సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాసిని మణిరత్నం తనయుడు!
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ మరపురాని ఎన్నెన్నో సినిమాల్లో నటించారు సుహాసిని. ఆమెను చూసిన వారు ఎవరైనా సరే, తెలుగు నటి కాదు అంటే ఒప్పుకోరు. అంతగా తెలుగు సినిమాల్లో లీనమై నటించారు. ఆమె భర్త మణిరత్నం లెజెండరీ డైరక్టర్. అరవై ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాష్రాజ్తో ఆయన తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు అద్భుతమైన విజయం సాధించాయి.