రెయిన్ట్రీయే కావాలంటున్న ఐఏఎస్లు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలిరావడం వేగం పుంజుకుంది. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా అమరావతికి క్యూ కడుతున్నారు. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని రెయిన్ట్రీ అపార్ట్మెంట్లో వసతి కావాల్సిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలతో రెయిన్ ట్రీలో వసతి కోసం మొత్తం 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, జె.సి.శర్మ, అజేయ కల్లం, పి.వి.రమేశ్, అనిల్ చంద్ర పునేత, దినేశ్కుమార్, ఎస్.వి.ప్రసాద్, శ్రీనరేశ్, లవ్ అగర్వాల్, అనంతరాము తదితరులున్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది.