TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

జగన్ పాదయాత్ర ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు. [Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]

Published on: Fri Sep 4, 2026 5:53PM

political-news-img

తెలంగాణ పాలిటిక్స్ లో తెలుగుదేశం జపం.!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందన్నది వాస్తవం. అయితే.. తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పాత్ర ఆ పార్టీపై ప్రత్యర్థులు కొనసాగిస్తున్న విమర్శల దాడి మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన ఒక ప్రధాన రాజకీయ శక్తిగా టీడీపీకి తిరుగులేని చరిత్ర ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతర కాలంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం రివాజుగా మారిపోయింది. తెలంగాణ గడ్డపై పార్టీకి ఉన్న బలమైన పునాదులను, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు చెబుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం లేదా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం రాజకీయ ప్రత్యర్థులకు మామూలైపోయింది. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం. అయితే.. తెలుగుదేశంపై విమర్శలను ప్రత్యర్థి పార్టీలు కేవలం ఎన్నికల సమయాలకే పరిమితం చేయడంలేదు.. తమకు అవసరమైన ప్రతిసంర్భంలోనూ రాజకీయ వేడిని రగల్చడానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలక మధ్య మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన అన్నది అనివార్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రస్తావనే తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేస్తుందన్న భావన తెలంగాణ రాజకీయ పార్టీలలో బలంగా పేరుకుపోయిందనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది. తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఆమె తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించారు. రేవంత్ లో ఉన్నది తెలుగుదేశం రక్తం కనుకనే కక్ష పూరితంగా తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్, అలాగే కొత్తగా సొంత కుంపటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, అధికార కాంగ్రెస్ తెలుగుదేశం జపం లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే తెలంగాణలో తెలుగుదేశం బలానికీ, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టుకూ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [TDP in Telangana Politics, Telugu Desam Party, Telangana PoliticsNews, TDP Rivals Target, TeluguOne]

Published on: Fri Sep 4, 2026 4:38PM

political-news-img

కొండా సురేఖ వైరల్ పోస్ట్ క్లారిటీ... కేబినెట్ బర్తరఫ్ తర్వాత ఆమె ప్లాన్ ఏమిటి..?

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి సడన్ గా బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పేరు మీద ఒక భారీ ప్రకటన లేదా "బిగ్ అప్‌డేట్" త్వరలోనే రాబోతోందంటూ విపరీతంగా ప్రచారం సాగింది. దీంతో రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కొండా సురేఖ తదుపరి అడుగు ఎటువైపోనని ఉత్కంఠగా గమనించారు. అయితే, ఈ వైరల్ ప్రచారాలపై మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా స్పందిస్తూ ఒక కీలక వివరణ ఇచ్చారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు, మీడియా నమ్మాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి ప్రధాన బీజం కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యల నుంచే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనివల్ల దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు మంత్రులు సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వేరొకరి అభిప్రాయాలకు తండ్రికి లేదా తల్లికి రాజకీయ బాధ్యత అప్పగించడం సరికాదని సమర్థించుకున్నారు. అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం సెప్టెంబర్ 3న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై సురేఖ తీవ్రంగా స్పందిస్తూ, తనకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే బర్తరఫ్ చేశారని వాపోయారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి నిమిషంలో మాట్లాడే అవకాశం ఇస్తారని, కానీ తన పట్ల కనీస ప్రజాస్వామ్య సూత్రాలను కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మంత్రి పదవి తనకు కేవలం ఒక అలంకారం మాత్రమేనని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తేల్చిచెప్పారు. మరోవైపు, కొండా సురేఖ బర్తరఫ్‌తో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తప్పించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణిలను నియమిస్తూ ప్రభుత్వం కొన్ని కీలక ప్రక్షాళనలు చేపట్టింది. ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణతో ఆమె పార్టీ మారే ఆలోచనలో లేరని స్పష్టమైనప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదని స్పష్టమవుతోంది. (Konda Surekha sacked, Telangana Cabinet churn, CM Revanth Reddy, Konda Surekha, Konda Sushmitha Patel comments, Telangana Congress news, Konda Surekha social media clarification, Telugu One, Telugu news)

Published on: Fri Sep 4, 2026 3:00PM

political-news-img

కొండా సురేఖ చూపు బీఆర్ఎస్ వైపు.. కేసీఆర్ పై పొగడ్తల వర్షం అందుకేనా?

రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగిన కాలంలో కేసీఆర్‌తో తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ హయాంలోనే దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు.. పార్టీలోని కొందరు సీనియర్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ, ముఖ్యంగా కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని, కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు. [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]

Published on: Fri Sep 4, 2026 12:24PM

political-news-img

రేవంత్ ది తెలుగుదేశం రక్తం.. కొండా సంచలన వ్యాఖ్యలు.!

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్ మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది. తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ.. కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు. తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు. [Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]

Published on: Fri Sep 4, 2026 10:51AM

political-news-img

క్రెడిట్ వార్ లో తప్పుటడుగులు.. లోపభూయిష్టంగా వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది. ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది. ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక. ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [YCP Social Media Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]

Published on: Fri Sep 4, 2026 10:36AM