RELATED NEWS
NEWS
అమెరికాలో అయ్యప్ప పడిపూజ

 

 

అమెరికా లోని నష్విల్లె నగరం లో స్థానిక గణేశ ఆలయం లో లో షిర్డీ సాయి భక్తుల నిర్వహించిన అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది ...హరి హర సుతుడు అయ్యప్ప శరణు ఘోష లతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ... గురు స్వాములు కిరణ్ ముదిగొండ ... శ్రీనివాస సరఫ్ఫ్ స్వామి ల ఆధ్వర్యం లో పడిపూజ జరిగింది ... మాలలతో అలంకరించిన విజ్ఞేశ్వర, సుబ్రమణ్య స్వాములతో పువ్వులు దీపాలు మరియు పండ్లతో అలంకరించిన పద్దెనిమిది పడి మెట్లపై స్వామి సేద తీరాడు ... అయ్యప్ప సాయి భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు ... స్వామివారికి పుశాప్భిషేకం,పంచామృతం ,చందనం మరియు విభూది తో అభిషేకం చేసారు ... స్వామివారికి ప్రియమైన పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు ... అనంతరం పద్దెనిమిధీ మెట్లపై పిల్లల చేత కర్పూర దీపం వెలిగించారు ... అనతరం గురుస్వాములు అయ్యప్ప మహిమల గురించి ,మాలధారణ గురించి చెప్పారు అనంతరం భక్తుల సందేహాలను తీర్చారు.చాల కాలం తర్వాత పడిపూజ లో పాల్గొనడం ఆనందం గా ఉందని భక్తులు తెలిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;