చికెన్@ 300
ప్రతి ఏటా ఎండాకాలం రాగానే చికెన్ ధరలు భూమి పైనే ఉండేవి.. కానీ కరోనా కారణంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతుంన్నాయి. పండగలు లేవు, పెద్దగా పెళ్లిళ్లు కూడా లేవు ,వేడుకల సమయం కూడా కాదు.. కాని చికెన్ ధరలు ఈ పిల్ టవర్ లా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక పై సండే కదా చికెన్ తిందామని వంద రెండు వందలు పట్టుకుని చికెన్ షాప్ కి వెళ్ళారనుకోండి.. పావు కిల్లో చికెన్ కూడా రాదు.. చికెన్ ధరలకు రెక్కలు రెక్కలొచ్చాయి.
అందుకు కారణం రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం కూడా కారణమని కోళ్ల పరిశ్రమ నిపుణుడు శ్రీకాంత్ చెబుతున్నారు. స్కిన్లెస్ చికెన్ ధర రూ. 210 ఉండగా.. ధర రూ. 260కి తక్కువ లేకుండా అమ్ముడైంది. కొన్ని చోట్ల స్కిన్లెస్ చికెన్ ధర రూ. 270, రూ. 280 వరకూ అమ్మారు. లైవ్ కూడా రూ. 125 ఉండగా.. రూ. 160కి తగ్గలేదు. త్వరలోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 300 కానుంది.
కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోడి కూర తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉడకబెట్టిన రెండు గుడ్లు తినాలని సూచిస్తున్నారు. అయితే గుడ్ల ధరలు పెరగకపోవడం ప్రజలకు ఊరటే. గతవారం డజను గుడ్ల ధర రూ. 60 ఉండగా.. ఈ వారం కూడా అంతే ఉంది. అయితే గుడ్డు ధర పెరిగినా అది పైసల్లోనే ఉంటుందంటున్నారు. ఎటొచ్చీ చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని.. దీంతో కొనుగోళ్లు తగ్గాయని దుకాణదారులు చెబుతున్నారు.
ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఈ కాలంలో కోళ్లు ఎండలకు తట్టుకోలేవని.. వాటి నిర్వహణ భారమని చాలా వరకూ కోళ్ల ఫారాలను ఖాళీ చేస్తారు. చిన్న రైతులు, చిన్నమొత్తంలో పెంపకందారులు ఎండాకాలం నిర్వహణ భారమంటూ కోళ్ల పెంపకాన్ని ఆపేస్తారు. అంతేగాక కోళ్ల దాణాకు అవసరమైన సోయాకేకు ఇతరత్రా ముడిసరకు ధరలు 30-40 శాతం వరకూ పెరిగాయని పెంపకందారులు చెబుతున్నారు. దీనికి తోడు కోళ్లకు తెగుళ్లు కూడా ఎక్కువయ్యాయని.. ఇలా అనేక కారణాలతో కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పరిశ్రమకు చెందిన వారు పేర్కొంటున్నారు. మే నెలలో శుభకార్యాలు మొదలుకానున్న నేపథ్యంలో కోడి ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఇక కారణం ఏదైనా కరోనా వల్ల కోళ్లు వ్యాపారులు బాగానే వెనకేసుకుంటున్నారని. కరోనా స్టార్టింగ్ లో చికెన్ తింటే కరోనా వస్తుందని భయపడ్డ జనాలకు రాష్ట్ర మంత్రులు సైతం నానా హంగామా చేసి చికెన్ తింటే కరోనా తగ్గుతుందని నమ్మించారు.. మళ్ళీ చికెన్ ధరలు పెంచారు. మంచి లాభాలు గడించారని సామాన్యులు మాట్లాడుకుంటున్నారు.. మళ్ళీ ఇప్పుడు కూడా రవాణా ఛార్జీలు దాదాపు 30 శాతం పెరగడం, కోళ్ల దాణా ధరలు 30 నుంచి 40 శాతం పెరగడం మాట పక్కన పెడితే.. కరోనా సెకండ్ వేవ్ పెరుగుండం చూసి వ్యాపారాలు లాభాలు గడించడం కోసం వేసిన పధకం అని సామాన్యులు మాట్లాడుకుంటున్నారు..