English | Telugu
షూటింగ్కి బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి
Updated : Jul 9, 2023
కొంతమంది షూటింగులకు బ్రేక్ తీసుకున్నారని తెలిస్తే మనసు ఎందుకో విలవిల్లాడిపోతుంది. సినిమాలకు కొన్నాళ్లు సమంత దూరంగా ఉంటారనే వార్త ఈ మధ్య వైరల్ అయింది. మయోసైటిస్తో బాధపడుతున్న సామ్, ప్రస్తుతం చికిత్స కోసం విదేశాలకు వెళ్తారని, దీని కోసమే బ్రేక్ తీసుకున్నారనే విషయం వైరల్ అవుతోంది. ఆ మాటలను మర్చిపోకముందే సాయిపల్లవి బ్రేక్ తీసుకోవడమేంటి? అని అనుకుంటున్నారా? సాయిపల్లవి తీసుకుంటున్నది లాంగ్ బ్రేక్ కాదు. జస్ట్ షార్ట్ బ్రేక్.
ఆల్రెడీ కొన్నాళ్లుగా షూటింగులకు దూరంగా ఉంటున్నారు సాయిపల్లవి. ఆ గ్యాప్ తర్వాత ఆమె శివకార్తికేయన్తో మూవీ చేస్తున్నారు. ఎస్ కె 21 అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల కశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంది. అక్కడికి వెళ్లిన సాయిపల్లవి మధ్యలో అమర్నాథ్ యాత్రలోనూ పాల్గొన్నారు. కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ సాయిపల్లవి పెడుతున్న పోస్టులు ఫ్యాన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
సినీ పరిశ్రమలో నటిగా అత్యధిక రేటింగ్ పొందిన నటి సాయి పల్లవి. ప్రస్తుతం కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. శివకార్తికేయన్ ఎస్కె 21 షూటింగ్ కొన్ని నెలల క్రితం ప్రారంభమైంది. శివకార్తికేయన్ తన రాబోయే చిత్రం మావీరన్ ప్రమోషన్ పనుల కారణంగా విరామం తీసుకున్నారు. మావీరన్ తెలుగులో మహావీరుడుగా వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విరామ సమయంలో సాయి పల్లవి అక్కడ సరదాగా గడుపుతున్నారు.
ఒక అందమైన లోయ నుండి కొన్ని స్నాప్లను పోస్ట్ చేసి, "మానసిక స్థితి: ప్రశాంతత" అని పోస్ట్ చేశారు పల్లవి. ఆ క్లిక్లు ఇప్పుడు వైరల్గా మారాయి. ఎస్కె21కి రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించగా, కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇది ఆర్మీ బ్యాక్డ్రాప్లో సాగే దేశభక్తి చిత్రం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.