నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన కిచ్చా!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఓ లీగల్ కేసుకు సంబంధించి వార్తల్లో నిలిచారు. తనపై ఓపెన్గా ఆరోపణలు చేసినందుకుగానూ నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేష్కు కిచ్ఛా సుదీప్ లీగల్ నోటీసులు పంపారు. కన్నడ నటుడు కిచ్చాసుదీప్ తమ దగ్గర రెమ్యునరేషన్ తీసుకున్నారని, తమతో సినిమా చేయడానికి అంగీకరించారని, అయితే ఇప్పటివరకు డేట్లు కేటాయించలేదని ఆరోపించారు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేష్. ఈ విషయం మీదే వారిద్దరి మీదా పరువు నష్టం కేసు వేశారు కిచ్చా సుదీప్.