ఆజాద్, వాయలార్ మాటలు నమ్మని సోనియా

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు ఉప ఎన్నికల ఫలితాలే కారణమవుతున్నాయి. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉంటేనే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ పదవులు క్షేమంగా ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు చేదుగా మారితే వీరిద్దరికీ పదవీగండం తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దేశరాజధానిలో కాంగ్రెస్ హైకమాండ్ వీరిద్దరి ప్రచారం తీరూ, పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. సిఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనితీరును విడిగానూ, బొత్సా పార్టీ పటిష్టానికి చేసిన పనిని విడిగానూ ఎఐసిసి సమీక్షించింది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జిగా వచ్చిన గులాంనబీ ఆజాద్, పరిశీలకునిగా వచ్చిన వాయలార్ రవి ఇప్పటికే మేడమ్ కు వీరిద్దరూ బాగా పనిచేశారని రిపోర్టు ఇచ్చారు. అయితే సోనియా మాత్రం ఆ మాటను నమ్మలేదనీ, రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో కనీసం రెండు అంకెలైనా వస్తేనే వీరిద్దరూ పనిచేసినట్టు నమ్ముతానని అన్నారని సమాచారం. జైలులో ఉన్నా జగన్ కోసం తెగించిన కార్యకర్తల తరహా జనం కాంగ్రెస్ లోనూ ఉంటే బాగుంటుందని సోనియా అభిప్రాయపడ్డారట. తమపై కేసులు పెడతారని తెలిసినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చూపిన చొరవ కాంగ్రెస్ లోనూ పెంచాలంటే ఏమి చేయాలో ఆలోచించమని సోనియా వీరిద్దరినీ కోరారట. ఫలితాలు సోనియా ఆశించినట్లు లేకపోతే కొత్త సిఎం, కొత్త పీసీసీ చీఫ్ తప్పేలా లేదని పరిశీలకులు అంటున్నారు.

కేంద్ర కేబినేట్ లో చిరుకు స్థానం లభించడం ఖాయమా?

ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తుకు కీలకమవుతోంది, ఎన్నికల ప్రచారంలో సిఎం కిరణ్ కుమార్ తోనూ, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణతోనూ, కేంద్ర నాయకులు వాయలార్ రవితోనూ, గులాంనబీ ఆజాద్ తోనూ కలిసి పనిచేసిన చిరంజీవి ఇమేజ్ గురించి సోనియా అడిగి తెలుసుకున్నారట. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని తేలిన ఈ తరుణంలో కోస్తాలో ఓ రెండు స్థానాల్లో కాంగ్రెస్ కనుక విజయం సాధిస్తే చిరంజీవికి కేంద్రకేబినేట్ లో పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినది మొదలు చిరంజీవి కూడా ఎప్పటికప్పుడు కేంద్రస్థాయి నాయకులకు అందుబాటులో ఉంటున్నారట. తన కుమారుని వివాహానికి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని ఆహ్వానించిన చిరంజీవి అక్కడ పలుకుబడి పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. సిఎం, బోత్సాలతో పనిలేకుండా కాంగ్రెస్ అధిస్థానం చిరంజీవిని ప్రత్యేకంగా చూసుకుంటోంది. అందుకే ఇటీవల చిరుకుమార్తే ఇంట్లో డబ్బు గురించి వివాదం ఏర్పడితే దాన్ని వెంటనే పక్కదారి పట్టించింది. అలానే అనంతపురంలో చిరు ఫైర్ ను కూడా పెద్దగా చూడలేదు. చిరంజీవికి కేంద్రకేబినేట్ లో అవకాశామిచ్చేందుకు ఉప ఎన్నికల ఫలితాల్లో కోస్తాలో మరో రెండు సీట్లు రావటమే అర్హతగా అధిష్టానం భావిస్తోంది. ఫలితాలపై ఆధారపడ్డ ఈ తక్కువ టార్గెట్ నెరవేరినా ఆశ్చర్యపోవాల్సిన పనైతే లేదు. ఎన్నికల తరువాత నాలుగుస్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించవచ్చన్న లెక్కలను బట్టి చూస్తే చిరుకు కేంద్రకేబినేట్ బెర్త్ కన్ ఫార్మే.

మార్పులు తథ్యం కానీ, తెలంగాణా సాధ్యమా?

"ఉప ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆ తరువాత తెలంగాణా ప్రకటించేస్తారు'' అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యానం ఆయన్ని అపహాస్యం పాలుజేస్తోంది. ఆయన మాటలను తెలంగాణా ప్రాంతంలోనే విశ్వసించటం లేదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకోండి. ఎన్నోసార్లు రిఫరెండెం, తేదీలు ప్రకటించే కేసీఆర్ తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఈసారి నూటికినూరుపాళ్ళూ నిజమని ఆయన తనప్రకటనలో ప్రతీసారి చెప్పుకోవటం, కేంద్రం తెలంగాణాకు సానుకూలంగా ఉందనటం ఇది రొటీన్ డైలాగ్ నమ్మించేలా ఉందని తెలంగాణావాదులంటున్నారు. అసలు తెలంగాణాయే రాలేదు కానీ, దాన్ని దేశంలో నెంబర్ వన్ గా ఎదిగేలా చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఇంకా చెప్పాలా! అయితే కేసీఆర్ ప్రకటనలో ఒక నిజం మాత్రం ఉంది. అదేమిటంటే ఉపఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రరాజకీయాల్లో పెనుమార్పులు మాత్రం జరగొచ్చు. తెలంగాణా సమస్య మాత్రం 2014 వరకూ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

కడప జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ విజయం తథ్యమా?

కడపజిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని పరిశీలకులు తేల్చేస్తున్నారు. ఈ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో రాయచోటి, రాజంపేటరైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ గ్రామాలే అండగా నిలిచాయి. ఎన్ని పార్టీలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా వాటన్నిటినీ ఈ మూడు నియోజకవర్గాల ఓటర్లు తోసిరాజన్నారు. దీనికి అసలు కారణమేమిటని పరిశీలిస్తే ప్రాంతీయత, జగన్ పై సానుభూతి అని తేలాయి. సిబీఐ జగన్ ను అరెస్టు చేశాక ఘాటైన విమర్శలతో ఈ మూడు నియోజకవర్గాలనూ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు వేడెక్కించాయి. అయినా ఆ విమర్శలకు స్పందించినట్లు కనిపించని ఓటరు చివరికి ప్రాంతీయతకు లొంగాడు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన ప్రచారంలో అన్ని పార్టీలూ ఒక్కటై మన జగన్ ను విమర్శలతో చుట్టుముట్టాయని ఆందోళనగా చెప్పిన మాటలు ఓటరు మనస్సు మార్చాయి. రాయచోటి నియోజకవర్గంలో రామాపురం, గాలివేడు, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం, సంచెపల్లి గ్రామాలు పూర్తిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపాయి. అలానే రాజంపేట నియోజకవర్గంలో సిద్ధవటం, మాధవపురం, వీరబల్లి, ఒంటిమిట్ట, నందలూరు గ్రామాలు మొదటినుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. క్షత్రియ, మైనార్టీలు ఈ నియోజకవర్గంలో జగన్ పార్టీకి అండగా నిలిచారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్యేలి, పెనగలూరు, ఓబులావారిపల్లి, కోడూరు ప్రాంతాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వెనుకనే గ్రామస్తులు నడిచారు. అసలు ఆ పార్టీకి స్పందించిన తీరు చూస్తే విజయం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకే అని చెప్పకుండానే అర్థమైంది. ఏదేమైనా తన సొంతగూటిలో జగన్ బలమైన పార్టీగా పాతుకుపోయారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారికంగా ఫలితాలు వెలువరించడమే తరువాయి కానీ, జగన్ పార్టీ తరువాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి హైలెట్స్

రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి అతిరథమహారథుల సమక్షంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. మొయినాబాద్‌ సమీపంలోని టెంపుల్‌ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు ఉపాసన మెడలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మూడుముళ్లు వేశారు. పెళ్లి మండపం, పరిసరాలను సినీ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్‌సాయి అత్యంత ఖరీదైన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు, వధువు కుటుంబ బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులలో మూడు వేల మందికి మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానాలు అందజేశారు.   ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణి కపూర్, అంబరీష్, మోహన్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీ మోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు. రాష్టగ్రవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సీఎం కిరణ్‌ కుమార్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, రఘువీరా రెడ్డి, జానారెడ్డి వివాహ వేడుకకు హాజరయారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఈ సందర్భంగా రాంచరణ్ అత్తమామలు రూ.రెండుకోట్లు ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును అల్లుడికి బహూకరించారు.          

రామ్ చరణ్ పెళ్ళికి తరలి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులు

సినీ నటుడు రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని టెంపుల్ ట్రీ ఫామ్హౌస్ ఈ వేడుకకు వేదిక అయ్యింది. ఈ వివాహానికి వచ్చిన అతిథులను కాంగ్రెస్ ఎంపీ, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానం పలికారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్‌ కళ్యాణ్‌, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఈ వివాహానికి సినీ నటులు రజనీకాంత్, జూనీయర్ ఎన్టీఆర్, మోహన్‌బాబు, శ్రీదేవి బోనీకపూర్, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్, కోలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కేంద్ర హోం మంత్రి చిదంబరం, గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తదితరులు వధూవరుల్ని ఆశీర్వదించారు.

ప్రజలకు రిలీఫ్, నాయకులకు టెన్షన్

ఎలక్షన్లు అయిపోయాయి. ఆయా నియోజకవర్గ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే నాయకుల వాగ్దానాలు రణగొణధ్వనులు, నాయకులకు ఏర్పాటుచేసే భారీబందోబస్తు ట్రాఫిక్ డైవర్షన్ లాంటివి ఇక మీదట లేనందున ప్రచారాల హోరు ముగిసి రోజువారి పనులకు ఎటువంటి అవాంతరాలు ఉండవని సామాన్య మధ్యతరగతి ప్రజలు సంబరపడుతున్నారు. అయితే నాయకుల పరిస్థితి దీనికి విరుద్ధంగా వుంది. కష్టపడగలిగినంత కష్టపడ్డాం ఫలితాలు ఎలా వుంటాయో అని దిగులుగా వున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరికీ వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం గెలుపువోటములపై అన్ని ప్రధాన పార్టీల నాయకులు టెన్షన్ గా వున్నారు. ఫలితాలను ఎలా స్వాగతించాలా అని అన్ని పార్టీలు సమాలోచనలో ఉన్నాయి. అధికార కాంగ్రెస్ మంత్రులెవరూ సేక్రటరేట్ లో కనిపించడం లేదు. తెలుగుతమ్ముళ్ళ పరిస్థితి అలాగే వుంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకేసులు, వాదప్రతివాదనలతోను సీనియర్ న్యాయవాదుల సంప్రదింపులతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా 15వ తేదీ వరకు ఈ టెన్షన్ నాయకులకు తప్పదు.

మళ్ళీ లాభాలబాటలో ఆర్.టి.సి. ?

నాలుగువేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. కట్ అండ్ జనరేట్ పాలసీతో ముందుకు వస్తోంది. దేనివల్ల నష్టం వస్తోందో దాన్ని కట్ చేయటానికీ, ఎక్కడ ఆదాయం వచ్చే అవకాశం ఆగిపోతోందో అక్కడ జనరేట్ చేయటానికీ ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కొత్త చైర్మన్ ఎ.కె.ఖాన్ సిద్ధంగా ఉన్నారు. తన పోలీసు బుర్రకు ఆయన పదునుపెట్టి నష్టాలు పూడ్చేందుకు తనవద్ద ప్లానుందంటున్నారు. అంతే కాకుండా రీజనల్ మేనేజర్ లు, డిపో మేనేజర్లు తమ పరిథిలో నష్టాలు తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. ముందుగా రోజుకు వస్తున్నా రెండుకోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. ఆ తరువాత లాభాలబాటలోకి తీసుకువెడతామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోయిన అప్పులు ఒక ఆర్టీసీ కార్మికుని తలపై మూడు లక్షల రూపాయల భారంగా ఉన్నందున కొత్త అప్పులకు వెళ్ళబోమన్నారు. మళ్ళీ కొత్త అప్పులకు వెళ్ళకుండా మెయింటనెన్స్ ఎలానో ఖాన్ నిర్వహణలోనె తెలుస్తుంది కదా అదేనండీ తినబోతూ రుచి ఎందుకని కార్మికులు ఎదురుచూస్తున్నారు.

వలసలను చంద్రబాబు ఆపగలరా?

ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకమైతే? ఈ ప్రశ్న తెలుగుదేశంపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాల్లో టిడిపికి రెండేస్థానాలు దక్కవచ్చన్న లెక్కలు ఆ పార్టీని కుంగదీస్తోంది. ఈ లెక్కలే పార్టీ అధినేత చంద్రబాబును లొంగదీసిందనుకోవచ్చు. అందుకే ఆయన్ను ఎవరూ ప్రశ్నించినా ఉప ఎన్నికల ఫలితాలు ఆశాజనకమంటున్నారు. నిజంగా కూడా ఎన్నికల్లో రెండేస్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే పార్టీ మారటానికి ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నేతలు సిద్ధంగా ఉన్నారు. వీరిని చేర్చుకోవాలని అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ ఎదురుచూస్తున్నాయి. ఈ పార్టీల మార్పుల గురించి అవగాహన ఉన్న బాబు జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పి ఉంటే పార్టీలో ద్వితీయశ్రేణి కూడా కదలకుండా ఉండేది. ఎందుకంటే పదవులు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలాంటి జాతీయరాజకీయాల ఆఫర్ ను కూడా ఇటీవలే చంద్రబాబు వదిలేశారు. దీంతో కార్యకర్తలు కూడా ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఎమ్మెల్యేను ఆపినట్లు తమను మాత్రం ఆపటం బాబుకు సాధ్యపడదని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

సోనియా దయతలిస్తే సుబ్బిరామిరెడ్డికి కేంద్రమంత్రి పదవి

గెలుపోటములు సహజమే. అందుకే నెల్లూరు లోక్ సభ స్థానం కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ఫర్వాలేదనుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. అయితే ఈ విషయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా దృష్టికి చేరటమే ఆయన లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ గెలుపోటములతో సంబంధం లేకుండా ఆమె కరుణ చూపి ఏ కేంద్రమంత్రి పదవి అయినా ఇవ్వవచ్చని సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నారు. అందుకే పోలింగ్ పూర్తయిన క్షణం నుంచి ఢిల్లీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. మేడమ్ కు ముఖ్యమైనవారికి తాను వందకోట్లకు పైచిలుకు ఖర్చుపెట్టినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డికి అనుకూలమంటున్నారని ఆవేదనా పూరితంగా చెప్పి రక్తికట్టిస్తున్నారు. అయ్యో! పాపం అనిపించుకునేలా సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ తాను ఓటమి పాలైతే తిరిగి విశాఖపట్టణం టిక్కెట్టు కోరవచ్చు అని ఆయన భావిస్తున్నారు. కేంద్రమంత్రి పురందరేశ్వరి కూడా ఈ ఓటమి వల్ల అక్కడికి తిరిగివచ్చారని సరిపెట్టుకుంటారని కూడా సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నారు. ఆ సానుభూతితోనే భవిష్యత్తులో మంచి పదవులు వరించే అవకాశాలూ ఉంటాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే డబ్బు తగలేశాను మేడమ్ కనికరించండి అని చెప్పేందుకు సుబ్బిరామిరెడ్డి రంగం సిద్ధం చేసుకున్నాడు.

తిరుపతిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమా?

మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైంది తిరుపతిలోనే. దీనికి కారణం ఏంటీ? ఈ సూటి ప్రశ్న అక్కడి వాతావరణంలో వచ్చిన మార్పును పట్టిఇస్తుంది. ఒకవైపు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఇంకోవైపు పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ ఈ తిరుపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేకించి సిఎం తన సొంత జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి పలురకాల వ్యూహాలను ఎన్నికల ముందునుంచి అమలు చేస్తూ వచ్చారు. తొలుత మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డి వంటి వారిని ఆకర్షించటంలోనూ సిఎం తన సొంత ఇమేజ్ ను నమ్ముకున్నారు. పదిమంది చేత అడిగించి తన కుటుంబంతో విభేదం ఉన్నా జిల్లా కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డితో కాంగ్రెస్ కె మద్ధతిస్తానని అనిపించారు. ఆయన ఆ మాట అనటమే ఆలస్యం ఆయన్ని వదిలేసి పెద్దిరెడ్డి అనుచరులు, బంధువులపై కాన్ సన్ ట్రేషన్ చేశారు. దీంతో తాను ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకవైపు నిర్లక్ష్యంగా ఉన్నట్లే కనబడింది కానీ, భారీగా ఓటుబ్యాంకుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎవరికీ అర్థం కాలేదు. ఇలా అడుగడుగునా ఆచి తూచి వ్యవహరించిన సిఎం గత ఎన్నికల ఫలితాలనూ విశ్లేషించారు.     ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువైతే ఇతర పార్టీలకు అనుకూలమని గ్రహించి తన స్థాయికి తగిన ప్రణాళిక వేశారు. అదీ ఎవరూ గమనించే పని లేకుండా పారామిలటరీ దళాలు, పోలీసులతో తిరుపతిని దిగ్భంధనం చేసేశారు. ఇంట్లోంచి బయటకు కాలుమోపాలంటేనే భయపడేంత సిబ్బందిని రంగంలోకి దించారు. పెద్ద గొడవలు జరిగినప్పుడు మూకలను చెదరగొట్టే తరహాలో పోలీసులు కనిపించారు. ఈ వ్యవహారం చూసి ఒకవైపు స్థానిక పోలీసులు భయపడితే మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అదిరిపోయింది. ముందురోజుకే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటరుకు డబ్బు పంచుతూ దొరికిపోయిన విషయానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ వీథుల్లో మౌఖికప్రచారం చేయించారు. దీంతో ఎక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనపడినా ఇతర పార్టీలు, పోలీసులు అప్రమత్తమయ్యేలా ఈ ప్రచారం సాగింది. ఈ దెబ్బకు అదిరిపోయిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ముందురోజు ఓటర్లకు పంచిన డబ్బులు వదులుకుని ఎన్నికల రోజు దూరంగా పోవాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా ఖర్చును కూడా తగ్గించింది. అంతేకాకుండా ఎఇఎం పాచికపారి కనిష్సిపాచికపారి కనిష్టపోలింగ్ అంటే 54 శాతం నమోదైంది. అనుకున్నది అనుకున్నట్లుగా సిఎం అమలు చేశారు. దీంతో తిరుపతిలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్తిపాడులో అభ్యర్థులే ఓటెయ్యలేదా?

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే ఓట్లేయ్యలేని నియోజకవర్గంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు చరిత్రపుటల కెక్కింది. ఈ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సుధాకరబాబు స్వస్థలం నాదేండ్ల మండలం తూబాడు. దీంతో ఆయనకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటు లేదు. ఆ తరువాత తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వీరయ్యది కూడా ఈ నియోజకవర్గం కాదు. ఆయన గుంటూరు నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఏసుభక్తనగర. చివరిగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత. ఆమె ఓటు ఫిరంగిపురంలో ఉంది. దీంతో ఆమె అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేక ఓటు హక్కు వదులుకోవాల్సి వచ్చింది. పోటీలో ఉన్న మూడు ప్రధానపార్టీల అభ్యర్థులూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓటెయ్యలేదన్న సమాచారం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

అభినవ 'అన్నా'కు శృంగభంగం తప్పదా?

అభినవ అన్నాహజారేకు శృంగభంగమైంది. అసలు అన్నాహజారే కన్నా ఈ అభినవ అన్నా ఓవర్ యాక్షనే చేసేశారు. అది కూడా ఓ పార్టీ అధినేత సృష్టించిన హజారే ఈయన. "అవినీతి ఆరోపణలు ఎదుర్కొనని రాజకీయనేతను మీకు ఇచ్చాను. ఈయన మీ ప్రాంతానికి ఒక అన్నా హజారేలాంటోడు. తానప్ ఇల్లాల విద్యాభ్యాసం నుంచి ఎలాంటి సమస్య వచ్చినా నా దగ్గరిక ఇవచ్చే నిజాయితీపరుడు. ఈయన్ని గెలిపించుకునే బాధ్యత మీదే'' అని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థి, ఐదుసార్లు తాళ్ళరేవు ఎమ్మెల్యేగా గెలుపొందిన చిక్కాల రామచంద్రరావును రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల ముందుంచారు. బాబు మాటలు తలకెక్కిన చిక్కాల అన్నా హజారే స్లోగన్ టో ఉన్న తోపీలతో రామచంద్రాపురం నియోజకవర్గంలో తిరిగారు. తానే అభినవ అన్నా హజారేలా ఫీలయ్యారు. ఎన్నికలు సమీపించే కొద్దీ తనకున్న ఒపికంతా ఉపయోగించి అన్నాహజారేలాంటి చిక్కాలను గెలిపించమని ప్రచారం చేయించారు. మొదటి నుంచి చిక్కాలకు ఉన్న అనుమానమే నిజమైంది. ఈ నియోజకవర్గ ప్రజలు తానేనని చేసినా గెలిపించారని తన సన్నిహితుల ముందు బయటపడిపోయారు. ఈ విషయమూ నియోజకవర్గంలో ఓటర్ల చెవికి సోకింది. ఎలాగూ గెలిపించే పనిలేదు కాబట్టి అన్నాహజారే అంటారేమిటని తెలుగుదేశంపార్టీ కార్యకర్తలను నిలదీయటం మొదలుపెట్టారు.     అక్కడి తెలుగుదేశంపార్టీ పట్టణాధ్యక్షుడు గరికిపాటి సూర్యనారాయణ కూడా తన సామాజిక కమ్మ కులసంఘం సిఫార్లు మేరకు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. తమ సామాజిక కులాలు ఇచ్చిన మద్దతు ప్రకారం ఎక్కువభాగం నేతలు పరోక్షంగా తోట వెనుక చేరారు. ఒక్క రెడ్డి సామాజిక కులం మాత్రమే తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మద్దతు ఇచ్చింది. అనుకున్నట్లుగానే పోలింగ్ రోజు వచ్చేసింది. అప్పుడు చూసుకుంటే చిక్కాల (టిడిపి) తరుపున చాలా పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు కనిపించలేదు. పార్టీ కేడర్ ను ఈ ఎన్నికల్లో పెంచుకోకుండా వదిలేసినందుకే చిక్కాలకు ఓట్లు తగ్గాయని అంచనా. ఆయనకు గతంలో గుత్తుల సూర్యనారాయణబాబు కన్నా తక్కువ ఓట్లు వస్తాయని పరిశీలకులు లెక్కతేలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు, తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే తలపడ్డట్టు అయింది. మధ్యాహ్నం నుంచి చిక్కాల తరుపున పోలింగ్ ఏజెంట్లే కేంద్రంలో లేరని పరిశీలనల్లో తేటతెల్లమైంది. చంద్రబాబు తమ పార్టీ తరుపున గెలిచే స్థానాల్లో రామచంద్రాపురం లెక్కించడం విశేషం.

ఓటర్లతో ఆటాడుకున్న అనంత రెవెన్యూ అధికార్లు?

ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హులైన ఓటర్లు కూడా అనంత రెవెన్యూ అధికార్ల నిర్లక్ష్యానికి బలయ్యారు. అనంత అర్బన్ శాసనసభ నియోజకవర్గం పరిథిలో పోలింగ్ కేంద్రాలను పెంచారు. దీంతో ఒకే కుటుంబంలోని వారు వేరు వేరు కేంద్రాలకు అదీ కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కొంతమంది ఓటర్లు తిరిగినా ఒట్లెక్కడున్నాయో తెలియక వెనుతిరిగే పరిస్థితులు ఎదురయ్యాయి. అలానే కొన్ని ఓట్లను గల్లంతు కూడా చేసేశారు. ప్రతీసారి ఓటు హక్కు వినియోగించుకునే శ్రీనివాసనగర్ లోని 200 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు గుర్తింపుకార్డు ఉన్నా వీరి పేర్లు ఓటర్ల జాబితాలో లేదు. వేణుగోపాల్ నగర్ లో వండ ఓట్లు కనిపించలేదు. ఎర్రనేలకొట్టాల ఓటర్లు గతంలో రామచంద్రనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేవారు. ఇప్పుడు కమలానగర్ డి.సి.ఎం.హెచ్.ఎస్. కేంద్రానికి వీరి పేర్లు మార్చారు. ఈ విషయం తెలియని ఓటర్లు వెనుదిరిగారు. త్రివేణి కాంప్లెక్స్ ఓటర్లు ప్రతీ ఎన్నికల్లోనూ వేణుగోపాల్ నగర్ లో పోలింగ్ కేంద్రానికి వెళ్ళేవారు. ఈసారి డీపెప్ పాఠశాలకు ఓటర్ల పేర్లు మార్హ్చారు. దీంతో విసుగుచెందిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయమా?

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కనుక 14స్థానాల్లో విజయం సాధిస్తే పరిస్థితి ఏమిటన్న విషయమై రాష్ట్రంలో వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ చర్చల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే ప్రధానపార్టీలకు అది ప్రత్యామ్నాయం అవుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అస్థిరతకు ఈ ఉప ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తాయని చర్చల్లో పాల్గొన్న వారందరూ ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కనుక గ్తెలిస్తే మిగతా పార్టీల మనుగడ అసాధ్యమన్న మాట కూడా ఖాయంగా వినిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాల్లో తెలుగుదేశంపార్టీ కనుక ఎక్కువ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. ఇలా మూడు పార్టీల గురించి చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ విప్ గండ్ర వెంకటరమణ తమ ప్రభుత్వం ఉప ఎన్నికల తరువాత పడిపోతుందనటం హాస్యాస్పదమంటున్నారు. అనర్హతావెతుకు గురైన ఎమ్మెల్యేలను ఆరేళ్ళపాటు అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేయకుండా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ జోస్యం ఆయన వ్యక్తిగతమైనదని అభిప్రాయపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఐక్యత భవిష్యత్తులో పార్టీ పురోభివృద్ధికి ఉపయోగపడుతుందని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఒకవేళ జగన్ కనుక ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే తనపై సిబీఐ దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా వెనుకాడడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ అభిప్రాయాలు ఇలానే ఉన్నాయని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలు మన రాష్ట్ర తలరాతను మార్చేందుకు ఉపయోగపడతాయన్న తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు మాట ఈ సమయంలో నిజమయ్యేలా ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా 15వ తేదీన ఉప ఎన్నికల ఫలితాల తరువాత దీని గురించి ఆలోచిద్దామని కొందరు చర్చకు బ్రేకులేస్తున్నారు.

ఎసిబి గుప్పెట్లో మద్యం సిండికేట్ల కీలక సమాచారం?

బెయిల్ మంజూరు కాకపోవటంతో వారంక్రితం అరెస్టు అయిన తిరుపతికి చెందిన ఇద్దరు మద్యం వ్యాపారులు ఎసిబి అదుపులోనే ఉండిపోయారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై ఎసిబి పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఈ దశలో ఆ ఇద్దరు వ్యాపారులు తమ గురించి ఏమి చెప్పారో అని అటు ఎక్సైజ్ అధికారులు, ఇటు తోటి మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎం.ఆర్.పి. కన్నా 30 శాతం అదనంగా వ్యాపారం చేసేందుకు ఎక్సైజ్ శాఖకు, సిండికేట్ కు రోజువారీ వాటాలు చెల్లించిన ఆ వ్యాపారులు పూర్తి వివరాలు చెప్పేసే ఉంటారని సిండికేట్ అభిప్రాయపడుతోంది. అందుకే వీరిద్దరికీ బెయిల్ గురించి అసలు ప్రయత్నాలే చేయలేడు. బంధువులు మాత్రం బెయిల్ కోసం న్యాయవాదుల సహాయం తీసుకుంటున్నారు. పలమనేరుకు చెందిన నాగభూషణం, చిత్తూరుకు చెందిన కొండారెడ్డిలను ఈ నెల 6న ఎసిబి స్వయంగా అరెస్టు చేసింది పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో 15 మాధ్యమషాపులను అధికమొత్తంలో కట్టి రెండేళ్ళక్రితం కొందరు వ్యాపారులు సొంతం చేసుకున్నారు. రెండు షాపులకు 82లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. అంటే రోజుకు రూ. 80వేల మద్యం అమ్మకాలు జరగాలి. అందుకే ఎం.ఆర్.పి.కి 30 శాతం అదనంగా అమ్మకాలు సాగించారు. అద్దెతో సహా లాభాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ప్రతీ నేలా ఎక్సైజ్ శాఖకు, ప్రజాప్రతినిథులకు డబ్బులు ఇచ్చేవారు.     ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో, ఎలా ఇచ్చారో పూర్తి వివరాలు తెలిపే ఉంటారని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. ఇంతకీ వారేమి చెప్పాతో ఎసిబి ఎలా ఇంటరాగేట్ చేసిందో తెలియాలంటే ఆ ఇద్దరు వ్యాపారులు బెయిల్ పై బయటకు రావాల్సిందే! అందుకే వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందని కొందరి సహాయంతో ఎక్శైజ్ శాఖ అధికారులు ఎసిబి వద్దకు పంపుతున్నారట. వారికి బెయిల్ మంజూరైతే తమకు సమాచారం తెలిసేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయినా సందేహం తీరక వీరికి ఎప్పుడు బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయంటూ తమకు పరిచయమున్న డిపార్ట్ మెంట్ అధికారులను అడుగుతున్నారట. ఎసిబి అదుపులో ఉన్న ఇద్దరు వ్యాపారుల బంధువులూ సీరియస్ గా బెయిల్ మంజూరు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారంరోజులు ఎసిబి వద్దే ఉండిపోవడంతో వారు ఆడుర్థాపడి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ బంధువులకు ఎక్సైజ్ సిబ్బంది బెయిల్ ఎలా తెచ్చుకోవాలో సూచనలిస్తోందట. తామెప్పుడూ సహకరిస్తామని నమ్మబలుకుతోందట.

కోర్టులో లో౦గిపోయిన నిత్యానంద,ఒక రోజు రిమాండ్

నిత్యానంద స్వామి బుధవారం బెంగళూరులోని రామనగర్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. మీడియాపై దాడి కేసులో పోలీసులు నిత్యానంద స్వామిపై ఇటీవల కేసు నమోదు చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం నిత్యానంద అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలించారు. బుధవారం ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి లొంగిపోయారు. కాగా నిత్యానంద స్వామీ ఆశ్రమంలో పోలీసులకు గంజాయి, మద్యం, కండోమ్స్ దొరికిన విషయం తెలిసిందే. కర్నాటకలోని ఆయన బిడదిలో నిత్యానందకు చెందిన ధ్యానపీఠంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రామనగర జిల్లా జాయీంట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ కలెక్టర్ తదితరుల నేతృత్వంలో యాభై మంది పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమం ఆవరణలో గంజాయి, కండోమ్‌లు, మద్యం సీసాలు, పాశ్చాత్య సంగీత సిడిలు, తమిళ వారపత్రికలు పోలీసులకు దొరికాయి. మరోవైపు మంగళవారం హైకోర్టులో నిత్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణను వాయిదా వేసింది. నిత్యానందకు రామనగర్ కోర్టు ఒకరోజు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

రామ్ చరణ్ పెళ్లికి హాజరుకానున్న చిదంబరం

రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చరణ్‌, ఉపాసనల వివాహానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం హైదరాబాద్ కు రానున్నారు. చిదంబరం బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. గురువారం చరణ్ వివాహానికి హాజరవుతారు. గురువారం ఉదయం ఏడున్నరకు కొణిదెల చిన్నోడు కామినేని రాకుమారి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి కోసం హిమాయత్‌సాగర్‌లోని అపోలో వారి ఫామ్‌హౌజ్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ సెట్టింగ్స్‌తో, కలర్‌ఫుల్‌ లైటింగ్‌తో వివాహవేదిక వాహ్‌వా అనిపిస్తోంది. డెకరేషన్‌ కోసం విదేశాల నుంచి కాస్ట్‌లీ ఫ్లవర్స్‌ తెప్పిస్తున్నారు. ఉదయం ఫామ్‌హౌజ్‌లో పెళ్లివేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో చిరంజీవి మ్యారేజ్‌ రిసెప్షన్‌ ఇస్తున్నారు. జూన్‌ 15న ఫ్యాన్స్‌కు సెపరేట్‌గా విందు ఏర్పాటు చేశారు.

రాజంపేట నేతలను హడలెత్తించిన గోరంట్ల మాధవ్

సిఐ గోరంట్ల మాధవ్ పేరు చెబితే కడప జిల్లా రాజంపేట రాజకీయనాయకులకు హడల్. ఆయనకు ఉప ఎన్నికల డ్యూటీ రాజంపేటలో పడటంతో రాజకీయ నాయకులందరూ తమ అక్రమ కార్యక్రమాలకు స్వస్తి పలికి మాధవ్ పైనే దృష్టి సారించారు. పైగా మాధవ్ కూడా ఎన్నికల విధుల్లోకి చేరటానికి ముందు అన్ని వీథులూ కలియతిరిగారు. దీంతో ఆయన ఊర్లోకి వచ్చిన వార్తా రాజకీయ నేతలకు తెలిసిపోయింది. ఎస్పీ ఉమేష్ చంద్ర హయాంలో 1999-2000లో మన్నూరు ఎస్.ఐ.గా పనిచేసిన గోరంట్ల మాధవ్ రాజకీయనాయకులు తప్పు చేస్తే పోలీసు బూటుకాలు ముద్ర చొక్కాలపై వేసేవారు. ఎవరినీ లెక్కచేయని ఆయన నైజం రాజకీయనాయకులకు అప్పట్లోనే మింగుడుపడలేదు. ఎంత పెద్దవారి సిఫార్సు అయినా తానేమీ పట్టించుకోనని , తాను చేయాల్సింది చేసే తీరతానని మాధవ్ చేసిన హెచ్చరిక కూడా రాజకీయ నాయకుల్లో భయంపుట్టించింది. 13ఏళ్ళ తరువాత రాజంపేట ఎన్నికలకు సిఐ హోదాలో వచ్చిన మాధవ్ కు ముందుగానే రూమ్ సిద్ధం చేసినా తన కారులోనే పడుకుంటానని మిత్రులనూ తిప్పి పంపించారు. నా డ్యూటీ నేను చేయాలి కదా! అనే మాధవ్ డైలాగ్ కూడా రాజకీయ నాఉఅకులకు భయంపుట్టిస్తుందని కొందరు బహిరంగంగానే అంగీకరిస్తారు.