RELATED NEWS
NEWS
Singapore Telugu Samajam - New Committee 2015-2017

ఆదివారం జూన్ 28న, సింగపూర్ తెలుగు సమాజం 39వ వార్షిక సభ్యత్వ గోష్టిలో (Annual General Meeting) నూతన కార్యవర్గం ఎన్నుకో బడింది. శ్రీ రంగా రవి కుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది.



సింగపూర్ తెలుగు సమాజం స్థాపించి 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, గౌరవ అధ్యక్షులు శ్రీ రంగా రవి కుమార్ గారు,  ఆయనకీ మరియు నూతన కార్యవర్గానికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు తెలుగు సమాజం సభ్యులకి కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ సమాజం, నా సమాజం మరియు మన సమాజం అనుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సింగపూర్లో తెలుగు వారి అభివృద్ధికి కృషి చెయ్యాలని. అలాగే  ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని  ప్రోత్సహించాలని గౌరవ అధ్యక్షులు శ్రీ రంగా రవి కుమార్ గారు కోరారు. నూతన కార్యవర్గం తెలుగువారికి మరియు తెలుగు బాష ఉన్నతికి కృషి చేస్తాము అని తెలిపారు. మరిన్ని వివరాలకు www.sts.org.sg చూడగలరు.    

TeluguOne For Your Business
About TeluguOne
;