గవర్నర్ నరసింహన్కు ఏపీ సీఎం పసందైన విందు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి పసందైన విందు ఇచ్చారు. విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్, సీఎంతో కలిసి ఓ హోటల్లో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు ఒకే వాహనంలో ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు.
అక్కడ చంద్రబాబు కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ నరసింహన్కు స్వాగతం పలికారు. గవర్నర్ రాకను పురస్కరించుకుని సీఎం 15 రకాల ఆంధ్రా వంటకాలను రెడీ చేయించారు. వీటిలో క్యారెట్ బొబ్బట్లు, గారెలు, పూర్ణం బూరెలు, పచ్చి శనగపప్పు గోంగూర కూర, టమోటా కొత్తిమీర చట్నీ, ఆంధ్రా గోంగూర చట్నీ, దొండకాయ, బీరకాయ చట్నీ, మిక్స్ డ్ వెజిటబుల్ కూర, ఉలవచారు, ముద్దపప్పు, మునక్కాయ, బెండకాయ కూరలు, గుమ్మడి వడియాలు, ఊర మిరపకాయలు, సాంబారు, రసం ఉన్నాయి. విందు అనంతరం కారు వద్దకు వచ్చి మరీ గవర్నర్ నరసింహన్కు చంద్రబాబు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్కు ముఖ్యమంత్రి స్వీట్ బాక్స్, గిఫ్ట్ ప్యాక్, తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.