English | Telugu

థియేటర్స్‌లో సరే.. ఓటీటీ మాటేమిటి?

'గరుడవేగ’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న ప్రవీణ్‌ సత్తారు ఆ తర్వాత నాగార్జునతో చేసిన ‘ది ఘోస్ట్‌’ చిత్రంతో నిరాశపరిచాడు. మరో ప్రయత్నంగా వరుణ్‌తేజ్‌, సాక్షివైద్య జంటగా చేసిన ‘గాండీవధారి అర్జున’ చిత్రంపై ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్స్‌కి వెళ్ళిన ఆడియన్స్‌కి నిరాశే మిగిలింది.
థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రాకపోయినా ఓటీటీలో విజయవంతమైన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాకి కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రతి ఇంటికీ చేరనుంది. మరి థియేటర్స్‌కి రాని ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.