లోకనాయకుడు 2.0.. నెవ్వర్ బిఫోర్..
నారా లోకేశ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలుగు తమ్ముళ్లకు యువరాజు. ప్రత్యర్థులకు మాత్రం పప్పు. లోకేశ్ది మాస్టర్ మైండ్ అంటారు సన్నిహితులు. మాట్లాడటమే రాదు, అమూల్ బాయ్ అంటారు ప్రత్యర్థులు. ఎవరేమన్నా.. లోకేశ్ మాత్రం ఇవేమీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుపోతారు. పార్టీ కోసం నిత్యం కష్టపడి పని చేస్తుంటారు. డౌట్ ఉంటే.. ఓసారి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం వైపు ఓ లుక్కేయండి.. లోకేశ్ పని తీరు ఏంటో మీకే అర్థం అవుతుంది...
మంచి ఎండలో.. చెమటలు కక్కుతూ.. తెలుగుదేశం అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు నారా లోకేశ్. పాదయాత్రతో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కేండిడేట్ పనబాక లక్ష్మి నామినేషన్ వేసినప్పటి నుంచీ ఆమె గెలుపు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్లో స్పూర్తి రగిలిస్తున్నారు. లోకేశ్ ముందు నడుస్తుంటే.. ఆ వెనకాలే తమ్ముళ్లు కదం కలుపుతున్నారు. మండు టెండలో.. పసుపు జెండాల నీడలో.. లోకేశ్ డైనమిక్ రోల్ ప్లే చేస్తున్నారు.
గుళ్లో పూజలు, యువకులతో సెల్ఫీలు, వృద్ధులు, మహిళలతో ముచ్చట్లు, రోడ్డు పక్కనే ఉన్న టీ షాపులో టీ తాగడం, వ్యాపారుల కష్టాలు అడిగి తెలుసుకోవడం.. ఇలా లోకేశ్ లోకనాయకుడిగా మారిపోయారు. అన్ని వర్గాల ప్రజలతో సంభాషిస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ స్థానికులతో మమేకమవుతున్నారు. చుట్టూ జనం.. మధ్యలో మనం.. అన్నట్టుగా కొన్ని రోజులుగా నారా లోకేశ్ జననేతగా మారిపోయారు. తిరుపతిలో పసుపు ప్రభంజనం సృష్టిస్తున్నారు. గాంధీ రోడ్డు, గాలి వీధి, తిలక్ రోడ్డు, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్.. ఇలా తిరుపతిలో ఎనీ సెంటర్ నారా లోకేశే కనిపిస్తున్నారు. తమ్ముళ్లలో ఉత్సాహం.. ఓటర్లలో ఉత్తేజం నింపుతున్నారు. టీడీపీకే ఓటేయమంటూ పిలుపిస్తున్నారు నారా లోకేశ్.
నారా లోకేశ్కు మాట్లాడటమే రాదనేది ప్రతిపక్షాల టీజింగ్. అదంతా అసత్య ప్రచారమని తిరుపతి ఎన్నికల ప్రచారంలో నిరూపిస్తున్నారు లోకేశ్. రాత్రి, పగలనే తేడా లేకుండా చేస్తున్న ఎన్నికల క్యాంపెయిన్లో అడుగడుగునా.. అధికార వైసీపీ ఆగడాలను, అరాచకాలను చీల్చి చెండాడుతున్నారు నారా లోకేశ్. ఆయన మాటల్లో పదును.. డైలాగుల్లో పంచ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఓటర్లను ఆలోచింప చేస్తున్నాయి.
జే ట్యాక్స్, కరెప్షన్, బాదుడు పార్టీ అంటూ వైసీపీ పేరును జేసీబీగా మార్చేశారు నారా లోకేశ్. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారంటూ సీఎం జగన్ దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. తిరుపతిలో నారా లోకేశ్ స్పీచ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన మాటల్లో వాడి-వేడీ బాగా పెరిగింది. పంచ్ డైలాగ్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుమ్మేస్తున్నారు లోకేశ్. ప్రధాని మోదీని చూసి ప్యాంట్ తడుపుకునే బ్యాచ్ కాదు.. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కావాలి. కేంద్రం ఏమి చెబితే దానికి తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఉంటుందా? వైసీపీ వాళ్లు 21 మంది లోక్సభలో, ఆరుగురు రాజ్యసభలో ఎంపీలుగా ఉండి ఏం సాధించారు? టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా పార్లమెంట్లో సింహాల్లా పోరాడుతున్నారు. ఇలా ఓ రేంజ్లో డైలాగులను డైనమైట్లలా పేలుస్తున్నారు నారా లోకేశ్.
కేంద్రమంత్రిగా పని చేసి సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించమంటూ ఓటర్లను కోరుతున్నారు. "ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టం ఆమెకు తెలుసు. ఒక ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించడం కూడా ఆమెకు తెలుసు. పార్లమెంట్లో గర్జించి ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మి కావాలో.. పార్లమెంట్లో పడుకొని జగన్ రెడ్డి పాదసేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోవాలంటూ.. నారా లోకేశ్ తిరుపతివాసులకు పిలుపిస్తూ అద్భుతంగా ప్రసంగిస్తున్నారు. ప్రతిపక్షం ఎగతాళి చేస్తున్నట్టు నారా లోకేశ్ పప్పు కాదు.. ఫైర్. దమ్ముంటే టచ్ చేసి చూడండి.. మీకు కాలిపోద్ది అంటూ సవాల్ విసురుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో లోకేశ్ దూకుడు.. నెవ్వర్ బిఫోర్.