ఏపీకి అప్పులు సునాయాసం! ఇలా అభ్యర్థన.. అలా అనుమతి..!

జగన్ ప్రభుత్వానికి దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ లేని వెసులుబాటు అప్పుల విషయంలో కేంద్రం ఇస్తోంది. దీని వెనుక జరుగుతున్న రహస్యోద్యమమేమిటో అర్ధం కాక జనమే కాదు పరిశీలకులు సైతం తలలు బాదుకుంటున్నారు. జగన్ సర్కార్ ఇలా కోరడం తరువాయి.. కేంద్రం నుంచి అప్పులకు అలా అనుమతి లభించేస్తోంది. అంతే చిటికెలా జగన్ సర్కార్ ఆర్బీఐలో ఇండెంట్ పెట్టేస్తోంది. ఆర్బీఐ సైతం ఆఘమేఘాల మీద అప్పిచ్చేస్తోంది. ఇప్పటికే అనుమతిని మించి పదివేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసింది. అది చాలదన్నట్లు మరో 1413 కోట్ల అప్పు కావాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. నవంబర్ 1వ తేదీన  బాండ్ల వేలం ద్వారా ఆ సోమ్ములు ఏపీ ఖాతాలో జమ అవుతాయి. ఆ సొమ్మును  ఇప్పటికే జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ఓడీ తీసుకున్నందున   వాటికి జమ చేస్తారని చెబుతున్నారు.   దాదాపు ఇలాంటి ఆర్థిక సమస్యలతో తెలంగాణ సతమతమౌతున్నప్పటికీ.. కేంద్రం ఖరాకండీగా కాదు.. కూడదని తెగేసి చెబుతోంది. ఈ వివక్ష ఎందుకు.. తేడా ఎమిటి అంటే కేంద్రం అడుగులకు జగన్ సర్కార్ మడుగులొత్తుతుంటే.. తెరాస సర్కార్ మాత్రం కేంద్రం తప్పిదాలపై విరుచుకు పడుతోంది. కేంద్రం విషయంలో జగన్ సర్కార్ రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే... తెలంగాణ సర్కార్ మాత్రం కేంద్రం ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. ఎదిరిస్తోంది. అదీ తేడా. మరో తమాషా ఏమిటంటే.. ఏపీ అప్పులకు వడ్డీలు చెల్లించడానికే అప్పులు చేస్తున్నట్లుగా ఉందంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించేస్తారు. అదే సమయంలో మరింత ఉదారంగా అప్పులకు అనుమతి ఇచ్చేస్తారు. విమర్శలు ఎందుకు, ఈ భుజం తట్టడాలెందుకు అన్న ప్రశ్నలకు సమాధానం రాదు.   ఏపీ సర్కార్ కు నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం మరచిపోయిందా అన్న అనుమానాలను ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పలా మారినా.. ఆ చేసిన అప్పులతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులూ చేపట్టింది. ఆ అభివృద్ధి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం తెలంగాణ సర్కార్ పట్ల కఠినంగానూ, ఏపీ సర్కార్ పట్ల  పరిమితులు లేనంత ఉదారంగానూ వ్యవహరిస్తున్నది. ఏపీ సర్కార్ ఇంత యథేచ్ఛగా అడ్డగోలుగా అప్పులు చేస్తూ కూడా ఒక్క రూపాయి అభివృద్ధి పనులకు కేటాయించిన దాఖలాలు లేవు. చేసిన వేల కోట్ల రూపాయల అప్పులన్నీ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికీ.. ఉద్యోగుల జీత భత్యాలకే సర్దేస్తోంది.   చిన్న చిన్న పనుల కాంట్రాక్టర్లకూ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి.  ఇలా వేల కోట్లు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ సొమ్ములన్నీ ఎటు పోతున్నాయన్నది బ్రహ్మ రహస్యంలా ఉందని పరిశీలకులు అంటున్నారు.  యాభై వేల కోట్ల రూపాయలు గల్లంతయ్యాయనీ, వాటి వివరాలు కావాలని కాగ్ వివరాలు కావాలని కాగ్ అడుగుతోందని ప్రచారం జరుగుతోంది.   నిజంగా ఏపీ అప్పుల తప్పుల లెక్కలు బయటకు తీయాలంటే పెద్ద పనేం కాదు. కానీ కేంద్రం, కాగ్ లకు ఆ పని చేయడానికి గంట కూడా సమయం చిక్కడం లేదు. అదనపు అప్పులకు అనుమతులు ఇవ్వడానికి మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఏపీ   ఆర్థికంగా దివాలా దిశగా పరుగులు తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్షం ఆడిన క్రికెట్ మ్యాచ్ 

వర్షం రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు. కానీ వర్షా కాలంలోనే తెలిసి క్రికెట్ మ్యచ్ లు , ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహించడంలో అర్ధం లేదు. మరి అన్నింటా తెలివిగా ఉంటామనే ఇంగ్లీష్ వారు వర్షాలు బాగా పడే సమయంలోనే ఏకంగా ప్రపంచకప్ నిర్వహించడం మాత్రం ప్రపంచ క్రికెట్ వీరాభిమానులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అవును చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అద్భత ప్రదర్శనలను చూడాలన్న ఉత్పాహం నీరుగర్చారనే అనాలి.  వర్షం మామూలు సమయంలో బాగానే అనిపిస్తుంది. తడిసి గెంతులేయాలనే అనిపిస్తుంది. కానీ మంచి క్రికెట్ మ్యాచ్ అందునా భారత్, పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ ల సమయంలో వస్తే మాత్రం క్రికెట్ వీరాభిమానులకు పిచ్చెక్కుతుంది. ఎంతో  ఆశతో చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న మ్యాచ్ లు వర్షం కారణంగా జరగకపోయినా, సగం జరిగి ఆగిపోయినా మ్యాచ్ మజా పోతుంది.  టికెట్ అతికష్టం మీద సంపాదించి తన వీరాభిమాన హీరోల ఆటను ప్రత్యక్షంగా చూడటంలో ఉండే థ్రిల్ వేరబ్బా అంటారు క్రికెట్ పిచ్చాళ్లు. కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాక్స్ వెల్ లాంటి సూపర్ హిటర్ల ఆటతీరు  దగ్గరుండి చూడటం, దాన్ని స్నేహితులకు వివరిస్తూ చెప్పడంలో అదో మజా. కానీ వర్షం వస్తే మాత్రం మొత్తం గల్లంతే.. అంతటి ఉత్సాహం వర్షార్పణమే అవుతుంది.    క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లు సిద్ధంగా ఉంటే సరిపోదు. వాతావరణం కూడా అనుకూలించాలి. వర్షం పడినా, ఎండ ఎక్కువైనా సరే మ్యాచ్ ఆడటం కష్టమవుతుంది. ఎండైతే ఎలాగోలా మేనేజ్ చేసి ఆడేయొచ్చు. కానీ వర్షం పడితే మాత్రం ఒక్క బంతి కూడా పడదు. ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ లకు ఇబ్బంది ఎప్పుడూ ఉండేదే. కానీ టీ20 వరల్డ్ కప్ లాంటివి నిర్వహించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా జరుగుతున్న టోర్నీనే చూస్తుంటే ఐసీసీని తిట్టాలి అనిపించేంత కోపం వస్తోంది. ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కొన్ని మ్యాచులకు ఇలా వర్షం అడ్డంకిగా నిలిచింది. 2020 జనవరి నెలలో భారత్, శ్రీలంక జట్ల మధ్య టి20 సిరీస్ వర్షం ప్రభావాన్ని తెలియజేసే గొప్ప సందర్భం.  అస్సాం రాజధాని గువహటి లో మ్యాచ్ అనగానే సగటు భారత క్రికెట్ అభిమానికి ఠక్కున గుర్తొచ్చేవి ఇస్ట్రీ పెట్టెలు, హెయిర్ డ్రయర్లు. అంతలా గువహటిలోని బర్సపార క్రికెట్ స్టేడియం పేరు గాంచింది. అందులో భాగంగా తొలి టి20 గువహటి లోని బర్సపార స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే మ్యాచ్ కు కొన్ని గంటల  ముందు గువహటిలో భారీ వర్షం  కురిసింది. ఇక మ్యాచ్ సమయాని కైతే వర్షం మాత్రం ఆగిపో యింది. వర్షం కురిసే సమయంలో గ్రౌండ్  సిబ్బంది పిచ్ ను సరిగ్గా కప్ప లేదేమో.. లేదా రంధ్రాలున్న  కవర్లతో  పిచ్ భాగాన్ని కప్పారేమో తెలీదు కానీ.. వర్షానికి పిచ్ తడిసి పోయింది. వర్షం తగ్గినా.. అవుట్ ఫీల్డ్ బాగున్నా.. పిచ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఎవరి ఐడియానో కానీ.. గ్రౌండ్ సిబ్బంది పిచ్  మీదకు ఐరన్ బాక్స్ లను, హెయిర్ డ్రయర్లతో వచ్చేశారు. వాటితో పిచ్ ను ఆరబెట్టే ప్రయత్నం చేశారు. టీ20 ప్రపంచకప్ 2022లో వర్షం హవా కొనసాగుతోంది ఇంగ్లండ్‌లో వాతావరణం అనూహ్యంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే, అయితే అనేక మ్యాచ్‌లు రద్దు కావడం మెగా ఈవెంట్‌ను ప్లాన్ చేయడంపై ప్రశ్నలను లేవ నెత్తింది.  మొన్న ఒక్క రోజే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు వర్షానికి బల య్యాయి. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలి యా- ఇంగ్లండ్ మ్యాచ్‌లు రద్దవ్వడం వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వర్షం వల్ల  దక్షిణాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా గెలిచేస్తుంది అని టైంకి మళ్లీ వర్షం పడింది. దీంతో మ్యాచ్ ని రద్దు చేశారు. బుధవారం కూడా సేమ్ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఇంగ్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ టైంలో వర్షం పడింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ జట్టుని విజేతగా ప్రకటించారు. దీని తర్వాత జరగా ల్సిన ఆఫ్ఘానిస్ధాన్-న్యూజిలాండ్ మ్యాచ్ అయితే.. కనీసం టాస్ పడకుండానే రద్దయింది. రెండు జట్లకు చెరో పాయిం ట్ ఇచ్చేశారు. జస్ట్ రోజుల వ్యవధిలోనే మూడు మ్యాచ్ లు వర్షానికి ఎఫెక్ట్ అయితే.. ఇక రాబోయే మ్యాచ్ ల పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది. వర్షకాలంలో వరల్డ్ కప్ ఏంటి.. ఐసీసీకి ఆ మాత్రం తెలివి లేదా అని నెటిజన్స్ ఏకిపారేస్తున్నా రు. అలానే దీన్ని వర్షాల వరల్డ్ కప్ అని విమర్శిస్తున్నారు. మరి ఈసారి వరల్డ్ కప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అను కున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యా న్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈ విధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి. 

తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు..జగన్ కు చిక్కులు తప్పవా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసు తార్కిక ముగింపు దిశగా సాగుతోందా? ఈ కేసు విషయంలో దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వ అధికారాలను దుర్వినియోగం చేశారా? ఆ విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం నమ్మిందా? అన్న ప్రశ్నలకు వివేకానంద హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి తరలించేందుకు సుప్రీం అంగీకరించడాన్ని బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తుంది. తన తండ్రి మరణం వెనుక ఎవరున్నారో తేలాల్సిందే అంటూ మొక్కవోని దీక్షతో అలుపెరగని న్యాయపోరాటం చేసిన వివేకా కుమార్తె సునీత ఈ కేసు వెనుక ఉన్న సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాల్సిందేనన్న పట్లు దలతో ఉన్నారు. ఇందుకోసం ఆమె సాహసోపేతమైన పోరాటమే చేశారు. ఆ పోరాటం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు వివేకానందరడ్డి తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన పినతండ్రిని హత్య చేసిన వారికి శిక్షపడేలా చూడాల్సిన వ్యక్తే ఆ కేసులో నేరస్థులను కాపాడటానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో ప్రస్తుత సీఎం జగన్ విపక్ష నేతగా ఉన్నారు.  ఆ సమయంలో తొలుత తన బాబాయ్ గుండె పోటుతో మరణించారనీ, ఆ తరువాత అది గుండె పోటు కాదు.. గొడ్డలి పోటని బహిర్గతమైపోవడంతో అధికార పక్షమే ఆయన హత్యకు కారణమని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే నేరుగా ఆరోపణలు చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సరే తరువాత ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకున్న తరువాత వివేకా హత్య కేసులో సిబీఐ దర్యాప్తు అవసరం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పడం గమనార్హం. అసలు వివేకా హత్య జరిగిన క్షణం నుంచీ ఆ కేసును పక్కదారి పట్టించే యత్నాలు, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. రక్తపు మరకలను కడిగి వేయడం.. గుండె పోటు అంటూ స్వంత మీడియాలో పదే పదే చెప్పించడం దగ్గర నుంచి.. అప్పటి ముఖ్యమంత్రే ఈ హత్య చేయించారంటూ ప్రచారం చేయడం ఆరోపణలు గుప్పించడం వరకూ ఈ కేసులో అసలు దోషులను కప్పిపుచ్చే యత్నాలే జరిగాయి.. జరుగుతూ వచ్చాయి. సరే వివేకా కుమార్తె తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న పట్టుదలతో చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఈ కేసును సీబీఐ టేకప్ చేసింది. అయినా కూడా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదస్థితిలో  మరణించడం, అప్రూవర్ గా మారిన  దస్తగిరి ప్రణాలకు ముప్పు ఉందంటూ ఎస్పీని ఆశ్రయించడం, కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే దాడి యత్నాలు జరగడం, సాక్షాత్తూ సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు కావడం వరకూ ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడం కోసం జరగని ప్రయత్నం లేదు. చివరకు ఏపీలో అయితే ఈ కేసు విచారణ సజావుగా సాగే అవకాశం లేదంటూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు కూడా  ఎపి పోలీసు మీద నమ్మకం లేనద్న భావన వ్యక్తం చేసిందంటే  రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అంతకంటే దారుణమైన అవమానం వేరొ కటి వుండదు. పాత రోజులలో అయితే అటు ముఖ్యమంత్రి, ఇటు డిజిపి వంటి ఉన్నతా ధికారులు సుప్రీంకోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడితే  వెంటనే పదవులు వదిలేసే వారు. కానీ విచిత్రంగా జగన్ హయాంలో అటువంటి నైతికతకు చోటు లేని పరిస్థితి ఉంది. అందుకే కేసు విచారణ ఏపీ బయట జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడినా జగన్ సర్కార్ లో ఎటువంటి చలనం లేదు. అయితే సుప్రీం ఆదేశాలతో  వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ అయితే (ఇప్పటికే కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదలీ చేయడానికి సుప్రీం అంగీకరించింది. అయితే  నేరస్తులకు ఉచ్చు బిగుసుకున్నట్లే అని పరిశీలకులు, న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇదే సమయంలో వివేకా హత్య పై జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు హత్యకు కారణమేమిటో, హత్య చేసిన వారెవరో చెప్పకనే చెప్పేశాయని పరిశీలకులు అంటున్నారు. తన చిన్నాన్నను చంపారని, చంపిన వారెవరో అందరికీ తెలుసని ప్రకటించా రామె. ఆమె నోటి వెంట ఆ మాట వెలువడడం వైఎస్ కుటుంబాన్ని చిక్కులలోకి నెడుతున్నది. ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంపీ సీటు కోసమే తన చిన్నాన్నను దారుణంగా చంపేశారని షర్మిల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో... ఇప్పటి దాకా కేసును నీరుగార్చడానికి పోలీసు యంత్రాంగం చేసిన ప్రయత్నాలతో వివేకా హత్య కేసులో నేరస్తులను కాపాడడానికి ముఖ్యమంత్రి స్వయంగా ప్రయత్నం చేస్తున్నారని, చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోంది. 

బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం

పోలీసుల తీరుకు నిరసనగా బుద్ధా వెంకన్న చేపట్టిన నిరశన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖలో తెలుగుదేశం  చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో  గురువారం(అక్టోబర్ 27) మధ్యాహ్నం నుంచి తన ఇంటి   వద్దే బుద్దా వెంకన్న నిరవధిక దీక్షకు దిగిన సంగతి విదితమే. వెంకన్న దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు బుద్ధా దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. నిరశన దీక్ష కారణంగా బుద్ధా వెంకన్న సుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయని వైద్యులు సూచించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు అర్ధరాత్రి రెండు గంటల  ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో బుద్ధా వెంకన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు బుద్ధా  సుగర్ లెవల్స్ పడిపోయాననీ, వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోనికి దింపి బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలీసుల చర్యను గర్హిస్తూ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వారు పోలీసు జీపును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తమ జీపుకు అడ్డు పడిన వారిని పక్కకు లాగేసి బుద్ధాను ఆసుపత్రికి తరలించారు. ఈ  సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కవిత కోసమేనా.. అమిత్ షా వద్దకు మాజీ గవర్నర్ నరసింహన్ ను పంపి కేసీఆర్ భంగపాటు?

నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయింది. ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను బయటపడేయడానికే అన్నది ఇప్పుడు తేటతెల్లమౌతోంది. తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని బయటపడింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసీఆర్ యూపీ వెళ్లారు. కూడా తన కుమార్తె కవిత, మరో సమీప బంధువు, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. సాధారణంగా చావు పరామర్శకు వెళ్లినా, అంత్యక్రియలకు వెళ్లిన.. అక్కడ నుంచి నేరుగా తిరిగి ఇంటికి రావడమన్నది సంప్రదాయం.. అటువంటిది సెంటిమెంట్లపై విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ ములాయం అంత్యక్రియలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు రాకుండా నేరుగా హస్తినకు వెళ్లి అక్కడే పది రోజులు బస చేయడంపై అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అక్కడ పది రోజులు బస చేసిన ఆయన అక్కడ అన్ని రోజులు ఏం చేశారన్నది ఇన్ని రోజులూ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడప్పుడే అక్కడ ఆయన అన్ని రోజులు బస చేసి చేసిందేమిటన్నది బయటకు వస్తున్నది. ఆయన హస్తిన పర్యటన మొత్తం తన బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికే అన్నది తేటతెల్లమైపోయింది. ఈ విషయమై ఆయన ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లి మరీ ప్రయత్నించారనీ, అలాగే బీజేపీ పెద్దలతో భేటీకి కూడా ప్రయత్నించారనీ హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందిన సమాచారం.  అలాగే పలు జాతీయ పార్టీల నాయకులతోనూ టచ్ లోకి వెళ్లి మద్దతు కోరినట్లు చెబుతున్నారు. అయితే ఎవరూ కూడా ఈ విషయంలో కేసీఆర్ కు ఎవరి నుంచీ ఎటువంటి మద్దతూ లభించలేదని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్.. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆయనను హస్తినకు పిలిపించుకుని సహకారం అందించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా అప్పట్లో నరసింహన్ కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించారని అంటుంటారు. అలాగే కేసీఆర్ కూడా నరసింహన్ కు అత్యధిక ప్రాధాన్యత  ఇచ్చే వారని చెబుతారు. ఆ పరచయాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ నరసింహన్ ను తన తరఫున అమిత్ షాను కలిసి కవిత విషయంలో మద్దతు కోరాల్సిందిగా అడిగారని ఢిల్లీ వర్గాల భోగట్టా. మొహమాటానికైనా నరసింహన్ అందుకు అంగీకరించారనీ, కేంద్ర ఇంటెలిజెన్స్   బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన నరసింహన్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అధికారులతో తనకున్న పరిచయాల ద్వారా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలిశారనీ, కేసీఆర్ విషయం ఆయనకు చెప్పారనీ అంటున్నారు. అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ,  ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని నరసింహన్ కేసీఆర్ కు చెప్పడంతో కేసీఆర్ కూడా ఆగ్రహంతో రగిలిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల పర్యవశానమే.. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కారణమైందని పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా బీజేపీని ఇరుకున పెట్టాలనీ, అమిత్ షాకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా గుణ పాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని అంటున్నారు. అయితే ఫామ్ హౌస్ నుంచి చేసిన ఫోన్ అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతోనే ఈ డ్రామా రక్తికట్టలేదని పరిశీలకులు అంటున్నారు. 

కాణిపాకం ఆలయంలో బంగారు విభూది పట్టీ చోరీ.. అర్చకుడే దొంగ!

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బంగారు విభూది పట్టి చోరీకి గురైంది. సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో  బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు‌   భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.   నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి‌ భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొంది తరిస్తుంటారు  స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని ఓ దాత విరాళంగా అందించారు. ఆ విభూది పట్టీ ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీన కుంభాభిషేకం సందర్భంగా స్వామి వారికి అలంకరించారు. అంతే ఆ రోజు నుంచీ అది కనిపించడం లేదు. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ విభూది పట్టీని విరాళంగా ఇచ్చిన దాత తనకు రశీదు ఇవ్వలేదంటూ..అధికారులను సంప్రదించడంతో ఆ బంగారు విభూది పట్టీ కనిపించడం లేదన్న విషయం వెల్లడంది. దీంతో ఆ ఆభరణం గురించి ఆరా తీయడం  ప్రారంభించారు. ఇంతలో గత 45 రోజులుగా కనిపించని ఆ ఆభరణం ఆలయ యోగశాలలో ప్రత్యక్షమైంది.  ఈ విభూది పట్టీని వేలూరుకు చెందిన ట్రస్ట్ విరాళంగా అందజేసింది. ఈ ఆభరణం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుంది. సాధారణంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి భక్తితో అందించిన విరాళాలకు సంబంధించిన రసీదును ఇస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆలయానికి ముగ్గురు మంత్రులు రావడం, కుంభాభిషేకం కావడంతో అధికారులు హడావుడిలో ఉండి రసీదు ఇవ్వలేదు. విభూది పట్టీని మాత్రం స్వామి వారికి అలంకరించారు. అయితే ఎన్ని రోజులైనా రసీదు రాకపోవడంతో విభూది పట్టీని విరాళంగా ఇచ్చన ట్రస్ట్ దాతలు రసీదు గురించి అధికారులను సంప్రదించారు.  అప్పుడు విభూది పట్టీ మాయమైన సంగతి వెలుగులోనికి వచ్చింది. ఇంతకీ ఆ విభూది పట్టీని కాజేసింది ఆలయ అర్చకుడేనని తేలింది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘటన బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. 

మోడీ, రిషి సునాక్ భేటీ ఖరారు.. ఎక్కడంటే..?

బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు భేటీ వచ్చే నెలలో బేటీ కానున్నారు. వీరిరువురి మధ్యా భేటీ ఖరారైంది. ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాధినేతల భేటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ వీరి భేటీ ఎక్కడంటే... వచ్చే నెల బాలి వేదికగా జరగనున్న జ20 లీడర్ షిప్ సమ్మిట్ కు ఇరువురూ హాజరు కానున్నారు.  ఈ సమ్మిట్ లో భాగంగా ఇరువురు నేతలూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని,  ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది. కాగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ   ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశాన్ని మోడీ రిషి సునాక్ దృష్టికి తీసుకువెళ్లారు. రిషీ సునాక్ హయాంలో భారత్, బ్రిటన్ ల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... దిగువకోర్టు సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో మరో ట్విస్ట్  చోటుచేసుకుంది.  ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాం డ్‌ను నిరాకరిస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సైబరాబాద్ పోలీసులు శుక్ర వారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు లంచ్ మోషన్‌ను తరలించడం ద్వారా ముందస్తు విచారణను కోరింది, అయితే కోర్టు రెగ్యులర్ పిటిషన్‌ను కోరింది. రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నంద కుమార్,  సింహయాజి స్వామి అనే ముగ్గురు నిందితులను విడుదల చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును పోలీ సులు సవాలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బీజేపీ సీనియర్ నాయకులతో సత్సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు  బుధవారం రాత్రి టీఆర్ ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఎరచూపించి బీజపీ పార్టీలోకి  తీసుకు రావడానికి, పార్టీలో ఉన్నత పదవులతో పాటు కాంట్రాక్టులు కూడా ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకోవడానికి  ప్రయ త్నించారు. ఆ ముగ్గుకు వ్యక్తులను సరూర్ నగర్ లో న్యాయమూర్తి నివాసానికి గురువారం రాత్రి పోలీసులు తీసికెళ్లారు. కానీ నిందితులను జ్యూడిషియల్ కస్టడీకి పంపేం దుకు పోలీసులు చేసిన అభ్యర్ధనను న్యాయమూర్తి తిరస్కరించారు.  నిందితులుగా పేర్కొన్న ముగ్గురు టీ ఆర్ ఎస్ నాయకులను పార్టీలోకి  ఆకట్టుకోవడానికి  చేసే యత్నం లో డబ్బు ఆశ చూపారనడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి పోలీసుల అభ్యర్ధ నను నిరాకరించారు. సాక్ష్యాధారాలు సరిగా లేనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని ఆయన అన్నారు.  కాగా,ఈ కేసు విషయంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.  బీజేపీ తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ తెలంగాణా హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.  మునుగోడు ఉప ఎన్నికలనేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్  కుట్ర చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేస్‌ని సమగ్రంగా విచారణ జరిపించాలని పిటిష నర్ హైకోర్టును కోరారు. పిటిషన్‌లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చారు.  తెలంగాణ హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్, రాజేంద్ర నగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్ఓ  కేంద్ర హోం ఆఫ్ఫైర్స్, సీబీఐ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డినీ పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐతో, సిట్టింగ్ జడ్జ్‌తో సమగ్ర విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. బీజేపీ పార్టీ ప్రచారాలను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన అని పేర్కొన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా?

తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీ కలిశాయా.. కలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాయా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడానికి బీజేపీతో అవగాహనే కారణమని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవైనా.. ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఈ ఎనిమిదేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడు ఈ క్యాడర్ అంతా బీజేపీతో కలిసి పని చేయనుందని పరిశీలకులు అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్యా మైత్రికి ఇరు పార్టీల అధిష్ఠానాలూ పచ్చ జెండా ఊపేశాయని కూడా చెబుతున్నారు. ఈ మైత్రి  ముందు ముందు ఏపీలో కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ముందుగా మునుగోడు ఉప ఎన్నికలో నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ అంతా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో  మునుగోడులో తెరాస, కాంగ్రెస్ ల పరాజయమే లక్ష్యంగా తెలుగుదేశం, బీజేపీలు కలిసి నడుస్తున్నాయని చెబుతున్నారు. ఏపీలో కూడా ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికలలో మిత్రులుగానే పని చేస్తాయన్న సంకేతాలు ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం నుంచీ, తెలుగుదేశం వైపు నుంచీ కూడా వస్తున్నాయనీ, ఇందుకు ఏపీలో బీజేపీతో పొత్త తమకు లబ్ధి చేకూరుస్తుందని తెలుగుదేశం భావిస్తుండటం.. తెలంగాణలో తెలుగుదేశంతో మైత్రి తమకు మేలు చేస్తుందని బీజేపీ భావించడం కారణమంటున్నారు. అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది నానుడి.. అందుకే నాలుగేళ్ల కిందట తెగిన మైత్రి బంధం మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మళ్లీ ముడిపడుతోందని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏపీలో తెలుగుదేశంతో పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందనీ పరిశీలకులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలన్న తమ ఆకాంక్ష నెరవేరేందుకు అనివార్యమన్న భావన బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా ఉందని అంటున్నారు. అందుకే  ఏపీలో తెలుగుదేశంకు దగ్గరయ్యేందుకు వేస్తున్న అడుగులలో భాగంగానే వైసీపీపై బీజేపీ ఉద్దేశపూర్వకంగా దూరం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వైసీపీని విస్పష్టంగా వ్యతిరేకిస్తూ అమరావతే ఏకైక రాజధాని అన్నదే తమ విధానమని బీజేపీ ప్రకటించడాన్ని ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.   

ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ వర్షార్పణం

ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అనుకున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యాన్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈవిధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి.  ఇరుజట్లూ చెరో మ్యాచ్ ఓడిపోయాయి గనుక మరో మ్యాచ్ కల్పోయేందుకు అవకాశం ఉండదు. ఈ పర్యాయం సెమీస్ చేరాలంటే రెండు జట్లు మరో మ్యాచ్ తప్పకుండా గెలవవవలసి ఉంటుంది. ఇంతవరకూ జరిగిన  మ్యాచ్ లను పరిశీ లిస్తే మెల్బోర్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలానే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ప్రారంభ మ్యాచ్ లోనే కివీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ  లంక మీద గెలిచిన  సంగతి తెలిసిందే. అయితే ఆసీస్ జట్టులో టాప్ ఆర్డర్  చెప్పుకోదగ్గ సామర్ధ్యం ప్రదర్శించ లేకపోతోంది. అదే జట్టు కెప్టెన్ని, యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఇంకా చెప్పుకోదగ్గ ఫామ్ ప్రదర్శించలేకపోతున్నాడు.  ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్ తమ పాత ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఆసీస్ మంచి స్కోర్ సాధించలేక వెనుకంజలో పడుతోంది. బౌలింగ్ పరంగా చూసినా పాట్ కమిన్స్  తప్ప  జోష్ హాజెల్ ఉడ్, మిచెల్ స్టార్క్ అటాకింగ్ బాగా చేస్తున్నారనాలి. ప్రపంచకప్ కి రావడానికి ముందు రెండు జట్లూ పోటీపడినపుడు ఇంగ్లండ్ బ్యాటర్లు మంచి ఫామ్ ప్రదర్శించి మున్ముందు  జట్టు విజయాలకు వెన్నుదన్నుగా ఉంటారని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయి బతికిపోయామనే అనుకుంటున్నారు ఇరజట్ల అభిమానులు. వారి హీరోలు అంతగా స్కోర్ చేయలేకపోతుండడమే అందుకు కారణం. ఇక ముందు జరిగే మ్యాచ్ లన్నీ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశమే ఉంది. 

ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కర్త, కర్మ, క్రియ కేటీఆర్?

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ బూమరాంగ్ అయ్యిందా? ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల  ఎపిసోడ్ వికటించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కనుగోలు బేరసారాల ఎపిసోడ్ వెనుక ఉన్న వ్యూహ కర్త కేసీఆర్ కాదనీ, ఇదంతా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కనుసన్నలలో జరిగిందనీ అంటున్నారు. అందుకే పైకి ప్రణాళిక పక్కాగా ఉన్నట్లు కనిపించినా, చివరికి తుస్సు మని ఎదురు పార్టీ ప్రతిష్టే మసకబారే ముప్పు తెచ్చిందనీ చెబుతున్నారు. అసలీ ఎపిసోడ్ మొత్తం అనుమానాల మయంగా, సందేహాల పుట్టగా ఉంది. సమాధానం దొరకని ప్రశ్నలెన్నో టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఒక వేళ ఇదే ఆపరేషన్ కేసీఆర్ ప్లాన్ చేసి ఉంటే.. బీజేపీ నాడు రేవంత్ ఇరుక్కున్న విధంగానే చిక్కుకుని ఉండేదని పరిశీలకులు అంటున్నారు. అయితే అత్యుత్సాహంతో కేటీఆర్ తన కనుసన్నలలో కేసీఆర్ కు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆరంభించడం వల్లనే విఫలమైందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాలన్న ఏకైక లక్ష్యంతో చేపట్టిన ఈ వ్యూహంలో టీఆర్ఎస్ విఫలమై నిండా మునిగిందని కూడా అంటున్నారు.  దీంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. కేటీఆర్, కొనుగోలు వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రగతి భవన్ లో గట్టిగా క్లాస్ పీకారని అంటున్నారు. ఆ క్లాస్ తరువాతనే కేటీఆర్ ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరూ స్పందించ వద్దంటూ పార్టీ నాయకులు, క్యాడర్ కు పిలుపు నిచ్చారంటున్నారు. దీనిని ఇంకా మోస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్.. ఆదేశాల మేరకే గురువారం ఉవ్వెత్తున ఎగసిన టీఆర్ఎస్ ఆందోళనలు అదే రోజున చప్పున చల్లారిపోయాయని అంటున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహాలు రచించాలన్న కేసీఆర్ ఒకే ఒక్క సూచనతో కేటీఆర్ ముందు వెనుకలాలోచించకుండా  ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ట్రాప్ డ్రామాకు తెరతీశారనీ, ఈ విషయంలో నాడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఏ వ్యూహం అవలంబించారో అదే వ్యూహాన్ని అంతే పక్కాగా ప్లాన్ చేశారనీ పరిశీలకులు అంటున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఎక్కడొచ్చిందంటే.. ఫామ్ హౌస్ లో డ్రామా అంతా రక్తికట్టినా డబ్బులు అక్కడ లేకపోవడం బెడిసికొట్టిందన్నారు. కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ కు తరలిస్తే ఈడీ రంగంలోకి దిగుతుందనీ, ఈడీ రంగంలోకి దిగితే కేసు తెలంగాణ పోలీసుల చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో డబ్బు చుట్టూనే డ్రామా నడిచినా ఆ డబ్బును ఫిజికల్ గా అక్కడకు చేర్చలేదని అంటున్నారు. అలాగే ఫామ్ హౌస్ నుంచి కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ఫోన్ వెళ్లినా.. ఆ ఫోన్ ను స్వయంగా అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ కేసులో బీజేపీని బలంగా ఇరికించే ప్రయత్నం ఫలించలేదంటున్నారు. ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేయలని భావించడం, ఇందుకు సంప్రదింపులు చేయడం అంతా వాస్తవమేనని అనుకున్నా.. దానిని ససాక్ష్యంగా బయటపెట్టే విషయంలో తెరాస విఫలమైందని అంటున్నారు. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే బీజేపీని ఇరికించే బలమైన ఆధారాలున్నాయని ప్రజలను నమ్మించే యత్నాలలో భాగమే... గురువారం (అక్టోబర్ 27) ఉదయం నుంచీ కేసీఆర్ మీడియాతో మాట్లాడతారంటూ మీడియాకు సమాచారం ఇవ్వడం.. సాయంత్రమయ్యే సరికి ఇక్కడ కాదు.. హస్తినలో కేసీఆర్ బీజేపీ గుట్టు రట్టు చేస్తారంటూ మాటమార్చడం వంటి వ్యూహాలను టీఆర్ఎస్ అమలు చేస్తున్నదని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ హస్తిన పర్యటన ఖరారు కాలేదు. ఈ వ్యవహారం కోసమే అయితే కేసీఆర్ ఢిల్లీ వేళ్లే అవకాశమే లేదు.   ఇక బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడం కోసం నియోగించిన నందకుమార్‌, ,సతీష్‌శర్మ  అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులు విషయానికి వస్తే.. వీరిలో నంద కిషోర్ కు బీజేపీ, తెరాస నేతలతో సంబంధాలు ఉన్నాయి. పాన్ షాప్ నిర్వాహకుడిగా ఆరంభమై ప్రస్తుతం హైదరాబాద్ లోని పోష్ ప్రాంతంలో ఖరీదైన బార్ అండ్ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ఇక రామచంద్రభారతి విషయానికి వస్తే ఆయనకు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆయన బీజేపీ తరఫున ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వచ్చారని నిర్ధారించలేం. ఇక మూడో వ్యక్తి తిరుపతి సమీపంలోని చిన్నమండెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆశ్రమం ఉన్నప్పటికీ ఏ రోజు భుక్తి ఆ రోజే అన్న పరిస్థితి ఆయనది. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు. కుమారుడు మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తి తనకు, తన కుమార్తెకు, కుమారుడికి  హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లు కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ తరఫున దూతలుగా, ప్రతినిథులుగా వ్యవహరించారంటే నమ్మశక్యంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయినా మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ గ్రామాల వారీగా ఎమ్మెల్యేలు, నాయకులకు ఇన్ చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. అనుక్షణం ఏ గ్రామంలో ప్రచారం తీరు ఎలా ఉందన్న సంగతిని కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. వారితో కేటీఆర్ నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఈ పరిస్థితిలో కేటీఆర్ కు తెలియకుండా వారు నియోజకవర్గం వదిలి హైదరాబాద్ కు వచ్చే అవకాశమే లేదు.   అందుకే ఇదంతా కేటీఆర్ కనుసన్నలలోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముట్టడి భయం తొలిగింది...కంచె తొలిగింది

పాలకుడు ప్రజామోదయోగ్యంగా వ్యవహరించాలి, పాలించాలి. ప్రజాసంక్షేమాన్ని ఎల్లపుడూ కోరుకోవాలి. అందుకు పాటుపడాలి. ప్రతీ పథకం, ప్రతీ పనీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయాలి. అప్పుడే ప్రజలు పాలకుడిని నెత్తిన పెట్టుకుంటారు, అభిమానిస్తారు. వీటన్నింటికీ విరుద్ధంగా పాలన సాగిస్తే ఇంటికీ పంపగలరు. ప్రజాగ్రహం అడ్డుకోవడం చాలా కష్టం. అందుకు తాజా ఉదాహరణే ఏపీ సీఎం జగన్ తన నివాసంవద్ద కంచెలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఆట్టే ప్రమాదం లేదు గనుక తీయిం చేస్తుండ డమూను.  ఇటీవల జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి తో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దుపై ఏపీ అంతటా నిరసనలతో ప్రభుత్వోద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ప్రభుత్వం పట్ల తమ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్ప టికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారని  వ్యతిరేకంగా చలో విజయవాడ పిలుపు నిచ్చింది  ఏపీసీపీ ఎస్‌ఈఏ. సమావేశమైన ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెం బర్‌ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీ ని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మిలినియం మార్చ్‌ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.  ఎక్కడ ఉద్యోగులంతా ఇంటిమీదకి వచ్చి పడతారా అని భయంతో కంచె కట్టించారు. ప్రజలు, ముఖ్యం గా ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వచ్చే వారిని దగ్గరికి రానీయకుండా కంచెలు, పోలీసులతో అడ్డు గోడ కట్టించేసుకుంటే పాలకుడని, మంచి సీఎం అని జగన్ ని ఎవరు మాత్రం అంగీకరిస్తారు. రాష్ట్ర మంతటా తీవ్ర నిరసనే వ్యక్తమవుతోంది.  అయితే ఇక  ఇప్పుడు ప్రజల నుంచీ అంతటా భయపడేంత దాడులకు, ముట్టడికి అవకాశం లేదుగనుక వెంటనే  సీఎం ఇంటి కి వెళ్లే రహదారిలో కంచెను తొలిగించే పనులు పడ్డారు పోలీసులు. దారిన వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారని కంచెను తొలగిస్తున్నామని పోలీసులు అంటున్నారు. 

మామగారు వ్యాపారం కంటే రాజకీయకెరీర్ చూసుకోమన్నారు..సునాక్

తనను  బ్రిటన్  రాజకీయాల్లోకి  వెళ్లమని ఉత్సాహపరిచింది తన మామ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి అని బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అన్నారు. రాజకీయాల్లో ఉన్నతమైన ప్రధాని పదవికి చేరుకోవ డం లక్ష్యంగా పెట్టుకోవాల న్నారని రిషీ అన్నారు. వ్యాపారం లో  ఉండే  కంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రభావం చూపగల్గుతావని నారాయణమూర్తి ఎంతో ఉత్సాహపరిచారని రిషీ అన్నారు.  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులయిన నారాయణమూర్తి ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. రిషీ సునాక్ గతంలో గోల్డున్ సాఛ్ సంస్థలో పనిచేశారు. స్టాన్ఫోర్డ్ నుంచి ఎంబిఏ పొందిన తర్వాత రాజకీయా ల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యు నిగా ఎదిగారు. మంచి జీతంతో ఉన్నత స్థాయి కెరీర్ ను కాదని  ఆయన  రాజకీయా్ల్లోకి వచ్చారు. రిషీ బ్రిటన్ ప్రధాని పదవిని దీపావళి రోజు అధికారం చేపట్టారు. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత్  మూలాలున్న, తొలి హిందువుగా గుర్తింపు పొందారు.  భారత దేశంలో అత్యంత పెద్ద సంస్థను నిర్మించి, కోట్లాదిమందికి ఉద్యోగ భద్రతను ఇస్తూ, వ్యాపార పరంగానూ ఎంతో విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గడించిన మా మామగారు వ్యాపారం కాదు రాజకీయాల్లో ఉంటేనే ఎంతో ప్రభావం చూపగలవన్న సూచన రావడం తనను ఎంతో ఆశ్చర్య పరిచిందని రిషీ అన్నారు.  ఆయన నా వెన్నంటే ఉండి ఎంతో ఉత్సాహపరిచారన్నారు.  

ఇక సినిమాల్లో రాజకీయ యుద్ధాలు! వ్యూహం.. ప్రతి వ్యూహం వెండి తెర మీదే!

సినిమాలకూ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది.  ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే శక్తి సినిమాకుఉంది. మావో వంటి విప్లవ నాయకుడే ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన మాధ్యమంగా సినిమాను అభివర్ణించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎందరో నటులు రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఎన్టీఆర్ స్థాయి విజయాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఇక రాజకీయ ప్రవేశం కంటే.. రాజకీయ సినిమాల ద్వారా ‘సంపాదన’ బాగుంటుందని కొందరు సినీ జీవులు ఆ బాటపట్టారు. గతంలో కూడా రాజకీయాలు సెంటర్ సబ్జెక్ట్ గా సినిమాలు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి కానీ.. రాష్ట్ర విభజన తరువాత మాత్రం రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా రాజకీయ నాయకుల ప్రచారమే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఒక పార్టీ నేతను అన్ పాపులర్ చేయాలన్న లక్ష్యంతో సినిమా నిర్మాణానికి ముందుకు రావడమన్న ఒక కు సంస్కృతి మొదలైంది. అందుకు ఉదాహరణగా గత ఎన్నికలకు ముందు విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చెప్పవచ్చు. ఆ సినీమా ముఖ్య ఉద్దేశం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు అనుకూలంగా ఉండేలా అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నష్టం చేకూర్చాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర అంటూ వైఎస్ఆర్ పాదయాత్రలపై సినిమాలు వచ్చినా వాటిలో ఇలా ప్రత్యర్థులను తూర్పారపట్టాలన్న ఉద్దేశం, లక్ష్యం ఏమీ కనిపించవు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లక్ష్యం మాత్రం ఒక పార్టీకి నష్టం చేకూర్చడం.. ఆ పార్టీ అధినేత వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనని పరిశీలకులు సైతం అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికలు లక్ష్యంగా మరోసారి అదే ప్రయత్నం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ కు, అధికార వైసీపీకి ప్రయోజనం చేకూర్చేదిగా.. ప్రత్యర్థులకు నష్టం చేకూర్చడమే లక్ష్యంగా వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మ వ్యూహం సినిమాకు రూపకల్పన చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సారి మాత్రం ఆయన సినిమాకు దీటుగా జనసేన తమ అధినేతకు మేలు చేకూర్చేలా ప్రతి వ్యూహం పేర ఒక సినిమా తీసేందుకు సన్నద్ధమౌతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.   వ‌ర్మ తీసే ఈ వ్యూహం, శ‌ప‌థం అనే రెండు సినిమాలూ ఏపీ సీఎం జ‌గ‌న్, అధికార వైసీపీకు మ‌ద్ద‌తుగా ఉంటాయ‌ని,  తెలుగుదేశం, జ‌న‌సేనల‌పై విమ‌ర్శ‌లు, విసుర్లు ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దీంతో వైకాపాని టార్గెట్ చేస్తూ  `ప్ర‌తివ్యూహం` అనే సినిమాని రూపొందించేందుకు జనసేన అభిమానులు, కార్యకర్తలు రంగంలోకి దిగారని అంటున్నారు.   స‌రిగ్గా.. వ‌ర్మ `వ్యూహం` సినిమా విడుదలయ్యే రోజునే . `ప్ర‌తివ్యూహం` కూడా విడుదల చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.    మొత్తానికి ఈ ఎన్నిక‌ల‌లో ప్ర‌చార వ్యూహాలన్నీ వెండి తెర‌పై కనిపిస్తాయని చెప్పవచ్చు.

సాదిక్ ఎందుకీ నోటి దురుసు?..క్షమాపణలు కోరిన కళిమొని

మహిళలను గౌరవించడం గురించి ప్రతీ వాళ్లూ ఉపన్యాసాలు ఇస్తూంటారు. మహిళలను గౌరవించని వారు ఎందుకు పనికిరారు వంటి ప్రవచనాలు రాజ్యం చేస్తున్నాయి. తప్ప వాస్తవానికి అలా ఏమీ జరగక పోవడమే విచారకరం. ఎక్కడ చూసినా మహిళలమీద అఘాయిత్యాలు, అవమానకర వ్యాఖ్యలు చేయ డం, అవమానించడం తప్ప మర్యాదగా  ఉండడమన్నది కనపడటం లేదు, వినపడటం లేదు. ఇది క్రమేపీ రాజకీయాలకీ పాకింది. రాజకీయ నాయకులు కూడా విపక్షాల మహిళా నేతల మీద అరా కొరా కామెంట్లు చేయడం గమనిస్తున్నాం. ఇది ఇటీవలి కాలంలో మరింత పెచ్చు మీరింది. నేరుగానే కామెం ట్లు చేయడం మరీ దారుణం. తాజాగా తమిళనాడులో డిఎంకే నాయకుడు సాదిక్  బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ ని ఐటమ్ అని కామెంట్ చేయడం ఆశ్చర్యపరిచింది.   మంచి నటిగా పలు భాషా చిత్రాల్లో ఎందరో అభిమానులను సంపాదించుకున్నఖుష్బూ పై అసహ్యమైన కామెంట్లు చేయడం డిఎంకె పార్టీ నాయకుల పరిస్థితిని తెలియజేస్తుంది. నటిగా ఆమెకు వీరాభిమానులు ఉన్నారు. అంతేకాదు, ఆమెకు తమిళనాడులో ఏకంగా గుడి కట్టి మరీ తమ వీరాభిమానం ప్రకటించుకుం టున్నారు. ఈ స్థాయి గౌరవం తమిళ నాడులో లభించిన కాలంలో ఆమెను ఆమెతో పాటు నటీమణు లంతా అలాంటివారే అనడమే డిఎంకె నాయకుడు సాదిక్ కి మహిళలు, మహిళా రాజకీయనేతల పట్ల ఉన్న అసలు గౌరవాన్ని బయటపెట్టింది. అయితే డిఎంకే నాయకురాలు కనిమొళి మాత్రం క్షమాపణలు అడిగారు.  మహిళలను గౌరవించలేనివారు ప్రజాప్రతినిధులుగా ఉండడం పార్టీలకు, సమాజానికి అవమానకరమే. కానీ రాజకీయాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తన కంటే రాజకీయ బలానికే ప్రాధాన్యతనీయడం వల్ల నాయ కులు చాలామంది తమ వాక్చాతుర్యంలో భాగంగా ఇటీవల దారుణ భాషను మాట్లాడటం గమని స్తున్నాం. తిట్ల పురాణం వినపడుతోందే గాని మర్యాదగా కామెంట్లు చేయడం, విమర్శించడం అనేది వినపడటం లేదు, కనపడటం లేదు. దూషణకు, విమర్శించడానికి, బూతులు తిట్టడానికి మధ్య అంతగా తేడాలేకుండా పోతోంది. ఖుష్యూయే కాదు నటీమణులంతా ఐటమ్స్ అంటూ డీఎంకే నాయ కుడు కామెంట్ చేయడం అందుకు తాజా ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల్లోనూ నాయకులు దారుణంగా మాట్లాడు తున్నారు. విపక్షాల్లోనివారి మీద విమర్శల పేరుతో నోటిదుడుసు ప్రదర్శిస్తున్నారు. అందు లోనూ అస హ్యంగా మాట్లాడటం, సంభోదించడం అనేవి చూస్తున్నాం, వింటున్నాం. కానీ అవేమీ ఆయా పార్టీల అధినేతలకు అంతగా పట్టకపోవడమే విచిత్రం.  వైఎస్సార్  తెలంగాణ పార్టీ  అధినేత్రి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రులు  కేటీఆర్, నిరంజన్ రెడ్డి  అను చిత వ్యాఖ్యలు  చేశారంటూ ఆ పార్టీ నాయకులు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి  ఫిర్యాదు చేశారు.  ఒక మహిళపై అంతటి దారుణమైన భాష వాడుతూ దుర్బాషలాడారంటూ వారు  ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ మేరకు సునీతా  లక్ష్మా రెడ్డికి  వినతి పత్రాన్ని అందించారు.  తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం పోరాడుతూ.. వారి కోసం  నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేస్తుంటే.. మంత్రి కేటీ ఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ టీపీ నాయ కులు మండి పడ్డా రు. మంత్రి కేటీఆర్  వ్రతాలు అంటూ సంబోధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలు నిష్టగా చేసుకునే వ్రతాలను దీక్షకు ముడిపెట్టి వ్రతాలను చులకన చేశారని వైఎస్సార్ టీపీ నాయకులు ఆరో పించారు. ఈ వ్యాఖ్యలు అటు షర్మిలకు, ఇటు యావత్ మహిళా లోకానికి తీవ్ర అవమానకరం అని వారు అన్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అని అన్నారని పేర్కొన్నారు. మహిళలను చులకన భావంతో చూసే మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మా రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.   

శివసేన వర్గాల ఎన్నికల గుర్తుల పేచీ

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చంది అన్నట్లుగా మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో  కేంద్ర ఎన్నికల సంఘం అదే చేసింది. శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికి కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసింది. అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3 వ తేదీన జరిగే ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో, కేంద్ర ఏన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3 ఉప ఎన్నికలో ఏ పార్టీ పేరున, ఏ గుర్తు పై పోటీ చేయాలనుకుంటున్నాయో, ప్రాధాన్యత క్రమంలో సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి తెలియచేయాలని ఎన్నికల సంఘం చీలిక వర్గాలు రెంటిని  ఆదేశించింది. కాగా, గత జూన్ లో శివసేన రెండుగా చీలి, షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని, తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గం, పదే పదే గడవు పొడిగింపు కోరడంతో, ఎన్నికల  సంఘం నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది,ఈ నేపధ్యంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడంతో ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల  చిహ్నాని స్తంబింప చేసింది. రెండు వర్గాలకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తాత్కాలికంగా పార్టీ పేరును, గుర్తును ప్రాధాన్యతా క్రమంలో కోరింది.  ఇదలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని,ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది, అన్యాయంగా పేర్కొంది. అయినా చివరకు సత్యమే గెలుస్తుందని, థాకరే వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.   అదలా ఉంటే, శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉపఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. శివసేన సిటింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. శివసేన థాకరే వర్గం అభ్యర్హ్దిగా ఆయన సతీమణిని రుజుత లట్కే’ను  బరిలో దింపింది. మహా వికాస్ ఘటబంధన్’ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ ఆమెకు మద్దతు ప్రకటించాయి. మరోవంక  షిండే వర్గం తరపున, బీజేపీ కార్పొరేటర్ ముర్జి పటేల్,ను బరిలో దింపుతోంది. నవంబర్ 3 న పోలిగ్ జరుగుతుంది, నవంబర్ 6 న ఫలితం వెలువడుతుంది. ప్రజలు ఎటున్నారో తేలిపోతుంది. అయితే ఇప్పుడు శివసేన వర్గాలకు ఈసీ కేటాయించిన గుర్తులపై పేచీ వచ్చి పడింది.  మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే థాకరే వర్గానికి కేటాయించిన గుర్తుపైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి. ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన బాలాసాహెబ్‌ శివసేనకు రెండు కత్తులు, డాలుతో కూడిన గుర్తును ఈసీ కేటాయించగా,  మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి చెందిన శివసేనకు ఈసీ కాగడా గుర్తును కేటాయించింది. షిండే వర్గానికి కేటాయించిన రెండు కత్తులు డాలు గుర్తు  ఖల్సా పంత్ కు సంబంధించిన మతపరమైన చిహ్నమని, ఆ గుర్తును ఎవరికీ కేటాయించడానికి వీల్లేదని సిక్కులు అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. తమ అభ్యంతరాన్ని పట్టించుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మరో వైపు ధాకరే వర్గానికి కేటాయించిన కాగడా గుర్తు విషయంలో సమతా పార్టీ అభ్యంతరం చెబుతోంది. 

అయినన్ పోవలె హస్తినకు.. ఢిల్లీకి కేసీఆర్

తప్పులు చేసి దొరికిపోయి హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్లాడు లెక్కల మాస్టరు, పిల్లలకు టెస్ట్ పెట్టి పరాగ్గా ఉండద్దని చెప్పి పంపారు పెద్దాయన..కొన్నాళ్లయ్యాక ఏకంగా హాఫియర్లీ పరీక్షల్లో ముగ్గురు వల్ల నలు గురు దొరికారని తెలిసింది. వాళ్లను మంచి విద్యార్థులే.. మా ఊరోళ్లే అని మార్కులేయించు కోవడానికి వెళ్లారు.. మళ్లీ హెడ్మాస్టర్ ఆగ్రహించారు. ఇది పొరపాటు కాదన్నారు. ఆ టీచర్ పెద్దాయన్ను సుముఖు నిగా చేసుకున్నారో లేదో గాని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తనవారిని కాపాడుకోవడానికి మళ్లీ ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఆమధ్యవరకూ ఢిల్లీ హైదరాబాద్ కి సమా నమా అని బహిరంగంగానే ప్రశ్నించిన తర్వాత హఠాత్పరిణామాలు ఆ ప్రశ్నకు నీవే బదులిచ్చుకో.. అంటూ పాత పాట పాడించారు కేంద్రం వారు. నిజవే.. అందుకే సొంత ఫ్లయిట్లో  మళ్లీ  ఢిల్లీ యాత్ర పయనం కావాల్సి వచ్చింది. అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పార్టీకి, రాష్ట్రానికి పరువు అమాంతం తీసేసిన కేసీ ఆర్ కుటుంబం ఇప్పుడు మరో సారి తన ప్రాంతీయులను, తన పార్టీవారిని తన వ్యూహం నుంచీ తనే తప్పించడానికి ఢిల్లీ ప్రయాణం కావల్సివచ్చింది. ఇది విచిత్రపరిస్థితి. ప్రత్యర్దులను దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ముందంజ వేయాలి. కానీ అన్ని వ్యూహాలు బెడిసికొట్టడమే కేసీఆర్ కి మింగుడు పడటం లేదు. అన్ని ఆలోచించే రంగంలోకి దిగిన తర్వాత వ్యూహం దెబ్బతినడమేమిటని తెగ గింజుకుంటున్నా రు. లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రంలో కొత్త పథకంతో రాజ్యం చెలాయించవచ్చన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలీదుగాని కుమార్తె కవిత ఎత్తుగడ తండ్రి కేసీ ఆర్ ను దిగ్భ్రమకి గురి చేసేంతగా బూమరాంగ్ అయింది. దాన్నుంచీ బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేంద్రంలో ప్రధాని, హోం మంత్రిత్వ శాఖ వారిని బతిమిలాడి కుమార్తెను రక్షించుకునేందుకు తన విమానంలోనే ఢిల్లీకి పయనమై  అక్కడే మూడు నాలుగు రోజులు మకాం పెట్టారు. ఫలితం ఎలా ఉన్నా, ఏమి తేలనున్నా ఆ పర్యటన పార్టీని, రాష్ట్ర పరువును దెబ్బతీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి.  మొదటిసారి వెళితే బావగారు బాగానే పలకరించారని రెండో సారి అత్యుత్సాహంగా వెళితే అరటిగెల తేలేదని సదరు బావ తిట్టాడట.  ఇప్పుడు కేసీఆర్ రెండవ ఢిల్లీ పర్యటన పరిస్థితి అదే.  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. తనకు, కుమార్తెకు జరిగిన అవమానాన్ని తిప్పి కొట్టే వ్యూహం వేయాలని రోజుల తరబడి  ఆలోచించి బీజేపీ వారిని ఇరికించాలన్న వల విసిరారు. డబ్బుకు  లొంగ కుండా బయటపడిన నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పరువు కాపాడా రని అందరూ పొగడ్గలతో ముంచెత్తారు. కానీ జరిగినదేమిటి.. ఆ నలుగురుని వల వేసి పార్టీలోకి తీసుకోవడానికి భారీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు వారికి అంత స్థాయే లేదని అన్నారు. అయితే అదంతా చాలా వ్యూహా త్మకంగా ఫామ్హౌస్లో ముందుగా కెమెరాల ఏర్పాట్లతోనే పకడ్బం దీగా చేయాలని అనుకున్నా రు. కానీ అనుకోగానే అన్నీ అయిపోవుగా. అసలు వారికి డబ్బు  ఆఫర్ చేస్తున్న దాఖలాలే లేవని తేలిం ది. అందువల్ల దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోనవసరం లేదని, అదంతా టీఆర్ ఎస్ పిచ్చి ఆలోచనే అని తేటతెల్లమయింది.  దీంతో తన రంగు బయటపడే సరికి తన కొంప పూర్తిగా మునిగే లోగానే, పరువు హుసేన్సాగర్ లో కలిసే లోగానే ఢిల్లీ పెద్దలను బతిమాలి బామాలి  ఈసారికీ కాసుకో దొరా అని అడగడా నికే కేసీఆర్ మరోసారి ఢిల్లీ ప్రయాణం కట్టారనేది విశ్లేషకుల మాట.  ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు  రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్‌లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్యేల బేరసారాల కేసు.. సమాధానం లేని ప్రశ్నలెన్నో..ఎన్నెన్నో!

 కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తే ఒకలా మాట్లాడుతారు.. విఫలమైతే మరోలా మౌనమునిలా మాట్లాడుతారు. గతంలో ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. తాజా ఉదాహరణ అయితే మొన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం. ఓ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కమలం పార్టీ హస్తిన నుంచి కుట్రలు చేస్తోందనీ, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హస్తిన నుంచి వచ్చిన దూతలను తమ ఎమ్మెల్యేలు పట్టించారనీ ఊరూ వాడా అదిరిపోయేలా ప్రచారం చేసి హంగామా చేసిన టీఆర్ఎస్ హఠాత్తుగా సైలెంటైపోయింది. ఓ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు వ్యక్తులు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వీడియోలు చూపించి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి హస్తిన దూతలు ప్రయత్నించారని హడావుడి చేసింది. పైగా ఆ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం చేసింది. భారీ కుట్రను భగ్నం చేసిన తెలంగాణ హీరోలుగా తమ ఎమ్మెల్యేలను కీర్తించేసింది. ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారంటూ ప్రగతి భవన్ నుంచి సమాచారం కూడా వచ్చింది. అంతే బస్... ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల గురించి టీఆర్ఎస్ పన్నెత్తి మాట్లాడటం లేదు..పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించవద్దంటూ పార్టీ క్యాడర్ కు ఓ పిలుపునిచ్చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతే కాదు నేరుగా కేసీఆర్ కు యాదాద్రి లో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. శుక్రవారం ఉదయమే ఆయన యాదాద్రికి వెళ్లారు. కేసీఆర్ కూడా రావాలని మరో సారి సవాల్ చేశారు. అయినా కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ నుంచి మౌనమే సమాధానమైంది. ఈ లోగా పోలీసులు మాత్రం భారీ మొత్తానికి డీల్ కుదరబోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో ఎంత నగదు స్వాధీనం చేసుకున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. నగదు ప్రస్తావన లేకుండా ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్టుకున్న ముగ్గురినీ 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆ తరువాత హడావుడిగా ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్ విధించేందుకు నో అని వారి ముగ్గురినీ విడుదల చేయాలని ఆదేశించారు.  బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని తెరాస ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.  ఇంత వరకూ బానే ఉంది కానీ.. ఆ తరువాత టీఆర్ఎస్ సైలెన్సే పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక ముందు కూడా ఇలాగే బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల నివాసంలో భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు బిల్డప్ ఇచ్చిన పోలీసులు ఆ తరువాత ఆ కేసు విషయమే మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందంటూ.. ఆ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు. మరి దీని సంగతి ఏమౌతుందో అని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తం మీద ఎమ్యెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయ్యిందా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఫాం హౌస్‌లో   నందకుమార్‌, ఆయనతో వచ్చిన సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, సింహయాజులును ట్రాప్‌ చేసిన.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ సంభాషణల ఆడియో రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? అలాగే తాము బేరసారాలకు గురయ్యామని ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా, పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్వాధీనం చేసుకున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత  లేదు. కానీ గతంలో ఇంచుమించు ఇటువంటి కేసులోనే నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫోనును, ఫిర్యాదుదారుడయిన ఎమ్మెల్సీ స్టీఫెన్సన్‌ ఫోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని  వాటిని కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో మాత్రం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు చెప్పడం లేదు. అలాగే.. మొయినాబాద్ ఫాం హౌస్ సంఘటన తరువాత పోలీసులు నిందితులుగా పేర్కొన్న  నందకుమార్‌, సతీష్‌శర్మ అలియాస్‌ రామచంద్ర భారతి, సింహయాజులును పోలీసులు అరెస్టు చేశారు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసు స్టేషన్ కు తీసుకురాలేదు.. వారి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు..వారిని నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడానికి ఎందుకు అనుమతించారు అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.  ఇలాంటి కేసుల్లో నిందితులు- ఫిర్యాదు దారులను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి, వారితో వాంగ్మూలం తీసుకోవడం తప్పని సరి.. కానీ అటువంటి తప్పని సరి అయిన, అనివార్యమైన సంప్రదాయాలను పోలీసులు పాటించినట్లు కనిపించడం లేదు. 

లోకేష్ కు చంద్రబాబు కర్తవ్య బోధ

సైన్స్ గణితం మీదా శ్రద్ధపెట్టమని చింటూకి వాళ్ల నాన్న ముద్దుగా చెప్పాడు, ఇక నుంచి నీ పనులు నువ్వే చేసుకోవడం నేర్చుకోమని పింకీకి వాళ్లమ్మ చెప్పారు, లెక్కల మాస్టార్ని తన బాధ్యతలూ కొద్ది రోజులు చూసుకోమని హెడ్మాస్టర్ చెప్పారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు తన కుమా రుడు నారా లోకేష్కి మంగళగిరి బాధ్యతలు పూర్తిగా చేపట్టి విజేతగా నిలవమని కర్తవ్యబోధ చేశారు.  ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడానికి ఎంతో అవకాశం ఉండడంతో తెలుగు దేశం నాయకులు రెండిం తల ఉత్సాహం తో దూసుకుపోతున్నారు. అయితే ఈపర్యాయం తప్పకుండా అధికారంలోకి రావాలంటే అందరం మరింత శ్రమించాలని, మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని  ఏమాత్రం నిర్లఓ్యం తగదని ఇప్పటికే అధినే చంద్రబాబు టీడీపీ వర్గాలకు చిన్న క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో  పార్టీ పరిస్థితిని, ఆ ప్రాంత నాయకుల పనితీరును  చంద్రబాబు సమీక్షించారు. లోకేష్ను మంగళగిరి బాధ్యతలను లోకేష్ చేతుల్లో పెట్టారు. అక్కడ చరిత్రను తిరగరా యాలని ఉత్సాహపరిచారు. అలాగే నియోజకవర్గాల ఇన్ ఛార్జ్లతో కూడా చంద్రబాబు వన్ టు వన్ సమావేశమై పరిస్థి తుల గురించి కూలంకషంగా చర్చించారు.  రాష్ట్రంలో జగన్ పాలనపట్ల విపరీత వ్యతిరేకత వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణాన్ని పూర్తిగా వినియో గించుకుని అధికారంలోకి రావాలన్న లక్ష్యం తెలుగు దేశం నాయకుల్లో ఉంది. ప్రజలు అన్ని విధాలా వైసీపీ  ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదు. జగన్ అన్నివిధాలా విఫలమ య్యార న్నది ప్రజల వ్యతిరేకతే  తెలియజేస్తోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే కాలం గడిపేయ కుండా పార్టీని మరింత  బలోపేతం చేయడం, పార్టీని గెలిపించడం మీదనే దృష్టి పెట్టాలని  టీడీపీ పార్టీ అధినేత సూచించారు.  మంగళగిరి నియోజకవర్గంపై ఇంచార్జ్ నారా లోకేష్ తో పార్టీ అధినేత సమీక్ష జరిపారు. పార్టీ కార్యక్ర మాలు, కమిటీల నియామకం, స్థానిక నేతల పనితీరు వంటి అంశాలపై తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా రివ్యూ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983,1985 ఎన్నికల్లో మంగళగిరిలో టిడిపి గెలిచిందని…1989 నుంచి 2009 వరకు జరిగిన 5 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. పొత్తుల్లో రెండు దశాబ్దాల పాటు మంగళగిరి సీటు వేరు పార్టీలకు ఇచ్చుకుంటూ వచ్చిన కారణంగా నియోజకవర్గంలో అప్పట్లో పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు. 2019 ఎన్నికల తరువాత పార్టీ యాక్టివిటీ పెంచడం, కార్యకర్తల సంక్షేమం చూడడం, ఇతర కార్యక్రమాల కారణంగా మంచి మార్పు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అయితే  దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని, తిరుగు లేని విజయంతో మంగళగిరిలో కొత్త చరిత్ర రాయాలని ఇంచార్జ్ లోకేష్ కు పార్టీ అధినేత సూచించారు. నాలుగు నియోజవర్గాల ఇంచార్జ్లతో ముఖాముఖీ భేటీలు జరిగాయి. కర్నూలు ఇంచార్జ్ టిజి భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ రివ్యూలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో ముఖాముఖి సమీక్షలు ముగిశాయి.