కృష్ణా జిల్లాలో భార్యకు శీల పరీక్ష..

రావణుడి వద్ద ఉన్న సీతను అవమానించి అగ్నిపరీక్ష పెట్టాడు శ్రీరామచంద్రుడు. అయినా ఎదురు మాట్లాడకుండా భర్త ఆజ్ఞ మేరకు అగ్నిలో దూకింది సీతమ్మ. సాక్షాత్తూ అగ్నిదేవుడే దిగివచ్చి సీతమ్మ నిప్పులాంటిదని ప్రకటించాడు. ఆనాటి రాముడిని స్పూర్తిగా తీసుకున్నాడో ఏమో గానీ ఒక భర్త కట్టుకున్న భార్యకు శీల పరీక్ష పెట్టాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో తానీష్ అనే వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ మాటలతో వేధించడమే కాకుండా, తన నిజాయితీని నిరూపించుకోవాలంటూ ఆమెను శీలపరీక్షకు ఒప్పించాడు.  అందుకు కాలిన ఇనుపరాడ్‌ను ఎంచుకున్నాడు. కాల్చిన ఇనుపరాడ్‌ను చేతితో పట్టుకోవాలని..చేతులు కాలకపోతే శీలవతి అయినట్టు, లేకపోతే శీలం లేనట్లేనని చెప్పడంతో భార్య అందుకు అంగీకరించింది. సాక్షాత్తూ పెద్దల ముందే శీలపరీక్షకు ఏర్పాట్లు చేశాడు. అయితే విషయం పోలీసుల చెవిన పడటంతో సమయానికి అక్కడికి చేరుకుని తానీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రెండో భార్యకు దిగ్విజయ్ ఝలక్.. ఆస్తిలో చిల్లిగవ్వ లేదు..

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ ఎన్డీటీవీ, రాజ్యసభ టీవీలో యాంకర్‌గా పనిచేసిన  అమృతా రాయ్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఆమెకు పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ ఆయన అమృతకి ఇచ్చిన షాక్ ఏంటనుకుంటున్నారా.. తన ఆస్తి మొత్తం మొదటి భార్య పిల్లల పేరుపై రాసిచ్చేశారు. అంతేకాదు దీని గురించి ట్విట్వర్లో ఓ పోస్ట్ కూడా పెట్టారు. అమృతారాయ్‌కు తన ఆస్తిలో ఏమీ దక్కబోదని కూడా దిగ్విజయ్ ట్వీటారు. అయితే దీనిపై వస్తున్న వార్తలకు స్పందించిన అమృతా మాత్రం తనకు దిగ్విజయ్ కావాలి తప్ప ఆయన ఆస్తి కాదని ప్రకటించారు. మొత్తానికి వీరి అన్యోన్యం ఇలాగే ఉండాలని కోరుకుందాం.. కాగా అమృతా రాయ్‌కు ముందు ఒక వివాహం జరుగగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నాక దిగ్విజయ్ సింగ్‌ను వివాహమాడారు.

మా కూతురు చనిపోవడానికి అనుమతి ఇవ్వండి..

  తమ కూతురు చనిపోవడానికి అనుమతి ఇవ్వడంటూ ఓ పాప తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. శ్యామ‌ల దంప‌తులు త‌మ స్వ‌స్థ‌లం జ‌గ‌ద్గిరిగుట్ట నుంచి హైద‌రాబాద్‌కి వచ్చి ఉంటున్నారు. అయితే తమకు హర్షిత కారుణ్య అనే పాప ఉంది. కారుణ్య గత కొద్ది కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. దీంతో కారుణ్య తల్లిదండ్రులు హర్షిత కారుణ్య మరణానికి అనుమతివ్వాలని హైద‌రాబాద్‌లో హెచ్ఆర్సీని ఆశ్ర‌యించారు. త‌మ చిన్నారి ప‌రిస్థితిని హెచ్ఆర్సీలో తెలిపి, తమ చిన్నారి కారుణ్య మరణానికి అనుమతినివ్వాలని కోరారు. ఈ అంశంపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ప్రియాంక గాంధీ దేనికి పనికిరాలేదా.. ?

  త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల గురించి పార్టీలు ఇప్పటినుండే వ్యూహాత్మక రచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓ అధికార ప్రకటన చేసింది. ఇప్పటివరకూ యూపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు ఎన్నికల బరిలో దిగుతారో అన్నదానిపై పలు అనుమానాలు ఉండేవి. మొదట రాహుల్ గాంధీని ఎన్నికల బరిలో దించుదామని అనుకున్నా.. రాహుల్ అయితే గెలవడం కష్టం అని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి మొత్తుకోవడంతో.. రాహుల్ కాకుండా ప్రియాంక గాంధీని బరిలో దించాలని చూశారు.   అచ్చం ఇందిరా గాంధీ పోలీకలతో ఉంటుంది కాబట్టి అది ప్లస్ చేసుకుందామని.. ఇక ప్రజలు కూడా ఓట్లు వేస్తారని కాంగ్రస్ అనుకుంది. ఇక ప్రియాంక గాంధీనే యూపీ ఎన్నికల బరిలో దిగుతారని అనుకున్నారు అందరూ. అయితే అందరికి ట్విస్ట్ ఇస్తూ షీలా దీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన షీలా దీక్షిత్ అయితే గెలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ఆమెతో చర్చలు కూడా జరిపారు. అంతే కాదు ఆమె ఇక ఫైనల్ అనుకున్నారు కానీ ఆమె మాత్రం దానిని తిరస్కరించారు. అయితే దీనికి కారణం.. ఆమెపై వాటర్ ట్యాంకర్ల కుంభకోణంపై ఆరోపణలు ఉన్నాయన్న నేపథ్యంలో వద్దన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో మళ్లీ ప్రియాంక గాంధీనే యూపీ తరుపున సీఎం అభ్యర్ధిగా బరిలో దిగుతారు అనుకున్నారు. మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. ఆఖరికి షీలాదీక్షిత్ పేరునే కాంగ్రెస్ ఖరారు చేసింది.   ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థినిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీలో నిలవనున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదటి నుండి ప్రచార భాద్యతలు ప్రియాంక గాంధీనే నిర్వహిస్తారని అనుకున్నారు.. ఆఖరికి అది కూడా ప్రియాంకాకు దక్కలేదు.. పార్టీ ప్రచార బాధ్యతల సారథ్యాన్ని ప్రియాంకా గాంధీకి కాకుండా సంజయ్ సింగ్ కు అప్పగించారు. మొత్తానికి ప్రియాంకాకు రెండింటిలో ఏదీ దక్కకుండా అయిపోయింది. కనీసం ప్రచారానికైనా ఉపయోగించుకుంటారా.. లేకా అక్కడ కూడా లైట్ తీసుకుంటారా.. చూద్దాం..

ఈకుక్కకి హ్యాట్సాఫ్ చెప్పాలిందే..

  కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని అంటాం.. అది మరోసారి నిరూపించింది  భువనేశ్వర్ లోని ఓ కుక్క. తన యజమాని కుంటుంబాన్ని కాపాడుకోవండం కోసం తన ప్రాణాల్నే పణంగా పెట్టింది. వివరాల ప్రకారం... భువనేశ్వర్‌లోని రాయ్‌ఘడ్ అటవీ ప్రాంతంలో దిబాకర్ అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. అయితే అది అటవీ ప్రాంతం కావడంతో తాను పెంచుకునే కుక్కని ఎప్పుడూ బయటనే ఉంచేవాడు. రోజూ లాగే కుక్క బయట ఉండగా.. నాలుగు పాములు ఇంటిలోపలికి రావడం గమనించింది. అంతే వాటితో యుద్దమే చేసింది. ఆఖరికి ఎలాగూ ఆ నాలుగు పాములను చంపింది. అయితే చంపే క్రమంలో దానికి కూడా విషం ఎక్కడం వలన.. వాటిని చంపిన కొద్ది సేపటికే కుక్క కూడా చనిపోయింది. ఈమరుసటి ఉదయం దిబాకర్ లేచి చూడగా.. కుక్క చనిపోవడం చూసి ఏమైందో అని భయపడుతుండగా.. పక్కన నాలుగు పాములు చనిపోయి ఉండటం చూసి షాకయ్యాడు. దీంతో పరిస్థితి అర్ధమైన దిబాకర్.. పాముల నుంచి మా కుటుంబాన్ని కాపాడేందుకు కుక్క తన ప్రాణాన్నే త్యాగం చేసిందని.. కుక్క చూపిన విశ్వాసానికి ఆ కుటుంబం మొత్తం కంటతడి పెట్టింది. మొత్తానికి మనుషులను, మనుషులే నమ్మని ఈరోజుల్లో.. ఒక కుక్క విశ్వాసంతో ఇంత పని చేసిందంటే గ్రేటే కదా..

డైలీ సీరియల్ మాదిరి శ్రీవాణి భూవివాదం...

బుల్లి తెర నటి శ్రీవాణి, ఆమె వదిన అనూషల మధ్య భూవివాదం డైలీ సీరియల్ మాదిరిగానే నడుస్తోంది. తన ఇల్లు శ్రీవాణి కూల్చేసిందని అనూష పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శ్రీవాణి కూడా తిరిగి అనూషపై తిరిగి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించిన శ్రీవాణి.. ఇల్లు కూల్చేశానని వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని.. తన వదినే తనపై దాడి చేసి కేసు పెట్టిందని తెలిపింది. తన వదినతో పాటు పరిగి గ్రామస్థులు కూడా అబద్ధం ఆడుతున్నారని తెలిపింది. 'మహిళా మండలిలో తిరుగుతావు కనుక అక్కడ సపోర్ట్ నీకుంటుంద'ని ఆమె ఆరోపించింది. ఆ ఆస్తులు తన తండ్రివని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పింది. తన తరపున వచ్చిన వాటా కావాలంటే తన వదినకు రాసి ఇచ్చేస్తానని శ్రీవాణి తెలిపింది. తన వదిన తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆమె చెప్పింది. దీనికి అనూష మాట్లాడుతూ, తన భర్త ఐసీయూలో ఉన్నప్పుడు అతనిని చూసేందుకు ఏనాడూ శ్రీవాణి రాలేదని అన్నారు. తన భర్త (శ్రీవాణి అన్న) మరణించినప్పుడు చూసేందుకు వచ్చిన శ్రీవాణి శవం దగ్గర గంటసేపు ఉండి వెళ్లిపోయిందని ఆమె తెలిపారు. భర్తకు చెప్పకుండా తన ఇంటికి వచ్చిన శ్రీవాణిని ఎలా ఆదరించానో ఆమెకే తెలుసని అనూష తెలిపారు. తన భర్తతో కలిసి శ్రీవాణి ఇంటికి వెళ్తే సూటిపోటి మాటలతో తనను వెళ్లగొట్టిందని ఆమె చెప్పారు. మరి ఇంకా ఎన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయో చూద్దాం..

బుర్హాన్ వానీ ఒట్టి పిరికి పంద.. ఏడ్చేశాడంట..!

  బుర్హాన్ వానీ.. ప్రస్తుతం కాశ్మీర్లో అల్లర్లు సృష్టించడానికి కారణమైన పేరు. గత నాలుగు రోజుల నుండి కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆయన మృతికి నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలో చాలామంది భద్రతా పోలీసులు మరణించగా.. పలువురికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇంత మంది కలిసి బుర్హాన్ ముజఫర్ వానీని హీరోని చేసి ఇంత సీన్ చేసిన నిరసనకారులు.. అసలు వాళ్లు అంత చేసే కెపాసిటీ బుర్హాన్ వానీకి ఉందా.. అంటే లేదనే అంటున్నారు.   అసలు సంగతేంటంటే.. ఇప్పటి వరకూ.. బుర్హాన్ పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నట్టు.. జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ అతడిని ఓ పోరాట యోధుడిగా చెప్పుకొచ్చాడు. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదట. ఎందుకంటే.. ఈ నెల 8న జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ ప్రాంతంలో తలదాచుకున్న అతడి స్థావరాన్ని భారత సైనికులు చుట్టముట్టగానే అతడు బెంబేలెత్తిపోయాడట. భారత సైనికుల బూట్ల చప్పుడు వినిపించగానే అతడు ప్రాణభయంతో వణికిపోయాడట. అంతేకాదు.. సైన్యం చేతిలో తనకు చావు తప్పదని తెలుసుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోధించాడట. కానీ మన సైన్యం మాత్రం  బుర్హాన్ వనీ.. మరో ఇద్దరు ఉగ్రవాదులను కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో వారిని మట్టుపెట్టారు. మరి అలాంటి పిరికి పంద కోసం కాశ్మీర్లో ఇంత అల్లరి సృష్టించడం కరెక్టో కాదో ఆలోచించుకుంటే బావుంటుంది.

అసెంబ్లీలోనే రాత్రంతా పడుకొని ఎమ్మెల్యేల నిరసన..

  కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇటీవల కర్ణాటకలో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగానే వారు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. మరోవైపు సిద్దరామయ్య డీఎస్పీ ఆత్మహత్యపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ప్రకటించినా విపక్షాలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్పీకర్ చేసేది లేక సభను వాయిదా వేశారు. అయినా శాంతించని విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీని వదిలి వెళ్లేందుకు నిరాకరించారు. రాత్రంతా అసెంబ్లీలోనే ఉండి అక్కడే చక్కగా దుప్పట్లేసుకుని పడుకున్నారు. ఎమ్మెల్యేల వినూత్న నిరసనతో నేటి ఉదయం ఆయా పార్టీలో ఈ విషయంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెర తీశాయి. కేజే జార్జి తన మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళన విరమించేది లేదని ఆ పార్టీలు తేల్చిచెప్పాయి. మరి మంత్రిగారు రాజీనామా చేస్తారో లేదో చూడాలి..

చంచల్ గూడ్ జైలుకు శ్రావెల్..

  కారు ప్రమాదంలో తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడి హైదరాబాదీ చిన్నారి రమ్య ఆఖరికి ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణమైన వారిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావెల్ పోలీసు కస్టడీ నిన్నటితోనే ముగియడంతో అతనిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు శ్రావెల్ కు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో శ్రావెల్ ను పోలీసులు చంచల్ గూడ్ జైలుకు తరలించారు.   మరోవైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ శ్రావెల్ కోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగానే.. అతడి తరఫున లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... దానిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

మద్రాస్ ఐఐటీలో జంట ఆత్మహత్యల కలకలం..

  మద్రాస్ ఐఐటీలో జంట ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్శిటీలో చోటుచేసుకుంది. దీంతో అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. వివరాల ప్రకారం. వర్శిటీలో  భౌతిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గణేశన్ సతీమణి విజయలక్ష్మీ వారి క్వార్టర్స్ లో ఉరేసుకొని చనిపోయింది. దీంతో అందరూ విచారంలో ఉండగా.. ఆమె చనిపోయిన కొంత సమయానికే పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న మహేశ్వరి (34) అనే మహిళ కూడా తానుంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. దీంతో వర్శిటీ ఒక్కసారిగా వణికిపోయింది. ఒకే రోజు.. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఇద్దరూ వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారా.. లేక ఇద్దరి ఆత్మహత్యలకు కారణం ఏదైనా ఉందా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మీ నేతలను పట్టించుకోవా కేజ్రీవాల్..

ఆప్ నేతులు ఎప్పడూ ఏదో వివాదాన్ని నెత్తిన పెట్టుకుంటూనే ఉంటారు. ఇప్పటికే చాలామంది నేతలు.. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు మరో కొత్త నేత.. మరో తలనొప్పి తీసుకొచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే.. సొంత పార్టీనేతే ఆరోపణలు చేయడం. అసలు సంగతేంటంటే..ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ మద్యం మత్తులో పార్లమెంటుకు హాజరయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై గతంలో యోగేంద్ర యాదవ్..మద్యానికి బానిసగా మారిన మన్... చాలాసార్లు తాగిన మైకంలోనే లోక్ సభలో అడుగుపెట్టారని ఆరోపించారు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా మన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యం సేవించి పార్లమెంటుకు వెళుతున్న భగవత్ మన్ పంజాబ్ ప్రజల ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. మరి ఎంతవరకూ వేరే పార్టీ నేతలను విమర్సించే కేజ్రీవాల్ తమ పార్టీ నేతలు చేసే పనుల గురించి పట్టించుకొని చర్యలు తీసుకుంటారో.. లేక లైట్ అని వదిలేస్తారో చూడాలి.

జకీర్ తలకు పెరుగుతున్న డిమాండ్..

  ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయకు తలకు రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది. జకీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు యువత ఉగ్రవాదం వైపు మొగ్గుతూపుతున్నార్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పులువురు జకీర్ నాయక్ పై విమర్శల బాణాలు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో జకీరా నాయకు తలను నరికిన వారికి రూ 15 లక్షల రివార్డ్ ఇస్తామని.. 'హుస్సైని టైగర్స్' నేత సైయద్ కల్బె హుస్సైని నఖ్వి ప్రకటించారు. అయితే ఇప్పుడు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) మాజీ నేత సాధ్వీ ప్రాచీ ఆ ధరను మరింతగా పెంచేశారు. జకీర్ నాయర్ తలను తెగ్గోసిన వారికి తాను రూ.50 లక్షలు బహుమానంగా ఇస్తానని.. జకీర్ ఇస్తామిక్ మత గురువు కాదని.. ఆయన ఉగ్రవాది అని విమర్సించారు. జకీర్ ను చంపేసే వారికి ఇచ్చే బహుమానాన్ని తాను సొంతంగానే ఇస్తానని, ఏ ఒక్క సంస్థ సహకారం తీసుకోనని కూడా ఆమె ప్రకటించారు.

చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితనం గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా అనుకుంటే అది నెరవేర్చేవరకూ చాలా కష్టపడతారు. ఆయన పనితనం గురించి మన రాష్ట్రం వారికే కాదు.. పొరుగు రాష్ట్రాల నేతలకు కూడా తెలిసిన విషయమే. అప్పుడప్పుడు కొంతమంది నేతలు ఆయన గురించి ప్రశంసలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదని.. చంద్రబాబు సూపర్ యాక్టివ్ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతున్నారని.. రాష్ట్రానికి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో తనతో చాలా సార్లు సంప్రదింపులు జరిపారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా ఏ ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చరని.. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా దూసుకుపోతోందన్నారు. ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.

సుష్మా స్వరాజ్ సరదా ట్వీట్.. ఈ యాంగిల్ కూడా ఉందా..!

విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్టర్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వరం స్పందిచడం.. సీరియస్‌ విషయాలనే పట్టించుకుంటారనుకుంటే పొరపాటే. ఆమె అప్పుడప్పుడు సరదా ట్వీట్లు కూడా చేస్తుంటారు. ఈరోజు కూడా  ఆమె సరదాగా ఓ ట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్‌ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ఆమె సరదాగా తన పెళ్లినాటి ఫొటోను ట్వీట్‌చేశారు. దీంతో సుష్మకి అభినందనలు వెల్లువెత్తాయి. అభినందనలు చెప్పినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా 1973 జులై 13న సుప్రీంకోర్టు న్యాయవాది స్వరాజ్‌ కౌశల్‌తో సుష్మా స్వరాజ్‌ వివాహం జరిగింది.

ఒడిషాలో తెలుగు విద్యార్ధి అనుమానాస్పద మృతి..

  పొరుగు దేశాల్లో.. పొరుగు రాష్ట్రాల్లో తెలుగు విద్యార్ధులపై అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్ధి ఒడిషాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బొర్రపాలెంకు చెందిన వంశీ పర్లాకిమిడి సెంచరియన్ యూనివర్శిటీలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వంశీకృష్ణ వర్శిటీ ప్రాంగణంలో శవమై కనిపించగా తోటి విద్యార్థులు గమనించి విశ్వవిద్యాలయం యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే విశ్వవిద్యాలయం యాజమాన్యం మాత్రం.. వంశీకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. కానీ తమ కుమారుడిది ముమ్మాటికి హత్యేనని తమ బిడ్డ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నివేదక వస్తేకాని ఏ విషయం చెప్పలేమని చెబుతున్నారు.

ఆటగాళ్లకు కుంబ్లే షరతులు..

  భారత్ క్రికెట్ కోచ్ గా అనిల్ కుంబ్లే నియామకం అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన ఆటగాళ్లకు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో టెస్ట్ సిరీస్‌ లో ఇండియా జట్టు విండీస్ జట్టుతో తలపడనున్న సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ గా స్వీకరించిన కుంబ్లే ఆటగాళ్ల ప్రాక్టీస్, శిక్షణతో పాటు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట. అంతేకాదు కొన్ని షరతులు కూడా పెట్టాడట. బస చేసిన హోటల్ నుంచి టీం బస్ వద్దకు నిర్ణీత సమయంలో రావాలని.. ఎవరైనా ఆలస్యంగా బస్సు వద్దకు వస్తే రూ.3వేల జరిమానా చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించాడట. ఆటగాళ్లు ఏ సమయంలోనైనా, ఏ సందేహాలు ఉన్నా తనతో నేరుగా మాట్లాడవచ్చునని.. ఆటగాళ్లకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నాడట. మరి కుంబ్లే కోచ్ గా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

ఇస్తే నేను రెడీ అంటున్న కుష్బూ..

  తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు కుష్బూకు టీఎన్‌సీసీ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అది నిజమో.. కాదో తెలియదు కానీ.. వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవికెఎస్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆపదవి ఖాళీగా ఉంది. దీనికి పీటర్‌అల్ఫోన్స్‌, వసంతకుమార్‌, సుదర్శన్‌ నాచ్చియప్పన్‌, కుమరిఅనంతన్‌లు రేసులో ఉండంగా..ఇటీవలే రాహుల్ వారితో మాట్లాడారు. అయితే ఇప్పుడు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో కుష్బూ భేటీ అవ్వగా వారు ఏం చర్చించుకున్నారో తెలియదు కాని.. ఆమెకు తమిళనాడు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.   ఇక ఈ విషయంపై స్పందించిన ఖుష్బూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో నార్మల్‌గానే భేటీ అయ్యానని, తనకు టీఎన్‌సీసీ అధ్యక్షురాలి పదవిని ఇస్తే స్వీకరిస్తానని, కానీ అందుకు తగ్గ నేతలు చాలామంది పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. మరి ఏ జరుగుతుందో.. ఎవరికి పార్టీ పగ్గాలు అందుతాయో చూడాలి.