Top Stories

political-news-img

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల రగడ.. పంపిణీకి ముందే పొలిటికల్ హీట్..!

సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలపై బీజేపీ భగ్గు..! తెలంగాణ పౌరసరఫరాల శాఖ లబ్ధిదారులకు సరికొత్త భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదం రేగింది. నిరుపేదలకు పంపిణీ చేసే ఈ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలను ముద్రించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రం వేదికగా నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుదీర్ఘకాలం వినియోగంలో ఉండే రేషన్ కార్డులపై స్థిరమైన నిబంధనలు లేకుండా ప్రజాప్రతినిధుల చిత్రాలను ముద్రించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల పేర్లు లేకపోవడంపై, అలాగే కార్డులపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినా లేదా రాజకీయ పరిస్థితులు మారినా ఈ కార్డుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఈ కార్డులను మార్చాలనుకుంటే మళ్లీ ప్రభుత్వ ఖజానాపై భారీగా వ్యయభారం పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుపేదలకు అందుతున్న రేషన్ బియ్యంలో దాదాపు 90 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని, అలాంటప్పుడు కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఎందుకు ముద్రించలేదని బీజేపీ ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. ఉచిత రేషన్ పథకం కింద కేంద్రం ప్రధాన వాటా ఇస్తుంటే, కేవలం స్వల్ప నిధులు మాత్రమే కేటాయించే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఫొటోలతో ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే స్మార్ట్ కార్డులపై ప్రధాని ఫొటోను ముద్రించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ కార్డుల తయారీ విధానం, కాంట్రాక్టుల కేటాయింపు ప్రక్రియ మరియు వాటికైన ఖర్చుల వివరాలపై పారదర్శకత లేదంటూ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాధనాన్ని అనవసర రాజకీయ ప్రచారానికి వినియోగిస్తున్నారంటూ విమర్శల దాడిని పెంచాయి. కొత్త భద్రతా ఫీచర్లతో కూడిన ఈ కార్డుల పంపిణీ ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నప్పటికీ, ఫొటోల వివాదం వల్ల పంపిణీ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ వివాదం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. Telangana Smart Ration Cards, CM Revanth Reddy, Uttam Kumar Reddy, Telangana Politics, BJP Vs Congress Telangana

Publish Date: Aug 15, 2026 8:58AM

political-news-img

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా.. ఎర్రకోట బురుజులపై నుంచి మోడీ ప్రతిన.!

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అత్యంత వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్ తీర్చిదిద్దుతామని ప్రతిజ్ణ చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన మహాత్మా గాంధీతో సహా ఎందరో మహానుభావులకు నివాళులర్పిస్తూ సాగిన ఈ ప్రసంగం, దేశ ప్రజలలో నూతనోత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా సాగింది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని ప్రధాని మోడీ.. గతం, వర్తమానాలను పోలుస్తూ గణాంకాలతో వివరించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఫ్రాజైల్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్.. కేవలం పుష్కర కాలంలోనే అంటే 12 ఏళ్లలోనే.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా సగర్వంగా నిలిచిందని ప్రధాని వివరించారు. గడిచిన 12 ఏళ్లుగా దేశ ప్రజలు, శ్రామికులు, యువత రాత్రింబవళ్లు పడ్డ కష్టం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 140 కోట్ల భారతీయుల ఐక్యత, సంకల్ప బలాన్ని ఏ శక్తీ ఆపలేదని ప్రధాని ఉద్ఘాటించారు. భవిష్యత్ గమ్యాలను నిర్దేశిస్తూ.. మన లక్ష్యాలు, ఆలోచనలు ఎంత పెద్దవిగా ఉంటే, మన సామర్థ్యాలు అంత ఉన్నత శిఖరాలను చేరుకుంటాయన్నారు. . ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన భారత్ 2047 నాటికి వందవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందనీ, ఆ సమయానికి అభివృద్ధి చెందిన దేశంగా మారితుందనీ మోడీ అన్నారు. కేవలం విజన్ మాత్రమే కాకుండా, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలు, నూతన వ్యూహాలు అవసరమన్నారు. మోడీ తన ప్రసంగంలో ఇటీవల దేశంలోని పలు ప్రాంతాలలో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తులు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ యావత్ భారతావణి అండగా నిలుస్తుందన్నారు. పునరావాస చర్యల్లో ప్రభుత్వం సహాయమందిస్తుందని భరోసా ఇచ్చారు. నవ భారత్ దిశగా వేగంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. PM Narendra Modi, Red Fort Speech, Independence Day 2047, Viksit Bharat Goal, Indian Economy Growth, Fragile Five to Top Economy

Publish Date: Aug 15, 2026 8:43AM

political-news-img

2047 నాటికి అగ్రరాజ్యంగా భారత్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ..!

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి భారతదేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు. 140 కోట్ల మంది భారత పౌరుల ఆకాంక్షలు, పట్టుదలే ఈ లక్ష్య సాధనకు కొండంత బలమని ఆయన పేర్కొన్నారు. ఈ దినోత్సవ వేడుకలలో ఎర్రకోట ప్రాంగణంలో ప్రతిధ్వనించిన 'వందేమాతరం' గీతం ఒక నూతన చరిత్రకు శ్రీకారం చుట్టిందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోందని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం సరికొత్త దిశగా అడుగులు వేస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. గత కాలంతో పోలిస్తే ఆర్థిక రంగంలో భారత్ సాధించిన అద్భుత పురోగతిని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టంగా వివరించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థల (ఫ్రాజైల్ ఫైవ్) జాబితాలో నిలిచిన భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్యానంతరం ఎన్నో పెద్ద కలలు కన్నప్పటికీ వేగవంతమైన వృద్ధిని సాధించడంలో గతంలో కొంత ఆలస్యం జరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అయితే, గడిచిన కొన్నేళ్లుగా దేశం అపూర్వమైన వేగం, ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తోందని, పౌరుల శ్రమ మరియు నిబద్ధత వల్ల ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి గొప్ప దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారినప్పుడు, ప్రపంచ వేదికపై భారత్‌ను చూసే కోణమే పూర్తిగా మారిపోతుందని ప్రధాని పేర్కొన్నారు. పెద్ద సంకల్పాలు, స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగినప్పుడే అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన ఉద్ఘాటించారు.మరోవైపు, ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటం వల్ల నష్టపోయిన బాధితుల పట్ల ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో బాధితులకు యావత్ భారతావని అండగా నిలుస్తుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.రాబోయే దశాబ్ద కాలం భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో కీలకమైనదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన 2047 విజన్ దిశగా మౌలిక వసతుల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సంస్కరణల విస్తరణ వేగవంతమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. PM Modi Red Fort Speech, Viksit Bharat 2047, Independence Day Celebrations, Indian Economy Growth, Vande Mataram Red Fort

Publish Date: Aug 15, 2026 8:29AM

political-news-img

పంద్రాగస్టు వేడుకల్లో తొలిసారి వందేమాతరం గీతాలాపన.!

ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారత చరిత్ర పుటల్లో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా ఎర్రకోటపై జరిగిన అధికారిక వేడుకలలో జాతీయ గేయం వందేమాతరం పూర్తి పాఠాన్ని ఆలపించి ఒక నూతన సాంప్రదాయాన్ని ఆవిష్కరించారు. ఈ చారిత్రక ఘట్టంలో జాతీయ గీతంతో పాటు జాతీయ గేయానికి కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించడం దేశవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే, 1721 ఫీల్డ్ బ్యాటరీ విభాగం ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం ఇండియన్ ఆర్మీ బ్యాండ్ వందేమాతరం పూర్తి స్వర సమ్మేళనాన్ని ప్రతిధ్వనింపజేసింది. ఆ వెనువెంటనే యథావిధిగా జాతీయ గీతమైన జన గణ మన ఆలాపన కొనసాగింది. జాతీయ గేయం వందేమాతరంకు 150 వసంతాలు పూర్తవుతున్న శుభసందర్భంలో ఈ అపూర్వ ఘట్టం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి వేదికపైకి పూలవర్షం కురిపించాయి. ఇందులో ఒక హెలికాప్టర్‌పై జాతీయ జెండా, మరొక హెలికాప్టర్‌పై వందేమాతరం అని ముద్రించిన పతాకం గాలిలో ఎగురుతూ కనిపించాయి స్వతంత్ర భారత చరిత్రలో ఎర్రకోట ప్రాంగణంలో పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని వాయించడం ఇదే ప్రథమమని ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఇటీవలి కాలంలో జాతీయ గేయమైన వందేమాతరానికి, జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ, హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఆమోదించిన'జాతీయ గౌరవ అవమానాల నివారణ (సవరణ) బిల్లు-2026 కు కొద్దిరోజుల క్రితమే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నూతన చట్టం అమలులోకి రావడంతో వందేమాతరం విశిష్టత శాసనబద్ధమైంది. కొత్త చట్టం ప్రకారం వందేమాతరం గీతాలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, అవమానించినా చట్టప్రకారం న చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చారిత్రక మార్పుల ప్రభావం స్వాతంత్ర్య దినోత్సవానికి పూర్వరంగంలోనే స్పష్టంగా కనిపించింది. ;పంద్రాగస్టు వేడుకలకు ముందు రోజు అంటే శుక్రవారం (ఆగస్టు 14) ముందు రోజు రాత్రి జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడానికి ముందు, ప్రసంగం పూర్తయిన తర్వాత కూడా వందేమాతరం పూర్తి గీతాన్ని ప్రసారం చేశారు. భారతదేశ స్వదేశీ ఉద్యమ సమయంలో దేశ ప్రజలందరినీ ఏకం చేసి, స్వరాజ్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అమూల్యమైన గీతం వందేమాతరమని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో లక్షలాది మంది త్యాగధనులకు స్ఫూర్తి నింపిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, ప్రభుత్వ అధికారిక వేడుకల్లో ఆ గీతానికి పూర్వ వైభవం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. భవిష్యత్తులోనూ అన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతంతో పాటు వందేమాతరం ఆలాపన జరగనుంది. RedFort, VandeMataram, IndependenceDayCelebrations, NationalSongVandeMataram, ProtectionLaw

Publish Date: Aug 15, 2026 8:20AM

political-news-img

పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై అజిత్ దోవల్ ఏమన్నారంటే?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి, అందుకు ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తొలి సారిగా స్పందించారు. పహల్గామ్ ఉగ్రదడి అనంతరం ప్రధాని మోడీ స్పందన, ఆయన అధికారులకు సంధించిన తొలి ప్రశ్న, ఆపరేషన్ సిందూర్ తీరును ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చి వివరించారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురైనఆయన తన పర్యటన ముగించుకుని భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయంలోనే అత్యవసర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విదేశాంగ కార్యదర్శితో పాటు భద్రతా విభాగాల ఉన్నతాధికారులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారని, ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. . ఆ అత్యవసర సమావేశంలో ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుసుకున్న అనంతరం ప్రధాని మోదీ ఆగ్రహంతో స్పందించారని దోవల్ చెప్పారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సూత్రధారి ఎవరు? దీని వెనుక ఉన్న అసలు శక్తులను వెంటనే గుర్తించారా? అని ప్రధాని మొదటి ప్రశ్నగా అడిగినట్లు దోవల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వారి వివరాలు, వారి వెనుక ఉన్న సంస్థల సమాచారం వీలైనంత త్వరగా తన ముందుకు తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో భారత నిఘా సంస్థలు దాడికి కారణమైన ముష్కరులను స్వల్ప సమయంలోనే గుర్తించాయన్నారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకుల గుంపుపైకి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో స్థానిక గైడ్‌తో పాటు 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్య వెనుక లష్కరే తోయిబా, దాని అనుబంధ తీవ్రవాద ముఠా అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణలోనే స్పష్టం చేసింది. పౌరుల బలికి నిరసనగా, ఉగ్రవాదానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యను చేపట్టి, పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉన్న తొమ్మిది ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశాయి.ఆపరేషన్ సిందూర్ దేశ భద్రత విషయంలో ఇండియా జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రపంచానికి విస్పష్టంగా చాటిందని దోవల్ చెప్పారు. Pahalgam Terror Attack, Modi Question, Ajit Doval, Operation Sindoor, Terror Camps, Jammu Kashmir

Publish Date: Aug 15, 2026 7:53AM

political-news-img

ఇండోనేసియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!

ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శనివారం (ఆగస్టు 15) తెల్లవారుజామున భూమి కంపించింది. సముద్ర గర్భంలో పది కిలో మీటర్ల లోతున సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ద్వీపాలు, తీరప్రాంత నగరాలు ఉలిక్కిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలకు ప్రజలు భయాందోళనలకు గురైఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. సముద్ర ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంపం ఇంత తక్కువ లోతులో సంభవించడంతో ప్రకంపనల తీవ్రత భారీగా ఉంది.ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. . భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీరప్రాంత ప్రజలందరూ తక్షణం తమ ఇళ్లు ఖాళీ చేసి, ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులుహెచ్చరించారు. కేవలం ఇండోనేషియా మాత్రమే కాకుండా పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పొరుగు దేశాలైన ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సమాచారం అందిన వెంటనే ఇండోనేషియా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి, సహాయక చర్యలను వేగవంతం చేసింది. శోధన బృందాలను తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు దెబ్బన్నాయి. Indonesia Earthquake, 77 Magnitude Quake, Tsunami Warning Indonesia, USGS Earthquake Report, BMKG Indonesia, Pacific Ring of Fire

Publish Date: Aug 15, 2026 7:19AM

MOVIE NEWS