తెలంగాణ చేప కొర్రమీను.. మరి ఏపీకి..?

  తెలంగాణ రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు అయింది. ఇప్పటికే ఈ రాష్ట్రం తమ రాష్ట్ర పక్షిగా పాలపిట్టను ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇంకా రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర పండు మామిడి, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడ కబడ్డీ, రాష్ట్ర జంతువు కృష్ణ జింకగా కూడా ప్రకటించుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తమ రాష్ట్ర చేపగా కొర్రమీనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది.   కాగా తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీనను గుర్తించాలని  మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్క రాష్ట్రం తమ రాష్ట్ర చేపగా ఒక్కో రకాన్ని గుర్తించాయని.. వాటి అభివృద్ధి కోసం నిధులు కూడా కేటాయిస్తున్నారని తెలిపారు. అందుకే తెలంగాణలో అత్యధికంగా లభించే .. ప్రజలు ఎక్కువగా ఇష్టపడి తినే  కొర్రమీనను  తెలంగాణ రాష్ట్ర చేపగా గుర్తించాలని కోరారు. ఇప్పటికే 16 రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు చేపలను గుర్తించాయని తెలిపారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొర్రమీనను రాష్ట్ర చేపగా గుర్తించింది. ఇప్పుడు తెలంగాణకు చేపను కొర్ర మీనగా గుర్తిస్తే ఏపీ రాష్ట్ర మరో చేపను ఏపీ చేపగా గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఏపీ ఏం చేస్తుందో చూడాలి.

మాయావతిని అంత మాట అన్నాడా..?

  కొంత మంది నేతలు ఆవేశంతో అప్పుడప్పుడు తాము ఏం మాట్లాడుతున్నామో అన్న సంగతి కూడా మరిచిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ  (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఒక వేశ్యతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాయవతి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని దయాశంకర్ సింగ్ వ్యాఖ్యానించారు. కాన్షీరాం ఆశయాలను మాయావతి తుంగలోకి తొక్కారని విమర్శించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మాయావతి.. రోజు రోజుకి బీఎస్పీ పై పెరుగుతున్న ఆదరణ చూసి ఇలాంటి దిగుజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. దయాశంకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవుడా.. రాహుల్ మళ్లీ బుక్కయ్యాడా..!

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నా..ఇంకా అతన్ని ఏం తెలియని వ్యక్తిగా చూస్తుంటారు. ఇంక ప్రతిపక్ష నేతలైతే రాహుల్ గాంధీపై సెటైర్ల మీద సెటైర్లు వేసుకుంటారు. రాహుల్ గాంధీకి ఏం తెలియదని.. రాహుల్ గాంధీ తెలివితక్కువ మేధావి అని అబ్బో ఇలా చాలానే విమర్శలు చేస్తుంటారు. అందుకే సొంత పార్టీ నేతలు కూడా రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటే భయపడుతున్నారు. రాహుల్ గాంధీ ఎంత ప్రతిభవంతుడో తెలిసే యూపీ ఎన్నిక్లలో ఆయన్ను కాదని.. ప్రియాంక గాందీని బరిలో దించుదామనకున్నారు. అది కూడా వద్దనుకొని యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆఖరికి షీలా దీక్షిత్ ను ఎంపికచేశారనుకోండి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి ఇంత పొగడటానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారా. అదేంటంటే.. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశ చర్చల్లో అప్పుడప్పుడు నిద్రకి ఉపక్రమించడం కామన్. ఇప్పుడు కూడా అలాగే నిద్రపోతూ బుక్కయ్యారు.   పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడోరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా ఒకపక్క ప్రతిపక్ష, విపక్ష నేతలు గుజరాత్ దాడుల గురించి కొట్టుకుంటుంటే మరోపక్క రాహుల్ గాంధీ మాత్రం హాయిగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు సైతం రాహుల్ చేసిన పనికి ఖంగుతిన్నారు. ఒకపక్క గుజరాత్ దాడులపై చర్చలు జరగాలని.. బీజేపీ పార్టీని ఇరుకున పెడదామని ఆందోళనలు చేస్తుంటే తమ నేతే ఇలా చేసినందుకు వారు ఢిపెన్స్ల్ లో పడిపోయారు. ఇక ఇది చూసిన బీజేపీ నేతలు ఊరుకుంటారా.. రాహుల్ గాంధీపై ఒకటే విమర్శలు చేశారు. దళితులపట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి రాహుల్ గాంధీని అన్నారంటే అన్నారు అంటారు కాని.. ఆయన చేసే పనులను బట్టే అందరూ అంటారు మరి.

లోకేశ్ ఒక్కడేనా.. అంతలేదు ఇద్దరం ఉంటాం..!

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు ఏపీకే అంకితమైపోయారు. అయితే ఏపీలో ఎలాగూ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇందుకు విరుద్దం. అక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ దే హవా అంతా. ఇప్పటికే ఇతర పార్టీల నుండి నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. టీడీపీ నుండి కూడా పదిమందికి పైగా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుకున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలోని టీడీపీకి కాస్త సమయం కేటాయించమని గతంలో నేతలు చంద్రబాబును కోరడం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి టీటీడీపీ నేతలు ఈ విషయంపై చంద్రబాబుతో భేటీ అయ్యారు.   మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్ తదితరులు చంద్రబాబుతో భేటీ అయి..  తెలంగాణలో పార్టీ క్యాడర్ పై నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారని.. అలాకాకుండా పార్టీ తిరిగి పుంజుకునేలా కనీసం తన కుమారుడు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ను అంకితం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. అలా అయినా వారిలో తిరిగి మానసిక స్థైర్యాన్ని నింపవచ్చని కోరారట. అయితే దీనిని చంద్రబాబు మాత్రం తిరస్కరించారట. తాను ఒక్కడే కాదు.. తెలంగాణకు ఇద్దరమూ సమయం కేటాయిస్తామని, పార్టీ సమస్యలను పరిష్కరిస్తామని మాత్రం హామీ ఇచ్చారట.

కాంగ్రెస్ పాప ప్రక్షాళనకు అవకాశం దక్కుతుందా..!

  ఏపీ ప్రత్యేక హోదా పై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీనిపై 22వ తేదీన ఓటింగ్ జరగనుంది. దీంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి బిల్లును ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశ్యంతో.. వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే కేవీపీ ఢిల్లీ చేరుకోగా.. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా హస్తినకు చేరుకున్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు.   మరోవైపు అసలు ఈ బిల్లును చర్చకే రానివ్వం అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీపై పట్టు సాధిస్తుందా. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు.. బీజేపీ పార్టీ వ్యూహాల ముందు నెగ్గుతాయా అన్నది ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ గా భావిస్తుంది. ఎలాగైనా బిల్లుకు ఆమోదం లభించేలా చేసి.. ఏపీలో పార్టీ మెలైజీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

నన్ను అవమానించారు.. అలాంటప్పుడు ఎందుకు పిలవాలి..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని నేరంద్ర మోడీపై ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఆరోపణలు చేస్తూనే ఉండటం కామన్. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ తనకు అవమానం జరిగిందని ఆరోపిస్తున్నారు. మోడీ గత వారం ముఖ్యమంత్రులందరితో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి వచ్చిన తనను ఫోన్ బయటే పెట్టి వెళ్లాలని భద్రతా సిబ్బంది కేజ్రీవాల్ ను కోరారట. తనతో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ కూడా బయట పెట్టమని కోరారట. దానికి ఆమె బెంగాల్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఏంటని.. తనకెలా తెలుస్తుందని ప్రశ్నించగా ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేశారంట. కానీ కేజ్రీవాల్ ఫోన్ మాత్రం సమావేశం పూర్తయ్యే వరకూ ఇవ్వలేదట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కేజ్రీవాల్.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సమావేశానికి పిలిచి నన్ను అవమానించారని.. వ్యక్తులను బట్టి భద్రతా సిబ్బంది ప్రవర్తించి మమ్మల్ని అవమానించారని అన్నారు. అంతేకాదు.. తాను, మమత మాట్లాడుతున్న వేళ, ప్రసంగాలను పలుమార్లు అడ్డుకున్నారని, తాము చెప్పేది వినే ఓపిక లేకుంటే అసలెందుకు పిలవాలని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మొత్తానికి కేజ్రీవాల్ మాత్రం మోడీని ఏదో ఒకటి అననిదే మాత్రం ఊరుకోరు.

ఈ బిల్లుపై కూడా ఆశలు వదులుకోవడమేనా..?

  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై 22వ తేదీన ఓటింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది.. ?ఓటింగ్ లో ఏపీకి న్యాయం జరుగుతుందా..? లేదా..? ఓటింగ్ లో కనుక గెలిస్తే బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది..? అంటూ ఇలా అందరూ చూస్తున్నారు. మరోపక్క కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఎవరి వ్యూహంలో వారు ఉండగా.. బీజేపీ నేత హరిబాబు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే మాత్రం ఈ బిల్లు ముందుకు సాగడం కష్టమేననిపిస్తుంది.   ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ ఎప్పటినుండో పాట పాడుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.. ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకంటూ చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బిల్లు ద్వారా అయినా ఏపీకి ప్రత్యేక హోదా సాధించవచ్చని అనుకుంటుంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ.. రాజ్యసభలో అసలు కేవీపీ బిల్లును చర్చకే రానివ్వమని ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో హరిబాబు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ బిల్లుపై కూడా ఆశలు వదిలేసుకోవడం మంచిది అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

కిక్కిరిసిన సాయి మందిరాలు..ఘనంగా గురుపౌర్ణమి

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సాయిబాబా ఆలయాలకు క్యూకట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షీర్డితో పాటు పలు నగరాల్లోని బాబా మందిరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మంగళ హారతులతో...సాయి నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. కొన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుపౌర్ణమి ఘనంగా జరిగింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్ సాయిబాబా దేవాలయాలతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సాయి నామస్మరణలో మునిగితేలారు.

లంచం తీసుకున్నాడని..ఐఏఎస్ భార్య, కుమార్తె ఆత్మహత్య

కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా పరిచేస్తున్న బి. బన్సాల్ ఓ ఫార్మా కంపెనీ నుంచి రూ.9 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇది జరిగి రెండు రోజులు తిరగకుండానే తూర్పు ఢిల్లీలో నివసిస్తున్న బన్సాల్ భార్య సత్యబాల, ఆయన కుమార్తె నేహ ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి వారిద్దరూ వేర్వేరుగా రాసిన రెండు సూసైడ్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే బన్సాల్ అరెస్ట్‌తో మనస్తాపానికి గురైన వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

పుష్కరాల్లో పురోహితులకు డిజైనర్ దుస్తులు..

పవిత్ర కృష్ణా పుష్కరాలు వచ్చే నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణానదికి హారతి ఇచ్చే సమయంలో సంబంధిత పురోహితులు డిజైనర్ దుస్తుల్లో కనిపించనున్నారు. ధోతీ, అంగవస్త్రంతో కూడిన నాలుగు రకాల దుస్తులను నిఫ్ట్ హైదరాబాద్ విభాగం డిజైన్ చేసినట్టు సమాచారం. ఎరుపు, పసుపు, పచ్చ, కాషాయం వంటి ముదురు రంగుల దుస్తులను హారతి ఇచ్చే పురోహితుల కోసం రూపొందిస్తున్నట్టు చెప్పారు. గతేడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమం నిమిత్తం పూజారులు ధరించిన దుస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో ఈ కృష్ణా పుష్కరాల్లో నదీమ తల్లికి హారతివ్వనున్న పూజారులకు కొత్త దుస్తులు రూపొందించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తయారైన సాంప్రదాయక దుస్తులతో ఆకర్షణీయమైన రీతిలో పురోహితులకు దుస్తులు రూపొందనున్నాయి.

రాహుల్ గాంధీ ఏం చేస్తాడో..!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహాత్మగాంధీ హత్యకు ఆరెస్సెస్ వారని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. ఆరెస్సెస్ పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆ సంస్థ సభ్యులు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఓ సంస్థపై ఇలాంటి నింధలు ఎలా వేస్తారాని.. ఒక సంస్థపై ఆరోపణలు చేస్తే.. సంస్థలో ఉన్న వాళ్లందరిని తప్పుబట్టినట్టు అవుతుందని.. అలా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని.. జులై 27లోగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు రాహుల్‌ను ఆదేశించింది.   అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటిస్తాడా లేక లైట్ అని వదిలేస్తాడా అన్నది అందరి ప్రశ్న.. సుప్రీంకోర్టు ఆదేశించినట్టు క్షమాపణ చెబుతారా.. లేక కేసును ఎదుర్కొంటారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు వివాదాల్లో రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటికి తోడు ఇదొక రచ్చ. మరి దీనినైనా గోరుతో పోనిస్తారో.. లేక కొండంత చేస్తారో చూడాలి.

అమెరికాలో తెలుగు యువకుడి దారుణహత్య..స్నేహితుడే చంపాడా..?

ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌కు చెందిన విజయ్‌కుమార్, రమాదేవి దంపతుల కుమారుడు సంకీర్త్ ఎమ్‌ఎస్ పూర్తి చేసి రెండున్నర సంవత్సరాల క్రితం ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ నగరంలోని అస్టీన్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో సంకీర్త్ నిన్న తన రూమ్‌లోనే రక్తపు‌మడుగులో పడి ఉన్నాడు. ఎవరో అతడిని కత్తితో పొడిచి చంపారు. అయితే సంకీర్త్ రూమ్‌లో 15 రోజుల క్రితం సాయిసందీప్‌ గౌడ్ అనే యువకుడు చేరాడు. అతడే సంకీర్త్‌ను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిసందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జులై 22న ఏం జరగబోతుంది..?

  జులై 22 ఏపీకి రాష్ట్రానికి అత్యంత కీలకమైన రోజు. ఆరోజు ఏం జరగుతుంది.. ఆరోజు ఏపీ ప్రజలకు ఊరటనిస్తుందా.. లేక ఇంకా అంధకారంలోకి పడేస్తుందా.. ఇంతకీ ఆరోజున ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరిగే రోజు. కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబల్ బిల్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇప్పుడు దానిపై ఓటింగ్ 22వ తేదిన జరగనుంది దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.   ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఓటింగ్ జరగనుంది. మరి ఈ ఓటింగ్లో ఏపీ ఓడిపోతుందా.. లేక గెలుస్తుందా.. అసలు బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకు 72 మంది సభ్యులున్నారు. యూపీఏ తరఫున 66 మంది ఉండగా.. ఇంకా పలు పార్టీలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. మరి ఈనేపథ్యంలో అందరూ ఏపీ ప్రత్యేక బిల్లుకు ఓటింగ్ వేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.   ఇప్పటికే రాష్ట్రాన్ని విడగొట్టి పాపం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు ఓటింగ్ వేస్తే పాప ప్రక్షాళన చేసుకున్నట్టు. అలా చేస్తే కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక ఆరుగురు సభ్యులు సైతం టీడీపీ నేతలు ఎలాగూ ఓటు వేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, టీడీపీ నేతలు.. ఇంకా పలు పార్టీలకు చెందిన నేతలు కూడా ఏపీ కి బిల్లుకు మద్దతు పలికి ఓట్లు వేస్తే గెలిచినట్టే. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే 22 వరకూ ఆగాల్సిందే.

దూసుకుపోతున్న హిల్లరీ.. ట్రంప్ ఇప్పుడైనా మారతాడా..!

  అమెరికా అధ్యక్ష పదవిపై ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ డొనాల్డ్ ట్రంప్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నారు అందరూ. అంతే కాదు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఆయన పాపులర్ అవ్వడానికి.. ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అవే ఆయనను ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న కంపు వల్ల ఇప్పుడు హిల్లరీకి మద్దతు పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో ఆంగ్లో ఇండియన్స్ తమ మద్దతును హిల్లరీకి తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్లరీ గెలిస్తే అందరికీ మేలు జరుగుతుందని.. ట్రంప్ తో అంతా నాశనమే అవుతుందని ఆరోపించారు. అంతేకాదు ఆమె ప్రచారంలో ఎలాంటి తప్పులు చేయలేదు.. ఆమెకు అన్ని విషయాలపై అవగాహన ఉంది.. ఇప్పటికే తనను తాను నిరపూపించుకున్నారు అని అన్నారు. ఇంకా ట్రంప్ కు భారతీయులంటే పడదు.. ముస్లింలు గిట్టదు.. మెక్సికన్లు అంటే అసహ్యం.. అలాంటి ట్రంప్ చేతిలో దేశాన్ని పెడితే సర్వనాశనం అవుతుందని అన్నారు.   మరోవైపు ట్రంప్ పై మాత్రం విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో కూడా విమర్శలు ఉన్నా.. అప్పుడు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు తాజాగా వెలువడ్డ అన్ని సర్వేల్లోనూ ట్రంప్ కంటే హిల్లరీకి 4 శాతం మేర విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ మద్దతు కూడా హిల్లరీకి లభించింది. దీంతో ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు.   మరి ఇప్పుడైనా ట్రంప్ కాస్త తన నోటికి పని తగ్గిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలే ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడు అయితే సర్వనాశనం అవుతుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాబట్టి కొన్ని రోజులు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగ్గిస్తే గెలిచే అవకాశాలు ఉండవచ్చు. లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే హిల్లరీకే ప్రజలు అధికార పగ్గాలు కట్టబెడతారు. ట్రంప్ ఇప్పుడైనా మారతాడో లేదో చూద్దాం..

సచిన్ టెండూల్కర్ పిటిషన్... కొట్టేసిన కోర్టు..

  క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సచిన్ కు భారతరత్న అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీకే నశ్వా అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్ భారతరత్న అవార్డును దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. సచిన్ అవార్డును ప్రకటనలు పొందేందుకు ఉపయోగించుకున్నాడని.. అలాగే కొంతమంది రచయితలు సచిన్ మీద పుస్తకాలు రాశారని, ఆ పుస్తకాలకు భారతరత్న అని పేరు పెట్టుకున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. ఎవరో రచయితలు సచిన్ పై పుస్తకం రాసి దానికి భారత రత్న అని పేరు పెడితే.. దానికి సచిన్ ఎలా బాధ్యులు అవుతారు.. ఇక ప్రకటనల విషయంలో కూడా చర్యలు తీసుకునేందుకు నియమాలేవీ లేవని తెలిపింది.