కాశ్మీర్ వద్దు కోహ్లీని ఇచ్చేయండి చాలు.. సామాజిక మాద్యమంలో వైరల్ అవుతున్న పోస్టు

భాతర్, పాకిస్థాన్ ల మధ్య వైరుద్ధ్యాలకూ, నిత్య ఘర్షణలకూ, దౌత్య సంబంధాలే కాదు, క్రీడా సంబంధాలూ తెగిపోవడానికి ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్. ఇరు దేశాల మధ్యా దేశ విభజన నాటి నుంచీ జమ్మూ కాశ్మీర్ అంశం ఒక్కటే పెద్ద సమస్యగా ఉన్న సంగతి విదితమే. ఇరు దేశాల మధ్యా కాశ్మీర్ కోసమే ఇరు దేశాల మధ్యా కార్గిల్ సహా మూడు యుద్ధాలు జరిగాయి.  ఇప్పటికీ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడుతోందంటే అందుకు కారణం కాశ్మీరే. నిత్యం కాశ్మీర్ కోసం పోరాడే పాకిస్థాన్ నుంచి ఇప్పుడు కొందరు మాకు కాశ్మీర్ అవసరం లేదంటున్నారు. కాశ్మీర్ కు బదులుగా విరాట్ కోహ్లీని ఇచ్చేయండి చాలు అంటూ ప్రతిపాదిస్తున్నారు. విషయమేమిటో అర్ధమైపోయింది కదా.. కింగ్ కోహ్లీకి భారత్ లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ లోనూ కోహ్లీని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువే. టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం(అక్టోబర్23) జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వీరవిహారం క్రికెట్ అభిమానులందరినీ ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో   160 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు.  31 పరుగులకే  నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి ఓటమి అంచున నిలిచిన  టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో ఆదుకుని గెలిపించాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ.. ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో దేశంలోనే కాదు ప్రపంచ మంతటా క్రికెట్ అభిమానులు కోహ్లీకి నిరాజనాలు పట్టారు. పాకిస్థాన్ లో సైతం కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.   పాకిస్థాన్ లో   కోహ్లీపై అభిమానం వారి దేశ భక్తిని సైతం మించి పోయింది. అందుకే కోహ్లీ ఉంటే చాలు.. కాశ్మీర్ ఎందుకు మాకు అంటున్నారు. అంది ఎంత వరకూ వెళ్లిందంటే.. కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయిన ఓ బ్యానర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ బ్యానర్ ఇప్పటిది కాదు.. కానీ టైమ్లీగా కోహ్లీ ఫ్యాన్స్ నాటి బ్యానర్ ను ఇప్పుడు మరో సారి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే కాదు.. ఇది జరిగే పని కాదు.. విరాట్ ను ఇవ్వడం జరిగే పని కాదంటూ కౌంటర్ కూడా సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది.  

కాంగ్రెస్ కోటను ఖర్గే కాచుకుంటారా?

గెలవంగానే సరిపోదు ముందుంది ముసళ్ల పండగ అన్నాడు పూర్వం ఒక పంచాయితీ ఎన్నికల్లో ఓడినాయన.  కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికయినంత మాత్రాన పార్టీలో అన్నీ తానై చేసేదాని కంటే మేడమ్ గారి మాట వింటూ  వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి వస్తుందేగాని తన బుర్రపెట్టి అడుగు ముందుకు వేయడానికి అంతగా అవకాశం ఉండదని ఖర్గే గెలిచిన తర్వాత రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇందులో నిజానిజాలు, వాస్తవాలు ఎంత ఉన్నప్పటికీ, త్వరలో రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్ని కల్లో పార్టీని గెలిపించాల్సిన అత్యవసర బాద్యత ఖర్గే నెత్తిన పడింది. పదవిలోకి రాగానే కాస్తంత విశ్రాం తికి తావు లేకుండా ముంచుకువస్తున్న ఎన్నికలు ఖర్గే నాయకత్వ పటిమను  పరీక్షిస్తాయన్నది వాస్తవం. వీటి కంటే  ఆ తర్వాత 2024 ఎన్నికలు పార్టీకి దేశంలో ప్రతిష్టను నిలబెట్టే పని మాత్రం పూర్తిగా బాధ్యతవహించాల్సి వస్తుంది. ఏది ఎటువచ్చినా రాయి పడేది మాత్రం పార్టీ అధ్యక్షునిగా ఖర్గే మీదే మరి.  గతవారం పార్టీ ఎన్నికలో గెలిచి సోనియా నుంచి సర్టిఫికెట్ తీసుకోవడంతో పూర్తి బాధ్యతలు స్వీకరిం చినట్లయింది. ఇక 80 ఏళ్ల కర్ణాటకా కి చెందిన ఈ సీనియర్ నాయకుడికి పరీక్షలు చాలానే ఉన్నాయి. వాటిలో తన పంథాలో ముందుకు నడుస్తారో, అనాదిగా వస్తున్న రబ్బర్ స్టాంప్ పరంపరనే అనుసరిస్తారో చూడాలి. కానీ గాంధీ కుటుంబేతర వ్యక్తి గా పార్టీ పగ్గాలు చేపట్టినందుకు దాదాపు పార్టీలో సీనియర్లు, యువ నాయకుల మద్దతు ఉంటుంది. అయితే ఆ పదవి ఆయన్ను వెదుక్కుంటూ వచ్చిం దని, తన సత్తాతో ఖర్గే నిరూపించుకోవాల్సి ఉంది.  ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లను పూర్తిగా తమ పార్టీ వేపు మొగ్గుచూపేలా చేయడం అన్నది చిన్నపాటి టాస్క్ కాదు. నవంబర్ 12న జరిగే ఎన్నికల్లో ఆయన సత్తాను హిమాచల్ ఓటరు కాంగ్రెస్ నుంచి దూరం కాకుండా చూసుకోవాలి. నిన్నటి వరకూ సోనియా గాంధీని అభిమానించి ఓటువేస్తు న్నవారు ఇపుడు ఖర్గేను చూసి వేస్తారా అనేది కొంత అనుమానం. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో గాంధీ కుటుంబం మీదనే పార్టీ నడుస్తున్నది. అదే భావన ప్రజల్లో కొనసాగుతోంది. కనుక ఆ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు పట్టగానే వారు వెంటనే సరేననే స్తారనీ అనుకోలేము. ఇలాగే గుజరాత్ కూడా ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇది ప్రధాని మోదీ స్వరాష్ట్రం.  ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించుకోగలగితే ఖర్గే మొనగా డనే అనిపించుకుంటారు. ఇక్కడ బీజేపీకి బలం తగ్గిందనే అభిప్రా యాలూ ఉన్నాయి గనుక కాంగ్రెస్కు అవకాశాలు ఉండవచ్చు. డిసెంబర్లో ఫలితాలు వచ్చేవరకూ ఓటరు మనసులో మాట తెలియదు. ఇక 2023లో ఖర్గేకు అసలు సిసలు పరీక్ష ఉంది. అప్పుడు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కూడా ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.  మరోవంక ఈ కీలక ఎన్నికలు లెక్కలోకి తీసుకునే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్న అభి ప్రాయాలూ ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఖర్గే పట్టినప్పటికీ తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ గెలిచేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడు తుందన్న అభిప్రాయాలే వినపడుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతరుల్లో ముందుగా సీతారామ్ కేసరి ఉన్నారు. 1998లో పదవి నుంచి ఆయన్ను  తొలగించి సోనియా గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్నారు.  ఇక ఇప్పుడు ఖర్గే చేపట్టారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెగడంతో కాంగ్రెస్ పట్టు తప్పుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇఫుడు ఖర్గే తలకు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కూడా పట్టుకుంది. గాంధీ కుటుం బేతరునిగా ఆయన పార్టీ పగ్గాలు పట్టుకున్నంత మాత్రాన అంత సులువుగా జరిగిపోతాయన్నది ఊహించడమూ కష్టమే.

సునీతకు టీడీపీ నుంచి మద్దతు

డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి.. పులివెందులలోని తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.  మాజీ ముఖ్యమంత్రి, దివంగత   వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకా హత్య జరిగి మూడున్నరేళ్లు ముగిసిపోయింది. అయినప్పటికీ వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టడంలో ఏపీ పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సీబీఐకి కేసు అప్పగిస్తే.. ఆ సీబీఐ విచారణ అధికారులకు బెదిరింపులే కాకుండా తిరిగి అధికారుల పైనే కేసులు పెడుతున్నపరిస్థితి. ఒక పక్కన తండ్రి హంతకులకు, వారిని పురిగొల్పిన వారికి శిక్షలు పడలేదు. ఇంకో పక్కన సీఎంగా ఉన్న  జగన్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందని పరిస్థితి. దీంతో వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత స్వయంగా రంగంలో దిగారు. తండ్రి హత్య కేసు త్వరగా తేల్చేలా చూడమని ముఖ్యమంత్రి అన్నయ్యను అర్థించారు. ఫలితం లేకపోవడంతో కోర్టులను ఆశ్రయించారు. ఏదైతేనేం సీబీఐ విచారణ ముందుకు సాగేలా చేశారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి, ఇచ్చిన వాంగ్మూలంతో మరికొందరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఐ విచారణ ఏపీలో కొనసాగితే వివేకా హత్య కేసులో న్యాయం జరగదని, ఇంకా ఆలస్యం అవుతుందని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో వివేకా కుమార్తె సునీతారెడ్డికి టీడీపీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన వెంటనే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తన తండ్రిని ఎవరు చంపారో కనీసం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని, కన్న కూతురిగా తన బాధ్యత అని వివేకా కుమార్తె సునీతారెడ్డి వీరోచితంగా పోరాడారు అని చంద్రబాబు నాయుడు అభినందించారు. తండ్రి వివేకా హత్య కేసును త్వరగా తేల్చాలని అన్న జగన్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదని, దాంతో సునీత హైకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ జరిగేలా కష్టపడ్డారన్నారు.  కానీ ఆ సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. చివరికి హైకోర్టుకు వెళ్లి సీబీఐ అధికారులే బెయిల్ తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను బెదించేదాకా పరిస్థితి వచ్చిందన్నారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ  నేత బీటెక్ రవి కూడా సునీతకు మద్దతుగా నిలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడమంటే.. వైసీపీ సర్కార్ ను అభిశంసించినట్లే అన్నారు. వివేకా కేసులో నిందితులకు సీఎం జగన్ మద్దతుగా ఉండడం వల్లే మరో రాష్ట్రానికి సీబీఐ విచారణ బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. నిందితులకు శిక్ష పడాలని, సునీతకు న్యాయం జరగాలని అన్నారు. వివేకా హత్య ఎలా జరిగిందనేది సాక్ష్యాధారాలతో ఏడాదికో ఏడాదిన్నరకో సీబీఐ చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డికి హత్య జరిగిన రోజే ఎలా తెలిసిందని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకా హత్య ఎలా జరిగింది.. ఎలా చేశారు? ఎందుకు చేశారనే విషయాలు జగన్ కు తెలుసు అన్నారు. వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత ఒక్కరే పోరాడుతున్నారంటూ విజయవాడకు చెందిన టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆమె పట్ల సానుభూతి చూపించారు. జగన్ రెడ్డి స్వార్థం కోసం వివేకా హత్య జరిగిందని జలీల్ ఖాన్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. అడ్డు తొలగించుకోవడం కోసం తన ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డి హత్య చేశారని స్పష్టంగా పేర్కొనడంతో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసుపై జగన్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. సీఎం స్థానంలో ఉన్న జగన్.. అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిమ్మల ప్రశ్నించారు. ప్రధాన నిందితుడిని జగన్ రెడ్డి తన అధికారాన్ని వినియోగించి రక్షించేందుకు చేసిన బాగోతం సీబీఐ చార్జిషీట్ ద్వారా వెలుగు చూసినందున సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బాబర్ , కెప్టెన్సీ రాకుంటే దిగిపో... సలీంమాలిక్ 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూపర్12కి చేరుకున్న పాకిస్తాన్, భారత్ మొన్న ఆాదివారం తలపడిన సంగతి తెలిసిందే. అందులో ఊహించనివిధంగా భారత్ సూపర్ స్టార్ కింగ్ కోహ్లీ ఒక్కడే వీరోచిత బ్యాటింగ్ ప్రధర్శనతో భారత్ చివరి ఓవర్లో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా గెలవాల్సిన మ్యాచ్ ని భారత్ కు అలా అప్పగించావని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్నారు. కెప్టెన్సీ రాకుంటే వదిలేయమని సలీం మాలిక్ వంటి మాజీలు సూచించారు. అసలు కెప్టెన్ గా జట్టును అవసరమై సమయంలో ధైర్యాన్నిస్తూ ముందుకు నడపడంలో ఘోరంగా విఫలమయ్యావంటూ బాబర్ అజామ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ మండిపడ్డాడు. 160 పరుగుల టార్గెట్ భారత్ అవలీలగా కొట్టేయగలదు. అయినా మంచి అవకాశం వచ్చినపుడు దాన్ని అనుకూలం చేసుకోలేకపోవడమేమిటని మాలిక్ ప్రశ్నించాడు. బౌలర్లను ఉత్సాహపరచకపోవడమే దారుణమన్నాడు. అసలు ప్రపంచకప్ పోటీకి సారధ్యం వహించే సత్తా ఏమాత్రం ప్రదర్శించలేదని, నాయకత్వం చేపట్టలేనపుడు తప్పుకోవడమే మేలని మాలిక్ సూచన చేశాడు.  బౌలింగ్, బ్యాటింగ్ పరంగానూ కెప్టెన్ విఫలం కావడంతోపాటు కనీసం జట్టును గెలిచే దిశలో ఉత్సాహ పరచక చతికిలపడ్డాడని ఇప్పటికే అతని మీద మీడియా కూడా విరుచుకుపడుతోంది. ఎంతో పోటా పోటీగా జరిగిన మ్యాచ్ లో చివరి దశలో పేలవ ప్రదర్శన  పాక్ అభిమానులను దెబ్బతీసింది. దీనికి తోడు కింగ్ కోహ్లీని నిలువరించలేకపోవడం పాక్ బౌలింగ్ స్థాయిని మరోసారి బయటపెట్టింది. వారి సూపర్ స్టార్ యువ పేసర్ అఫ్రిదీ కూడా ఏమాత్రం ప్రభావం చూపకపోవడమే జట్టును, పాక్ అభిమాను లను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.   ఎంతో ఉత్కంఠభరితంగా జరిగన మ్యాచ్ లో  కోహ్లీ ఎంతో సమయస్పూర్తితో ఆడుతూ, ఎంతో సహనం ప్రదర్శిస్తూ ఆడాడని పాక్ జట్టు ప్రశంసించింది. అయితే మరో వంక బాబర్ అజామ్ కెప్టెన్ గా ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని పట్టుకోలేకపోయాడని, తప్పుడు నిర్ణయాలతో గెలవాల్సిన మ్యాచ్ ని వదిలేయ డమేమిటని మాలిక్ మండిపడ్డాడు. యువ ప్లేయర్ వి సమర్ధుడవని కెప్టెన్సీ ఇచ్చారు, సీనియర్లు లేక కాదని, అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం దారుణమ న్నాడు.  దీనికంటే జట్టు నాయకత్వం వదులుకోవడమే మేలని సలీం మాలిక్ సూచించాడు.

డాన్స్ పాల్ డాన్స్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తార స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు చతురంగ బలాలను రంగంలోకి దింపి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణల పర్వం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇతా మునుగోడులో వాతావరణం హీటెక్కింది. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై దాడి యత్నం జరిగింది. కాంగ్రెస్ ప్రచార సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇలా ఒకటేమిటి ప్రతి రోజూ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రతి రోజూ నియోజకవర్గానికి తరలుతున్న సోమ్ము కోట్లలో పట్టుబడుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్ని 24 గంటల వ్యవధిలో మూడు సార్లు తనిఖీ చేశారు.  అయితే ఇంతటి ఉద్రిక్తతల్లోనూ, ఇంతటి సీరియస్ వాతావరణంలోనూ ఓ వ్యక్తి ప్రచారం మాత్రం నియోజకవర్గ ప్రజలకు కామెడీ పంచుతోంది. వారిని కడుపుబ్బా నవ్విస్తోంది. వినోదాన్ని అందిస్తోంది. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నిక రంగంలోకి దిగారు. అసలు ఆ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో గద్దర్ పోటీకి సుముఖత చూపకపోవడంతో పాల్ స్వయంగా తానే బరిలోకి దిగారు.  అయితే ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేని కారణంగా పాల్ మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.   తనకు ఓటేసి గెలిపించాలంటూ కేఏ పాల్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. చివరాఖరికి బీజేపీ అభ్యర్థ కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డిని కూడా కలిసి తనకే ఓటేయాల్సిందిగా అభ్యర్థించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తన ప్రాచారంలో తీన్ మార్ డ్యాన్సులతో ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారు. ఓ జానపద పాటకు పాల్ డాన్సు చేస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో తెర వైరల్ అవుతోంది. తన డాన్స్ తో, హావభావాలతో పాల్ మునుగోడు ప్రజలకు వినోదం పంచారు. అంతేనా ప్రచారంలో భాగంగా ఒక సెలూన్ లోకి వెళ్లి అక్కడ హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. దీపావళి సందర్బంగా పాల్ ఓటర్లకు మిఠాయిలు పంచారు.  మునుగోడు ఉప ఎన్నికల బరిలో పాల్ నిలలబడకపోయి ఉంటే గొప్ప వినోదాన్ని మిస్ అయి ఉండేవాళ్లమని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల ప్రచారం కంటే పాల్ ప్రచారమే బహు పసందుగా ఉందని సెటైర్లు వేసుకుంటున్నారు.

వీటి గతి  ఇంతేనా..!

అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలే ప్రజలు కోరుకుంటాయి. పేదలను ఆదుకునే నాయకుడినే ప్రజలు కోరుకుంటారు. ప్రజోపయోగ పనులు చేస్తుంటేనే ప్రజలు నాయకుడిని, ముఖ్యమంత్రినీ, పార్టీనీ అభిమానిస్తారు. అలాగాకుండా కేవలం తమ స్వార్ధం కోసం కేవలం ప్రకటనలు, ప్రమాణాలకు పరిమిత మయితే ప్రజలు ఏమాత్రం సహించరు. పేదలకు కూడా నివాసం ఉండాలని, వారిని ఆదుకోవాలన్న ఆలోచన మంచిదే . వారికీ ఇళ్లు కట్టించే ప్రయత్నాలూ హర్షణీయమే. డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఆశలు కల్పించారు. కానీ వాటిని అనుకున్న సమయంలో పూర్తిచేసి వారికి అంద జేయడం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాటిలో సామాన్యు దొంగలపరం అవుతున్నాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది ఎంతో నిజం.  తెలంగాణా ప్రభుత్వం ఇందుకు మినహాయింపు కాదు. ఘట్ కేసర్సమీపంలోని రాంపల్లి, జవహర్నగర్ సమీపంలోని అహ్మద్గూడ, నల్లగండ్ల పోచంపల్లి, కుంట్లూరు, హయత్ నగర్ ప్రాంతాల్లోకి వెళితే అంతా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కనపడతాయి. కానీ వాటిలో నివాసయోగ పనులు యింకా పూర్తి కాలేదు. యింకా కరెంటు, వాటర్ కనెక్షన్ పనులు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కట్టినంతమేరకు వదిలేశారు. తమ పని అయిపోయిందను కుంటున్నారేమో మరి. చాలారోజులుగా అలా ఉండిపోవడంతో కొన్ని వస్తువులు తుప్పుపట్టి పాడయిపోతున్నాయి, చాలా వస్తువులు దొంగలపరం అవుతున్నాయి. ముందు అక్కడ సిద్ధపరచుకున్న వస్తువులేవీ అక్కడ లేవనే అనాలి. అంతా దొంగలబారిన పడిందని అక్కడివారి మాట. ఇళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసిన తర్వాత వెంటనే ఆ పని పూర్తిచేసిన తర్వాత వాటిని అర్హులకు అందజేయాలి. కానీ పని పూర్తిచేయక, అర్హులను అలా ఎదురుచూస్తుండమని ఇంకా ఎన్నాళ్లిలా అందకుండా చేస్తారన్నది ప్రశ్న. ఇప్పటికే నిర్మాణపనులకు కావలసిన వస్తువులు దొంగలపాలవుతోంది. దీన్ని ప్రబుత్వం అధికారులు పట్టించుకో కుంటే కొన్నాళ్లు పోతే సంబంధంలేని వ్యక్తులు కబ్జా చేసి అవన్నీ మావే అన్నా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇకనైనా వాటిని పట్టించుకుని వదిలేసిన నిర్మాణపనులు పూర్తిచేసి అర్హులకు వాటిని అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అక్కడివారు కోరుతున్నారు. మరి ప్రభుత్వానికి ఈ ఓటర్లు లెక్కలోకి వస్తారా? ...

పెర్త్‌లో స్టాయినిస్ సిక్స్‌ల మోత‌... లంక బెంబేలు!

బౌల‌ర్లు బౌలింగ్ మ‌ర్చిపోయేలా చిత‌క‌బాదుడు బ్యాటింగ్ అంటే ఏమిటి అనే ప్ర‌శ్న‌కు తాజా స‌మాధాన‌మే మార్క‌స్ స్టోయినిస్ బ్యాటింగ్‌. సునాయాసంగా సిక్స్‌లు బాది వార్న‌ర్ రికార్డు అధిగ‌మించి, యువ‌రాజ్‌సింగ్ వంటి మేటీ బ్యాట్స్‌మ‌న్‌ల స‌ర‌స‌న చేరాడు. మంగ‌ళ‌వారం టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీ‌లంక మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ మార్క‌స్ త‌న బ్యాటింగ్ స‌త్తాను ప్ర‌ద‌ర్శించ‌డంలో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. కేవ‌లం 17 బంతుల్లో అర్ధ‌సెంచరీ చేశాడు. గ‌తంలో ఇలా అతి త‌క్కువగా 18 బంతుల్లో అర్ధసెంచ‌రీ చేసిందీ ఆసీస్ స్టార్ బ్యాట‌ర్ వార్న‌ర్‌. అంత‌కు ముందు 2007 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ డ‌ర్బ‌న్‌లో ఇంగ్లండ్‌మీద 12 బంతుల్లోనే అర్ధ‌సెంచ‌రీ చేశాడంటే ఇంగ్లండ్ బౌల‌ర్లు నిజంగానే బౌలింగ్ మ‌ర్చి పోయి ఉంటారు.  కాగా పెర్త్ మ్యాచ్‌లో మంగ‌ళ‌వారం ముందుగా బ్యాట్ చేసిన శ్రీ‌లంక 156 ప‌రుగులు చేసింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ఆసీస్‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని గెల‌వ‌డానికి కాస్తంత మంచి స్కోర్ చేశామని ధైర్యంగా ఫీల్డింగ్‌కి దిగారు. మూడు వికెట్లు ప‌డ‌గొట్టేరు. చూస్తుండగానే రెచ్చిపోయే మాక్స్‌వెల్‌ను కాస్తంత క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు. అత‌ను వెనుదిర‌గ‌గానే మ్యాచ్ మీద ప‌ట్టు బిగించా మ‌నే లంక బౌల‌ర్లు అనుకున్నారు. కానీ ఆల్ రౌండ‌ర్ స్టాయినిక్ బాదేస్తాడ‌ని అస్స‌లు భావించ‌లేదు.  ఒక వంక ఆరాన్ ఫించ్ ఎంతో ఓపిక‌తో ఆడుతూ స్కోర్ చేస్తుండ‌టం ఇన్నింగ్స్ నిల‌బెట్టే య‌త్నాలు చేస్తున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ మ‌హాద్భుతంగా ఆడుతున్నాడు. కానీ సిక్స్‌కొట్టే య‌త్నంలో దొరికిపోయాడు. అప్పు డు వ‌చ్చాడు అస‌లు హీరో స్టాయినిస్ సిక్స్‌ల మోత‌తో పెర్త్ స్టేడియంలో ఆసీస్ వీరాభిమానులకు క‌నుల పండుగే అయింద‌నాలి. అత‌ని వీరవిహారంతో ఆసీస్ కేవ‌లం 16.3 ఓబ‌ర్ల‌లోనే 157 ప‌రుగులూ చేసి విజ‌యం సాధించింది. అప్ప‌టివ‌ర‌కూ బ్ర‌హ్మాండంగా ఆడిన ఫించ్‌, మాక్స్‌ వెల్‌ను ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయేట్టు చేశాడు స్టాయినిస్‌. సింగిల్స్ డ‌బుల్స్ చేస్తూ మ‌ధ్య మ‌ధ్య ఫోర్లు కొట్టినా మ్యాచ్ ముగిం చేయ‌చ్చు అనుకు న్నారు. కానీ స్టాయినిస్ మ‌రో విధంగా ఆలోచించాడు. ఆ ఆలోచ‌న శ్రీ‌లంక బౌలింగ్‌, ఫీల్డింగ్ ఏమాత్రం అత‌ని ధాటిని నిలువ‌రిం చ‌లేక‌పోయింది. 18 బంతుల్లో 59 కొట్టి అజేయంగా నిలిచాడు. ఫించ్ 31 ప‌రుగులు చేయ‌డానికి 42 బంతులు ఎదుర్కొన్నాడు. 

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి...రిషీ సునాక్

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని బాద్యతలు చేపట్టారు. ముందుగా ఆయన లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్ కి వెళ్లి కింగ్ చార్లెస్ 3ను మర్యాదపూర్వకంగా కలిశారు. లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం రిషి ఆ బాధ్యతలు స్వీకరించడం వేగంగా జరిగిపోయాయి. భారతీయ మూలాలు  ఉన్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల భారత్ ప్రజలు, ప్రభుత్వం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ప్రధానిగా రిషీ తన తొలి ప్రసంగంలో భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొనడానికి అందరం సిద్ధపడాలని హెచ్చరిం చడం గమనార్హం. అప్పుల భారం రానున్న తరాల మీద పడేయనని అన్నారు.  అంతకుముందు లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టాల నుంచి అతి త్వర లోనే బయటపడగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రిషీకి ఆమె శుభాకాంక్షలు చెప్పారు. బోరిస్ జాన్సన్ తర్వాత ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే  ఆమెకు రిషీ గట్టి పోటీనే యిచ్చారు. ఆమె తెచ్చిన మధ్యంతర బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఆమె అనుసరించిన ఆర్ధిక విధానాలతో దేశం మరింత సమస్యలకు దారితీసింది. ఈ కారణంగా ఆమె వ్యతి రేకత ఎదుర్కొని పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. బ్రిటన్ చరిత్రలో చిన్నవయసులో ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా, భారత్ సంతతికి  చెందినవాడిగా రిషీ రికార్డు నెలకొల్పారు.  రిషి సునాక్ చూసి మేము గర్విస్తున్నామని. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటు న్నామని  రిషీ మామగారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అన్నారు. బ్రిటన్ ప్రధానిగా ఆయ న ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని నమ్ముతున్నానని అన్నారు.  2009లో రిషి సునాక్  నారాయణ మూర్తి కుమార్తె అక్షితామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్. ఇదిలాఉండగా, రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టడం పట్ల భారత్ లోని వివిధ పార్టీలవారు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం  మాత్రం సునాక్ విజయం నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెజారిటీయేతర వ్యక్తులను అధికార పీఠం మీద కూర్చునేందుకు అవకాశం కల్పించడం గమనార్హమని ట్వీట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం  గురించి నిరంతరం భారీ ఉపన్యాసాలు ఇచ్చేవారు సునాక్ విజయాన్ని గురించి ఆాలోచించి మారుతున్న రాజ కీయ పరిస్థితులనుంచీ మనవాళ్లు నేర్చుకోవాల్సిన  గుణపాఠాలున్నాయని, బ్రిటన్ లో జరిగిన రాజకీ య పరణామాలను మన దేశంలో ఊహించుకోగలమా అని పరోక్షంగా బీజేపీని  కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థారూర్, జైరాం రమేష్ ఎద్దేవీ చేశారు. 

వయసు 90 పైనే...కలయితో 16 అయింది!

స్నేహం మీద అనేకానేక కథలు, సినిమాలు వచ్చేశాయి. హీరో విలన్ కలిసిపోవడం, ఒక పెద్దాయన కష్టాల్లో ఉన్నాడని తెలిసి మరో వ్యక్తి సహాయానికి వెళితే అతను తన బాల్యమిత్రుడని గుర్తించి ఆనందంగా సాయంచేయడం.. స్నేహ మేరా జీవితం.. అంటూ గట్టిగా కావలించేసుకుని పాడేసుకోవడం.. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పెద్ద రోడ్డుకి అవతల నుంచి స్నేహితుడి కోసం పరుగులు తీసి ఇవతలున్న స్నేహితుడిని కలవడం.. మామూలే. చిత్రమేమంటే ఇద్దరు పెద్దవాళ్లు ఏకంగా 75 ఏళ్ల తర్వాత కలిశారు. వారి ఉద్వేగానికి అంతే లేదు. బాల్యంలో కలిసినవారు అనేకానేక కారణాల వల్ల విడిపోయి చాలాకాలం తర్వాత కలవడం వింటూనే ఉంటాం. అయితే మరీ ముదిమి వయసులో కలవడమే ఈ యిద్దరి ప్రత్యేకత. అవును ఎప్పుడు రెండో ప్రపంచయుద్ధంలో కలిసి పనిచేసిన కుర్రాళ్లు పండు ముసలి వయసులో హఠాత్తుగా ఎదురయ్యారు. తప్పకుండా ఇది తెలుగు సీనిమా సీన్ అయితే కాదు.   ఒక షాపింగ్ మాల్ కి 95 ఏళ్ల పెద్దాయన మనవరాలితో వెళ్లాడు. అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి బయటికి వస్తున్నాడు. అప్పుడే దాదాపు అంతే వయసున్న మరో పెద్దాయన మనవడి సాయంతో లోపలికి వచ్చాడు. లోపలికి వస్తూనే అవతలి ముసలాయన్ని గుర్తించాడు. వీడు నా ఫ్రెండ్ అని గుర్తించాడు. అంతే పరుగులాంటి నడకతో వెళ్లి  ఆ ముసలాయన్ని కౌగిలించుకున్నాడు. నేన్రా.. నేను.. అంటూ రెండో ప్రపంచయుద్ధసమయంలో నేవీలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేశాడు. అవును నిజమే.. అనుకుని పేలవంగా నవ్వలేదు.. అమాంతం హత్తుకున్నాడు.. ఆ ముసలాయన కూడా.  పెద్దాయన వాళ్లింటికి తీసికెళ్లాడు...75 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితుడితో 90 సంవత్సరాల సంభాషణ చేశాడు. యుద్ధానికి వెళ్లడం, అంతకుముందు కలిసిన రోజు, కలిసి నేవీలో పనిచేయడం, అంతా.. కానీ ఆ తర్వాత ఎంతో వెతికానని ఎవరూ తన గురించి చెప్పలేకపోయారని చెప్పుకున్నారు.. వారికి కనీసం మూడు గంటలపాటు ఆకలి అనిపించలేదు, డ్రింక్స్ అలానే ఉండిపోయాయి, అంతా మాటలు, కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎన్నో కథలు, ఎన్నో సరదాలు, సీరియస్ అంశాలు, పిల్లలు, మనవలు, మనవరాలు, ఆనందం, దుఖం, నవ్వులు, కాసిని ఏడుపులు... సర్వం వారిద్దరి మధ్యా అలా ప్రవాహ మయ్యాయి.  స్నేహబలం అంతే. ఎన్నాళ్లుపోయినా యంగ్ అండ్ ఎనర్జటిక్. అవును వాళ్లిద్దరూ పదహారేళ్లవారే. వాళ్లే కాదు అలా కలిసినవారంతా పరమ కుర్రాళ్లే. మీరయినా అంతే. పాత బాగా పాత... కనీసం ముప్పయ్యే ళ్లయినా కలవని స్నేహితులను కలవడానికి ప్రయత్నించండి.. వయసు, వ్యధలు, మౌనం.. అన్నీ వీడిపోతాయి. 

తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

నిలిచిపోయిన రెండున్నర గంటల తరువాత ఎట్టకేలకు వాట్సాప్ సేవలు పున: ప్రారంభమయ్యాయి. ప్రముఖ మేసేజింగ్ ఇంజిన్ వాట్సాప్ సేవలు సంకేతిక సమస్యలతో మంగళవారం (అక్టోబర్ 26) మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ట్విట్లర్ వేదికగా వాట్సాప్ సేవల స్తంభనపై పలువురు నెటిజన్లు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో  మెటా.. వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయని పేర్కొంది. సధ్యమైనంత త్వరలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ చెప్పింది. కాగా దాదాపు రెండున్నర గంటల తరువాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.   వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలపై ఆ సందస్థ విచారణ చేపట్టింది. కాగా వాట్సప్ సేవలు నిలిచిపోవడం వెనుక ఏదైనా ఉగ్ర కోణం ఉందా అన్న అనుమానాన్ని భారత ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. అయితే వాట్సాప్ హ్యాకింగ్ కు గురయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని ప్రొవైడర్లు చెబుతున్నారు.  

ఐదు పరుగులిచ్చిన గ్లౌవ్

ఈసారి టీ20 ప్రపపంచకప్ లో వింతలు విడ్డూరాలే జరుగుతున్నాయి. ఆటతో పాటు విచిత్రాలూ ప్రేక్షకు లను ఆకట్టుకుంటున్నాయి. ఊహించని విధంగా క్యాచ్ లు పట్టడం, సిక్స్ లు బాదడంతోపాటు వికెట్ కీపర్ విన్యాసాలు గమనిస్తున్నాం. అయితే మరో చిత్ర విచిత్రమేమంటే దక్షిణాఫ్రికా పెనాల్టీగా ఐదు పరుగులు ఇవ్వడం. మొన్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ లో జింబాబ్వే ఉట్టినే 5 పరుగులు సాధించింది. అందుక్కారణం కూడా దక్షిణాఫ్రికా ఫీల్డర్లే కారణం. సోమవారం గ్రూప్ 2లో జరిగిన ఈ మ్యాచ్ లో పెనాల్టీ పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. జింబాబ్బే ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మూడో బంతి ని జింబాబ్వే బ్యాటర్ మిల్టన్ వికెట్ కీపర్ వెనగ్గా ఫోరో సిక్సో కొట్టాలనుకున్నాడు. కానీ చేతకాలేదు. బంతి శరవేగంతో వెళ్లింది. రివర్స్ స్కూప్ ఆడబోతే అది కాస్తా ఫైన్ లెగ్ లోకి వెళ్లింది. అక్కడి ఫీల్డర్ ఎన్గిడి బంతిని అందుకుని వేగంగా కీపర్ డీకాక్ కి విసిరాడు. డికాక్ జింబాబ్వే బ్యాటర్ ను అవుట్ చేయాలన్న తొందరలో చేతికి ఉన్న కీపర్ గ్లౌవ్ తీసి పడేసి బంతిని పట్టుకున్నాడు. కానీ అది కాస్తా వికెట్లను తాకింది. వాటి మీద ఉన్న బెయిల్ పడింది. బ్యాటర్ అవుటయ్యాననుకన్నాడు. కానీ గ్లౌవ్ విసిరేయడంతో అది పడింది కనుక అవుటియ్య లేదు. పైగా అలా చేసినందుకు దక్షిణాఫ్రికా జట్టు అయిదు పెనాల్టీ పరుగులు సమర్పించు కోవాల్సి వచ్చింది. బ్యాటర్ కదలకుండానే అయిదు పరుగులు సాధించడం అందర్నీ ఆశర్యర్యపరి చింది. డీకాక్ కూడా ఇదేందిరా అయ్యా అన్నట్టు చూశాడు.  కానీ రూల్స్ అలానే ఉన్నాయి. గ్లైవ్ వికెట్లను తాకితే బెయిల్స్ కిందపడితే బ్యాటింగ్ చేస్తున్నవారికి అయిదు అదనపు పరుగులు ఇవ్వాలి. అలా పెనాల్టీ పడిందన్నమాట. అంచేత ఆడటం అంత సులువు కాదు. సవాలక్ష నిబంధనల మధ్యలో కాస్తంత భయం భయంగానే ఆడాలి. స్వేచ్ఛ తీసుకోవడానికి చాలా పరిమితులు ఉంటాయి.  ఆవేశంలో వాటిని అధిగమిస్తే ఫలితం ఇలానే ఉంటుంది. అందుకే మధ్యలో బ్యాటర్, బౌలర్ మధ్య గొడవలు జరిగినా మీదకు వచ్చినా ఇరుజట్ల కెప్టెన్లు పరుగున వచ్చి సర్దిచెప్పుకు పోతుంటారు. రోడ్డు మీద కొట్టుకున్నట్టు కొట్టుకుంటే డేంజరే. పెనాల్టీ  పరుగుల మాట ఎలా ఉన్నా, ఆట నించి బయటికి పంపేస్తారు. 

పలాస పోలీసు స్టేషనా... వైసీపీ కార్యాలయమా?

ఆంధ్రప్రదేశ్ లో పోలీసు స్టేషన్లు అధికార వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయా? పోలీసు స్టేషన్లలో వైసీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా? విపక్ష నేతలను వేధించడమే పనిగా వైసీపీ నేతల కనుసన్నలలో పోలీసు స్టేషన్లు పని చేస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడమే తమ విధి అన్నట్లుగా పని చేస్తున్నాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పోలీసు స్టేషన్ పూర్తిగా వైసీపీ కార్యాలయంలా మారిపోయిందంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.   తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శీరీష, పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలాస సీఐ శంకరరావు అధికారపార్టీకి కొమ్ము కాస్తున్నారనీ, మంత్రి అప్పలరాజు చెప్పిన విధంగా ఆయన వ్యవహరిస్తున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అప్పలరాజు కనుసన్నలలో సీఐ పని చేస్తూ... ఏకంగా పోలీసు స్టేషన్ నే వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఎంపీ ఆరోపంచారు. సీఐ శంకరరావుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఎస్పీని కోరారు. 

ఎన్నికల కమిషన్ హెచ్చరిక...గోడమీద పోస్టర్

ప్రతీ గల్లీలో జనం పరిగెడుతున్నారు. గ్రామకూడలిలో వేపచెట్టుకింద ఒక వ్యక్తి  ఆభరణాలు పంచు తున్నాడు. పిల్లలయితే ఉంగరాలు, పెద్దవాళ్లయితే గాజులు,గొలుసులు, వడ్డాణాలూను. మన రాజుకింత బుద్ధుంటే బావుండేది అనుకుంటూ అవి తీసుకున్న ఆనందంలో రాజుని వీలయినంతగా తిట్టుకుం టున్నారు. అలానే ఇళ్లకి చేరుకున్నారు. యువరాజుగారికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎవరక్కడ అని అరిచాడు. భటుడు వచ్చాడు. ఏం జరుగుతోంది అంటూ అరిచాడు. ప్రభూ పక్కూరి వాల్లు, చిన్న రాజ్యంవారూ వచ్చి మన ప్రజలకు కానుకలు ఇస్తున్నారు. మా ఆడోళ్లూ తెచ్చు కున్నారు అన్నాడు. రాజుకి కోపం నషాలానికి అంటింది. ప్రజలా మేకలా అలా వెంటబడి మీదబడి తీసు కుంటారా? అని కోపగించుకున్నారు. బాగా ఆాలోచించి మంత్రికి వాళ్లని తరిమే యమన్నాడు. మంత్రి వెళ్లి ఒక వడ్డాణం తీసుకుని ఇప్పుడు కాదు మరో రోజు రండి అని పంపేశాడు. ఈసమాచారం విని రాజుగారు ఒక ప్రకటన చేయించారు.. ఎవరూ ఎవరి కానుకలను తీసుకోరాదని. ఎవరు కానుకలు ఇవ్వడానికి వచ్చినా వెంటనే కబురుపెట్టమని లేకుంటే చెట్టుకి కట్టేయ మని ఆదేశించారు. అది చదివి జనం ఊరుకున్నారు. జరిగేది జరగక మానదు, రాజుగారి హెచ్చరి కతో అన్నీ ఆాగిపోతే రాజ్యం ఎందుకైతది?  ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో ఉన్న పార్టీలన్నీ ఓటరుని ఆకట్టుకోవడానికి అనేక బహుమానాలు ఇవ్వడం మీదనే ఆసక్తి చూపుతున్నాయి. అసలు ఇప్పటికే కోట్లు ప్రవాహంగా వెళిపోయాయి. కొంతే పట్టుబడిందని మీడియా కోడయి కూస్తోంది. ఇప్పటికి భారత ఎన్నికల కమిషన్ వారికి ఇక్కడి సమాచారం తెలిసింది. వెంటనే అలా కానుకలు రూపంలో ఏమీ ఎవ్వరూ ఇవ్వడానికి వీల్లేదని శాసించింది. ప్రజలకు ముఖ్యంగా ఓటరుకి పొట్టచెక్కలయ్యేంత నవ్వొచ్చింది.  పార్టీలు గెలవడానికి అన్ని యత్నాలూ చేస్తున్నాయి. వాటిలో భాగమే ఈ కానుకుల సంగతి. కొందరు ఏకంగా బంగారం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారట. అంటే మునుగోడు ఓటరు అనతికాలంలోనే కోటీశ్వరుడు అయినా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు. ఎవరు ఏమీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకో వాలని హెచ్చరికలు జారీచేయడం పెద్ద అమాయకత్వం. అధికారంలోకి రావాలి, మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలి, రెండింటిలో ఏదయినాసరే పార్టీలకు ప్రధానమే. అందువల్ల తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి చేయాల్సిన అన్ని పనులూ చేస్తారు, అన్ని మార్గాలను అనుసరిస్తుంటారు. ఇది అనాదిగా ఉన్నదే. కాబోతే, ఇ.సి మాత్రం ఈసారి గట్టి చర్యలు తీసుకోవడానికి నిర్నయించింది. ఎవర యినా సరే డబ్బురూపంలోగాని, వస్తు రూపంలోగాని పార్టీల నుంచి, అభ్యర్ధుల నుంచి తీసుకోరాదు, అది ఘోరనేరంతో సమానమని భారీ ప్రచారానికి పూనుకుంది. పూర్వం సినిమాలకు రిక్షాల ప్రచారంలాగ వాహనాల్లో మైకు ప్రచారానికి, గోడల మీద పోస్టర్ల ప్రచారానికి పూనుకుంది. ప్రాంతీయ భాషలో ఈ ప్రచారం జరగాలని  తెలంగాణా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్, ఏవిఎంలు సిద్ధమయ్యాయని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు.  మునుగోడు నియోజకవర్గంలో 80 ఏళ్లు నిండిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత గడువులోగా ఫారం 12 డి సమర్పించారు. సీనియర్ సిటి జన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి ఈసీఐ సూచనల మేరకు షెడ్యూల్‌ను సిద్ధం చేసి నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు బుక్ చేశామని, 2.5 కోట్లు సీజ్ చేశామని వికాస్ రాజ్ తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483 లీట ర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, 77కేసులు నమోదుచేసి 36 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మునుగోడుకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌తో పాటు ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని రెండవ ఎన్నికల పరిశీలకుడిగా  ఎన్నికల కమిషన్  నియమించింది. ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) నియోజకవర్గంలోని అక్రమ నగదు ప్రవాహాన్ని నియం త్రించేందుకు వ్యయ పరిశీలకులకు సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ నుండి ఏడుగురు సిబ్బందిని మునుగోడుకు నియమించారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ బహుమతులు, చేబదులు రూపంలో పార్టీవర్గాలు ఓటర్లకు ఇచ్చేవాటిని, బహిరంగంగానో, రహస్యంగానో ఇళ్లకు పంపే వస్తువులను ఏ కెమెరా కన్ను అమాంతం పట్టేస్తుంది?  రాజుగారికి కోపం వచ్చినా, ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని హెచ్చరికలు చేసినా పార్టీలు, నాయకులు, అభ్యర్ధులు, ఇపుడు  ఓటరు కూడా చాలా లైట్ గానే తీసుకుంటున్నారు. దీన్ని అవినీతి అనే కంటే మా వారికి ఇష్టపూర్వకంగా ఇస్తున్న కానుకలు అంటూ పెళ్లిలో ఇచ్చినట్టు ఇస్తున్న పుడు ఓటరు మాత్రం కాదనలేకపోతాడుకదా. లోలోపల కాస్తంత భయం ఉండచ్చుగాక, ఈ తరుణం మించితే  ఆనక ఫ్రిజ్ కొనడానికయినా నానా తంటాలు పడాలన్నది  ఓటరు ఆలోచన, పోనీలేద్దూ మనకి ఓటు వస్తాడుగా అనే నమ్మకం పార్టీలదీను.  ఇక ఇసీ ప్రకటనలు, హెచ్చరికలు గోడ మీద పోస్టర్లే. 

ఏపీలో జగన్ సీన్ సితారేనా?.. సీ వోటర్ సర్వే తేల్చేసిందా?

ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి ఓటర్లను కడుపూ, గడ్డం పట్టుకుని బతిమాలి ఏపీలో అధికార పీఠం ఎక్కిన జగన్ పట్ల ఓటర్లలో ఎక్కువ శాతం మందికి వెగటు పుట్టినట్లుంది. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసిన జగన్ పాలన అంటే జనంలో తీవ్ర అసంతృప్తి రేగుతున్నట్లుంది. జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిందంటున్నారు. ఆర్థికంగా ఏపీని బలోపేతం చేసే దిశగా ఏమాత్రం ఆలోచించకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రాజెక్టులు, సంస్థల ఏర్పాటుపై దృష్టిపెట్టకుండా.. కేవలం కంటితుడుపు చర్యగా ఉచితాల పేరుతో జనాన్ని వెర్రోళ్లుగా, ప్రభుత్వం ఇచ్చే పథకాల లబ్ధి కోసం అర్రులు చాచేలా చేసిన జగన్ పట్ల, వైసీపీ పాలన పట్ల ఈ మూడున్నరేళ్లలో జనానికి మొహం మొత్తిందంటున్నారు.  తద్వారా జగన్ సర్కార్ డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ సీ-ఓటర్ తాజాగా వెల్లడించిన సంచలన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. జగన్ ఏలుబడిలో ఏపీలో ఒక్క కొత్త ప్రాజెక్టు రాలేదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ధైర్యంగా ఏపీలో ముందుకు రాని పరిస్థితి ఉంది. కొత్త పెట్టుబడిదారుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోతున్న వైనం బాధాకరంగా మారింది. రోడ్ల దుస్థితి చూస్తే దయనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు ఇలా ఒక్కటేమిటి అన్ని వర్గాల వారూ వైసీపీ పాలన అంటేనే చీదరించుకునే స్థితి వచ్చింది. ఇలాంటి ఎన్నో కారణాలతో జగన్ సర్కార్ అంటే ఏపీ జనంలో 57 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీ ఓటర్ తాజా సర్వేలో  వెల్లడించింది. సీ ఓటర్ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ప్రజాగ్రహాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న టాప్ 5 ప్రభుత్వాల జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం పట్ల జనంలో ప్రజాగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ అయితే మరీ దారుణంగా అగ్రస్థానంలో నిలిచింది. ‘యాంగర్ ఇండెక్స్’ పేరిట సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఏపీ సర్కార్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తనుందని విషయం వెల్లడైంది. ఈ క్రమంలో ఏపీలోని ప్రస్తుతం 58 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం గమనార్హం. ఈ విషయం సీ ఓటర్ సంస్థే కాకుండా జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ చేసిన సర్వేలో కూడా స్పష్టమైంది. 2019లో 151 స్థానాల్లో విజయం సాధించి, బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గానూ 175 చోట్లా గెలవాలనే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తన పార్టీ నేతలు, బాధ్యులను పరుగులు పెట్టిస్తుండడం గమనార్మం. అయితే.. సీ ఓటర్ సర్వేలో అందుకు పూర్తి భిన్నంగా జగన్ సర్కార్ పట్ల జనం అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం. జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్ సర్వేల కన్నా విభిన్నంగా సీ ఓటర్ సర్వే ఫలితాలు రావడం గమనించదగ్గ అంశం. ఎక్కువ శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, వారి తీరు మారకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, ఇతరులకు కేటాయిస్తానంటూ జగన్ పదే పదే చెబుతున్నారు. అయితే.. విచిత్రంగా ఆ పార్టీ ఎమ్మెల్యేల కన్నా వైసీపీ పాలనే ఘోరంగా ఉందని జనం ఆగ్రహంతో ఉన్నట్లు సీ ఓటర్ సర్వే తేటతెల్లం చేసింది. అయితే.. అభివృద్ధిలో, సంక్షేమంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని వైసీపీ నేతలు, ముఖ్యనేత చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98 శాతం అమలు చేశామని గొప్పగా వైసీపీ నేతలు చెబుతుంటే.. జనంలో తీవ్రాతి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం కనిపించడం లేదా అంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లినప్పుడు కూడా ఇంతే స్థాయిలో వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని సమర్థించగల దమ్ములేక అనేక మంది ఎమ్మెల్యేలు అసలు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ముఖం చాటు వేసిన ఘటనలు ఉన్నాయి. ఏపీలోని స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేలు, సీఎంకు సంబంధించిన ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే అంశంపై సీ ఓటర్ సర్వే నిర్వహించడం గమనార్హం. ఈ సర్వే సందర్భంగా జగన్ రెడ్డి పాలన ఏమాత్రం బాగోలేదని ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారంటే.. వైసీపీ సర్కార్ ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయిందనే భావించాలని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కో ఆర్డినేటర్ల సమీక్ష సందర్భంగా ఎంతసేపూ ఎమ్మెల్యేల గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ చిర్రుబుర్రులాడుతున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అయితే.. ఆశ్చర్యకరంగా అసలు వైసీపీ సర్కార్ పైనే ఎక్కువ వ్యతిరేకత రావడం గమనార్హం.మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు ఏపీ జనం నుంచి దబిడి దిబిడి తప్పేట్టు లేదని సర్వే నివేదికల ద్వారా అర్థం అవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గుడివాడలో నానికి ప్రత్యర్థిగా తెరపైకి కొత్త ముఖం.. చంద్రబాబు వ్యూహం

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఓటమి రుచి చూపించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఓ బలమైన నాయకుడినే కాకుండా.. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన వ్యక్తిని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆయనను రంగంలోకి దింపి.. గుడివాడలో సేవా కార్యక్రమాలతోపాటు రైతులకు అండగా నిలిచే కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  ఆయన అయితేనే.. కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా చంద్రబాబు తెరపైకి తీసుకు వచ్చిన వ్యక్తికి.. కొడాలి నానికి పెద్దగా పరిచయం లేదని తెలుస్తోంది. కానీ.. కొడాలి నానిపై ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులంతా కొడాలి నానికి  బాగా పరిచయస్తులేనన్న సంగతి తెలిసిందే.  కానీ ఇక పరిస్థితి ఉండకూడదన్న  కృత నిశ్చయంతోనే కొత్త అభ్యర్థినిబరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై మొన్నటి వరకు వంగవీటి రాధాని నిలుపుతారంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేరు తెరపైకి వచ్చింది.  ఉమ  అయితేనే కొడాలి నానికి కరెక్ట్ అని కూడా టీడీపీలో ప్రచారం జరిగింది. కానీ దేవినేని ఉమను సైతం కాదని.. తెరపైకి ఓ కొత్త వ్యక్తి పేరును చంద్రబాబు తీసుకు రావడంతో కొడాలి నాని వర్గంలో కొంత అలజడి మొదలైనట్లు తెలుస్తోంది.  అదీకాక.. ఇప్పటికి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి... గెలుస్తూ వచ్చిన కొడాలి నానికి వచ్చే ఎన్నికలు అంత ఈజీ కాదని ఆయన వర్గమే పేర్కొంటోంది. జగన్ తొలి కేబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నా.. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా..  చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై బండ బూతులు తిట్టడమే కాదు.. చంద్రబాబు ఫ్యామిలీపై సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్లో కొడాలి నాని తీవ్ర అపప్రదను ముటకట్టుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు నల్లేరు మీద నడక కాదనే చర్చ   గుడివాడ నియోజకవర్గంలో జోరుగా నడుస్తోంది. అదీకాక.. ఆయన మంత్రిగా ఉండగా  ఆయన వ్యవహార శైలితో.. నియోజకవర్గంలో యువత అంతా కొడాలి నానికి బాగా దూరంగా జరిగింది. మరోవైపు.. రానున్న ఎన్నికల్లో  కొడాలి నాని ఓటమే లక్ష్యంగా చంద్రబాబు.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త అభ్యర్థిని చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన అయితేనే కొడాలి నానికి సరైన రాజకీయ ప్రత్యర్థి అని చంద్రబాబు తన ఆలోచనలకు పదును పెట్టి.. మరీ ఆ పారిశ్రామికవేత్తను గుడివాడ నుంచి రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

నా హత్యకు సీఎం కుట్ర..రఘురామకృష్ణం రాజు

దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి హైదరాబాదుకు వెళ్ళిన తనని, బ్లాంక్ ఎఫ్ ఐ ఆర్ ద్వారా ఏపీ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారని రఘురామరాజు చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  తనకు ఖచ్చితమైన సమాచారం లభించడంతోనే, తాను తిరిగి ఢిల్లీకి చేరుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని అంతమొందించడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు లేఖలు రాయనున్నట్లు తెలిపారు. ఏపీలో మంత్రులకు భద్రత పెంపుపై స్పందించిన ఆయన ఏపీలో జగన్ సర్కార్ తీరు కారణంగా ప్రజల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కావాలనే పరిస్థితి ఇంత తొందరగా వస్తుందనుకోలేదని వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మా జగనన్న ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని సెటైర్ వైశారు.  సిఐడి చట్టబద్ధంగానే పని చేస్తోందని, తప్పు చేయని వారు భయపడాల్సిన పని లేదని, అవసరమైతే కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ వారికి ఉంటుందని మీడియాలో వచ్చిన కథనాలపైనా రఘురామకృష్ణంరాజు స్పందించారు.  హక్కుల గురించి సిఐడి అధికారులు  చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో తాము లేమన్నారు. సిఐడి పోలీసులు ఎంతోమందిని అరెస్టు చేయగా, మెజిస్ట్రేట్ లు వారిని కస్టడీకి ఇవ్వకుండా తిరిగి వెనక్కి పంపిన ఉదాంతాలు అనేకం ఉన్నాయన్నారు.  అమాయకులను అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులను మెజిస్ట్రేట్ లు తక్షణమే శిక్షించాలని కోరారు. ఇదే విషయమై తాను త్వరలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలుస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాలు, బారి కేడ్స్ మధ్య ప్రజల్లోకి వస్తున్నారన్న ఆయన , ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అదే పంథా ను అనుసరించాలని అపహాస్యం చేశారు.     సిఐడి కస్టడీలో పోలీసుల హింసను అనుభవించిన వారెవరు న్యాయస్థానానికి, మీడియాకు ఫిర్యాదు చేయలేదని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు . సిఐడి ని అభాసు పాలు చేసేందుకే కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐడి అధికారులకు కళ్ళు ఉన్నాయా?, లేవా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, తాను దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం సిఐడి పోలీసులకు, న్యాయస్థానం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసిందన్నారు.  అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడుగడుగునా పాలకులు అడ్డుకోవాలని చూస్తున్నారన్న రఘురామకృష్ణంరాజు, ఇది రైతులకు పరీక్షా సమయం కాదని… ప్రజాస్వామ్యానికే పరీక్ష అని వ్యాఖ్యానించారు.      కడప ఎంపీ స్థానం కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చెప్పారంటే నిజమే అయి ఉంటుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా హత్య వల్ల లబ్ధిదారులు ఎవరన్నది త్వరలోనే తేలనుందన్నారు.  

నక్క...నాగలోకమూ

రైతే రాజు నినాదం అనాదిగా ఉన్నదే. రాష్ట్రపతి కంటే రైతే మన దేశంలో గట్టివాడనేవారు. రాజకీయా ధికారాలు లేకపోయినా రైతు దేశ ప్రజలకు దైవంతో సమానం. కానీ కాలక్రమంలో రైతును సామాన్య ఓటరు స్థాయికి దిగజార్చారన్న మాటా లేకపోలేదు. రాజ్యాధికారం చేతికి రాగానే రాజకీయ పార్టీలు, నాయకులే రైతునీ ఓటుహక్కున్న మనిషిగానే చూస్తున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రైతుపట్ల కాస్తంత గౌరమే ఉందనుకోవాలి. అక్కడి ప్రభుత్వాలు వారికి గౌరవమిస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రైతుకి స్థాయి దిగజారింది. రాజధాని నగరానికి భూము లిచ్చినా వారిని అగౌరవపరచడమే జరుగుతోంది. వారి మాటను వినడం మానేశారు. ప్రబుత్వం ఏది నిర్ణయిస్తే దాన్నే అంగీకరించాలన్న విధంగా వారిని లోబరచుకోవడానికే చూస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణే రైతుల మహాపాద యాత్ర. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి భూములు తీసుకున్నారు. 2015లో ల్యాండ్ ఫూలింగ్ ద్వారా సేక‌రించిన భూముల్లో 2015 ఆక్టోబ‌ర్ లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేతుల మీదుగా అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. రైతుల నుంచి స‌మీక‌రించిన భూములతో పాటుగా ప్ర‌భుత్వ భూములు కూడా క‌లిపి 50వేల ఎక‌రాల పైబ‌డి విస్తీర్ణంలో అమరావతి మహా న‌గ‌రం నిర్మాణానికి పూనుకున్నారు. కొన్ని కార్యాల‌యాల‌ను సిద్ధం చేశారు. తాత్కాలిక అవ‌స‌రాల కోసం నిర్మించిన సెక్ర‌టేరియేట్, అసెంబ్లీ భ‌వ‌నాలు 2017లోనే అందుబాటులోకి తీసుకొచ్చా రు. తాత్కాలిక హైకోర్టు భ‌వ‌నం కూడా అందుబాటులోకి వ‌చ్చింది.  ఆ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తెలుగుదేవంప్రభుత్వం దిగిపోయి వైసీపీ సర్కార్ వచ్చింది. దీంతో 2019 డిసెంబ‌ర్ లో జగన్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి విష‌యంలో నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 2020 జ‌న‌వ‌రిలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మూడు రాజ‌ధానుల వైపు అడుగులు వేసింది. వాటిపై ప‌లు అభ్యం త‌రాలు, అమ‌రావ‌తి ప్రాంతవాసుల ఆందోళ‌న‌ల‌కు తోడు కోర్టులో కేసులు ఉండ‌డంతో రాజ‌ ధానుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ముందుకు సాగ‌లేదు.  భూములు ఇచ్చింది రాజధాని నిర్మాణానికి కనుక అమరావతి నే రాజధాని చేయాలన్న రైతాంగం, ప్రజల డిమాండ్ బలపడింది. పాలనాపరమైన సౌలభ్యంకోసమే మూడు రాజధానుల మాట తెరమీదకు తెచ్చామని జగన్ సర్కార్ ప్రచారం చేసుకుం టోంది. ప్రబుత్వం చెప్పే కారణాలు, వివరణల మాట ఎలా ఉన్నప్పటికీ , రైతాంగం మాత్రం ససెమిరా అంటూ పాదయాత్ర ఆరంభించింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం.. సీఆర్డీయే చట్టాన్ని సవరించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.అయినా జగన్ సర్కార్ తన మొండి పట్టు వీడలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. మూడురాజధానులపై ముందుకే సాగుతానంటోంది. రైతుల మహాపాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటోంది.  మరో వంక  నోయిడా విమనాశ్రమం కోసం చుట్టుపక్కల ఆరు గ్రామాల రైతాంగంలో 76 శాతం మంది తమ భూములు ఇవ్వడానికి  అంగీకరించారు. వారిని నోయిడా విమానాశ్రమం రెండో విడత పనులకు కావలసి భూమి కోసం అధికారులు, ప్రభుత్వం సంప్రదించింది.  వారిని నుంచి భూమిని తీసుకు నేందుకు అన్ని ఏర్పాట్లూ చేపడుతున్నామని ప్రభత్వం ప్రకటించింది. కలెక్టర్  ఆ గ్రామాల రైతులకు అంగీకార పత్రాలనుకూడా ఇచ్చారు. ఎయిర్ పోర్టు ప్రాజెక్టు రెండో విడత పనులు చేపడితే సుమారు 7,164 కుటుంబాలపై ప్రభావం ఉంటుందని వారిలో 70 శాతం మంది అంటే 5 వేల కుటుంబాల అంగీకారం అవసరమయిందని కలెక్టర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ  రాజధాని  వ్యవహారం కంటే చిన్నదే కావచ్చుకాని రైతాంగంతో ప్రభుత్వాలు వ్యవహరించే తీరు లో మార్పు గమనించవచ్చు. రైతాం గాన్ని అవసరం వచ్చినపుడు బతిమాలి బామాలిన జగన్ సర్కార్ తర్వాత నిర్లక్షంగా మాట్లాడి దూరం చేసుకుంది. అటు యూపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఎంతో సమన్వయంతో పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతోంది. అయితే అక్కడ కూడా ప్రబుత్వం భూముల విషయమయి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ ఆ రైతులతో సంప్రదించి పరిస్థి తులు వివరించి వారి నుంచి అనుకూలత అంగీకారం సాధించగలిగారు. వారికి ఆ ర్ అండ్ ఆర్ పాలసీనీ చక్కగా వివరించారు. ఆ తర్వాత ఆయన నాయకత్వంలోనే 200 మంది రైతులు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను కలిశారు. వారికి భూమిపై ఇచ్చే పరిహారం పెంచమన్న డిమాండ్ గురించి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అంగీకరించడం గమనార్హం.  చిత్రమేమంటే, ఆంధ్రా విషయానికి వస్తే, భూములు తీసుకున్న లక్ష్యం మరోలా ఉండటం. భూములను రాజధాని నిర్మాణానికి తీసుకుని అందుకు వినియోగించుకోవడం లేదు. పైగా రాజధానిని విశాఖపట్నానికి మారిస్తే చూస్తూ ఊరుకోమని రైతాంగం కూడా కరాఖండీగా చెబుతోంది. మా వద్ద నుంచి భూములు తీసుకుని ఇప్పుడు రాజధానిని మార్చే ఆలోచన చేయడం దుర్మార్గమని రైతాంగం ఉద్యమ బాట పట్టింది. మహా పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది.  సమస్యను పరిష్కరించడంలో జగన్ విఫలమయ్యారు. తాను పట్టిన కుందేటికి.. అన్న సామెతలా తయారయి విశాఖను అభి వృద్ధి చేయాలనే తలంపుతో సీెం జగన్ మొండిపట్టుపట్టారు. అమరావతి, చుట్టుపక్కల భూములిచ్చినవారంతా రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్నే ముందునుంచి ప్రచారం చేశామని,ఆాశించామని భీష్మించారు.  ప్రబుత్వం కేవలం రాజకీయ అవసరాలకోసమే మూడు రాజధానుల మాట ఎత్తిందేగాని వాస్తవానికి అమరావతి అభివృద్ధిని ఆకాంక్షించలేదని రైతాంగం ఆగ్రహించింది. ప్రభుత్వం పొగరు దించాలనే మహాపాదయాత్ర చేపట్టి ప్రజల మద్దతు పొందింది. 

ఫోటో ఇచ్చిన అమితానందం

ఇప్పుడంటే సెల్ఫీలు వచ్చాయిగాని ఈమధ్య వరకూ ఫోటోలదే రాజ్యం. బాల్యంలో తీయించు కున్న ఫోటోలకు మరింత విలువ.  అప్పట్లో యే ప్రముఖ వ్యక్తితోనో తీయించుకున్న ఫోటో చాలాకాలం ఎంతో పదిలంగా దాచుకోవడం పరిపాటి. అది ఏకంగా ముఖ్యమంత్రితో తీయించుకున్నదయితే మరీ పదిలం చేసుకోవడం దాన్ని చూసుకుంటూ మురిసిపోవడం జరుగుతూంటుంది. స్కూల్లో, అపీసులో తోటి మిత్రులతో అ అనందం పంచుకుంటాం. మరీ వింతేమంటే..చాలాకాలం ఏ ప్రముఖుడితో ఫోటో తీయించుకున్నామో అదే ప్రముఖుడు మరింత పెద్ద స్థాయిలో కలిస్తే ? అ అనందానికి అంతే ఉండదు. సరిగ్గా ఇదే జరిగింది ఒక మేజర్ కి. గజరాత్ కి చెందిన అమిత్ బాలాచాడిలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఆయన స్కూల్ ఫంన్ కి నరేంద్ర మోడీ వెళ్లారు. అప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఆయన చేతుల మీదుగా అమిత్ ఓ షీల్డ్ అందుకున్నారు. ముఖ్యమంత్రితో ఫోటో తీయించుకన్న ఆనందం అందరికీ పంచుకున్నారు. దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు.  తర్వాత చదువు పూర్తిచేసుకున్న అమిత్.. భారత సైన్యంలో చేరి మేజర్ అయ్యారు. ప్రస్తుతం కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్నారు.  చిత్రంగా చాలా కాలం తర్వాత మోదీని ఇన్నాళ్లకి కలిశారు. ఈసారి తాను మేజర్, ఆయన దేశ ప్రధాని.   దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తన పాత జ్ఞాపకాన్ని పంచుకునే అవకాశం అమిత్కి  వచ్చింది. ఈ అరు దైన సంఘటనకు ప్రధాని మోదీ కార్గిల్ పర్యటన వేదికగా మారింది.  దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో పర్యటిస్తారని తెలియడంతో అమిత్ సంతోషం పట్టలేకపోయారు. వెంటనే తన చిన్ననాటి ఫొటో ఫ్రేంను తెప్పించుకుని, ప్రధానికి ఆ ఫొటో చూపించే క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూశారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపు కుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కార్గిల్ లో పర్యటించారు. అక్కడి సైనికులతో వేడుకలు జరుపుకుం టుండగా.. అమిత్ ఆయన దగ్గరికి వచ్చి చిన్నప్పటి సంగతిని గుర్తుచేశాడు. అప్పటి ఫొటోను మోదీకి చూపించారు. ఇద్దరూ అప్పటి విశేషాలను గుర్తుకుతెచ్చుకున్నారు. అమిత్తో పాటు ప్రధాని కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆనాటి ఫొటోను పట్టుకుని ప్రధాని మోదీ, మేజర్ అమిత్ మళ్లీ ఫొటో దిగారు.

వాట్సాప్ కు గ్రహణం.. గగ్గోలు పెడుతున్న నెటిజనం

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌  సేవలకు అంతరాయం ఏర్పడింది.   మధ్యాహ్నం 12 గంటలకు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్లనే వాట్సప్ సేవలు నిలిచిపోయాయని భావిస్తున్నారు. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో ఆ యాప్ యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి అవకావం లేకుండా సేవల మొత్తం నిలిచిపోయాయి. వాట్సప్ కాల్స్ కు కూడా అవకాశం లేకుండా పోయింది.  అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ.. వాట్సాప్‌ పర్సనల్ చాట్స్‌తో పాటు గ్రూప్స్‌కు కూడా సందేశాలు పంపే, స్వీకరించే సేవలు స్తంభించిపోయాయి. . ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్  విషయాన్ని వెల్లడించింది.  దీంతో నెటిజన్లు వాట్సాప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యగ్రహణం మాట దేవుడెరుగు.. వాట్సాప్ కు గ్రహనం పట్టిందని గగ్గోలు పెడుతున్నారు నెటిజనం.