంగా వెళ్లిపోయిందని కారు పార్టీ అధినేత అండ్ కో పక్కాగా ఫిక్స్ అయిపోయినారని వారు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ మునుగోడు ఉప ఎన్నికల్లో.. బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందంటే.. కారు పార్టీ అధినేత కేసీఆర్‌ ఉక్కిరి బిక్కిరితోపాటు తీవ్ర అసహనానికి గురయ్యే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. అదీకాక.. ఇప్పటికే మునుగోడు వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తీవ్రంగా హార్ట్ చేశాయని వారు చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ తెరపైకి వచ్చి.. ఇంత రచ్చకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. కేంద్రంలో చక్రం తిప్పుతోన్నా హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు మాత్రం ఇది పెద్ద దెబ్బనని.. అందుకే కేసీఆర్ దెబ్బకు అమిత్ ఠా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై హస్తినలోని కమలదళం అధిష్టానం... ఏ మేరకు చర్యలు.. అదే ప్రతీకార చర్యలు తీసుకొంటోందనేది మాత్రం.. వేచి చూడాల్సిందేనని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు

క్రికెట్ అనగానే పురుషుల క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. టెండూల్కర్, ధోనీ, కింగ్ కోహ్లీల గురించే చర్చోప చర్చలు. కానీ మరో వంక మహిళల క్రికెట్ దేశంలో ఎంతో ముందడుగువేస్తోంది. అంతర్జాతీయ టోర్నీల్లో గొప్పగా రాణిస్తోంది. కానీ పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టును గౌరవించడం చాలా తక్కువే. కారణాలు అనేక చెబుతారు కానీ ఇటీవలి కాలంలో మహిళలూ అద్భుతంగా రాణిస్తున్నారు. 2017లో టీ20 ప్రపంచకప్ రన్నర్ అప్ నిలిచిన భారత్ అమ్మాయిలు 2020 లో ఫైనల్ చేరుకున్నారు. అలాగే ఈ ఏడాది కామన్ వెల్గ్ గేమ్స లో రజత పతకం అందుకున్నారు.  అన్ని విధాలా వారికి  ఆర్ధిక పరంగా ఎంతో మద్దతు నియ్యాలనే విషయమై ఎంతో కాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఈ అంశంలో మాజీలు కూడా బీసీసీఐ స్పందించాలనే సూచనలు చేశారు. మొత్తానికి  ఇప్పటికి  మహిళ క్రికెటర్లకు  మ్యాచ్ ఫీజు పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకుంది.  ఇక ఇప్పటి నుంచి మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటారు.  క్రికెటర్ల మధ్య  ఫీజుకు సంబంధించి చాలా కాలం నుంచి ఉన్న వ్యత్యాసాలను తొలగించాలనే నిర్ణయిం చుకున్నామని, బీసీసీ ఐతో కాంట్రాక్టులో ఉన్నవారికి ఈ లబ్ధి పొందే అవకాశం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.  బీసీసీఐ నిర్ణయం ప్రకారం మహిళా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్ కి 3 లక్షలూ మ్యాచ్ ఫీజు రూపంలో అందుకుంటారు. 2023 లో మహిళల ఐపి ఎల్ ఆరంభానికి ముందే బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం దేశంలో మహిళా క్రికెటర్లను ఎంతో ఉత్సాహపరుస్తుంది. 2017 మహిళల ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచినప్పటి నుంచీ దేశంలో మహిళా క్రికెట్ పట్ల అభిమానం, ఆసక్తి రెండింతలయింది. అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ పట్ల మొగ్గు చూపుతు న్నారు.  ఈ ఏడాదిలోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని న్యూజిలాండ్ లో మహిళా క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించింది. అక్కడ కూడా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు లభిస్తోంది. 

రెచ్చిపోయిన రూసో..దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లా చిత్తు

సిడ్నీలో గురువారం  జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్12 మ్యాచ్ దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాట్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 16 ఓవర్లలో కేవలం 101 పరుగులు చేసి వెనుదిరిగింది. మంచి ఫీల్డింగ్ సత్తా ఉన్న బంగ్లాదేశ్ ఊహించని విధంగా భారీ స్కోర్ సమర్పించుకోవడం, బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం కావడం ప్రేక్షకులు ఊహించలేదు. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేంత బ్యాటర్లు బంగ్లా జట్టులో లేకపోలేదు. కానీ చాలా పేలవంగా ఆడి మ్చాచ్ ను సమర్పించుకున్నారు.  దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రూసో బంగ్లాదేశ్ ఫీల్డర్లకు, బౌలర్లకు సింహస్వప్పంగా మారాడు. సిడ్నీలో భారీ సెంచరీతో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 56 బంతుల్లో రూసో 109 పరుగులు (14 ఫోర్లు) చేయడంతో దక్షిణాఫ్రికా 20  ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 205 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇదే అతని తొలి సెంచరీ. 16వ ఓవర్లో తొలి బంతిని సింగిల్ తీయడంలో సెంచరీ పూర్తి చేసిన ఆనందంలో గెంతులు వేశాడు, రూసో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. సిడ్నీ గ్రౌండ్లో  ఇంతటి టోర్నీలో సెంచరీ చేయడం అందునా 20 ఓవర్లో మ్యాచ్లో చేయడం అంత సులభం కాదు.  ఇంతకు ముందు భారత్ తో తలపడిన టీ20 సిరీస్ లో 48 బంతుల్లోనే సెంచరీ చేసి తన బ్యాటింగ్ సత్తాను భారత్ బౌలర్లకు తెలియజేశాడు. రూసోకి ధీటుగా మరో వంక డీ కాక్ కూడా రెచ్చిపోయి 38 బంతుల్లో 63 పరుగులు(11 ఫోర్లు) చేయడంలో తన బ్యాటింగ్ సత్తాను మరోసారి ప్రదర్శించాడు.

వెలిసిపోయిన కమలం!

పిల్లలు బాగా చదువుతామని తండ్రికి హామీ యిస్తారు, తప్పకుండా గెలపించాలని అభ్యర్ధులు తమ తమప్రాంతంలోని ఓటర్ల నుంచి హామీ తీసుకుంటారు, కానీ కేసులు లేకుండా చేస్తామని హామీ యివ్వడం మాత్రం బీజేపీవారివల్లే అయింది. ఇది కనీ వినీ ఎరుగని హామీ. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో అంశాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.  తమ పార్టీలో చేరండి అన్ని తామే చూసుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం. అందులోనూ వారికి ఎలాంటి క్రిమినల్ నేపథ్యం ఉన్నా తామే చూసుకుంటామనడం. ఇంతకంటే దారుణమైన హామీ ఎవరూ ఇవ్వరు.  అంటే తమ పార్టీ బలపడేందుకు, తమ విజయానికి ఎలాంటి వారినయినా గట్టి పట్టున్నవారని తెలిస్తే లాగేసుకోవడానికి ఇంతటి హామీలను ఇచ్చి అక్కున చేర్చుకోవాలనుకోవడం బీజేపీవారి గొప్ప ఆలోచన.  ఈమధ్యవరకూ మా పార్టీలో చేరండి మీకు ఏదో ఒక మేలు చేస్తామన్న ధీమా ఇచ్చేవారు. అంటే సామాన్యంగా అనుకు నేది.. ప్రభుత్వ కార్యాలయాల్లో తమవారికి ఉద్యోగాలో, ఏదో  ఒక పథకంలో భాగ స్వామి చేయడమో లేదా ఫ్రాజెక్టు కాంట్రాక్టులు లాంటివే.. కానీ రోజులు మారిపోయాయి. అంతే కోట్ల వ్యవ హారమే. అంతా డబ్బు మయం. కోట్లలో వస్తువుల్ని, భవనాల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేయడం అనేది కేవలం కమలనాథుల బుర్రలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. చిత్రమేమంటే ఇది భయానకమనో, ప్రజలు తమ రహస్యం తెలుసుకుంటే, బండారం బయటపడితే పోయేది తమ పరువేనన్న ఆలోచన, భయం లేకుండా ధైర్యంగా రహస్యంగా వ్యవహారం నడిపేయాలనే చూశారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న అంశాల్నీ భీజేపీ వారి నీతి నిజాయితీని నాలుగు రోడ్ల జంక్షన్లో పెట్టేసిం ది.  నిన్న మొన్నటి వరకూ టీఆర్ ఎస్ పరువు తీయడానికి ఒంటకాలి మీద లేచిన కమలనాథు లంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  తన వ్యూహం తననే ముంచిందనేది బీజేపీవారే రుజువు చేయడం పెద్ద  సినిమా కంటే అతి పెద్ద చిత్రమే చూపింది.  ఎరవేయడం నలుగురిని లాక్కనేందుకు వ్యూహ రచన చేసామని జబ్బలు చరుచు కోవడం, మునుగోడు ఉప ఎన్నిక ముందే టీ ఆర్ ఎస్ కొంపముంచేసేమని ఏసీ గదుల్లో కూచుని హాస్య మాడుకోవడం, గట్టిగా నవ్వుకోవడం అంతా ఆ గదులకే పరిమితమై అసలు రంగు బయటపడింది. కాషాయం బాగా వెలిసిపోయి హేమా హేమీ నాయకుల బుర్ర తక్కువ తనం ఆసేతు హిమాచలమూ తెలిసిపోయింది.  ఇక తమ పరువును తామే కాపాడుకోవాల్సిన పెద్ద పనిలో పడాల్సిన అగత్యం ఏర్పడిం ది. అధికారంలోకి రావడానికి వేసే వలలు టీ ఆర్ ఎస్ వ్యూహంతో ముక్కలయ్యాయి. చేపలు అను కున్నవారు చేపలు కాదని తమకు భవిష్యత్ అగమ్యగోచరం చేయగల టీ ఆర్ ఎస్ వీరాభిమాను లేనని తేటతెల్లమయింది.  ఇపుడు తెలంగాణా అంతా తమదే నని రొమ్ము విరుచుకు ప్రచారం చేసుకుంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కేంద్రంలోని వారి మహా నేతలకు మొహం ఎలా చూపగలరో మరి. వ్యూహానికి, అమలుకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా టీ ఆర్ ఎస్ వీరాభిమానులను అంత సులువుగా చేపల్లా లాగేసుకునే ఆలోచన బీజేపీ వారికి పెద్ద బూమరాంగ్ అయింది.  ఇక తెలంగాణ  బీజేపీ మహానేతలు దేశ  తెలంగాణా ప్రజలకు, తమని నమ్ముకుని జండా పట్టుకు తిరుగుతున్నవారికీ సమాధానం చెప్పుకోవాలి. 

బాలినేని.. వైవీ సుబ్బారెడ్డి.. ఢీ అంటే ఢీ

ఒకరు స్వయానా ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మరొకరు మామ.. అంతేకాదు.. వీరిద్దరూ బావ బామ్మర్దులు.. జగన్ కుడి ఎడమ భుజాలుగా ఉంటారు. ఇప్పుడు వీరు ఢీ అంటే ఢీ అంటున్నారు.  వీరిలో ఒకరు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మరొకరు ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇరువురూ వైసీపీలో కీలక నేతలు. ఇటీవలి కాలం వరకూ కలిసి ఉన్న వీరు.. ఇప్పుడు కస్సు బుస్సు అంటున్నారట. వైవీఎస్- బాలినేని తీరుతో జగనన్నకు తల బొప్పికట్టిందని, ఇరువురి మధ్యా విభేదాలు కార్యకర్తలను ఇరకాటంలో పడేశాయని అంటున్నారు. తాజాగా ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించే విషయంలో వీరి మధ్య విభేదాలు బట్టబయలయ్యాయన్నారు. రాజకీయంగా తొలుత కలిసి ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య తర్వాత మనస్పర్థలు పెరిగిపోయాయి. క్రమేపీ పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరి అనుచరులు కూడా అందుకు భిన్నంగా లేరంటున్నారు. చివరికి కుటుంబ వేడుకలో, దేవుడి కార్యక్రమం శ్రీనివాస కల్యాణం ఏర్పాటు విషయంలోనూ వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికిచినికి గాలివానలా మారి వ్యవహారం జగన్ దాకా వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మనవడి పుట్టినరోజు నవంబరు 9. ఆ సందర్భంగా అదే రోజు ఒంగోలులో శ్రీనివాస కల్యాణం జరిపించాలనుకున్నారు. నిబంధనల ప్రకారం 3 నెలల ముందే టీటీడీకి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తు చేశారు. ఈఓ ధర్మారెడ్డి ఆయనకు సన్నిహితుడు కావడంతో అనుమతి తొందరగానే లభించింది. బాలినేని ఆ వెంటనే స్వామి దర్శనానికి వెళ్లి అనుమతి పత్రాలు అందుకున్నారు. 9న ఒంగోలులో ప్రజల శ్రేయస్సు కోసం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 50 వేల మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదంటూ.. శ్రీనివాస కల్యాణం నిర్వహణకు సహకరించలేమంటూ కొద్ది రోజుల కిందట టీటీడీ అధికారుల నుంచి బాలినేనికి సమాచారం వచ్చిందట. టీటీడీ చైర్మన్ ను సంప్రదించలేదనీ.. కనీసం పాలకమండలికైనా లేఖ పంపలేదనే సాకుతో అనుమతులు నిలిపేశారట. దీంతో బాలినేనికి కోపం వచ్చింది. ఇచ్చిన అనుమతులు ఎలా రద్దుచేస్తారని బాలినేని ప్రశ్నించారట. అయినా చైర్మన్ ని కాదని ఎవరూ సమాధానం చెప్పలేదట. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సీఎంను కలిసిన  బాలినేని  సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తన మనవడి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, వైవీ జోక్యంతోనే ఇదంతా జరిగిందని ఆరోపించినట్లు సమాచారం. తాను కూడా చాలా అడ్డంకులు సృష్టించగలనని, సీఎం సూచనలతో సర్దుకుపోతున్నానని చెప్పారని తెలిసింది. బాలినేని ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తర్వాత వైవీని పిలిపించి జగన్ మాట్లాడారు. ఒంగోలులో శ్రీనివాస కల్యాణం నిర్వహణకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇంతలో బాలినేని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లడంతో వివాదం ముదిరిందని, ఒంగోలులో శ్రీనివాస కల్యాణం ఇక లేనట్లే అని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీనివాస కల్యాణం నిర్వహణకు టీటీడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. జగన్ జోక్యం చేసుకుని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను బాలినేనికి కేటాయించి... ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీకి అప్పగించారు. అయినా ఇద్దరూ కలవకపోగా పంతాలకు పోయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండడం గమనార్హం.

తనవారి కోసమే... త్యాగధనుడు

నా యావదాస్తి మా నాన్నగారి పేరునున్న ట్రస్ట్ కి ఇచ్చేస్తున్నాను.. పేదలకు దాన్ని వినియోగించండి .. అంటూ పాత సినిమాల్లో హీరోగారు భారీ డైలాగుతో నగరంవేపు అడుగులు వేస్తాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం  ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో ధర్మల్ ప్రాజెక్టులో  యూనిట్ నే  ప్రైవేటువారి చేతుల్లో పెట్టి అందర్నీ ఆకాశంవంక చూడమన్నాడు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న కృష్ణపట్నం విద్యు త్ ప్లాంటును ప్రయివేటుకి అంకితం చేయడానికి పూనుకున్నారు.  నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం జెన్కో అందరికి తెలిసిందే. జిల్లాలోని ముత్తుకూరు మండలం నేలటూరు వద్ద  సుమారు 1500 వందల ఎకరాల్లో ఏర్పాటు చేసిన మొట్ట మొద టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. 2006 అప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 800 ×800 మెగావాట్లతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీద జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2015లో చంద్రబాబు హయాంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభించారు. ఇందులో సుమారు 18వందల మంది పనిచేస్తున్నారు. దీని తర్వాత వచ్చినవి సెంబ్ కార్బ్ గాయత్రి, ఎన్ సిసి అనే రెండు ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  కాగా టీడీపీ హయాంలో అనుమతి పొందిన మూడో యూనిట్ ను ఇటీవల జెన్కో ను నష్టాల నుంచి బయటపడేసేం దుకు అని కారణం చెబుతూ 25 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జగన్ సర్కార్ జీవో విడుదల చేసింది. వాస్తవానికి ఇది ఇటీవలి వరకూ బాగానే పనిచేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్గూ జెన్కో ఉద్యోగులు, కార్మికులు పది నెలలుగా నిరసనలు చేపడుతున్నారు.  మూడో యూనిట్ కూడా అందుబాటులోకి రావడం 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడంతో మరి కొందరికి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశించిన స్థానికుల ఆనందం ఆవిరైపోయింది.  నష్టాల సాకుతో జెన్కో ఉద్యోగులను నమ్మించే ప్రయత్నాలు చేస్తూ జగన్ తనకు సన్నిహితులయిన వారి ప్రయివేటు సంస్థ నెల్లూరు జిల్లా లోని దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ ప్లాంటును కట్టబెట్టే యత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, అసలు  కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని ప్రయివేటుకు లీజు విష యంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగులు, భూములిచ్చిన నిర్వాసితుల ఆధ్వ ర్యంలో ఉద్యమిస్తున్నారు. కానీ లీజు ప్రకటనకు అనుగుణంగా ఈ నెల 30న టెండర్లకు పిలుపు నిచ్చింది ప్రభుత్వం. సామర్ధ్యం కలిగిన ఇంజనీరింగ్ సిబ్బంది, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఉండి కూడా సంస్థను ప్రయివేటు పరం చేయడం కేవలం రాజకీయ స్వార్ధం కోసమే తీసుకున్న నిర్ణయమనాలి. సవ్యంగా నడిచేవాటిని కూడా ఎందుకు పనికి రావని చూపించి తన ప్రభుత్వ హయాంలో ఇంతటివి ఉండడాన్ని తానే ప్రచారం చేసుకోవడం విని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదేమీ జగనన్నా.. నువ్వే అలా చేస్తే ఎలా అనుకుంటున్నారు.  ఉత్పత్తి సరిగా లేని యూనిట్లను వాటిలో పనిచేసేవారిని ఉత్సాహపరిచి దాన్ని కూడా మంచి ఉత్పత్తి సాధించే దిశగా దిశా నిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి ఏకంగా ప్రయివేటువారికి ధారాదత్తం చేయడం దుర్మార్గమనే ఉద్యోగులు అంటున్నారు.  ప్రబుత్వానికే యూనిట్ లో పనిచేసే సిబ్బందిపట్ల నమ్మకం లేకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రబుత్వం నుండి తగిన మద్దతు లేకపో వడం పట్ల ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేవలం తన వారిని ఆదుకోవ డానికే జగన్ ప్రయివేటు పరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం దారుణం.  అయితే సామర్థ్యం కలిగిన ఇంజనీరింగ్ సిబ్బంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కారణంగా ఈ ప్లాంటు ఇతర ప్రైవేటు ప్లాంట్లతో పోటీ పడుతూనే ఉంది. అయినా సంస్థను నష్టాలలో ఉన్నట్లుగా చూపుతూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం తహతహలాడుతుండటం ఇప్పుడు సర్వత్ర విమర్శలకు తావిస్తుంది.  కర్మాగారం నిర్మించేప్పుడు ఇక్కడి నిర్వశితులను ఇతర ప్రాంతాలకు తరలి స్తామని, కుటుంబంలొ ఒకరికి ఉధ్యోగం ఇస్తామన్న హామీలు ఏమాత్రం ప్రభుత్వం నెరవేర్చక పోయినా తమ ప్రాంతంలొ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఏదోక రోజు తమ పిల్లలు చదువుకోని ఇక్కడ ఉద్యోగాలు సంపాదించు కుంటారన్న దీమాతొ ఉన్నామని ఇప్పడు పరిశ్రమ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వేళ్ళి పోతె తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారు ఇక్కడి ప్రజలు. ఎట్టి పరిస్థితుల్లో విద్యూత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వమంటు ఉద్యమబాట పడుతు న్నారు. ఎపి ప్రజలు మాత్రం వాటమ్మా వాటీజ్ దిస్ అమ్మా అంటూ ముక్కున వేలెసుకుంటున్నారు.