political-news-img

ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.... సీపీ సజ్జనార్

పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం సమయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరిం చుకుంది. పరీక్ష ఫలితాలు జీవితాన్ని నిర్ణయించేవి కావని, దీర్ఘ ప్రయాణంలో ఇది ఒక చిన్న దశ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం చోటుచేసుకున్న కొన్ని విషాద ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. మార్కులు తక్కువ రావడం లేదా ఫెయిల్ కావడం వల్ల ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని, అది కుటుంబాలకు తీరని బాధను మాత్రమే మిగులుస్తుందని హెచ్చరించారు. మహిళా భద్రత విభాగం చేసిన పరిశీలనలో తల్లిదండ్రుల ఒత్తిడి, అధిక అంచనాలు కూడా కొన్నిసార్లు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. ఓటమి అనేది విజయానికి మొదటి మెట్టు మాత్రమేనని, అది జీవితానికి ముగింపు కాదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై భారంగా మోపకుండా, వారికి అండగా నిలవాలని కోరారు. ఫలితం ఎలా ఉన్నా పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకుని, వారిలో నమ్మకం నింపాలని తెలిపారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి ఆనందమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించి, వారు మౌనంగా లేదా ఒంటరిగా ఉంటే వెంటనే మాట్లాడి ధైర్యం చెప్పాలని సూచించారు. అవసరమైతే పనులన్నీ పక్కనపెట్టి వారితో సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, వైఫల్యం తాత్కాలికమేనని వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. చదువులో వెనుకబడిన ఎంతో మంది పట్టుదలతో ప్రపంచస్థాయి విజయాలను సాధించిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని, ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎలాంటి ఆందోళన వచ్చినా తల్లిదండ్రులు లేదా ఆత్మీయులతో పంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు.

Publish Date: Apr 28, 2026 10:53PM

political-news-img

నెల్లూరులో విషాదం...బాలుడి ప్రాణం తీసిన ఫోన్‌ గొడవ

ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది. అది పెద్దదై చివరికి ఒకరి ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు సమీపంలోని చెన్నూరు బిట్-2 మర్రిపల్లిమడుగు ప్రాంతంలోని ఒక తోటలో ఈ ఘటన జరిగింది. గూడూరు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఆ తోటలోనే ఇద్దరు బాలల తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. సమీపంలోనే చెన్నూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు, సైదాపురం మండలానికి చెందిన పదిహేడేళ్ల బాలుడు ఇటీవల ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో పదిహేడేళ్ల బాలుడు గొంతు నులుమడంతో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భీతిల్లిన ఆ బాలుడు.. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక తోటలోనే పూడ్చేశాడు. బాలుడు అదృశ్యమైనట్టు ఈనెల 17న తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడింది. పోలీసులు విచారణలో పదిహేడేళ్ల బాలుడు తానే దారుణానికి పాల్పడ్డానని అంగీకరించాడు. సోమవారం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నెల్లూరులోని జువనైల్ హోంకు తరలించారు.

Publish Date: Apr 28, 2026 10:43PM

political-news-img

క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ

క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఐటీ, లాజిస్టిక్స్, పారిశ్రామిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో క్యారియర్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఏఐ-డ్రివెన్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చడానికి డేటా సెంటర్ కూలింగ్, ప్రిడిక్టివ్ HVAC సిస్టమ్‌లకు అధునాతన మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి. స్పెసిఫికేషన్‌ల కోసం పెద్ద స్థాయి మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీతో గ్లోబల్ రిఫ్రిజరేషన్& కోల్డ్-చైన్ ఎక్స్‌పోర్ట్ హబ్ ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. క్యారియర్ గ్లోబల్ కార్పోరేషన్ ఇంటిలిజెంట్ క్లైమేట్, ఎనర్జీ సొల్యూషన్లలో గ్లోబల్ లీడర్ గా ఉంది. HVAC, రిఫ్రిజరేషన్, భవన ఆటోమేషన్ సిస్టమ్‌లను ప్రపంచవ్యాప్తంగా అందిస్తుంది. క్యారియర్ సంస్థ ఏప్రిల్ 2026 నాటికి $52.92 బిలియన్ల మార్కెట్ క్యాపిటల్ కలిగి ఉంది.

Publish Date: Apr 28, 2026 10:28PM

political-news-img

హైదరాబాద్‌లో వరుసగా భారీ డ్రగ్స్ పట్టివేతలు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి. విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఆపరేషన్లలో కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌పై కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ గంజాయి స్వాధీనం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ గంజాయిని పట్టుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులకు అందిన సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిపై నిఘా పెట్టి బ్యాగులను తనిఖీ చేశారు. లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో చాకచక్యంగా దాచిన 16 డ్రగ్స్ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. పైభాగంలో దుస్తులు ఉంచి డ్రగ్స్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరకు అధికారులకు చిక్కాడు.

Publish Date: Apr 28, 2026 10:20PM

political-news-img

వాళ్ల ఏడుపు నాకు వినసొంపు...సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిని పురాణాల్లోని రాక్షస పాత్రలతో పోల్చిన సీఎం రేవంత్, కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని కుట్రలు పన్నుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను 'శుక్రాచార్యుడు'తో, ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావులను 'మారీచులు, సుబాహులు'గా అభివర్ణించారు. వీరు ప్రజల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఏడుస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధలో వారు చేస్తున్న విమర్శలు, ఏడుపులు వినడానికి తనకు చాలా వినసొంపుగా ఉన్నాయని ఆయన సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ నగరం ఎవరి సొత్తు కాదని, గత పాలకుల నుంచి నేటి వరకు ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం హైదరాబాద్‌కు అదనపు హంగులు అద్దుతూ, ప్రపంచంతో పోటీ పడేలా 'నాలుగో నగరం'గా 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని తీర్చిదిద్దుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని సీఎం వివరించారు. ముఖ్యంగా, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి, కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ భవన పనులను జూన్ 2వ తేదీ నాటికి, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ భారీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్లతో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంటే, ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో సమస్యలను ఎత్తిచూపుతూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.

Publish Date: Apr 28, 2026 10:07PM

political-news-img

ట్రంప్‌పై కాల్పులు ఘటన...నిందితుడి హెచ్చరిక లేఖ బయటకి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు కోల్ టొమాస్ అలెన్‌కు సంబంధించి ఒక షాకింగ్ నోట్ బయటపడింది. దాడికి ముందే నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఒక లేఖను పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లేఖలో ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించడం గమనార్హం. ఆయనను ఒక అత్యాచార నిందితుడిగా, పిల్లలను వేధించే వ్యక్తిగా, ద్రోహిగా అభివర్ణిస్తూ నిందితుడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. "ఇలాంటి లక్షణాలున్న వ్యక్తిని నేను సహించను" అని అందులో స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనే దానిపై నిందితుడు ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. తన దారికి అడ్డు రానంత వరకు సాధారణ అతిథులను, సిబ్బందిని లేదా సెక్రెట్ సర్వీస్ ఏజెంట్లను తాను లక్ష్యం చేసుకోనని కూడా ఆ నోట్‌లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, వైట్‌హౌస్ వద్ద భద్రతా లోపాలను కూడా నిందితుడు ఎండగట్టడం గమనార్హం. భారీ రైఫిల్‌ను తీసుకుని తాను లోపలికి వచ్చినా, ఎవరూ గుర్తించలేదని, భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో దీనిని బట్టే అర్థమవుతోందని పేర్కొన్నాడు. నిందితుడి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా భద్రతా సంస్థలను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను వివరణ కోరగా, ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు రాసిన నోట్‌లోని ఆరోపణల గురించి రిపోర్టర్ ప్రశ్నించగా, ట్రంప్ వెంటనే స్పందిస్తూ.. "అతడు తన కోసం తాను రాసుకున్నది. నేను ఎలాంటి నేరాలు చేయలేదు, నేను నిర్దోషిని" అని బదులిచ్చారు. అవాస్తవ ఆరోపణలను తనతో ముడిపెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారులు ఈ నోట్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులనే నిందితుడు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన భద్రతా పరమైన చర్చలకు దారితీయడంతో, భవిష్యత్తులో రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

Publish Date: Apr 28, 2026 9:11PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img