దారుణంగా ఆడి ద‌క్షిణాఫ్రికాను గెలిపించిన భార‌త్‌ 

గ‌త రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆట‌ను ప్ర‌ద‌ర్శించి విజ‌యాలు సాధించిన భార‌త్ మూడో మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడింది. ఊహించ‌ని ఫీల్డింగ్ లోపాలు, అశ్విన్ వంటి సీనియ‌ర్ స్పిన్న‌ర్ విఫ‌లం కావ‌డంతో పాటు సీనియ‌ర్ బ్యాట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, రాహుల్‌, కింగ్ కోహ్లీ వైఫ‌ల్యం జ‌ట్టు ఓట‌మి బాటే ప‌ట్టించింది. సూర్య‌కుమార్ యాద‌వ్ ఒక్క‌డే క‌ష్ట‌ప‌డి 68 ప‌రుగులు చేశాడు. భార‌త్  టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 133 ప‌రుగులే చేసింది. ద‌క్షిణా ఫ్రికా పేస‌ర్లు ఎన్గిడి, పార్న‌ల్ అద్భుతంగా బౌలింగ్ చేసి భార‌త్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డంలో త‌మ స‌త్తా చాటా రు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎన్గిడి త‌న 4 ఓవ‌ర్ల‌లో 29 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీసు కోగా, పార్న‌ల్ 15 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీసు కున్నాడు. ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల న‌ష్టానికి 137 ప‌రుగ‌లు చేసిం ది. మిల్ల‌ర్‌, మార్క‌ర‌మ్ భార‌త్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టించారు.  ఆదివారం పెర్త్‌లో గ్రూప్ 2 సూప‌ర్ 12 మ్యాచ్‌లో భార‌త్ గ‌త రెండు మ్యాచ్‌లు గెలిచి మూడో మ్యాచ్ కూడా విజ‌యం సాధిస్తుం ద‌ని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ భార‌త్ బ్యాటింగ్ ఆరంభం నుంచే ఖంగారు ప‌డ్డారు.  ప‌వ‌ర్ ప్లే 6 ఓవ‌ర్ల‌లో భార‌త్ 33 ప‌రుగుల‌కు 2 వికెట్లు కోల్పోయింది. త‌ర్వాతి ఓవ‌ర్లోనే కోహ్లీ కూడా వెనుదిర‌గ‌డంతో ప్రేక్ష‌కులు ఎంతో నిర‌శ‌ప‌డ్డారు. రెండో మ్యాచ్ లో ఒంటిచేత్తో భార‌త్‌ను గెలిపించిన కింగ్ ఈ మ్యాచ్‌లో కేవ‌లం 12 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. కుర్రాడు హూడా ఈ మ్యాచ్ లో నిల‌బ‌డ‌తాడ‌ని కెప్టెన్ ఆశప‌డ్డాడు. కానీ అత‌నూ బోర్లాప‌డ్డాడు. ఆ త‌ర్వాత హార్డిక్ పాండ్యా మెరుపులు ప్ర‌ద‌ర్శించ కుండానే స‌ర్దు కున్నాడు. దీంతో భార‌త్ 10 ఓవ‌ర్ల‌కి కేవ‌లం 60 ప‌రుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. కానీ మ‌రో ఎండ్‌లో సూర్య ఇన్నింగ్స్ నిలిపే య‌త్నంలో చాలా జాగ్ర‌త్త‌గా ఆడుతూ స్కోర్‌ను పెంచుతూపోయాడు. 15 ఓవ‌ర్లో సూర్య త‌న అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. సూర్య 50 ప‌రుగులు 30 బంతుల్లో కొట్టాడు. అందులో 3ఫోర్లు, 3 సిక్స్‌లూ ఉన్నాయి. కానీ ఆ త‌ర్వాత అదే ధాటిని కొన‌సాగించ లేక‌పోయాడు. భార‌త్ వంద‌ప‌రుగులు 16వ ఓవ‌ర్లో పూర్త‌య్యాయి. అ్పుడే సూర్య అవుట‌య్యాడు. త‌ర్వాత వ‌చ్చిన కార్తిక్ కూడా వెనుదిర‌గ‌డంతో భార‌త్ పెద్ద‌గా స్కోర్ చేయ‌ ద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌యింది. మొత్తానికి భార‌త్ 20 ఓవ‌ర్ల‌కి 9 వికెట్ల న‌ష్టానికి 133 ప‌రు గులు అతి క‌ష్టం మీద చేయ‌గ‌లిగింది.  134 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ద‌క్షిణాఫ్రికా ఓప‌నర్ల‌కు భార‌త్ యువ పేస‌ర్ అర్ష్‌దీప్ పెద్ద ప‌రీక్షే పెట్టాడు. ఈ లెఫ్టీ వ‌స్తూనే 2వ ఓవ‌ర్లో డీకాక్‌ను వెన‌క్కి పంపాడు. ఇంత‌కు ముందు మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాట్ చేసిన రూసో కూడా అత‌నికే దొరికిపోయాడు. అప్పుడు వ‌చ్చాడు మార్క‌ర‌మ్‌. అత‌ను ధాటిగా ఆడుతూ జ‌ట్టు స్కోర్‌ను వేగంగా పెంచ‌డంలో భార‌త్ బౌల‌ర్లం ద‌రికీ పెద్ద ప‌రీక్ష‌గా మారాడు. దీనికి తోడు ఫీల్డింగ్ లోపాల‌న్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి. రెండు స్టంపింగ్‌లు, రెండు ల‌డ్డులాంటి క్యాచ్‌లూ చేజార‌డంతో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డి బ్యాట్ చేశారు. 10 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 40 ప‌రుగులు చేశారు. 12వ ఓవ‌ర్లో అశ్విన్ బంతిని ఫోర్ కొట్టే య‌త్నంలో మార్క‌ర‌మ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కానీ కోహ్లీ చేతిలోంచి క్యాచ్ మిస్ అయింది. మొత్తం ప్రేక్ష‌కులు కెప్టెన్‌తో పాటు నోరెళ్ల‌బెట్టారు. కోహ్లీ కే అర్ధం కాని ప‌రిస్తితి. అప్ప‌టి నుంచి దూకుడుగా ఆడ‌టం మ‌రింత కొన‌సాగించారు. ఎంతో అనుభ‌వం ఉన్న స్పిన్న‌ర్ అశ్విన్‌ని సిక్స్‌లు, ఫోర్లు కొట్ట‌డంతో ల‌క్ష్య సాధ‌న మ‌రింత సులువ‌యింది. 14వ ఓవ‌ర్లో అశ్విన్ ఏకంగా 17 ప‌రుగులిచ్చాడు. మార్‌క్ర‌మ్ 38 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేశాడు. 16వ ఓవ‌ర్లో ద‌క్షిణాఫ్రికా వంద ప‌రుగులూ పూర్త‌య్యాయి. ఈ స‌మ‌యంలో గాయం కార‌ణంగా కీప‌ర్ కార్తిక్ వెళిపోగా అత‌ని స్థానంలో రిష‌బ్ పంత్ వ‌చ్చాడు. త‌ర్వాతి ఓవ‌ర్లో మార్క‌క్ర‌మ్ సూర్య‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిర‌గ‌డంతో భార‌త్ ఊపిరిపీల్చుకుంది. కానీ మ‌రో వంక డేవిడ్ మిల్ల‌ర్ ఎంతో ధాటిగా దంచికొట్టాడు. ఒక్క ష‌మ్మీ త‌ప్ప అశ్విన్‌, పాండ్యాల‌ను ఇద్ద‌రి నుంచి ప‌రుగులు సాధించాడు. 18 వ ఓవ‌ర్‌కి 102 ప‌రుగులు చేసింది. ఈ ఓవ‌ర్ అశ్విన్ కి ఇచ్చి శ‌ర్మ త‌ప్పు చేశాడ‌నాలి. ఆ ఒక్క ఓవ‌ర్లోనే వీర బాదుడు బాది ఏకంగా 25 ప‌రుగులు సాధించ‌డంతో ప్రేక్ష‌కులు ఇక ఇంటికి వెళ్ల‌డ‌మే మిగిలింద‌ని అనుకున్నారు. అలా ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో గ్రూప్ 2లో మొద‌టి స్థానంలో నిలిచింది. 

ఢిల్లీ బ్రోకర్లను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు: కేసీఆర్  

ఢిల్లీ బ్రోకర్ల ను మన ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టి పంపారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని చూశారు. మేము అంగట్లో పశువులము కాదని సీఎం కేసీఆర్ అన్నారు. చండూరులో బహిరంగ సభ కేసీఆర్ మాట్లాడుతూ వందల కోట్ల డబ్బుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి.. ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ త‌న‌తో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని వాళ్ల‌ని ఎడ‌మ‌ కాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమా లయ పర్వతం అంత ఎత్తుకు ఎత్తారని తెలంగాణా మ‌ఖ్య‌మంత్రి ఎంతో గ‌ర్వంగా ప్ర‌క‌టించారు.    తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.  ప్రధాని మోదీకి ఇంకా ఏం కావాలి.. మోదీ రెండుసార్లు ప్రధానిగా చేసి కూడా.. ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నా రు? అని కేసీఆర్ ప్రశ్నించారు. అవసరం లేకుండా మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని విమర్శించారు. మునుగోడు ప్రజలు ఫలి తాలను ఎప్పుడో తేల్చేశారని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించుకుని ఓట్లు వేయాలని, ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపో తుం దని ఆయన హెచ్చరించారు. దోపిడీదారులు మాయమాటలు చెబుతూనే ఉంటారని, కరిసే పామును మెడలో వేసుకుంటా మా? అని కేసీఆర్ ప్రశ్నించారు.   మ‌నం క‌ష్ట‌ప‌డి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, మెల్ల మెల్ల‌గా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటున్నాం. మంచినీటి స‌మ‌స్య తీరింది, సాగునీరు దిండి ప్రాజెక్టు నుంచీ రావాలి. ఆ ప్రాజెక్టు పూర్త‌వుతుంది. సిద్ధాంతాల్లో భేదాలు రావ‌చ్చు. ఓటు మాత్రం ఆలోచించి వేయాలి. ప్ర‌జ‌లు చైత‌న్యంతో ఉండాలని, దోపిడీ దారుల మాయ‌మాట‌లు విన‌వ‌న‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన దుర్మార్గులకు బుద్ధిచెప్పిన న‌లుగురు తెలంగాణా బిడ్డ‌ల్లా అంద‌రూ చైత‌న్య‌వంతులు కావాల‌ని కేసీఆర్ కోరారు. అక్ర‌మార్జ‌న‌తో ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను కొనేసి ప్ర‌భుత్వాల‌ను కొనే అరాచ‌క విధానం అనుస‌రించ‌డం సిగ్గుచేట‌ని, ప్ర‌ధానికి తెలీకుండానే ఇదంతా జ‌రిగిందా, అస‌లు ఆ తెచ్చిన సొమ్ము ఎవ‌రిది, ఎక్క‌డినించీ తెచ్చార‌ని, దాని వెనుక కీల‌క వ్య‌క్తి ఎవరో తేలాలి, ఆయ‌న రాజీనామా చేయాల‌ని తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. కొనేయ‌డానికి వ‌చ్చారు, జైలు పాల‌య్యార‌ని ఎద్దేవా చేశారు.  75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నాన‌ని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడుదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాల‌ని సీఎం కేసీఆర్‌ సూచించారు. చేనేతలకు ఏ ప్రధాని చేయని దుర్మార్గం ప్రధాని మోదీ చేశారు. చేనేతలపై కేంద్రం 5శాతం జీఎస్టీ విధించింది. బీజేపీకి ఎందుకు ఓటేయాలని చేనేతలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే.. బీజేపీకి చేనేతల నుంచి ఒక్క ఓటు కూడా పోవద్దు. చేతిలో ఉన్న ఆయుధాన్ని ప్రజలు కాపాడుకోవాలి. కార్పొరేట్ల జేబులు నింపడానికే బీజేపీ పనిచేస్తోంది. విద్యుత్ సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారట. ఇళ్లల్లో మీటర్లు కూడా రూ.30వేలు పెట్టి మార్చుకోవాలట. ప్రలోభాలకు ఆశపడితే గోసపడేది మనమేన‌ని కేసీఆర్ హెచ్చరించారు. చేనేత కార్మికుల కుటుంబాలు పోరాటాలు చేయ‌ద్దు, ఓటు మాత్రం దేశం కోసం, మంచి కోసం, మంచి చేసేవారికే వినియోగించ‌డం.. బీజేపీ కి ఓటు వేయ‌ద్ద‌ని కేసీఆర్ సూచించారు.  దేశంలో 4 ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసే సామ‌ర్ధ్యం ఉంటే ప్ర‌బుత్వం కేవ‌లం 2 లక్ష‌ల మెగావాట్ల‌నే ఉత్ప‌త్తికి వీలు క‌ల్పిస్తోంది. ఇది దారుణం, ప్రైవేటీక‌ర‌ణ పేరుతో ధ‌నికుల‌కు కొల్ల‌గొట్ట‌డ‌మే త‌ప్ప దేశానికి చేస్తున్న‌దేమీ లేదు. ఇదంతా కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల ఫ‌లితం అన్న‌ది యువ‌త‌, విద్యావంతులు వారి నుంచి ప్ర‌జ‌లంతా తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని కేసీఆర్ అన్నారు. 

 డ్రామాలో గెలిచిన బంగ్లా.. ఎట్ట‌కేల‌కు పాక్ కీ ఓ విజ‌యం! 

అనేక ట్విస్టులు సినిమాల్లోనే చూస్తాం.. డ్రామా అంతా చివ‌రి భాగంలోనే చూస్తాం. హీరోని చంపేశాన‌ని విల‌న్ ఆనందంతో గ‌ట్టిగా అరుస్తూ వెళ‌తాడు.. మ‌రో అయిదు నిమిషాల్లో అస‌లు హీరో ఎంటవు తాడు.. విల‌న్ ఆశ్చ‌ర్య‌ప‌డ‌ తాడు..!  ఇలాంటి ట్విస్టే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో భాగంగా ఆదివారం బ్రిస్బేన్‌లో జ‌రిగిన బంగ్లాదేశ్‌, జింబాబ్వే మ్యాచ్ చివ‌రి ద‌శ‌లో జ‌రిగింది. చివ‌రి నాలుగు ఓవ‌ర్లు జింబాబ్వే బ్యాట‌ర్లు బాగానే ఆడారు, కానీ కీల‌క బ్యాట‌ర్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డంతో బంగ్ల‌దేశ్‌కు గెలిచే అవ‌కాశం వ‌చ్చింది. టాస్ గెలిచి ముందు బ్యాట్ చేసిన బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో న‌జ‌ముల్ శాంటో అద్భుతంగా బ్యాట్ చేశాడు. అత‌ను 71 ప‌రుగులు తీసి వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది.  జింబాబ్వే చివ‌రి ఓవ‌ర్లో చివ‌రి 2 బంతుల్లో 5 ప‌రుగులుచేయాలి. చివ‌రి బ్యాట్స్‌మెన్.. బంగ్లా స్పిన్న‌ర్ హొస్సేన్ వికెట్ తీశాడు. రిచ‌ర్డ్‌ను కీప‌ర్ స్టంపింగ్ చేయడంతో మ్యాచ్ అయిపోయింద‌ని అంతా సంబ‌ర‌ప‌డ్డారు. ప్లేయ‌ర్లంతా దాదాపు వెళిపోయారు.. డ‌గౌట్ ద‌గ్గ‌ర ఉండ‌గా వెన‌క్కి ర‌మ్మని అంపైర్‌ పిలిచారు. కార‌ణం కీప‌ర్ స్టంపింగ్ స‌మ‌యంలో బంతిని స్టంప్‌ల ముందే ప‌ట్టుకోవ డంతో  నోబాల్ కావ‌డంతో రిచ‌ర్డ్ నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. అంతే మ‌ళ్లీ అంతా వ‌చ్చారు. ఫ్రీహిట్ కూడా కావ‌డంతో వీడెక్క‌డ ఫోరో సిక్స్ గానీ కొడ‌తాడో న‌ని అంతా క‌ళ్ల‌ప్ప‌గించి చూశారు.. తీరా ఆ త‌ర్వాతి.. చివ‌రిది మ‌ళ్లీ వేసిన చిట్ట‌చివ‌రి బంతికి ప‌రుగుతీయ లేక పోయాడు.హ‌మ్మ‌య్య‌..అనుకున్నారంతా..  బంగ్లా గెలిచిన ఆనందాన్ని ఇంకాస్త కొన‌సాగించింది.. ఒకే మ్యాచ్ రెండు సార్లు గెల‌వ‌డం అంటే ఇదే మ‌రి! ఇలా ఎన్న‌డూ జ‌ర‌గ లేదు. మొత్తానికి బంగ్లాదేశ్ జింబాబ్వే పై 3 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ విజ యంతో బంగ్లాదేశ్ గ్రూప్ 2లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచి రెండో స్థానంలోకి వెళ్లింది. జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో ఒక్క‌టి గెలిచి 4వ స్థానంలో నిలిచింది. ఆదివారం జ‌రిగిన మ‌రో మ్యాచ్‌లో  షాదాబ్‌, రిజ్వాన్‌లు విజృంభించ‌డంతో పాకిస్తాన్ నెద‌ర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ముం దుగా బ్యాట్ చేసిన నెద‌ర్లాండ్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 91 ప‌రుగులే చేసింది. పాకిస్తాన్ 13.5 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 95 ప‌రు గులు చేసింది.  పాక్ బౌల‌ర్ల ను నెద‌ర్లాండ్స్ ఎదుర్కొన‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌యింది. షాదాబ్‌, ఆఫ్రిదీ, రావూఫ్, వాసిమ్, న‌జీమ్ అందరూ ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లోకి వ‌చ్చారు. ముఖ్యంగా షాదాబ్ నాలుగు ఓవ‌ర్ల‌లో 22 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నెద‌ర్లాండ్స ఇన్నింగ్స్‌లో కాలిన్ అక‌ర్మాన్ మంచి బ్యాటింగ్ నైపుణ్యం ప్ర‌ద‌ర్శించి 27 బంతుల్లో 27 ప‌రుగులు చేశాడు. పాక్ ఇన్సింగ్స్ ఆరంభం నుంచే రిజ్వాన్ దూకుడుగా ఆడుతూ నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌ను ఇబ్బందిపెట్టాడు. కానీ మ‌రో వంక కెప్టెన్ బాబ‌ర్ అజామ్ మాత్రం అదే పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచాడు. అత‌ని త‌ర్వాత వ‌చ్చిన ఫ‌క‌ర్ జ‌మాన్  రిజ్వాన్ తో క‌లిసి ఇన్నింగ్స్ నిల‌బెట్టాడు. ఇద్ద‌రు 31 బంతుల్లో 37 ప‌రుగులు చేశారు. ఇద్ద‌రూ ధాటిగా ఆడుతుండ డంతో వీరే మ్యాచ్‌ని పూర్తిచేస్తార‌నిపించింది. కానీ ఆ వెంట‌నే స్కాట్ ఎడ్వ‌ర్డ్స్ అద్బుత క్యాచ్ ప‌ట్ట‌డంతో ఫ‌క‌ర్ జ‌మాన్ వెనుది ర‌గాల్సి వ‌చ్చింది. అప్ప‌టికి అత‌ను 20 ప‌రుగులు చేశాడు. రిజ్వాన్ మ‌రింత వేగంగా ప‌రుగులు చేయ‌డంలో అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేయా ల్సింది కానీ ఒక్క ప‌రుగు దూరంలో పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. మొత్తానికి పాకిస్తాన్ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని అధిగ‌మించ డానికి 4 వికెట్లు కోల్పోయింది. అయితే చిన్న ఆనంద‌మేమంటే, ప్ర‌స్తుతం ఈ టోర్నీలో ఇదే పాక్ సాధించిన తొలి విజ‌యం. అంతేగాక ఆస్ట్రేలియాలో టీ 20 తొలి విజ‌యం కూడా ఇదే!   

ఓట్ల కోస‌మే ఉమ్మ‌డి పౌర‌సత్వ అంశం... ఓవైసీ

దేశంలో త‌మ అధికారం మ‌రింత బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అనుస‌ రిస్త‌న్న మార్గాల‌ను విప‌క్షాల‌న్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. హిందుత్వం, హిందూసంర‌క్ష‌ణ అంటూ దేశంలో అన్నివ‌ర్గాల రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర విభేదాలు సృష్టిస్తున్న‌ద‌ని మండిప‌డు తు న్నాయి. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌ యంలోనే హిందుత్వం అంశం తెర‌మీద‌కు తెచ్చి గొడ‌వ‌లు సృష్టించ‌డం త‌ప్ప దేశాన్ని అభి వృద్ధి ప‌థంలో న‌డిపేందుకు కించిత్ ప‌నిచేయ‌ డంలేద‌ని విప‌క్షాలు భారీ ఆరోప‌ ణ‌ల‌తో దాడిచేస్తున్నాయి.  హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకు వెళ్లి రాబోయే గుజరాత్ ఎన్ని కల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడు తూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు. హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశా న్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లా వడ్గాంలో జరి గిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ స్వచ్ఛందంగా ఉండాలని, తప్పనిసరి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పింది నిజం కాదా? బీజేపీ మాత్రం హిందుత్వ ఎజెండా ను ముందుకు తీసుకు వెళ్లేందుకు, ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం ఒక అలవాటుగా మార్చుకుంద‌ని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 25,26,14,20 ఆర్టికల్స్ ద్వారా ఇది సాధ్యమైంది. యూసీసీ అమలు ద్వారా మైనారిటీ హక్కులను పరిరక్షించే ఆర్టికల్ 29కి వ్యతిరేకంగా ఎవరైనా చట్టం చేస్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ కింద ఆదాయం పన్ను రిబేట్ ప్రయోజనాల నుంచి ముస్లింలు, క్రైస్తవులను ఎందుకు మినహా యించారో చెప్పాల‌న్నారు. ఇది సమానత్వ హక్కుకు వ్యతిరేకం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి అన్ని కోణాల నుంచి మదింపు చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం శనివారంనాడు ప్రకటించిన నేపథ్యంలో ఒవైసీ తాజా వ్యాఖ్యలు చేశారు.

క‌రాచీ పార్టీల్లోనే అల‌వాట‌యింది...కొకైన్ వ్య‌స‌నం పై అక్ర‌మ్‌

వసీం అక్రమ్ తన కొత్త పుస్తకం సుల్తాన్: ఎ మెమోయిర్ లో తన కొకైన్ వ్యసనం గురించి అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాన్ని వెల్ల డించాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆటలోని గొప్ప ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. 1984లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసిన అక్రమ్, తర్వాత 19 ఏళ్లపాటు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు, 2009లో శ్రీలంక స్పిన్న‌ర్‌ ముత్తయ్య మురళీధరన్ అతనిని అధిగమించే వరకు వన్డేల్లో అత్యధిక వికెట్లు (502) సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. టెస్టు ల్లో, అక్రమ్ పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 104 మ్యాచ్‌లు ఆడి 25 ఐదు వికెట్లతో 414 వికెట్లు తీశాడు. మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 1992 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో  పాకిస్తాన్ కు మొదటి టైటిల్‌ను అందించాడు. ఎంతో ఉన్న‌త‌స్థాయి లెఫ్ట్ఆర్మ్ పేస‌ర్‌గా అన్ని దేశాల్లో అభిమానుల‌ను సంపాదించు కున్నాడు.  అక్రమ్ పాకిస్తాన్ క్రికెట్‌లోని లెజెండ్‌లలో ఒకరిగా రిటైర్ అయినప్పుడు, మాజీ క్రికెటర్ ఇప్పుడు తన ఆట తర్వాత కెరీర్‌లో చీకటి దశ గురించి ఒక ప్రధాన  అంశాన్ని బహిర్గతం చేశాడు. ప్రస్తుతం 56 ఏళ్ల అక్రమ్ తన పదవీ విరమణ తర్వాత కొకైన్‌కు బానిసై నట్లు అంగీకరించాడు. అతను దాన్నుంచీ బ‌య‌ట‌ప‌డేందుకు ఎంతో ప్ర‌య‌త్నించాన‌ని కానీ ఫలితం లేకుండా పోయిందనీ అన్నాడు. తాను ఎప్పుడూ ఎంతో ఆనందంగా గ‌డ‌పాల‌నే అనుకుంటాన‌ని, పార్టీలంటే యిష్ట‌ప‌డ‌తాన‌ని అన్నాడు. అయితే దుర దృష్ట మేమంటే ద‌క్షిణాసియాలో కీర్తి సంస్కృతి అంతా అవినీతిమ‌య‌మైన‌ద‌న్నాడు. మీరు రాత్రికి పది పార్టీలకు వెళ్లవచ్చు ఎవ‌రూ ప్ర‌శ్నించ‌రు, కొందరు అలా చేస్తుంటార‌ని,  అది  త‌న‌పై ప్రభావం చూపింద‌ని, ఆ అల‌వాట్లే దుర్గుణాలుగా మారాయ న్నాడు. అన్నింటికంటే చెత్తగా,  కొకైన్‌పై ఆధారపడటాన్ని పెంచుకున్నానన్నాడు. ఇంగ్లండ్‌లోని ఒక పార్టీలో నాకు లైన్‌ను అందించినప్పు డు ఇది చాలా హానికరంగా ప్రారంభమైంది; నా ఉపయోగం క్రమంగా తీవ్రంగా పెరిగింది, అది పని చేయడానికి నాకు అవసరమని నేను భావించానని అక్రమ్ వెల్లడించాడు. తన వ్యసనం రహస్యంగా కరాచీకి వెళ్లి పార్టీ చేసుకునే స్థాయికి చేరుకుందని అక్రమ్ వెల్లడించాడు.  అక్రం అప్పటి భార్య హుమా త‌న‌కు తెలుసున‌ని, ఈ సమయంలో తరచుగా ఒంటరిగా ఉండేదని, ఆమె కరాచీకి వెళ్లాలని, తన తల్లిదండ్రులు, తోబుట్టు వులకు దగ్గరగా ఉండాలని తన కోరిక గురించి మాట్లాడేద‌ని, తాను అయిష్ట‌ప‌డేవాడిన‌ని అక్ర‌మ్ వెల్ల‌డించాడు. అంతెందుకు, క‌రాచీకి వెళ్ల‌డం త‌న‌కు బాగా న‌చ్చినందువ‌ల్ల ఏదో ప‌నిమీద వెళుతున్న‌ట్టుగా, పార్టీల గురించి త‌ర‌చూ రోజుల త‌ర‌బ‌డి వెళ్ల‌డం అల‌వాట‌యింద‌న్నాడు పాక్ మాజీ పేస‌ర్‌. కానీ త‌న భార్య హూ్య‌మా చివ‌రికి తెలుసుకుంద‌ని, వాలెట్‌లో కొకైన్ ప్యాకెట్ చూడడంతో అడ్డంగా దొరికిపోయాన‌న్నాడు. కొకైన్ ను దూరం చేసింద‌ని, ఆ అల‌వాటును నియంత్రించ‌లేక‌పోయాన‌న్నాడు. తిండి, నిద్ర‌కు క‌రువై విప‌రీత‌మైన త‌ల‌నొప్పితో చాలా బాధ‌ప‌డ్డాన‌న్నాడు. రిహాబిలిటేష‌న్ సెంట‌ర్‌కి వెళ్లాడు, కానీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ట‌. త‌ర్వాత ఆయ‌న భార్య హ్యూమా దుర‌దృష్ట‌వశాత్తూ జ‌బ్బున‌ప‌డి మ‌ర‌ణించారు. దాంతో అక్ర‌మ్ జీవితంలో ఎంతో మార్పు వ‌చ్చింది. ఆమె అత‌న్ని డ్ర‌గ్స్‌కు దూరం చేయ‌డంలో చేసిన నిస్వార్ధ సేవ అత‌న్ని క‌దిలించేసింది. ఊహించ‌నంత‌గా జీవితంలో గొప్ప మార్పు వ‌చ్చింది. ఇపుడు మంచి వ్య‌క్తిగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాడు.

48 గంట‌లు ప్ర‌చారానికి దూరంగా ఉండండి...జ‌గ‌దీష్‌రెడ్డికి ఈసీఐ నిషేధం

అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరించడంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లం ఘించినందుకు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇంధన శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని 48 గంటల పాటు ప్రచారం చేయ కుండా భారత ఎన్నికల సంఘం శనివారం నిషేధించింది. ఎన్నికల సంఘం మంత్రిని బహిరంగ సభలు, కార్యక్రమాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు,  మీడియా నిష్క్రియాలను నిర్వహించకుండా నిషేధించింది. అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈసీ ఆర్డర్ 48 గంటల పాటు అమలులో ఉంటుంది. మంత్రి తనపై అందజేసిన నోటీసుకు వివరణ ఇచ్చినప్పటికీ, ఈసీ అతని సమాధానంతో సంతృప్తి చెందలేదు. మంత్రి చేసిన ప్రసంగం తీరు, భావం ఓటర్లను భయపెట్టే విధంగా ఉందని, అందువల్ల మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పేర్కొన్న ఉల్లంఘనకు ఆయనపై నిందలు వేస్తున్నట్లు ఈసీ శనివారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబరు 25న మునుగోడులో జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ కె.రాజగోపాల్‌రెడ్డిల మధ్య ఎన్నికలు జరగలేదని, సంక్షేమ పథకాలు కావాలా కాదా అని మంత్రి అనడంతో ఈసీ నోటీస్‌ను కొట్టేసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తానెప్పుడూ చెప్పలేదని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తు న్న సంక్షేమ పథకాలను వివరించేందుకు నేను చేసిన ప్రయత్నం మాత్రమేనని జగదీశ్‌రెడ్డి ఈసీ నోటీసుకు సమాధాన మిచ్చారు. త‌న‌ ప్రకటన అవినీతి కార్యకలాపాల నిర్వచనం కిందకు రాదని ఆయన అన్నారు. బీజేపీ నేత కె.దిలీప్ కుమార్ చేసిన ఫిర్యాదు అస్పష్టమైనదని, అబద్ధమని, అవాస్తవమని మంత్రి అన్నారు. థీమీటింగ్‌లో తాను తెల్గులో మాట్లాడానని, తన ప్రసంగం ట్రాన్‌స్క్రిప్ట్ ను ఈసీకి ఎలా అందించారనే దానిపై క్లూ ఉందని చెప్పాడు.

రాజ‌గోపాల్‌రెడ్డి సంస్థ‌నుంచి న‌గ‌దు బ‌దిలీ...ఈసీ కి ఫిర్యాదు

మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులు, కంపెనీలకు రూ. 5.2 కోట్లు ఇటీవల బదిలీ అయినట్లు టీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ నగదు బదిలీలపై దర్యాప్తు చేయాలంటూ టిఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ కుమార్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రకరకాలు వ్యాపారాలు చేస్తున్నవారికి, తమ కంపెనీతో ఎలాంటి సంబంధం లేనివారికి లక్షల్లో నగదు బదిలీ అయిందని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో కంపెనీ నుంచి ఏయే మార్గల ద్వారా ఎవరెవరికి బదిలీ అయిందో తెలుపుతూ వివరాలు లేఖలో పొందుపర్చారు. వెంటనే ఆ ఖాతాలను జప్తు చేసి.. అక్కడి నుంచి నగదు బయటకు రాకుండా చూడాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిం ది. దీంతో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ద‌ప‌డుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండటంతో... ప్రతీఓటూ కూడా పార్టీలకు కీలకంగా మారింది. ఏ ఒక్క ఓటును కూడా పార్టీలు వదులు కునేందుకు ఇష్టపడటం లేదు. ఓటు వేస్తాడని తెలిసినా, తెలియకపోయినా సరే ప్రతిఒక్కరికీ డబ్బులు పంచుతున్నట్లు చెబుతున్నారు. దీంతో మునుగోడులో ధనప్రవాహం ఏరులై పారుతోంది. అభ్యర్థులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా దారబోస్తు న్నారు. కాంగ్రెస్ కొంచెం ఇందులో ఒక స్టెప్ వెనకుండగా.. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం ధారాళంగా ఖర్చు పెడుతు  న్నారు. ఓట‌ర్ల‌కు పంపిణీ చేసేందుకు భార‌తీగా న‌గ‌దు ఖాతాల్లోకి బ‌దిలీ చేశార‌ని టీఆర్ ఎస్ ఆరోపించింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ త‌ర‌హాలో భారీ న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డ‌మేన‌ని టిఆర్ ఎస్ నేత భ‌ర‌త్ కుమార్ పేర్కొ న్నారు. ప్ర‌జాస్వామ్యంలో త త‌ర‌హా చ‌ర్య‌లు సిగ్గుచేట‌ని దుయ్య‌బ‌ట్టారు. 

మునుగోడులో గెలిచేది ఆ  పార్టీ యేనా

మునుగోడు ఉప ఎన్నిక ను అన్ని పార్టీలు చాలా సీరియస్ గానేతీసుకుంటున్నాయి. ముఖ్యంగా రాబోయే ప్రధాన ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీస్ గా భావించడంతో అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది.  మునుగోడును అడ్డుపెట్టుకుని తెలంగాణాలో అధికారం చేపట్టాలన్న పట్టుదలతో బీజెపీ ఉంది. మరో వైపు కాంగ్రెస్ టీపీసిసీ అధ్యక్షుడు రేవంత్ సారధ్యంలో బీజేపీ, టీ ఆర్ ఎస్ లకు చెక్ పెట్టి కేసీ ఆర్ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని  రెండింతల ఆవేశంతో ముందుకు ఉరుకుతోంది. టీ ఆర్ ఎస్ ఎలాగైనా కాంగ్రెస్ను, బీజేపీ నీ తమ అధికారాన్ని కొల్లగొట్టకుండా చూసే యత్నంలో ఉంది. అయితే తాజా పరిణామాల దృష్ట్యా, టిఆర్ఎస్ కు అంత సీన్లేదని బీజేపీ విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయని  కాంపాక్ట్ సర్వే వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన అనేక సర్వేలు మాత్రం బీజేపీయే ఈసారి మునుగోడులో గెలుస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికలు, ఫలితాలు అత్యంత ఉత్కంఠభరితం గా జరుగుతాయనే చెప్పాలి. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 2 లక్షల,43వేల,594 ఓట్లున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అనుసరించి బీజేపీ 36 శాతం, అధికార టీఆర్ఎస్ పార్టీ 41 శాతం ఓట్లు సాధించుకోవచ్చని కాంపాక్ట్ సర్వే తెలియజేసింది. మునుగోడులో కాంగ్రెస్కు 14శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు రావచ్చని తెలుస్తోంది.  మండలాల వారీగా చూసుకుంటే.. చండూరు మున్సిసిపాలిటీలో 9 వేల 950, రూరల్ లో 19 వేల 500 ఓట్లున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీల మధ్య మంచి పోటీ ఉంది. అయితే డబ్బు పంపిణీ జరుగు తున్న నేపథ్యంలో ఓటరు ఎటు మొగ్గు చూపుతాడన్నది అనుమానమే. కాంగ్రెస్ కంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యే పోటాపోటీ నడుస్తోంది. ప్రచారంలో గాని, ఓటర్లను ఆకట్టుకోవడంలోగాని బీజేపీ ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంటోంది. కాగా చౌటుప్పల్ మున్సిపాలిటీ 20 వార్డుల్లో 25 వేల 493 ఓట్లు ఉన్నాయి. చౌటుప్పల్ లో మొదటి రెం డు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్ ఓట్లు సమానంగా పంచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే గతంలో ఇక్కడి కాంగ్రెస్ ఓటు బ్యాంకును రెండు పార్టీలు సమానంగా పంచుకు నేలా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ క్రమేపీ ప్రాభవం కోల్పోయిందనే అనాలి. కానీ భారత్ జోడో యాత్ర ప్రభావం అంతగా లేదనేది స్పష్టమవుతోంది. అయితే పదిరోజుల క్రితం బీజేపీకి చెం దిన ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు తంగేడుపల్లి, మరొకరు లింగోజిగూడెంకు చెందిన వారు టీఆర్ఎస్ లో చేరటం గమనార్హం. ఇది బీజేపీపై ప్రభావం చూపవచ్చు.  కాగా 16 వేలకు పైగా ఓట్లున్న గట్టుప్పల్ లో బీజేపీ కంటే టీఆర్ఎస్ వెనకంజలో ఉందనే చెప్పాలి. బీజేపీకి 50 శాతం ఓట్లు రావడానికి చాలా అవకాశా లున్నాయి. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు మోహరించినప్పటికీ ఓటరు అధికార పార్టీకే ఓటువేస్తా రనే గ్యారంటీ లేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ ఓట్లు చీలవచ్చు. గతంలో కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న మర్రిగూడలో దాదాపు 28 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ టీఆర్ ఎస్ బలం ఇటీవలి రాజకీయ పరిణామాలతో తగ్గిందనాలి. అధికారపార్టీ ఇక్కడి యువతను ఆకట్టుకోవడానికి విశ్వయత్నాలు చేస్తోంది. ఇక్కడ బీఎస్పీకి కూడా అభిమానులు ఉన్నారు. టీఆర్ ఎస్ ప్రాభవం ఉన్న చాలా గ్రామాల్లో ఓటర్లను డబ్బుతో బాగా ఆకట్టుకుంది. దీనితో ఓటర్లు టీఆర్ఎస్ కు పట్టం కట్టవచ్చు. కానీ డబ్బుల పంపిణీ జరగడం అనేది యింకా అమలు కాలేదు గనుక ఓటర్ మనసు మార్చుకున్నా పెద్దగా ఆశ్చర్యపడనవసరం లేదు.  ఇక అత్యంత కీలకమైన మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ రెండూ బరాబరీగా ఉన్నాయి. ఇక్కడ 36వేల మంది ఓటర్లలో చాలామంది బీజేపీకే మొగ్గుచూపుతున్నారనాలి. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ కోటగా భావించినప్పటికీ ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో తలెత్తిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కొంత ఇబ్బందుల్లో పడిందనాలి. పైగా ఇక్కడ కోమటిరెడ్డి సోదరులకు అభిమానుల బలం ఎక్కువే. మరో వంక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన సోదరుడు వెంకటరెడ్డి పట్ల పార్టీ వర్గాలు కూడా నమ్మకం కోల్పోయాయి. అయితే టీఆర్ ఎస్ ను బలపరిచేందుకు కేసీఆర్ మహాసభ విజయవంతం అయితే పోటీ మరింత పోటాపోటీగా మారుతుంది. అయినప్పటికీ పరిస్థితులు టీఆర్ఎస్ కు అంతగా అనుకూలించవని విశ్లేషకుల మాట. ఇక్కడ అనూహ్యంగా బీజేపీకి మెజారిటీ ఓట్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి.  కోమటిరెడ్ది అభిమానులు తప్పకుండా ఈ పరిస్థితుల్లో బీజేపీ నే గెలిపించే అవకాశాలున్నాయని కోపాక్ట్ సర్వే వెల్లడించింది.  కాగా మునుగోడు నియోజకవర్గంలో వెనుకబడినప్రాంతంగా పేర్కొనే నాంపల్లి అభివృద్ధి ఏమాత్రం లేకపోవడంతో ప్రజలు అధికార టీఆర్ ఎస్ పార్టీ పట్ల ఆసక్తి చూపడం లేదు. తండాలు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో 35వేల ఓట్లున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల మాత్రం ప్రజలు విముఖంగా లేరు.  అధికార పార్టీ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కి కూడా వీరాభిమానులు ఉన్నారని సర్వేలో తేలింది. ఇక్కడ త్రిముఖ పోటీకీ అవకాశం ఉందని కోపాక్ట్ సర్వే స్పష్టం చేసింది.  కాగా నారాయణపురం విషయానికి వస్తే, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు మంచి పేరుంది. కాగా టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడివాడే కావడంతో టీఆర్ ఎస్ ప్రతిష్టాత్మకంగానే తీసుకుందనాలి. 36 వేల మందికి పైగా ఓటర్లున్న నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి వ్యక్తిగత అభిమానులు ఉండటంతో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని. ఇక్కడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి షిఫ్ట్ అయితే, ఆ పార్టీకి లీడ్ ఉంటుందని కాంపాక్ట్ సర్వే స్పష్టం చేసింది. ఇదే మండలంలోని గుడిమల్కాపూర్ లో వివిధ పథకాలు బాగా అమలు కావడంతో టీఆర్ఎస్ కి కలిసిరావచ్చని పేర్కొన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అదే జరిగితే ఇక్కడ బీజేపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని సర్వే పేర్కొంది. 

అప్పుడలా.. ఇప్పుడిలా..

నాడు నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో లీక్ చేసి తెలంగాణకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరగబోతోందన్న బిల్డప్ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పడు  కేటీఆర్ బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా కోరుతున్న ఫోన్ సంభాషణ అడియో రిలీజైతే మాత్రం అందులో తప్పేముంది. నేనే మాట్లాడా, అది నా గొంతే అని దబాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. తాను చేస్తే రైటు.. ఇతరులు ఏం చేసినా రాంగ్ అన్న టీఆర్ఎస్ వైఖరికి ఇది నిదర్శనం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు ఓటుకు నోటు కేసులో  అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ తో తెలుగుదేశం అధినేత.. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు  అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఆ ఫోన్ కాల్ లో స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన మాటలలో సొమ్ము ప్రస్తావన ఏదీ లేదు. అయినా అప్పట్లో చంద్రబాబు మాటలతో తెలంగాణలో ఏదో  బ్రహ్మాండం బద్దలైపోయినంత హడావుడి చేసింది. నాడు ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు ఎక్కడా డబ్బు ప్రస్తావన చేయలేదు. మనవాళ్లు నాకు బ్రీఫ్ చేశారు. వారేం చెప్పారో అది జరుగుతుంది. మనం కలిసి పని చేద్దాం అని అన్నారు. దానితోనే కోట్ల రూపాయల వోటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారంటూ అప్పట్లో తెరాస సర్కార్ హడావుడి చేసింది. ఇప్పుడు కేటీఆర్ ఒక బీజేపీ నాయకుడిని టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఫోన్ లో మాట్లాడుతున్న ఆడియో లీక్ అయ్యింది. మనుగోడు ఉప ఎన్నిక తో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడేదీత లేదు.. టీఆర్ఎస్ సర్కార్ కూలిపోయేదీ లేదు.  అందుకే మీరు మా పార్టీలోకి రండి మీ ఆశీర్వాదం కావాలి అంటే పార్టీలో చేరాల్సింగా ఒత్తిడి చేశారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఔను   అవును నేనే మాట్లాడాను. తప్పా. ఆయనను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేమన్నా తప్పా.. పని చేశాం అని చెప్పాం. పార్టీలోకి రమ్మని అడిగాం తప్పేముంది అన్నారు. ఈ రెండు ఆడియోలూ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. నాడు చంద్రబాబు విషయంలో ఒకలా.. నేడు కేటీఆర్ విషయంలో ఒకలా టీఆర్ఎస్ స్పందన ఉండటం గమనార్హం అంటూ పరిశీలకులు అంటున్నారు.

రిమాండ్ కు  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు...హైకోర్టు  తీర్పు

అధికార తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు లో నిందితుల రిమాండ్ కు హైకోర్టు అనుమతించింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామిలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోవాలని ాదేశించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రామాలో పట్టుబడిన నిందితులకు 41 ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్ కు తరలించేం దకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వాదనలు విన్న తర్వాత నిందితులకు రిమాండ్ కు అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్ల కూరు సుమలత తీర్పు వెలువరించారు. వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర చాలని ఆదేశించారు.  రిమాం డ్‌ను నిరాకరిస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు శుక్ర వారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు లంచ్ మోషన్‌ను తరలించడం ద్వారా ముందస్తు విచారణను కోరింది, అయితే కోర్టు రెగ్యులర్ పిటిషన్‌ను కోరింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామి అనే ముగ్గురు నిందితులను విడుదల చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పోలీ సులు సవాలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు  బుధవారం రాత్రి టీఆర్ ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఎరచూపించి బీజపీ పార్టీలోకి  తీసుకు రావడానికి, పార్టీలో ఉన్నత పదవులతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడానికి  ప్రయ త్నించారు. ఆ ముగ్గుకు వ్యక్తులను సరూర్ నగర్ లో న్యాయమూర్తి నివాసానికి గురువారం రాత్రి పోలీసులు తీసికెళ్లారు. కానీ నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపేం దుకు పోలీసులు చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.  నిందితులుగా పేర్కొన్న ముగ్గురు టీ ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి  ఆకట్టుకోవడానికి  చేసే యత్నం లో డబ్బు ఆశ చూపారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి పోలీసుల అభ్యర్ధ నను నిరాకరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని ఆయన అన్నారు.  కాగా,ఈ కేసు విషయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.  బీజేపీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తెలంగాణా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  మునుగోడు ఉప ఎన్నికలనేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్  కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేస్‌ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిష నర్ హైకోర్టును కోరారు. పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు. 

రాహుల్ భారత్ జోడో యాత్రను మసకబార్చడానికేనా?

ఎవరు ఔనన్నా కాదన్నా రాహుల్ భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇప్పటి దాకా రాహుల్ పాదయాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలోనూ మంచి స్పందన లభించింది. మీడియా కూడా రాహుల్ పాదయాత్రకు మంచి కవరేజే ఇచ్చింది. కానీ ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టే సరికి సీన్ మారిపోయింది. రాహుల్ పదయాత్రకు జనస్పందన ఎలా ఉంది అన్న విషయం కూడా తెలియనంతగా మీడియా ఆయన యాత్రను డౌన్ ప్లే చేస్తోంది. అయితే ఇది ఉద్దేశ పూర్వకంగా కాదని పరిశీలకులు అంటున్నారు. ఆయన పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భంగా జనస్పందన, యాత్ర వివరాలకు మీడియా , సామాజిక మీడియాలో మంచి కవరేజ్ వచ్చింది. దీపావళి సందర్భంగా విరామం ఇచ్చి తరువాత తెలంగాణలో ఆయన పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ అది ఎవరికీ పట్టని వ్యవహారంగా మారిపోయింది. మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ హడావుడిలో మునుగోడు ప్రచార సంరంభం కూడా మసకబారిపోయింది. అది పక్కన పెడితే రాజకీయ వర్గాలలో మాత్రం రాహుల్ పాదయాత్ర ప్రాముఖ్యతను తగ్గించడానికే ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల డ్రామాకు తెరలేచిందా అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.  కాంగ్రెస్ ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి బీజేపీకి ఇప్పుడు ప్రధానంగా అడ్డుపడుతున్నది రాహుల్ భారత్ జోడో యాత్రే. ఆయన యాత్రకు వస్తున్న ఆదరణ  బీజేపీ టాప్ బ్రాస్ లో బెదురు పుట్టించిందనడంలో సందేహం లేదు. అందుకే మోడీయే స్వయంగా కాంగ్రెస్ కదులుతోంది జాగ్రత్త అంటూ బీజేపీ క్యాడర్ ను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవద్దనీ, ఆ పార్టీ కొత్త పంథాలో, కొత్త వ్యూహాలతో చురుగ్గా పుంజుకుంటోందనీ హెచ్చరించారు. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి ఆయన అలా అన్నారనే అనుకోవాలి.  ఇప్పుడు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రవేశించిన తరువాత అప్పటి వరకూ ఆ యాత్రకు వచ్చిన కవరేజ్ హఠాత్తుగా ఆగిపోయింది. అందుకు కారణంగా బయటకు కనబడుతున్నది ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం. ఈ విషయంలోనే రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ లు కూడబలుక్కునే ఈ వ్యవహారానికి తెరలేపారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో బీజేపీ, తెరాసలు కూడబలుక్కున్నాయా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. తమ సందేహాలకు కారణంగా వారు బీజేపీ లక్ష్యం కాంగ్రెస్ ముక్త భారత్ అయితే.. కేసీఆర్ అవసరం లిక్కర్ స్కామ్ నుంచి తన బిడ్డను కాపాడుకోవడం అని అంటున్నారు. అందుకే ఉభయతారకంగా మునుగోడు ఉప పోరులో పోటీ విషయాన్ని విస్మరించి.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు, రాహుల్ పాదయాత్ర ప్రభావం లేకుండా చూసేందుకు కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. 

మునుగోడులో బీసీ ఓట్లే కీలకం.. మొగ్గు ఎటు?

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, విపక్ష  బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ నియోజకవర్గాన్ని  84 యూనిట్లుగా చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లను ఆయా యూనిట్లలో మోహరించింది. అలాగే బీజేపీ కూడా ఇక్కడ విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  అందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోకి సైతం వెళ్లి ప్రచారం చేస్తూ బీజేపీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం.. తన ఐదో విడత మహా సంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌  వేసి మరీ   మునుగోడు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యం అన్నట్లుగా కదన రంగంలోకి దూకింది. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. మునుగోడులోనే బస చేసి మరీ.. పార్టీ  విజయం కోసం సర్వశక్తుల ఒడ్డుతున్నారు. అందుకే రాహుల్ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి ఇలా పాల్గొని.. అలా మళ్లీ మునుగోడుకు వచ్చేసి.. తన ప్రచారాన్నికొనసాగిస్తున్నారు. అయితే దుబ్బాక, హూజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్.. మునుగోడులో ఎలాగైనా గెలిచి తీరాలన్న ధ్యేయంతో ప్రచారాన్ని మరో లెవల్ కు తీసుకువెడుతోంది. అలాగే బీజేపీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలిచాం.. ఆలాగే మునుగోడులో కూడా గెలిచి కమలం సత్తాను  సీఎం కేసీఆర్‌కు మరోసారి రుచిచూపించాలని ఉవ్విళ్లూరుతోంది.  అందుకు అనుగుణంగానే ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.  మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేలకుపైగా బీసీలే.  మునుగోడు లో ఎవరు విజయం సాధించాలన్న బీసీ ఓట్లే అత్యంత కీలకం. ఈ విషయమే మూడు పార్టీలలోనూ టెన్షన్ కు కారణమౌతోంది. ఎందుకంటే మునుగోడు బరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ముగ్గురూ  రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. అలాంటి వేళ..   బీసీ ఓట్లు కోసం ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే కాదు.. బీసీలను తమ వైపు తిప్పుకుంటే.. తమ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే  అని భావిస్తున్నాయి.  మరి బీసీలు ఎవరి వైపు.. ఏ పార్టీ వైపు.. ఎవరి పక్షాన నిలబడారనేది తెలియాలంటే మాత్రం నవంబర్ 6వ తేదీ వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మునుగోడు ఫలితం తరువాత టీఆర్ఎస్ కు చుక్కలేనా?.. వరదలా బీజేపీలోకి వలసలేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత ఇప్పటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని, ఎదురు లేని పెత్తనం, ఆధిపత్యం చెలాయించిన పార్టీ. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయా. ప్రజా వ్యతిరేకతతో పాటు.. పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి తార స్థాయికి చేరిందా? అంటే పరిశీలకులు అవునంటున్నారు. అధినాయకత్వంపై తిరుగుబావుటా ఎగురువేయడానికి సిద్ధమైన వారి సంఖ్య భారీగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కారణం 2014, 2019 ఎన్నికల తరువాత కేసీఆర్ నిర్వహించిన ఆపరేషన్ ఆకర్ష్ మిషన్ లేనని చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో పెద్ద సంఖ్యలో ఇరత పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో తెరాస పూర్తిగా కక్కిరిసి పోయిందంటున్నారు. అలా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో వారిపై తెరాస తరఫున పోటీ చేసి పరాజయం పాలైన వారికి పార్టీలో గుర్తింపు లేకండా పోయిందనీ, అలా గుర్తింపు లేకుండా పోయిన వారిలో అత్యధికులు తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ తెరాసతో కలిసి నడిచిన వారేనని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా ఇకపై తమది ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించడంతో ఉద్యమ నేతలకు, ఉద్యమ కారులకు ఇకపై పార్టీలో ప్రాధాన్యత ఉండదని చెప్పకనే చెప్పేసినట్లయ్యింది. దాంతో ఉద్యమ కాలం నాటి నేతలంతా పార్టీ నేతలంతా పార్టీలో ఉన్నప్పటికీ మానసికంగా అనుబంధాన్ని కోల్పోయామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సిట్టింగులకే టికెట్లు అని కేసీఆర్ ప్రకటించేయడంతో చాలా నియోజకవర్గాలలో ఆశావహులు ఇక టీఆర్ఎస్ లో కొనసాగడం అనవసరం అన్న అభిప్రాయానికి వచ్చేశారు. అలాగే గత ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు తమ నియోజకవర్గంలోనే గత ఎన్నికలలో ప్రత్యర్థులుగా నిలిచి గెలిచిన వారి తరఫున ప్రచారం చేయడానికి సిద్ధపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెరాస నుంచి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో  చిక్కిన వారిలో నందు అనబడే నందకుమార్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనీ, ఆ డైరీలో తెరాసకు చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారనీ, వారు పార్టీ మారడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.  బీజేపీని ట్రాప్ చేయడానికో, లేక వారి ట్రాప్ లో పడటానికో  ఫామ్ హౌస్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలూ ఇప్పటికీ ప్రగతి భవన్ లోనే ఉండటం.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటం పై తెరాస వర్గాల్లోనే పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఆ నలుగురినీ ఫామ్ హౌస్ లో నిర్బంధించారా అన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఒక వేళ వారు నిజంగానే బీజేపీ అగ్రనేతలను ట్రాప్ చేయడానికే అక్కడకు వెళ్లి ఉంటే వారిని ప్రగతి భవన్ కు పరిమితం చేయకుండా.. మునుగోడు ప్రచారానికి పంపి పార్టీ క్యాడర్ చేత బ్రహ్మరథం పట్టించేవారు కదా అని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో టీఆర్ఎస్ బండారం బయటపడే పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం అటూ ఇటూ అయినా.. అంటే తెరాస విజయం సాధించకపోతే మాత్రం కేసీఆర్ కు తలనొప్పులు తప్పవనీ, తెరాస నుంచి వలసలు గట్టు తెంచుకుని ప్రవహించే వరదలా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఆ వలసలను నివారించడమెలా అన్నదే కేసీఆర్ ముందున్నపెద్ద సవాల్ అనీ, ఆ విషయంలో కేసీఆర్ పార్టీ నేతలను నియంత్రించ లేని పరిస్థితి ఏర్పడితే టీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడుతుందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం వెలుగులోకి రాగానే ఓ రేంజ్ లో రెచ్చిపోయి మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి ఆందోళనలకు దిగిన తెరాస శ్రేణులు ఒక్క సారిగా చల్లబడిపోయాయి. ఇందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపే కారణం. హఠాత్తుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై ఎవరూ స్పందించద్దంటూ కేటీఆర్ పిలుపు నివ్వడంతోనే ఏదో తేడా కొట్టిందని తెరాస నాయకులు, క్యాడర్ కు అర్ధమైపోయింది. అందుకే వారిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వం సంక్షోభ సమయంలో ఎందుకు ఇలా మౌనం వహిస్తోందని పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చ ప్రారంభమైంది. ఒక వైపు అత్యంత ప్రతిష్ఠాత్మంగా కేసీఆర్ స్వయంగా ప్రకటించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని కూడా పట్టించుకోకుండా.. కేసీఆర్ మౌనం.. ప్రచారంలో జోరుగా తిరగాల్సిన నలుగు ఎమ్మెల్యేలు నాలుగు రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం.. బీజేపీ సవాళ్లకు స్పందించే నాథుడే లేకపోవడం వంటి విషయాలతో మునుగోడు పరాజయాన్ని కేసీఆర్ ముందుగానే అంగీకరించేశారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఫలితం తరువాత తెరాస పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతున్నది.

ఓటింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్న బీజేపీ 

ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్  అన్నారు. అవును రోజూ లెక్కలు చేస్తుంటే భయం పోతుందిరా.. అంటాడు తండ్రి కొడుకుతో...బాగా ప్రాక్టీస్ చేయి..సిక్స్ కొట్టడం తెలుస్తుందంటాడు ప్లేయర్ తో కోచ్.. ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటు వేయడం గురించి నేర్పుతారు అక్కడి వాలంటీర్లు. వేలి మీద వేసిన చుక్క ఎలా పోతుందనేది నాయనమ్మ చెబుతుంది.. చిత్రంగా మునుగోడులో జనానికి బీజేపీ వారు  తమకే ఓటువేసే విధానాన్ని బోధిస్తున్నారు.  అసలు ఏదయినా ప్రజలు తమకు అనుకూలమయ్యే మార్గాన్ని ఆలోచించడంలో బీజేపీ వారిని మించి ఎవ్వరూ ఉండరు. వారి తెలివే తెలివి. ఉపన్యాసాలతో ఆకట్టుకుంటారు, ఎవరయినా సరే తమవారిని చేసుకోవడం వారి పనులు కానిచ్చేసుకోవడంలో ఉండాల్సిన తెలివి కమలనాథులకే తగును. ఎంత ఆలోచించినా వారితో పోటీ పడటం చాలా కష్టం. ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ వారికి, టీ ఆర్ఎస్ వారికి రాని ఆలోచనని బీజేపీవారికి రావడం వెంటనే అమలుచేసేయడం క్షణాల్లో జరిగిపోతోంది. ఇపుడు ఇంటిం టికీ తిరిగి మాకు ఓటెయ్యండి అంటూ బతిమిలాడుకోవడం, నోటు ఇవ్వడమే కాదు.. వాటికన్నా అసలు పోలింగ్ బూత్ కి వెళ్లాక పెద్దాయనో, పెద్దమ్మో ఏ కీ నొక్కితే భీజేపీ కి ఓటు వెళుతుందో కూడా వారికి తెలి సేలా చేస్తున్నారు. వారికి మెల్లగా ప్రాక్టీస్ చేయించితే ఓటింగ్ రోజు ప్రత్యేకించి ఆ బోర్డు మీద మీట నొక్కడం గురించి తెలియజేయక్కర్లేదు.   ఎందుకంటే, పాపం ఓటర్లకీ అందరికీ ఓటు వేయడంలో ప్రాక్టీస్ ఉండాలిగదా.. ప్రాక్టీస్ చేయిస్తే ధైర్యంగా వెల్లి మీట నొక్కి నవ్వుతూ బయటికి వస్తాడు.. బీజేపీ వారి మనుషులంతా కమలమంత పెద్దగా నవ్వులు విరజిమ్ముతారు. అదిగదా ఆనందం. అదే కావాలి. అందుకే మునుగోడు మొత్తాన్ని బీజేపీ గుర్తు ఓటింగ్ మిషన్ మీద ఎక్కడుంటుంది, మీట ఎలా నొక్కాలి.. ఈ ఘనకార్యం చేస్తే మనసు ఎంతగా నెమ్మదిస్తుం దీ, అంతా ఎంత ఆనందంగా ఉంటారు, అక్కర్లేకున్న రిక్షాలోనో, ఆటోలోనో ఇంటికి వెళ్లే మార్గం గురించి పెద్దగా ఆలోచించకుండానే జరిగిపోవడం...అన్నీ అయిపోతాయి. పాపం ఓటరుకి అంతకంటే ఏం కావాలి. ఎలాగూ డబ్బుల పంపకాలు, హామీలూ అన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు పోలింగ్ స్టేషన్ కి ఎలా వెళ్లాలి, ఓటు ఎలా వేయాలన్నది మాత్రం నేర్పుకోలేదు. అది బీజేపీవారే బాగా ముందుగా గుర్తించి మరీ వెంటాడి నేర్పుతున్నారు.  నేర్పితేనే గొప్ప విద్య అవుతుంది. నేర్పితేనే మాట వింటారు. నేర్పితేనే పార్టీ గెలుస్తుంది. నేర్పితేనే మన వెంట ఉంటారు... ఈ నినాదాలన్నీ ఎంతగా ఉపకరిస్తాయన్నది కూలంకషంగా ఆలోచించే ప్రయోగా త్మకంగా మునుగోడులో, ఆనక  పెద్ద ఎన్నికల్లో మరింత పకడ్బందీగానూ చేయిపట్టి చేయించే యొచ్చ న్నది కమలనాధుల ధీమా.. కాదు వాల్లు తప్పకుండా మన మాట వింటారని, మన గుర్తున్న మీటనే నొక్కుతారని కాషాయమంత వెలవని నమ్మకం. 

సమభావం లేనప్పుడు అన్నీ ఒకేలా ఎలా?

బీజేపీ వారికి దేశభక్తి మరీ నరనరాల నిండిపోతోంది. భక్తి తో తూగిపోతున్నారు, దాన్ని అందరికీ పంచాలి. సామాన్యు లకు బోధించాలి. అందుకే ప్రధాని మోదీజీ మన్ కీ బాత్ పేరుతో బోధానంద మోదీజీ గా మారారు. మనసులో మాట మరీ జనాంతికంగానే అనేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చేయడానికి అధికార యంత్రాన్ని అమాంతం రంగంలోకి దింపేయడం అన్నీ రాజకీయతంత్రంగానే భావించాలి. మనసులో మాట అంటూనే వారి నిర్ణయాన్ని ప్రకటించడంలో మోదీజీ ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చింతన్ బైఠక్ లోనూ ఒకే దేశం, ఒకే యూనిఫాం అనే కొత్త నినాదాన్నిచ్చారు. అసలా మాటకి వస్తే ఆయనలా మరే రాజకీయ నాయకుడూ దేశంలో ఆలోచించలేరు.. కడు దుర్లభం కూడా. వారిది ఆర్ ఎస్ ఎస్ క్రమశిక్షణ మరి. అందువల్ల మాటయినా, అభిప్రాయాన్న యినా రుద్దడమే తెలుసు. పలకమీద కాదు రాతి మీద శాసనమే. మనమంతా ఒకటే అంటూండడం పరిపాటి. అంతా ఒకటే ఏ విషయంలోనో తెలీదు. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రాలకీ మధ్య  అత్తగారు, చిన్న కోడలు, పెద్దకోడల తారతమ్యం చాలా ఉంది. పెద్దామెకు పెద్ద కోడలు పీట వేస్తే, చిన్న కోడలు అరిచి అడిగితే గాని గ్లాసుడు నీళ్లవదట.. అలా ఉంది కేంద్రం, రాష్ట్రాల మధ్య సో కాల్డ్ సంబంధాలు. మనది భిన్నత్వంలో ఏకత్వం.. కానీ ఎక్కడా ఎవ్వరూ సమానత్వం, ఏక కత్వం అనేది పాటించగా చూడం. రాజకీయవాతావరణం అంతగా పరిస్థితులను మలినంచేసేసింది. ప్రతీదీ రాజకీయాల మయం. రాజకీయ కోణంలోనే  ఆలోచించడం జరుగుతోంది. మరి ఇప్పుడు మోదీజీ కొత్త పిలుపుని చ్చారు.. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం అని. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్  ద్వారా మాట్లా డారు. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని తెలిపారు. వారి చింతన్ శిబిరంలో ఏది చర్చించినా, నిర్ణయం తీసుకున్నా దేశానికి ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయంలో ప్రకటనలు చేయడం చిత్రం.  రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చిం చాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. ఇది ఉపన్యాసంవరకూ బాగానే ఉంది. కానీ రాష్ట్రాల మధ్య సమన్వయం సరిగా లేన పుడు, వివరాలు, సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడాల్లో రాజకీయ కోణంగా ఆలోచించి జాప్యాలు జరుగు తున్న సమయాల్లో శాంతి భద్రతలు, ప్రజారక్షణ అంశాల్లో కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది. పైగా అన్నింటికీ ముందే నిర్ణయాలు తీసుకుని, అమలు చేయాలన్న చివరి దశలో పోనీ మనోళ్లని ఒకసారి కలిసి మాట్లాడు తామన్న ధోరణే తప్ప జాతీకి ఉపయోగపడే అంశాల మీద రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయడం అవసరం. ీ విషయంలో మరి కేంద్రం ఏ మేరకు నమ్మకం కలిగిస్తోంది.  చిత్రమేమంటే,  నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు. ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేధోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్య మంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారి మాటకు కేంద్రం యిచ్చే ప్రాధాన్యత, గౌరవం మున్ముందు తెలుస్తుంది. హామీలు ఇవ్వడం కంటే వాటిని నిలబెట్టుకోవడం, సహాయసహకారాలు అందించడమే కీలకం. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య రాజకీయ కోణం అడ్డుపడకూడదు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం, రక్షణ విషయాల్లో కూడా పరిస్థితులను అనుసరించి  ఏ విధంగా సహాయసహకారాలు అందించాలన్నది ఆలోచించాలి. తనవారు పరాయివారు అన్న తేడాలు ఈ విషయాల్లో లేకుండా ఉంటేనే నిజమైన సామరస్యం ఉంటుంది. 

యాంటిబయిటిక్స్ వినియోగం..  3వ స్థానంలో తెలంగాణా

యాంటి బయిటిక్స్ వినియోగంలో జాతీయస్థాయిలో తెలంగాణా మూడవ స్థానం లో నిలిచింది. అంతర్జా తీయ పరిశోదన సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల యాంటి బయాల్ను తట్టుకుంటుంది. దీనివల్ల సూపర్బగ్స్ గా మారే అవకాశం ఉంది. అది ఏ యాంటి బయిటిక్స్ కు  స్పం దిం చదని నిపుణులు హెచ్చరిం చారు. ఈ విషయాన్ని మైక్రో బయల్ రెసిస్టన్స్ జర్నల్లో ప్రచురించింది. దేశంలోనే అత్యధిక యాంటి బయి టిక్స్ వినియోగించిన రాష్ట్రాలలో తెలంగాణా మూడవ స్థానానికి చేరింది. యాంటి బయిటిక్స్ వినియోగిస్తే సూపర్ బగ్స్ తో ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడవతరం నాటి యాంటి బాయిటిక్స్ అధికమొత్తం లో వినియోగించినట్లు కనుగొన్నారు. యాంటి బయిటిక్స్ వినియోగం వల్ల మొదటి, రెండవ తరం నాటి మందులు వినియోగించినట్లు తేల్చారు. డాక్టర్లు సాధారణ ఇంన్ఫెక్షన్లకు సైతం చాలా శక్తి వంతవంతమైన యాంటి బాయిటిక్స్ ను రోగులకు ప్రిస్ క్రైబ్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఆధునిక మందులను విచ్చల విడిగా వినియోగించిన విషయాన్ని బృందం గమనించింది. అధికంగా యాంటి బయి టిక్స్ వాడడంవల్ల సూపర్బగ్ గా మారి ఇకసాధారణదారణ మందులు సైతం స్పందిం చడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ స్థాయిలో యాంటి బయిటిక్స్ వినియోగించిన మాట వాస్తవం. వివిదరాష్ట్రాలలో యాంటి బయి టిక్స మోతాదులు వేరు వేరుగా ఉన్నాయని  కొన్నిచోట్ల ఎక్కువ  మరికొన్ని చోట్ల  తక్కువగా విని యోగిం చినట్లు బృందం గుర్తించింది. బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందినా బృందం నిర్వహించిన పరిశోధకుల బృందంలో యుఎస్ ఏ ,పబ్లిక్ హెల్త్  ఫౌండే షన్ ఇండియా ఢిల్లికి  చెందిన  షఫీ  ఫుజలుద్దిన్  కోయా.సెంథిల్ గణేష్,శక్తివేల్ సెల్వ రాజ్, వెరోనిక్ జేవిర్స్, సాంద్రో గాలియా,పీటర్ సి రాకర్స్ ఉన్నారు. యాంటి బయిటిక్స్ అత్యధిక కంగా వినియోగించిన రాష్ట్రాలలో డిల్లి మొదటి స్థానం ఉందని.ప్రతిరోజూ ప్రజలు 1౦౦౦ డోసులు వినియోగించారని. 2౩.5 పంజాబ్,రెండవ స్థానం 22.9 తో తెలంగాణా మూడవ స్థానం. 7.2 తో  మధ్యప్రదేశ్ నాల్గవ స్థానం.బీహార్ 8.1 రాజ స్థాన్ 8.౩ జార్ఖండ్ 8.5 ఒడిస్స 8.9 పరిశోదన లో తెలం గాణా అత్యధికంగా వినియోగించిన  పరిశోదనా బృందం వెల్లడించింది. 2౦11 నుండి 2౦19 లో జాతీయ స్థాయిలో ౩.6 % వినియోగించారని ప్రపంచ స్థాయితో గ్లోబల్ రేట్లకన్నా భారత్ ప్రైవేట్ యాంటి బాయిటిక్స్ వినియోగంలో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ. క్రమంగా యాంటి బాయిటిక్స్ వినియోగం తగ్గుముఖం పట్టడం గమనించమని బృందం అభిప్రాయ పడింది. భారత్ లో వినియోగించే ప్రిస్ కిప్షణ్ నాణ్యత తక్కువే నని కొన్ని సందర్భాలలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందొ  లేదో తెల్సుకోకుండా యాంటి బాయిటిక్స్ వాడినట్లు సమాచారం. పరిశోధనలో 9౦౦౦ స్టాకిస్టు లు,దేశవ్యాప్తంగా 60 శాతం  స్తాకిస్టులు,5౦౦౦ ఫర్మాకంపెనీలు, 18 వేలు పంపిణీ దారులు 5 లక్షల రీటై లర్స్ పరిశోదనలో పాల్గొన్నట్లు బృందం వెల్లడించింది.                                                     

అధికార బాషా సంఘం అధ్యక్షుడిగా పి. విజయబాబు

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా  ఆర్టీఐ మాజీ కమిషనర్ ,సీనియర్ జర్నలిస్టు పి.విజయ్ బాబును ఏపీ సర్కార్ నియమించింది.  విజయబాబు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.   జగన్ సర్కారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో రాష్ట్ర ప్రభుత్వం పి. విజయబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుగా పలు పత్రికలలో పని చేసిన విజయబాబు.. ఒక ప్రముఖ పత్రికలో సంపాదకుడిగా పని చేశారు. ఆ తరువాత సమాచార హక్కు చట్టం కమిషనర్ ఉన్నారు. ఇప్పడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

ద్ర‌వ్యోల్బ‌ణం.. ముందున్న‌ది  గుజ‌రాత్ 

గుజరాత్ అన్నివిధాలా  అభివృద్ధి దిశలో ముందడుగు వేస్తోందని  చాలాకాలం నుంచి ప్రచారం బాగానే సాగుతోంది. కేంద్రం నుంచి  దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నాయకులంతా  ఆ రాష్ట్రంలో  పోలుస్తూ ఇతర రాష్ట్రాలు  ఆ  దిశగా పయనించాలని బోధ చేయడం, ప్రాచారం చేయడం పరిపాటి. రాష్ట్రంలో పాడిపం టలు, పరిశ్రమలు ఎంతో  అద్భుత మని అక్కడి పాలనా పరంగా ప్రజలు ఎంతో సంతృప్తి చెందుతు న్నారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి  వ్యతిరేకతా లేదని అంటూంటారు. కానీ ఇతర రాష్ట్రాలను అంతే స్థాయిలోకి తీసుకురావడానికి పరిస్థితులు,రాజకీయ వాతావరణం, కేంద్ర సహకారం ఇన్ని అంశాలు లెక్క లోకి వస్తాయి. అన్నిటినీ రాజకీయ కోణంలోనే చూడడం తప్ప, రాష్ట్రాలకు  కేంద్రం ఎలాంటి ప్రోత్సాహక ప్రకటనలూ చేయడం లేదు.  ద్రవ్యోల్బణం విషయానికొస్తే, గుజరాత్ జాతీయ సగటు కంటే ముందుంది, హిమాచల్ సెప్టెంబరులో అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమంగా ఉంది. డేటా గుజరాత్  ద్రవ్యోల్బణం తోటి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ రాష్ట్రం హిమాచల్ కంటే దాదాపు రెట్టింపు; గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల కనిపిస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు వెళ్లే రెండు రాష్ట్రాలలో, రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరు 2022 నెలలో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తరువాతి కాలంలో తక్కువగా ఉందని అధికారిక డేటా చూపు తుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం గుజరాత్‌లో వార్షిక సీపీఐ ద్రవ్యోల్బణం 7.95 శాతంగా ఉంది, ఇది జాతీయ సగటు 7.41 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో 4.54 శాతం తక్కువగా ఉంది. వాస్తవానికి, ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ కంటే ఢిల్లీ మాత్రమే తక్కువ (4.03 శాతం) నమో దైంది. హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 4.24 శాతం, 5.76 శాతంగా ఉంది. గుజరాత్‌లోని గ్రామీణప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 8.31 శాతంగా ఉండగా, రాష్ట్రం లోని పట్టణ ప్రాంతాల్లో 7.68 శాతంగా నమో దైంది. ఈ ఏడాది చివర్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ నున్నాయి. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ధరల పెరుగు దల గతంలో ఎన్నికల ప్రధాన సమస్యలలో ఒకటి. పోల్ ఫలితాలను ప్రభావితం చేసినందున డేటా ముఖ్యమైనది. ఇదిలా ఉండగా, నవంబర్ 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) అదనపు సమావేశం జరగబోతోంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి మీద ఈ సమావేశంలో చర్చ జరుగు తుంది. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు ఎందుకు అదుపు చేయలేకపోయిందో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సమాధానం చెప్పాలి. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీ ఐ సౌలభ్య స్థాయి (కంఫర్ట్ రేంజ్) 2-6 శాతంగా ఉంది. అయితే... సెప్టెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులోని 7 శాతం నుంచి ఇది పెరిగింది. ఇది ఐదునెలల గరిష్టస్థాయి. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది. 2021 సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా నమోదైంది. అక్కడి నుంచి పెరుగుతూనే వస్తోంది. ఆర్బీ ఐ మానిటరీ పాలసీ కమిటీ  చివరిసారిగా 2022 సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో సమావేశమైంది. ఎంపీసీ సిఫార్సుల ప్రకారం... సెప్టెంబర్ 30న, పాలసీ రెపో రేటును 0.5 శాతం లేదా 50 బేసిస్ పాయిం ట్లు (బీపీఎస్) ఆర్బీ ఐ పెంచింది. ఈ ఏడాది మే నెల నుంచి రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి. మే నుంచి సెప్టెంబర్ వరకు 1.9 శాతం లేదా 190 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయి,  కరోనా ముందున్న స్థాయి. ఆర్బీ ఐ రెపో రేట్లను పెంచడం వల్ల, అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఫలితంగా.. కార్‌, పర్సనల్‌, హోమ్‌ లోన్‌ వంటి అన్ని రకాల రుణాలు ప్రియమై, సామాన్యులపై భారం పెరిగింది.

ఆడియో టేపుల మతలబేంటి?

తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల అంశంలో ఆడియో టేపుల మతలబేంటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఆడియో టేపులు ఈ వ్యవహారంలో కీలక సాక్ష్యం అని ఎవరైనా అంటారు. కానీ తెరాస మాత్రం అలా భావించడం లేదు. వీటి వల్ల న్యాయపరంగా కానీ చట్ట పరంగా కానీ కేసు నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్లు తోస్తోంది. ఎందుకంటే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఏపీసీ కోర్టు రిమాండ్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.  అయితే కోర్టులో మాత్రం ఆ పార్టీ బయటకు రిలీజ్ చేసిన ఆడియో టేపులను బయటపెట్టలేదు.  స్వల్ప వ్యవధిలో రెండు ఆడియో టేపులను విడుదల చేసి ప్రజలలో అయోమయం సృష్టించాలనీ, ఈ కేసులో బీజేపీ అగ్ర నేతల హస్తం ఉందని ప్రజలు భావించేలా చేయాలన్న ప్రయత్నానికే పరిమితమైంది కానీ, ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో చట్టం ముందు బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు. నిజంగా తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీ అగ్రనేతల ఇన్ వాల్వ్ మెంట్ ఉండి ఉంటే.. తన వద్ద ఉన్న, లేదా ఉన్నాయని తెరాస చెబుతున్న ఆధారాలను కొర్టులోనే ప్రవేశ పెట్టి ఉండేది. తెరాస కోర్టులో ప్రవేశ పెట్టకుండా విడుదల చేసిన ఆడియోలలో ఒక దాంట్లో రామచంద్ర భారతి, రోహిత్ రెడ్డి, నందకుమార్ మధ్య పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్లు ఉంది. మరో దాంట్లో  డబ్బుల ప్రస్తావన ఉంది. రోహిత్ వంద అడిగారని నందకుమార్ చెబుతున్నట్లు ఆ ఆడియోలో వినిపించింది. అయితే వీరు  ఎవరితో డీల్ చేశారన్నదానిపై  మాత్రం ఆ వీడియోలో  స్పష్టత లేదు. బీజేపీలోని టాప్ టు వ్యక్తులతో మాట్లాడిస్తామని చెప్పడం అయితే వినిపించింది.  అయితే వీటిని కోర్టులో ఎందుకు ప్రవేశ పెట్టలేదు?  ఇంత మొత్తంలో డబ్బులు దొరికాయని పోలీసులు కూడా ప్రకటించలేదు. దీంతో కేసు నిలబడదని న్యాయశాస్త్రంలో కొద్ది పాటి పరిచయం ఉన్న వారికైనా ఇట్టే అర్ధమైపోతుంది.  న్యాయవర్గాలు కూడా అదే చెబుతున్నాయి.   ఆ రెండు ఆడియోలలోనూ  రెండు వర్గాల మధ్య మాటలు మాత్రమే ఉన్నాయని వాటిలో ఐపీసీ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేర వ్యవహారమేదీ లేదని చెబుతున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఈ టేపులను కోర్టులో ప్రవేశ పెట్టలేదని అంటున్నాయి. ఇక   రోహిత్ రెడ్డి సహా ఈ డీల్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచీ ప్రగతి భవన్ లోనే ఉన్నారు.  ఫామ్ హౌస్‌లో కేసు బయటపడిన రోజున   ప్రగతి భవన్‌కు వెళ్లిన వారు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. అంతే కాదు వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి.     శుక్రవారం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఈ వ్యవహారం గురించి బాంబు విస్ఫోటనం లాంటి వివరాలు వెల్లస్తారని తెరాస వర్గాలు చెప్పాయి. కానీ అది జరగలేదు.     శుక్రవారం లేదా శనివారం  ఢిల్లీకి వెళ్లి .. అక్కడే మీడియాతో మాట్లాడతారనీ, బీజేపీకి దిమ్మతిరగక తప్పదనీ తెరాస వర్గాలు లీకులు ఇచ్చాయి. అదీ జరగలేదు. గురువారం నుంచీ కేసీఆర్ పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లి పోయారు. ప్రగతి భవన్ గడప దాటి బయట కాలు పెట్టలేదు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం టీఆర్ఎస్ కు బూమరాంగ్ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ సైలెన్స్  తెరాస వర్గాలలో గందరగోళం సృష్టిస్తోంది. బ్రహ్మాండం బద్దలైపోయిందన్న సంబరం గంటల పాటు కూడా నిలవలేదు. ఏదో తమ వైపు నుంచే పొరపాటు జరిగిందా అన్న శంక తెరస శ్రేణుల్లో కనిపిస్తోంది. దీంతో వారు కూడా నిశబ్దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా మునుగోడులో తెరాస ప్రచారంపై ప్రతికూలంగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.