తెలంగాణపై వరుణుడి కరుణ వరద

ఊహించ‌నివిధంగా వాతావ‌ర‌ణం మారిపోయింది. భారీ వ‌ర్షాల‌తో తెలంగాణాపై వరుణుడి కరుణ వరద కొనసాగుతోంది. దీంతో వ‌రుణుడి వ‌ల‌లో రాష్ట్రం చిక్కుకున్న‌ట్టుగా ఉన్న‌ది. ఈ వ‌ర్షాల కార‌ణంగా ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్నారు. చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఒక వంక జ‌లాశ‌యాలు నిండుతున్నాయ‌న్న ఆనందంగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ క‌ద‌ల‌నీయ‌ని స్థితిలో వ‌ర్షాలు ముంచెత్త‌డం భ‌యాందోళ‌న‌కూ గురిచేస్తోంది.  వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా...  ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి  నీటి  మట్టం  1763.50 అడుగులకు గాను, ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది.  మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మెదక్ మండలంలో 26.8 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటిమీటర్లు, తుప్రాన్ మండలంలో 19.6 సెంటీమీటర్లు, చిన్న శంక రం పేటలో 19.4 సెంటీమీటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ మీటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీమీటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారనంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,600 .18 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.33 టీఎంసీలకు చేరింది.

అక్కడ సంజయ్ రౌత్.. ఇక్కడ కేటీఆర్ ?

ప్రపంచం మొత్తం మీద మనిషిని  పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అదేమో, కానీ, ఈ మధ్య కాలంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తెలంగాణ మంత్రి కేటీఅర్ మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయనే మాట అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే ఆ ఇద్దరి మధ్య ఉన్నది భౌతిక పోలికలు కాదు. వ్యక్తిత్వ సారుప్యతని  అంటున్నారు. నడక,  నడత,  మాట తీరు, ఈ అన్నిటినీ మించి  కూర్చున్న కొమ్మను నరుక్కునే విపరీత దురహంకార ధోరణి విషయంలో ఇద్దరి మధ్య స్పష్టమైన సారుప్యత కనిపిస్తోందనే మాట ఎప్పటి నుంచో అక్కడక్కడా వినిపిస్తున్నా ఈ మధ్య కాలంలో మరింత గట్టిగా వినిపిస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, కేటీఆర్  తీరు పట్ల పార్టీలో ఒక విధమైన ఆందోళన వ్యక్తంవుతోందని అంటున్నారు.  అయితే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కీలక నేతగా చెలామణి అవుతున్నారు.అందులో మరో అభిప్రాయం లేదు. నిజానికి, కేటీఆర్ తెరాస రాజకీయాల్లో కీలక నేతగా చెలామణి అవడమే కాదు, కాబోయే ముఖ్యమంత్రిగానూ ప్రచారం  జరుగుతోంది. అందుకే కావచ్చును, కొంతమంది ఆయనంటే గిట్టని వాళ్ళు కేటీఆర్’ను మహా రాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్’తో పోలుస్తున్నారు, సంజయ్ రౌత్ కూడా సామ్నా పత్రికలో ఉద్యోగిగాచేరి అలా అలా ఎదిగి ఇలా ఏకుమేకై కూర్చున్నారని, కేటీఆర్’ కూడా సన్ అఫ్ కేసీఆర్’ గా  ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇలా తయారయ్యారని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, శివసేన పతనంలో రౌతు పోషించి పాత్రను, తెరాస పతనంలో కేటీఆర్ పోషితున్నారనే మాట కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.మితి మీరిన అహంకారం, అతి తెలివి చూపడం ఈరెండు అంతిమంగా  పతననానికి దారి తీస్తాయి, సంజయ రౌత్’లో పుష్కలంగా పేరుకు పోయిన ఈ అవలక్షణాల కారణంగానే, శివసేనలో చిచ్చు రాజుకుంది. శివసేనలో చీలిక తెచ్చాయి. కేటీఆర్’లోనూ అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకునేటప్పుడు,, షిండే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, శివసేన రెండు ముక్కలుగా చీలిపోవడానికి మూల కారణం సంజయ్ రౌత్, ఆయన కారణంగానే,శివసేనలో అశాంతి రాజుకుందని విశ్లేషకులు పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.  మహారాష్ట్రలో శివసేన అధినేత్ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సైలెంట్’గా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఎవరిని అడిగినా, తిరుగుబాటుకు, ఇంకా  ఇతర కారణాలు అనేకం ఉన్నా, సంజయ్ రౌత్. దురుసు ప్రవర్తన, దురంకార  ధోరణి ఒక  ప్రధాన కారణంగా పేర్కొంటారు. ఇక్కడ తెలంగాణలో, మంత్రి కేటీఆర్ ధోరణిలోనూ అలాంటి పోకడలు కనిపిస్తున్నాయని అంటున్నారు.  కేటీఆర్ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే, ఎరికి వారు సహించి ఉరుకుంటున్నా, ఎక్కడో అక్కడ అగ్గిరాజుకుంటే, ఇప్పుడ కాకపోయినా, ఎప్పడు అప్పడు మహారాష్ట్ర  పరిణామాలు తెలంగాణ ల్ల్నూ పునరావృతం అయ్యే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల దురహంకారం గురించి మాట్లాడుతున్నారే, కానీ, సొంత పార్టీలో పెరుగతున్న దురహంకార ధోరణినీ, సొంత పార్టీలో రగులుతున్న అసమ్మతినీ గుర్తించడం లేదని తెరాస నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, పదిమంది పొతే పోతారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను చులక చేయడం సరి కాదని అంటున్నారు. మహారాష్ట్రలోనూ తిరుగుబాటు, ముగ్గురితో మొదలై 11 కు చేరి అక్కడి నుంచి 40 ప్లస్ ‘ కు చేరిందని గుర్తు చేస్తున్నారు. అదెలా ఉన్నా, అన్నిటికంటే ముఖ్యంగా తెరాసలో అంతా బాగుంది అనేందుకు లేదు. నివురు గప్పిన నిప్పుల ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

వదలని వాన.. తప్పని తిప్పలు!

విశ్వనగరం మీద వరుణులు పగబట్టాడా అన్న అనుమానం కలుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మరో సారి హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలపై వరుణుడు తన ప్రతాపం చూపాడు. శుక్రవారం ఉదయం ముసురు పట్టి చిరుజల్లులతో మొదలైన వాన అంతకంతకూ పెరిగి కుండపోతగా మారింది. వర్షం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లళ్లోకి నీరు ప్రవేశించింది. రహదారులు గోదారులయ్యాయి. ట్రాఫిక్ లో జనం నానా ఇబ్బందులూ పడ్డారు. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరి వాహనాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ముసురు ఇప్పట్లో వదలదనీ మరో రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు వర్షాలు వదలకుండా కురిశాయి. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. నాలుగు రోజులు వర్షాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నగరం శుక్రవారం నాటి జోరు వానకు ఉక్కిరి బిక్కిరైంది. ఒక్క జంట నగరాలనేమిటి? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కనీసం 15 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.    మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రమేపీ పెరిగిన వర్షం సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. భారీ వర్షానికి హైదరాబాద్‌ బేగంపేటలోని బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీలో మోకాలిలోతు వరకు నీరు నిలిచింది.  లింగంపల్లి అండర్‌బ్రిడ్జి, బొల్లారం రోడ్డులో వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంపేట మెయిన్‌రోడ్డులో, ఉప్పరపల్లిలో  టోలీచౌకీ వద్ద ప్రవాహం ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. మక్కా మజీద్‌ అవరణలో వజుఖానా వెనక ఉన్న పురాతన భవనం గోడ కుప్ప కూలింది. కుత్బుల్లాపూర్‌లోని ఇంద్రసింగ్‌నగర్‌, నిజాంపేటలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, టోలీచౌకీ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఆబిడ్స్‌, కోఠి, మోజాంజాహి మార్కెట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లి మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అప్పు స‌రే, తీర్చుమార్గ‌మేది జగనా?!

మేక‌కి పులి భ‌యం, పాముకి కుక్క‌భ‌యం, దొంగ‌కి పోలీసు భ‌యం.. ఇవి స‌హ‌జం. ఇప్పుడు కొత్త‌గా వింటున్న‌ది బ్యాంకులే ప్ర‌భుత్వాన్ని దూరం పెడుతున్నాయి. జగన్ ఏ క్ష‌ణాన వ‌చ్చి ఎన్ని కోట్లు అడుగుతారో అని భ‌య‌ప‌డుతున్నాయి. రకరకాల ఒత్తిళ్లతో కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు పుట్టించుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అవే బ్యాంకుల నుంచి రివర్స్‌లో షాకులు తగిలే పరిస్థితి కనిపిస్తు న్నది. వేల కోట్ల రుణాలను సరైన తనఖా,ఆదాయం,చెల్లింపుల పరిస్థితి లేకుండానే బ్యాంకులు ఇచ్చేశాయి. ఇంకా తెచ్చుకు నేందుకు ఏపీ ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది. కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి ఎస్‌బీఐకి చైర్మన్‌గా పని చేసిన వారిని సలహాదారులుగా నియమించుకుని మరీ ఈ అప్పులు తెస్తోంది. అలాంటి వారి పలుకు బడితో పెద్దఎత్తున అప్పులు తెచ్చింది జగన్ సర్కార్. అంతేగా, గుడిలో ప్ర‌సాదం కావాలంటే పంతులు గారితో ర‌వ్వంత స్నేహం అవ‌స‌రంగ‌దా! అయితే నిజానికి అలాంటి అప్పులు తేవడానికి నిబంధనలు అంగీకరించవు. బ్యాంకులు కూడా ఇవ్వలేవు . కానీ తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారు. కార్పొరేషన్లకు లేని ఆదాయాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి డబ్బులు చెల్లిస్తామంటే సరే అన్నారు. కానీ ఇలాంటివి అరికట్టడానికి నిబంధనలను ఆర్బీఐ ఎప్పుడో పెట్టింది. ప్రభుత్వాలకు అప్పు ఇచ్చేపద్దతులను వివ రించింది. కానీ బ్యాంకులు ఇప్పుడు ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించాయి. కాస్త లేటైనా ఇప్పుడు ఆర్బీఐ ఆ అంశంపై దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులకు ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.  ఒక వేళ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులిచ్చినట్లుగా తేలితే, ఆ బ్యాంకులకు జరిమానా విధిస్తారు. అదో పెద్ద మైనస్ అవుతుంది.  ఇలా అప్పులు తెచ్చుకున్న ఏపీకి రుణాలివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఏపీ అప్పుల్లో అసలు విషయం ఏమిటంటే.. అసలు ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేల కోట్లు తెచ్చారో స్పష్టత లేదు. ఏం లెక్క చెప్పారు. ఏం తాకట్టు పెట్టారు. ఎలా అప్పులిచ్చా రన్న వివరాలు లేవు. ఆ అప్పులను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. బ్యాంకులూ అంతే. ఈ గోల్ మాల్ వ్యవహారం ముందు ముందు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని ఆర్బీఐ కూడా ఇప్పుడు సీరి యస్‌గా చర్యలు తీసుకుంటోంది. దీంతో మొత్తం లోగుట్టు బయటపడే అవకాశం కనిపిస్తోంది.

ర‌ణ‌రంగానికి రెడీ కండి.. లేకుంటే కొత్త‌వారికి దారివ్వండి!

పూర్వం రాజులు విజ‌య‌మో వీర‌ మ‌ర‌ణ‌మో అనే పెద్ద కాన్సెప్టుతో సైన్యాధ్య‌క్షుడితో, కీల‌క సామంతుల‌తో స‌మావేశ‌మై చివ‌రి హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్టు ఇపుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే పంధాను అనుస‌రిస్తున్న‌ట్టుంది.  ఒక వంక విమ‌ర్శ‌లు, అన‌ను కూల‌త‌లు, మ‌రోవంక ప్ర‌కృతి  వైప‌రీత్యాలు.. నిస్సహాయ‌త‌లో ఎమ్మెల్యేలు.. అయినా వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి మాత్రం విజ‌యం త‌మ‌దేన‌ని 175 స్థానాలూ త‌మ‌వేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంకిత‌ భావంతో ప‌నిచేస్తే గెల‌వ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని వైఎస్సా ర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశంలో ఉద్ఘాటించారు. తాను ప్యాలస్ లో కూర్చన్నా సరే కింది వారంతా క్షేత్రస్థాయిలో తిరగాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచ నలు చేశారు. బాధ్య‌త‌ల‌ను భార‌మ‌నుకుంటే లేదా చేయ‌లేమ‌ని అనుకుంటే కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఒక హెచ్చరికా జారీ చేశారు. సంక్షేమ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి ప్ర‌తినెలా ప‌థ‌కాల‌ను అందిస్తుండ‌టాన్ని ప్ర‌ జ‌ల‌కు గుర్తు చేస్తూ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని చిత్త‌శుద్ధి, అంకిత‌భావం, నాణ్య‌త‌తో నిర్వ‌హిస్తే మొత్తం సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ అన్నారు.   అయితే యుద్ధానికి వెళ్లి గాయ‌ప‌డిన‌ట్టు అవ‌మాన‌భారంతో తిరిగి వ‌స్తున్న ఎమ్మెల్యేల మాట మాత్రం జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఆయ‌న ఆదేశాలు జారీ చేయ‌డం తప్ప ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న‌వ్య‌తిరేక‌త‌, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులు పట్టించుకోరు. ఎవరైనా ఆయనకు తెలియజేయడాన్ని సహించలేరు. అసహనం వ్యక్తం చేస్తారు. అలా చెప్పిన వారిపై లేదా చెప్పబోయిన వారిపై ఆగ్రహిస్తారు. మీ ప్ర‌య‌త్న లోప‌ం అనే ఒకే ఒక్క మాట‌తో వారి మాటలను ఒక్క ముక్కలో తుంచేస్తారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య క్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలదే అన్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని.. త్వరలోనే ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలో పేతం చేయాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టామని.. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. పార్టీ పరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నమ్మకంతో ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించామని.. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం ప‌ది రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. ప్రతి సచివాలయంకు రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని, ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ సమ న్వయకర్తలు, జిల్లా అధ్యక్షులదే అన్నారు.  పార్టీ బలోపేతం కోసం బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని సూచించారు. బూత్‌ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలని.. పార్టీ బూత్‌ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న రోజుల్లో జగన్‌ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు అధినేత.

హైకోర్టు తరలింపుపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు లేవు.. లోక్ సభలో కేంద్ర మంత్రి రిజుజు

అమరావతిని నిర్వీర్యం చేయడమన్నలక్ష్యం తప్పితే మూడు రాజధానులపై జగన్ కు నిజంగా సీరియస్ నేస్ లేదని మరో సారి తేలిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఫర్వాలేదు కానీ.. చంద్రబాబు ఆరంభించిన అమరావతి మాత్రం ముందుకు కదలకూడదు అన్నదే జగన్ ఏకైక లక్ష్యం అనడానికి లోక్ సభ సాక్షిగా రుజువు దొరికింది. స్వయంగా వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రిజుజు ఇచ్చిన సమాధానమే మూడు రాజధానులపై జగన్ చిత్తశుద్ధిలోని డొల్లతనం బయట పడింది.  హైకోర్టు ధర్మాసనాన్ని కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత పూర్వక విజ్ణప్తి వచ్చిందా? కేంద్రం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న ప్రతిపాదన సీఎం జగన్ నుంచి 2020 ఫిబ్రవరిలో ఒక ప్రతిపాదన వచ్చిందన్న రిజుజు పూర్తి స్థాయి ప్రతిపాదనలు మాత్రం అందలేదన్నారు.హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు  ఒక అభిప్రాయానికి వచ్చి పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ అటువంటి పూర్తి స్థాయి ప్రతిపాదన ఏదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని ఆయన తన సమాధానంలో స్పష్టం చేశారు. రూ.1137.92 కోట్లు విడుదల చేశామన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ముందడుగే!?

తెలంగాణ సీఎం.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇటీవలి కాలంలో ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై ముఖం మొత్తినట్లు కనిపిస్తోంది. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే ఉందని తెరాస శ్రేణులు కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వంపై ఇప్పుడు ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందనీ, ఈ సమయంలో రాష్ట్రంపై సీరియస్ గా దృష్టి సారించకుండా జాతీయ రాజకీయాలంటూ చేస్తున్న హడావుడి వల్ల రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి తూట్లు పడే అవకాశాలున్నాయనీ తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లుతుండటం. అధినేత వాటిని పట్టించుకోకుండా సందర్భం ఏదైనా మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం అన్నట్లుగా  ప్రసంగాలు చేయడం, రాష్ట్ర సమస్యలన ప్రస్తావించకపోవడం మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి నుంచి జాతీయ అజెండా వరకూ ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వ్యూహాలు పన్నినా అనుకున్నంత స్పందన రాకపోవడంతో కేసీఆర్ కూడా ఒక అడుగు వెనుకకు వేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా భావించాయి. కానీ తాజాగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ పర్యటనల కోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం కార్లు సమకూర్చుకున్నట్లు బయట పడింది. అందుకు సంబంధించి కొన్ని కార్లు మొన్న (గురువారం) బెజవాడ మల్లపల్లి పారిశ్రామిక వాడలోని గ్యారేజీకి చేరుకున్నాయి. ఆ తరువాత కార్గో విమానంలో వాటిని తరలించారు. ఆ కార్లను వాటి తయారీ సంస్థ కార్గొ విమానాశ్రయంలో గన్నవరం ఏయిర్ పోర్టుకు అక్కడ నుంచి గ్యారేజీకి తీసుకువచ్చి అవసరమైన ఫిట్టింగ్ లు చేయించారు. ఆ వెంటనే మళ్లీ అదే కార్గొ విమానంలో హస్తినకు తరలించారు. వీటిని ఢిల్లీలోని టీఆర్ఎస్ భవన్ కు తరలించారని చెబుతున్నారు.  కేసీఆర్ ఢిల్లీ పర్యటనల్లో ఈ ఈ కాన్వాయ్ నే ఉపయోగిస్తారని అంటున్నారు. అంతు కాదు తన జాతీయ రాజకీయ పర్యటనలలో భాగంగా వీటినే వివిధ రాష్ట్రాలకు తిరగడానికి వినియోగిస్తారని చెబుతున్నారు. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా తన జాతీయ పర్యటనల కోసం కేసీఆర్ కాన్వాయ్ కార్లను రెడీ చేయించుకున్న సంగతి బయటకు పొక్కడం సంచలనం కలిగించింది. అధికారికంగా టీఆర్ఎస్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కేసీఆర్ కొత్త కాన్వాయ్ కార్ల గురించి ఎటువంటి ప్రకటనా వెలువడకపోయినా.. కేసీఆర్ కోసం కొత్త కాన్వాయ్ రెడీ అవుతోందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    ఎందుకంటే ఎన్డీయేను ఢీకొట్టడానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ముందుకు వచ్చే సూచలను కనిపించడం లేదు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇంట్రెస్టు చూపుతున్నా టీఆర్ఎస్ చెప్పిన మాట వినే పొజిషన్లో లేదు. దీంతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా సక్సెస్ అవుతారోనని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గ‌డియారంలో నిమిషాల ముల్లు క‌ద‌లిక‌లో జాప్యం!

బ‌డికి వెళ్లాల్సిన పిల్లాడితో ప‌రిగెట్టే స‌మ‌యంలో త‌ల్లి, ఆఫీస్ టైం అయిపోతోంద‌ని ఉద్యోగి, ఏదో సీరియ‌ల్ కోసం బామ్మ‌గారూ.. వీరంద‌రి చూపు గోడ‌కి వేలాడుతున్న గ‌డియారం మీదే ఉంటుంది. ఇది చాలా స‌హ‌జ దృశ్యం. టైం ప్ర‌కారం అన్నీ జ‌రిగిపోవాల్రా అబ్బాయ్ అంటూ పెద్దాయ‌న  అదే గోడ‌గ‌డియారం చూస్తూనే హితోప‌దేశం చేసేది. ఇంత‌మందికి ఆ గ‌డియారం రోజూవారీ జీవితాన్ని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో గ‌డిపేందుకు దారి చూపుతోంది. గ‌డియారంలో గంట‌లు, నిమిషాల ముల్లులా రోజూవారీ జీవితా న్ని మార్చుకుంటున్నారు ఈరోజుల్లో ఉద్యోగులు, యువ‌త‌! గ‌డియారంలోని ముల్లుల విష‌యంలో ఒక చిత్ర‌మైన సైన్స్ ఉందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌నం గ‌డియారాన్ని అదే ప‌నిగా అలా ప‌ది నిమిషాలు త‌దేకంగా చూస్తే గ‌డియారంలోని నిమిషా ముల్లు కాస్తంత ఆగిన‌ట్టో, మ‌రీ నెమ్మ‌దిగా క‌దిలిన‌ట్టో అనిపిస్తుంది. అందుకు ఒక శాస్త్ర‌ప‌ర‌మైన అర్ధం ఉంద‌ట‌. ఈ కాన్సెప్ట్‌ను ఇటీవ‌ల యూట్యూబర్ ఆసాప్ సైన్స్ ఒక వీడియో ద్వారా వివ‌రించింది. గ‌డియారం వంక మ‌న చూసు మ‌న మెద‌డు కంటే వేగంగా క‌దిలి చూడ‌గ‌ల్గుతుందిట‌.   వాస్తవానికి ఇది జరగడానికి నిజంగా మంచి కారణం ఉంది. మీరు దానిని ఊహించడం లేర‌ని యూట్యూబర్  చెప్పాడు, మీ కళ్ళు రెండు రకాల ఆపరేషన్లను కలిగి ఉన్నాయని వివరించాడు. మీరు నెమ్మదిగా కదులుతున్న దాన్ని గమనించడం. మరోవైపు, సాకేడ్స్ అంటే మీరు త్వరగా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి దూకడం. ఇది జరగడానికి నిజంగా మంచి కారణం ఉంది మరియు మీరు దానిని ఊహించడం లేదు," అని అతను చెప్పాడు, యూట్యూబర్ మీ కళ్ళకు రెండు రకాల ఆపరేషన్ మోడ్‌లు ఉన్నాయని వివరించాడు: మృదువైన ముసుగు సాకేడ్‌లు. మీరు నెమ్మదిగా కదులుతున్న దాన్ని గమనించడం. మరోవైపు, సాకేడ్స్ అంటే మీరు త్వరగా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి దూకడం. సకేడ్‌లతో, మీ కన్ను పాయింట్ ఎ నుండి పాయింట్ బికి దూకినప్పుడు, మెదడు వాస్తవానికి ఎటువంటి సమాచారాన్ని తీసు కోదని యూట్యూబర్ చెప్పారు. మీ మెదడు బి పాయింట్ నుండి చిత్రాన్ని తీసుకుంటుంది, చిత్రం బి తో తప్పిపోయిన గ్యాప్‌ను బ్యాక్‌ఫిల్ చేస్తుంద‌ని అతను చెప్పాడు. కాబట్టి, మీరు గడియారాన్ని పరిశీలించినప్పుడు, మీరు చివరి వస్తువును చూసిన సెకను నుండి మీరు దానిని తదేకంగా చూస్తున్నారని మీ మెదడు చెబుతోంది. ఫలితంగా, మొదటి సెకను నిజానికి మిగతా వాటి కంటే ఎక్కువగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది అని యూట్యూబర్ చెప్పారు.

రావ‌ల్సిండి బాల్య‌ఛాయ‌లో 95 ఏళ్ల  రీనా వ‌ర్మ‌

పిల్లాడిని ఊరు నించి పంపేయ‌వ‌చ్చేమోగాని, పిల్లాడి మ‌న‌సులోంచి ఊరుని విడ‌దీయ‌లేమ‌ని ఆంగ్లంలో ఓ సామెత‌. ఇది అక్ష‌ర స‌త్యం. పుట్టిపెరిగిన ఊరు అన‌గానే తెలీకుండానే ఏదో ఆనంద‌పు కెర‌టం కేరింత‌లు కొట్టిస్తుంది. దీనికి వ‌య‌సుతో సంబంధం లేదు. త‌మ ఊరు నుంచి బ‌య‌ట‌ప‌డి ఎన్నేళ్ల‌యినా, వ‌య‌సు మీద‌ప‌డినా ఒక్క‌సారి ఆ ఊరి క‌బురు వినాల‌నే ఉంటుంది. అదో బాల్య ఆనందం, అదో తీపి మ‌ధుర‌స్మృతి, అదో అద్భుతం, అదో మ‌న‌సు తేలిక ప‌రిచే ఔష‌ధం. వృత్తి ఉద్యోగాలు, వ్యాపార హ‌డావుడిలో బిజీగా గ‌డిపేస్తున్న ఈ కాలంలో ఎక్క‌డో ఒక‌చోట మ‌న ఊరువాళ్లు ఒక్క‌రు క‌లిసినా, పోనీ ఆ మాట‌లు విన్నా ప‌ని ఒత్తిడి తాలూకు టెన్ష‌న్ అంతా కొంత‌సేపు మ‌న‌ల్ని ఒదిలేస్తుంది. దానికి అంత మ‌హ‌త్తుంది. అలాంటిది 75 ఏళ్ల త‌ర్వాత రీనా వ‌ర్మ త‌న స్వ‌గ్రామం వెళితే ఇంకెంత ఆనందం ఉర‌క‌లేసి ఉంటుందో ఆలోచించండి. రీనా వ‌ర్మ 90 ఏళ్ల వృద్ధురాలు, పూణె నివాసి. ఆమె పుట్టి పెరిగిందంతా పాకిస్తాన్ రావ‌ల్‌పిండి. ఎప్పుడో డెబ్బ‌య్ ఐదేళ్ల క్రితం దేశ విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఆమె పూణెలోనే ఉండిపోయారు. ఆమె మూడు నెల‌ల వీసా సంపాదించి సొంతూరుకి వెళ్లింది. అదీ ఇప్ప‌టి పాకిస్తాన్ రావ‌ల్పిండికి. అక్క‌డికి వెళ్ల‌గానే ఆ గాలి, ఆ ప్ర‌జ‌ల్ని, ఆ వీధులు చూస్తూ ఒక్క‌సారిగా రీనా త‌న బాల్యాన్ని పాఠం చెప్పిన‌ట్టు అల‌స‌ట లేన్న‌ట్టు చుట్టూ చేరిన‌వారికి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పింది. కాదు.. ఆ వూరే ఆమెను కావ‌లించుకుని చెప్పించింది. అమె త‌న స్వ‌గ్రామానికి వ‌స్తున్న‌ట్టు ఫేస్‌బుక్ ద్వారా భారీ ప్ర‌చార‌మే జ‌రిగింది. అక్క‌డి ఝాంగ్‌, రావ‌ల్సిండిల‌లో గ‌డిపిన జీవితాన్ని ఆమె నెమ‌రేసుకుంది. అక్క‌డి  వారి పొలాలు, పంట‌లు, పుస్త‌కాల దుకాణాలు, ఇత‌ర చిరు వ్యాపారాల గురించి రీనా ఒక పుస్త‌కం రాయ‌ద‌గ్గ స‌మాచారాన్ని ఆ 90 యేళ్ల వ‌య‌సులోనూ చిన్న‌పిల్ల‌లా చెబుతూనే ఉంద‌ని ఆమె మ‌న‌వ‌రాలు మీడియాతో చెప్పి బుగ్గ‌లు నొప్పిపుట్టేలా న‌వ్వుకుంది. త‌న‌కంటే ఓ అమ్మ‌మ్మ భార‌త‌దేశంలో ఉంద‌ని తెలుసుగాని ఆమెను ఫోటోలోనే చూడ‌టం ఇప్పుడు చూడ‌ట‌మే కాదు ఆమెతో రావ‌ల్సిండీ వీధుల్లో తిర‌గ‌డం, తెలిసిన‌వారికి ఆమెను ప‌రిచ‌యం చేయ‌డం.. అదంతా ఓ అద్భుతం.. నిజానికి చూసి తీరాల్సిన బాంధ‌వ్య దృశ్యం. నిజానికి రీనా రావ‌ల్సిండికి వెళ్లాల‌ని అంద‌ర్నీ క‌నుమూసేలా చూడాల‌ని తెగ ఆరాట‌ప‌డ్డారు. వీసా కోసం 1965 నుంచి ప్ర‌య‌ త్నిస్తున్నారు. కానీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. 1945లో దేశ విభ‌జ‌న సమ‌యంలో త‌ప్ప‌నిస్థితిలో మ‌హారాష్ట్ర పూణెకి రావ‌ల‌సి వ‌చ్చింది. మొన్న కోవిడ్ స‌మ‌యంలో ఆమె రావ‌ల్సిండి వెళ్లాల‌ని ఎంతో అనుకు్న్నారు. ఆమె త‌మ జీవితం తొలి 15 ఏళ్లు గ‌డిపిన  ఆ పట్ట‌ణానికి వెళ్లిపోవాల‌ని ఎంతో ఆరాట‌ప‌డ్డారు. త‌న కోరిక‌ను తెలియ‌జేస్తూ కోవిడ్ స‌మ‌యంలో పంజాబ్ హెరిటేజ్ ఫేస్ బుక్ పేజీలో తెలియ‌జేశారు. రెండు దేశాల స‌రిహ‌ద్దుల‌కు రెండు వేపులా వున్న పంజాబీలు ఒక్క‌టి కావాల‌ని ఆమె ఎంతో ఆకాంక్షిస్తున్నారు. ఆమెది రావ‌ల్సిండికి వెళ్లాల‌న్న ప‌సిపిల్ల ఆరాటంతో పాటు, పంజాబీలంతా ఒక్క‌టిగా ఉండాల‌న్న దేశ‌భ‌క్తి కూడా!  ఆమె క‌థ తెలిసిన రావ‌ల్సిండి వ్య‌క్తి స‌జ్జ‌ద్ భాయ్ ఆమె బాల్యంలో గ‌డిపిన ఇంటి వివ‌రాలు, ఫోటోలు ఆమెకు చేరేలా చేశాడు. ఆమె కుమార్తె సోలాన్ అనే ప్రాంతంలో ఉంటున్నారు. విభ‌జ‌న త‌ర్వాత తిరిగి వెళ్లాల‌ని అనుకున్నారు కానీ సాధ్య‌ ప‌డ‌లేదు.  రీనా మూడు మాసాలు రావ‌ల్సిండిలో వ‌దిలేసిన బాల్యాన్ని వీధుల్లో వెతుక్కుంటూ ఆ జా్ఞ‌ప‌కాల‌తో, ఆ ఇంటి ప‌రిస‌రాల్లో తిరుగుతూ గంపెడు గొప్ప అనుభూతుల్ని, జ్ఞాప‌కాల‌ను మ‌న‌కోసం తీసుకువ‌స్తారేమో!

ప్ర‌జ‌లు విసిగెత్తితే ఇలానే చేస్తారు

రాజ‌కీయ‌నాయ‌కుల‌కు, సినీస్టార్స్‌కు వారి ప‌నులే కాకుండా బ‌ట్ట‌ల దుకాణాలు, మాల్స్ ఓపినింగ్ ప‌ని కూడా గొప్ప ప్ర‌తిష్టా త్మ‌కం. వారి వీరాభిమానుల‌కు అదో పండ‌గానందం! వీల‌యితే ప్ర‌తీ గ‌ల్లీలోని పెద్ద పెద్ద దుకాణాల ఓపినింగ్ వారి చేత చేయిం చాల‌న్న పిచ్చి అభిమానంతో పిలుస్తుంటారు. ఏ ప్రాంతంలోనైనా స‌రే కొన్ని కేవ‌లం శిలాఫ‌ల‌కంతోనే ప‌నులు ఆగిపోతుంటాయి. ఓపినింగ్‌కి వెళ్లిన‌వారు ఆ త‌ర్వాత పెద్దా సీరియ‌స్‌గా తీసుకోరు. అయితే ప్ర‌జ‌లు త‌మకు ఉప‌యోగ‌ప‌డేవాటిని నాయ‌కుల‌తో ఆరంభించాల‌నుకుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో అది అంత త్వ‌ర‌గా అనుకున్న స‌మ‌యానికి అవ్వ‌దు. ఉదాహ‌ర‌ణ‌కి క‌ర్ణాట‌క గ‌డ‌గ్ జిల్లాలో ఒక బ‌స్షెల్ట‌ర్‌ను ఆరంభించ‌డానికి చాలారోజుల నుంచి అక్క‌డి రాజ‌కీయ‌నాయ‌కులు ఎగ‌నామం కొడుతున్నారు. ప్ర‌జ‌లు ఎదురు చూసి చూసి విసిగెత్తారు. చివ‌రికి గేదె ను ఛీఫ్ గెస్ట్‌గా తీసుకువ‌చ్చి మ‌రీ  ఆరంభించారు.   గ‌డ‌గ్ జిల్లా బాల‌సూర్‌లో ఒక బ‌స్ షెల్ట‌ర్ క‌ట్టి చాలా కాల‌మే అయింది. అంటే ఓ న‌ల‌భ‌య్యేళ్లు! కొంత‌కాలం క్రితం అది కూల‌డం కూడా జ‌రిగింది. కానీ దాని ఆరంభోత్స‌వం మాత్రం జ‌ర‌గ‌లేదు. ప్ర‌జ‌లు దాన్ని వినియోగించ‌డం కుద‌ర‌లేదు. చాలాకాలం నుంచి అధికారుల‌ను ఆ బ‌స్‌షెల్ట‌ర్ గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ అస‌లు ఆరంభోత్స‌వం జ‌ర‌గ‌కుండా ఎలా ఉప‌యోగిస్తార‌ని వారి స‌మాధానం. జ‌నం విసిగెత్తారు, కోపం వ‌చ్చింది. నాయకులు, అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రికి మండిప‌డ్డారు. పైగా బ‌స్ షెల్ట‌ర్ అందుబాటులో లేక‌పోయేస‌రికి విద్యార్ధులు, ఉద్యోగులు అంద‌రూ అక్క‌డి ఇళ్ల ద‌గ్గ‌ర‌, దుకాణాల దగ్గ‌ర బ‌స్సుల కోసం వేచి ఉండాల్సి వ‌స్తోంది. వ‌ర్షాకాలం ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా మార‌తాయి.  ఇక లాభంలేద‌ని ఆమ‌ధ్య అక్క‌డివారే బ‌స్ ష‌ల్ట‌ర్‌ను ఆరంభించారు. అయితే అందుకు ఛీఫ్ గెస్ట్‌గా మాత్రం ఒక గేదెను తీసుకువ‌చ్చారు. దీని సారాంశ‌మేమిటో మ‌రీ వివ‌రిం చ‌క్క‌ర్లేదేమో!

మితిమీరిన ఆనంద‌మూ ప్ర‌మాద‌మే!

అనారోగ్యంతో మ‌ర‌ణించేవారి సంగ‌తి తెలుసు. ఏదో చెప్ప‌లేని బాధ‌తో క్షీణించి మ‌ర‌ణంచేవారుంటారు. ఒంట‌రిత‌నం మాన‌సిక ప్ర‌శాంత‌త‌లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ మ‌నిషి మ‌ర‌ణానికి దారితీస్తుంటాయి. చిత్ర‌మే మంటే అమితానందం కూడా ప్ర‌మాద‌మే అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అదేమిటి.. జీవితంలో సంతోషంగా ఉండాల‌ని, ఎప్పుడూ ఆనందంగా జీవించాల‌ని అంటూంటారు క‌దా అంటే క‌రెక్టే.  కానీ హ‌ఠాత్ప‌రిణామాలతో వ‌చ్చే ఆనందం గుండె పోటుకి దారితీస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఆమ‌ధ్య ఒక సినిమాలో ఓ పెద్దామె న‌వ్వుతూ న‌వ్వుతూ గుండె ఆగి మ‌ర‌ణించ‌డం చూపించారు. న‌వ్వు ముఖంతోనే పార్ధివ దేహం క‌న‌ప‌డుతుంది! అది సినిమా సీన్‌లే అని అనుకోవ‌చ్చు.  కానీ అందుకు చాలా ఆస్కారం ఉందిట‌. అదేదో గొప్ప మ‌ర‌ణంగానూ భావించ‌న‌క్క‌ర్లేదు.  ఈ ఆధునిక కాలంలో అన్నీ చాలా ఆశ్చ‌ర్య‌క‌ర సంఘ‌ట‌న‌లే ఎక్కువ వింటున్నాం, చూస్తున్నాం. అబ్బాయి కి ఎన్న‌డూ లేనిది జీతం రెండింత‌లు పెర‌గ‌డం, విదేశీ చ‌దువు ఫ్రీగా లభించ‌డం, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విదేశాల్లో పెద్ద ఉద్యోగం రావ‌డం, లాట‌రీలో కోట్లు రావ‌డం వంటివి ఎంత ఆనందా న్నిచ్చే స‌మాచారాలో  అంత ప్ర‌మాద‌క‌రం కూడా! ఇలాంటి మ‌ర‌ణాల్ని త‌కోత్సుబో సిండ్రోమ్ అంటార‌ని జ్యూరిచ్ ఆస్ప‌త్రికి చెందిన స్విస్ శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. దీన్నే ఇంకా తేలిక‌గా చెప్పాలంటే హార్ట్ బ్రోకెన్ సిండ్రోమ్ అంటారు.  అత్యంత ఆనంద‌క‌ర సంద‌ర్భాలు, సంఘ‌ట‌న‌లు ఒక్కోసారి మ‌నిషిని తెలీకుండా విప‌రీత‌మైన బ‌ల‌హీన త‌కు దారితీస్తాయి. ఇలాంటివి మ‌న‌మూ అపుడ‌పుడూ గ‌మ‌నిస్తుంటాం. ఇంట్లో ఏద‌యినా అత్యంత ఆనం దక‌ర సంఘ‌ట‌న జ‌రిగితే అంద‌రూ గ‌ట్టిగా న‌వ్వేసుకుంటూంటారు. అందులో ఒక్క‌రిద్ద‌రికి ఆ ఆనంద‌పు న‌వ్వు చాలా సేపు ఉంటుంది. అల‌స‌ట వ‌చ్చేస్తుంది. కుర్చీలో కూర్చుండిపోతారు. పొట్ట చెక్కల‌య్యేలా న‌వ్వావురా.. అంటారు హాస్యంగా అంద‌రూ.. కానీ అదే గుండె ఆగేందుకు దారి తీస్తుందిట‌.  అంటే ఆ స‌మ యంలో గుండె ఎడ‌మ క‌వాటం ఉండాల్సిన స్థితి మారుతుంది. దానితో  గుండెపోటు వ‌స్తుంది. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదు.  అంటే గుండె కండ‌రాలు మెల్ల‌గా శ‌క్తి  కోల్పోతాయి.  గుండె జ‌బ్బులు వ‌చ్చే కేసుల్లో ఇలాంటిది  ఏ  ఒక్క‌టో  రెండో  ఉంటాయంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు.  అందు క‌నే ఎక్కువ‌గా ఆవేశ‌ప‌డ‌వ‌ద్ద‌ని, ఆగ్ర‌హానికి , అతి భ‌యానికి  గురికావ‌ద్ద‌ని, అతిగా  స్పందించ‌డం, లేని దాన్ని ఉంద‌ని ఊహించుకుని ఆందోళ‌న‌చెంద‌డం వంటివాటికి దూరంగా ఉండాల‌ని.. మామూలుగా డాక్ట ర్లు సూచిస్తుంటారు. అంటే మ‌నిషి మ‌ధ్య‌వ‌య‌సు దాటిన త‌ర్వాత కొంత ఉద్రేక ప‌రిస్థితుల‌కు దూరం గా ఉండాలి. స‌హ‌జంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో అలాంటి ప‌రిస్థితులు దాదాపు త‌ర‌చూ  వ‌స్తుంటాయి గ‌నుక  క‌డు జాగ్ర‌త్త‌గానే ఉండాలంటున్నారు గుండె నిపుణులు. జ్యూరిచ్  శాస్త్ర‌వేత్త‌లు  సుమారు  500 మంది రోగుల ఆరోగ్య‌ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ఈ  హాపీ సిండ్రోమ్‌ను క‌నుగొన్నారు. దీనికి సం బంధించిన విశ్లేష‌ణ‌తో కూడిన వ్యాసాన్ని యూరోపియ‌న్ హార్ట్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  త‌కోత్సుబో  సిండ్రోమ్ అధిక‌శాతం మ‌హిళ‌ల్లోనే క‌న‌ప‌డుతోందని శాస్త్ర‌వేత్త‌లు క‌నుగొన్నారు. శ్వాస తీసు కోవడం త‌గ్గడం, ఛాతీ నొప్పి వంటివి అతి సాధార‌ణ ల‌క్ష‌ణాలుగా పేర్కొన్నారు. 

గెలుపు ముర్ముదే.. ఓడింది సిన్హా కాదు!

అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్లుగానే  రాష్ట్రపతి ఎనికల్లో, అధికార బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఘన విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీలో ముర్ముకు 6,76,803 ఓట్లు పోలయితే, ఆమె ప్రత్యర్ధి  ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 3,80,177 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో ముర్ము 64 శాతం ఓట్లు సాధించారు. యశ్వంత్ సిన్హాకే 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో మూడు రోజుల్లో, జులై 25న  ద్రౌపతి ముర్ము భారత  15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  నిజమే రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్ధి విజయం సాధించడం విశేషమేమీ కాదు.  ఇంతవరకు ఒకే ఒక్క సందర్భంలో మినహా, మిగిలిన అన్ని సందర్భాలలో అధికార పార్టీ/ కూటమి అభ్యర్ధులే రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ  ఒక్క సందర్భం (1969) లో కూడా. అధికార కాంగ్రెస్ పార్టీలో చీలిక నేపధ్యంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీనే, కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్ధి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దించారు. ఆత్మ ప్రభోదం నినాదంతో  ఆమె వీవీ గిరిని గెలిపించారు. అదొక ప్రత్యేక పరిస్థతి. ప్రత్యేక సందర్భం.  అయితే ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ము గెలుపు కోణం కాకుండా ప్రతిపక్ష పార్టీల ‘ఉమ్మడి’ అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓటమి కోణం నుంచి చూడవలసి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి,రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ తొలి గంట కొట్టక ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికపై దృష్టిని కేంద్రీకరించాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ భవిష్యత్ రాజకీయలకు, రాష్ట్రపతి ఎన్నికలు,టర్నింగ్ పాయింట్ , మేలి మలుపు అవుతుందని, మోడీ, షా జోడీ దూకుడుకు రాష్ట్రపతి  ఎన్నికల ఫలితాలతో బ్రేక్ పడుతుందని ఆశించారు.  అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దించితే, అధికార  ఎన్డీఎ కూటమికి గట్టి పోటీ ఇవ్వగలమని, తద్వారా, 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పోరాటాన్నిముందుకు తీసుకు పోగలమనే ఆలోచన వెంబడి అడుగులు వేశారు. అందు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ లో శరద్ పవార్ మొదలు కేసీఆర్ వరకు  ప్రతిపక్ష పార్టీల పెద్దలంతా, పేరంటాలు చేశారు. పావులు కదిపారు. చర్చలు జరిపారు. అయితే, ఉమ్మడి అభ్యర్ధి  ఎంపిక దగ్గరే  తడబడి తప్పటడుగులు వేశారు అనుకోండి అది వేరే విషయం. చివరకు  ఏమి జరిగింది అనేది ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తోంది. యశ్వంత్ సిన్హాను బరిలో దించారు. అయిన ఫస్ట్ సీన్ లోనే సినిమా అర్థమై పోయింది.  ప్రతిపక్షాల ఐక్యత ఎండమావని మరో మారు తెలిపోయింది. ప్రతిపక్షాల పక్కా ఓట్లనుకున్న ఓట్లలో పది శాతం కంటే ఎక్కువ ఓట్లే అధికార కూటమి అభ్యర్ధికి పోలయ్యాయి.మొతం మీద ఓ 17 మంది ఎంపీలు ఓ వంద మందికి పైగా ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు. ముర్ముకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన జేఎంఎం, వైసీపీ, శివసేన ఇతర ఎన్డీయేతర పార్టీల ఓట్లు వీటికి అదనం.   సో.. ముర్ము గెలుపు యశ్వంత్ ఓటమి కాదు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి పరాజయం. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలు  దేశ రాజకీయాలలో టర్నింగ్ పాయింట్ అవుతాయని పెట్టుకున్న ఆశలు నెరవేర లేదు, సరికదా ఓటి కుండ బొక్కలు బయట పడ్డాయి. అంతే కాదు ముర్ము తిరుగులేని విజయంతో కంగుతిన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక ముందు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఇంకెన్ని వంపులు, వంకర్లు పోతుందో చూడవలసిందేనని పరిశీలకులు అంటున్నారు. మరో వంక, వచ్చే రెండేళ్ల వ్యవధిలో జరిగే గుజరాత్‌, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో,  అదే విధంగా 2024 ఎన్నికల పైనా గిరిజన రాష్ట్రపతి ప్రభావం తప్పక ఉంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలను కొట్టి వేయలేమని  అంటున్నారు.  అందుకే రాజకీయ విశ్లేషకులు  రాష్టపతి ఎన్నికల్లో ముర్ము గెలుపు, బీజేపీ దీర్ఘకాల వ్యూహంలో మరో గెలుపు, మరో మలుపు అంటున్నారు. బీజేపీకి బ్రాహ్మణ, బనియా పార్టీ అనే ముద్ర ఉన్నా, ఉత్తారాది పార్టీ అనే ముద్ర ఉన్నా, ఇంకా  చాలా చాలా గీతలు, గళ్ళు ఉన్న బీజేపీ,  ఒక్కొక గీతను  దాటుకుంటూ వస్తోంది. చివరకు ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం  చేస్తోంది. అన్ని వర్గాలను కలుపుకు పోతోందని పరిశీలకులు అంటున్నారు.  ప్రస్తుత పార్లమెంట్ లో ఎస్సీ,ఎస్టీ  ఎంపీలు 131 ఉంటే అందులో బీజేపీ ఎంపీలు  77 మంది ఉన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమంటే, 2014లో కంటే 2019 బీజేపీకి 21 ఎంపీ సీట్లు ఎక్కువచ్చాయి ( 282 నుంచి 303) ..ఈ  21 మంది  ఎంపీలలో 10 మంది  ఎస్సీ, ఎస్టీ ఎంపీలున్నారు. ఇప్పడు ముర్ము ఎన్నిక తర్వాత ఎస్సీ, ఎస్టీలలో బీజేపీ ఇంకా విస్తరించే అవకాశం ఉంటుందని, ఆ  ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం బెడిసి కొట్టిందని,  భవిష్యత్;లోనూ ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా బీజేపీని  ఎదుర్కోవడం అయ్యే పని కాదని అంటున్నారు.

16 అడుగుల చేప‌.. మూఢ‌న‌మ్మ‌కాల‌కు కేంద్రం!

ఒక రోజు బామ్మ‌గారు మ‌న‌వ‌డిని తీసుకుని కంచికి బ‌య‌లుదేరింది. ఎందుక‌ని అడిగితే మొన్న మా వాడి బుజంమీద బ‌ల్లిప‌డింది, అక్క‌డ బంగారుబ‌ల్లిని తాకించాలిగ‌దా.. అందుకు అన్న‌ది. అంత‌కు రెండ్రో జుల ముందు ఎదురింటి పిల్లకి పిల్లి ఎదుర‌యింద‌ని ప‌రుగున వెళ్లి గ‌ది త‌లుపులేసుకుని రోజంతా బ‌య‌టికి రాలేదు.. రాతి యుగం నుంచి రాకెట్లు దాటి కంప్యూట‌ర్ కాలంలోకి వ‌చ్చాం. ప్ర‌పంచ‌మంతా ఆ చిన్న ముండే చూపుతుందేవిట్రా అంటారు తాత‌గారు.. కానీ శ‌కునాల పిచ్చి మాత్రం త‌రాలు మారుతు న్నా పోవ‌డం లేదు. ఇక్క‌డే కాదు చిలీ వంటి దేశాల్లోనూ ఇదే భ‌యం ప‌ట్టుకుపీడిస్తోంది! చిలీలో ఓ మ‌త్స్య‌కారుడు అలా చేప‌ల కోసం స‌ముద్రంలోకి వెళ్లాడు. ఎప్పుడూ లేనిది హ‌ఠాత్తుగా అత‌న్నే లోప‌లికి లాగేసింది ఏదో జంతువు. అత‌ను ఎలాగో మ‌ళ్లీ ప‌డ‌వ ఎక్కి దాన్ని మాత్రం ఒడ్డు మీద‌కి లాక్కొచ్చా డు. తీరా చూస్తే అది ఏకంగా 16 అడుగుల పాములాంటి  చేప‌. ఇలాంటిది అక్క‌డి వారు ఎన్న‌డూ చూడ లేద‌ట‌. అంతే ఇదేదో ద‌య్యం అనుకున్నారు, ఇదేదో కొంప‌ముంచేందుకే  వీడికి దొరికింద‌ని  తిట్టుకున్నా రు. ఒక గ‌డ్డం ముస‌లాయ‌న వ‌చ్చి ఇది నిజంగానే అప‌శ‌కునం.. జాగ్ర‌త్త  అని వాళ్ల  భ‌యాన్ని రెండింత లు చేసి వెళ్లారు. ఇంత‌కీ ఆ పేద్ద‌ది.. ఓర్ ఫిష్. ఇది చేప‌లానే క‌నిపించే చేప‌గాని నీటి జంతువు. దాని ఒడ్డూ పొడుగూ తేల్చ‌డానికి ఏకంగా రాళ్లెత్తే క్రేన్ ని ప‌ట్టుకొచ్చారు.  ఈ అతిపెద్ద చేపని కింగ్ ఆఫ్ హెరింగ్స్ అని పిలుస్తున్నారు. నీటి అట్ట‌డుగున  జీవించే ఈ చేప‌ చుట్టూ కూడా ఒక కథ‌ను అల్లి చెబుతున్నారు ఇక్క‌డి వారు. ఇలాంటివి గ‌తంలో జ‌పాన్‌లో క‌నిపించాయి.  ఆ త‌ర్వాత‌నే ఫుక‌షిమా అనే భ‌యాన‌క తుపాను జ‌పాన్‌ను ముంచెత్తింది. ఇపుడు  అదే  భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. అయితే కొంద‌రు నాస్తికులు మాత్రం పెద్ద జీవ‌మే క‌నిపించినంత మాత్రాన చూసి ఆనం దించాలి. భ‌యంలేక‌పోతే పెంచుకోవాలి గాని ఇలాంటి పిచ్చి, అర్ధ‌ర‌హిత మూఢ‌న‌మ్మ‌కాల‌తో భ‌య‌పెట్ట వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పోనీ అలా అనుకున్నా, ఇపుడు ఉన్న‌ప‌ళాన ఎక్క‌డ‌క‌ని ప్ర‌జ‌లంతా  నివాసాలు ఖాళీ చేసి వెళ్లాలి? అయినా, ఓర్ ఫిష్ అనేది నీటికి అట్ట‌డుగున ప‌డి ఉంటుంది. దానికి  లోకంలో జ‌రిగే దానికి ఏమ‌న్నా సంబంధం ఉంటుందా? అనీ చిలీలో కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. టెటానిక్ ప్లేట్స్ క‌ద‌లిక‌ల వ‌ల్ల ఇలాంటివి పైకి వ‌స్తుంటాయే త‌ప్ప అదేమి అప‌శ‌కునం, అతి ప్ర‌మాద హేతుకం కాద‌ని అంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఎన్న‌యినా, ఎవ‌రైనా చెప్ప‌నీయండి.. మూఢ‌న‌మ్మ‌కం క‌లిగితే దాన్ని ఎవ్వ‌రూ మ‌నసు లోంచి తీసేయ‌లేరు. 

జ‌గ‌న్  ప‌క్క‌లో  బ‌ల్లెం!

రాజా, మీ ఆజ్ఞ శిరోధార్యం, మీకోసం రాజ్యంకోసం మ‌ర‌ణాన్న‌యినా లెక్క‌జేయ‌ను.. అంటాడు స‌త్య నారా య‌ణ ఓ పాత సినిమాలో. కానీ రాజు స‌త్య‌నారాయ‌ణ వెన‌కే వేగుల్ని పెట్టి న‌మ్మ‌కం కోల్పోయేలా చేసుకుంటాడు. దాదాపు అదే సీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. జ‌గ‌న్ పార్ల‌మెంటుకి పంపిన‌ ఎం.పీ ర‌ఘురామ కృష్ణం రాజు ఆయ‌న్నే నిల‌దీస్తున్నారు. మ‌నోడు మ‌నోడు అనుకుంటే న‌చ్చ‌ట్లే ద‌న్న దిట‌ వెన‌క‌టికి  ఒకామె. అదుగో అలా త‌యారైంది జ‌గ‌న్‌, ర‌ఘురామ‌ల మైత్రి. ఒకే పార్టీ అయినా న‌మ్మ‌కం పోయిన త‌ర్వా త అధినేత‌యినా పార్టీ కార్య‌క‌ర్త‌యినా ఎం.పీ గారికి తిట్ట‌డానికి పెద్ద అడ్డేమిటి. జ‌గ‌న్ పాల‌నా విధానం, ఆయన మంత్రివ‌ర్గ నిర్ణ‌యాలు ఏమాత్రం ఆయ‌న‌కు రుచించ‌డం లేదు. త‌ప్పుల త‌డ‌క పాల‌న‌తో ప్ర‌జల‌ను మ‌భ్య‌పెట్ట‌డం త‌ప్ప జ‌గ‌న్ వాస్త‌వంగా ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనే స్థాయిలో పాల‌న సాగించ‌డం లేద న్న‌ది ర‌ఘుమా అభిప్రాయం..కాదు.. గ‌ట్టి న‌మ్మ‌కం. అందుకే ఆయ‌న  వైసీపీ అధిష్టానా నికి కొరకరాని కొయ్య గా మిగిలారు. జ‌గ‌న్ ప్ర‌తీ మాట‌ని, అడుగునీ విమ‌ర్శిస్తూ అయోమ‌యానికి గురిచేస్తు న్నారు ఎం.పీ. ర‌ఘురామ  అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానా లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  ఇదే జ‌గ‌న్‌కు బొత్తిగా మింగుడుప‌డ‌ని సంగ‌తి. మ‌నోడ నుకుంటే ఇలా తీవ్రంగా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డ‌మేమిట‌ని లోలోప‌ల జ‌గ‌న్ తెగ బాధ‌ప‌డు తున్నా రు. ప్రభుత్వ వైఫ ల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో  కడిగి పారేస్తున్నారు. సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయ లేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై  వేటు వేయడానికి  చేయని  ప్రయత్నమంటూలేదు. కానీ వీలు పడడం లేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత  రెచ్చిపోతారని  భావిస్తోంది.  వ‌దిలేస్తే కాసేపాగి మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చే చిన్న‌పిల్లాడుకాదు ర‌ఘురామ‌. ఆయ‌న  బీజేపీ గూటికి చేరి మరిన్ని ఇబ్బందులు పెడతారని  వైసీపీ భయం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలి చిన ఆయన తొలినాళ్ల‌లో  అధిష్టానంతో సఖ్యత గానే నడిచారు. కానీ తరువాత విభేదాలు పొడచూపాయి. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. తనపై భౌతిక దాడిచేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయిం చారు. మొత్తానికి అయితే రఘు రామరాజు అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యాలు చేస్తారో తెలియక సతమతమవుతున్నారు.  తాజాగా లోక్ సభలో ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని వైసీ పీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద గలాటానే చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఛీ మీ ముఖం చూసి మాట్లాడలేనంటూ ఆయన చేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇది లోక్ సభలో పెద్ద చర్చకే దారితీసింది.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రఘురాజు మాట్లాడారు. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పలు చేస్తోందని.. కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఆదాయంపై అప్పులు చేయడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తోందన్నారు.  తాజాగా ఏపీ బేవరేజెస్ తరుపున అప్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఖాజానాకు రావా ల్సి న ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ లోకి మళ్లించి…అదో ఆదాయ వనరుగా చూపించి అప్పులు చేస్తు న్నార ని ఆరోపించారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. దీనిపై వైసీపీ ఎంపీలు మార్గని భరత్, వంగ గీతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామతో వాదనకు దిగారు. దీనికి రఘురామ కూడా దీటుగా స్పందించారు. సిట్ డౌన్ అంటూ హెచ్చరించారు. అసలు మమ్మల్ని కూర్చోవడానికి మీరె వరు అంటూ ఆ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ స్పం దించారు. తనను చూసి చెప్పాలని సూచించారు. దీంతో వైసీపీ ఎంపీలు అభ్యంతరాలు చెబుతున్నా. .రఘురామ మాత్రం తన ముఖానికి చేతిని అడ్డంగా పెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే మొత్తానికి లోక్ సభ వేదికగా వైసీపీ ఎంపీల మధ్య జరిగిన రచ్చ మాత్రం తోటి సభ్యలుకు వినోదం పంచింది.

ఇంతకీ పవన్, బీజేపీల బంధం బలమైనదేనా?

పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో బీజేపీ మైత్రి లవ్ అండ్ హేట్ చందంగా కొనసాగుతోంది. ప్రసిద్ధ కథా రచయత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర కథ యావజ్జీవం హోష్యామీలో నిత్యం గొడవపడుతూ కలిసి జీవించే దంపతుల్లా జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల మధ్యా మైత్రి రంగులు మార్చుకుంటోంది. తగవులు పడుతోంది.. కలిసి సాగుదాం అంటోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను అంగీకరించాలని బీజేపీతో మైత్రికి జనసేనాని షరతు పెడితే.. మా పార్టీ ఎవరినీ భుజాన మోయదని బీజేపీ బెట్టు చేస్తున్నది. ప్రధాని నరేంద్రమోడీ హాజరైన భీమవరం సభకు జనసేనానిని నువ్వు రావద్దుసుమా అని నోటితో చెబుతూ సభకు రావాలంటూ ఓ ఆహ్వానం పడేసింది బీజేపీ.. అలిగిన జనసేనాని ఆ సభకు దూరంగా ఉండిపోయారు.  ఆ తరువాత మేం ఆహ్వానించాం మీరే రాలేదంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కితే.. వద్దామనే అనుకున్నా, కానీ స్థానిక ఎంపీని ఆహ్వానించకుండా నన్న ఆహ్వానించడం, నేను రావడం మర్యాద కాదని దూరంగా ఉన్నానని జనసేనాని వివరణ ఇచ్చారు. సరే అది ముగిసిన కథ.. ఇప్పుడు మళ్లీ ఈ ఆహ్వానం కథే మరో చోట మరోలా ఆరంభమైంది.  ఆ కథేమిటంటే  పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు శుక్రవారం (జులై 23) కేంద్రం పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రొటో కాల్ ప్రకారం పవన్ ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. ఉప రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు మాత్రమే ఆహ్వానితుల జాబితాలో ఉంటారు. అయినా కూడా పెద్ద మనసు చేసుకుని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు జనసేనాని పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పని సరిగా రావాలని కోరారు. దీనిని బట్టి పవన్ ను బీజేపీ దూరం పెట్టే ప్రశక్తే లేదనీ, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసే పోటీ చేస్తాయని విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే తనకు ఆహ్వానం వచ్చిందని ధృవీకరించిన పవన్ కల్యాణ్ ఆ ఆహ్వానాన్ని అనివార్య కారణాల వల్ల మన్నించలేకపోతున్నానని చెప్పేశారు. ఆరోగ్యం బాలేదనీ, అందుకే వెళ్లడం లేదనీ చెబుతూ, పనిలో పనిగా రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో క్రియాశీలంగా వ్యవహరించారనీ, పదవికి వన్నెతెచ్చారని ప్రశంసించేశారు. అయితే ఇంతకీ మోడీ స్వయంగా ఆహ్వానించినా పవన్ ఎందుకు స్పందించడం లేదు అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బీజేపీ, జనసేన మధ్య మూడేళ్లుగా మైత్రి కొనసాగుతున్నా.. ఈ మూడేళ్లలో కేవలం ఒక్కటంటే ఒక్క సారి మాత్రమే పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు. ఈ మధ్య కాలంలో పలు మార్లు మోడీతో భేటీ అవకాశం కలిగినా, స్వయంగా మోడీయే పిలిచినా పవన్ కల్యాణ్ ఆయనను కలిసే యత్నం చేయలేదు.   విశాఖ స్టీలు ప్లాంట్ ఇష్యూలో పవన్ నేరుగా హోం మంత్రి అమిత్ షానే కలిశారు. స్టీల్ ప్లాంట్ స్థితిగతులపై చర్చించారు. పలు సందర్భాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు. కానీ ఇంతవరకూ ప్రధాని మోదీని మాత్రం కలవలేదు.  ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తులు చిగురిస్తున్నట్టు వస్తున్న వార్తల వేళ.. పవన్ రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు గైర్హాజర్ కావాలని తీసుకున్న నిర్ణయం పలు సందేహాలకు తావిస్తున్నది. ఒక వైపు బీజేపీ  2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని   గంటా పథంగా చెబుతూ వస్తోంది. అయితే పవన్ మాత్రం మరో ఉద్దేశంలో ఉన్నట్లు తన మాటలు, చేతల ద్వారా స్పష్ఠంగానే తెలియజేస్తున్నారు.   గత రెండు సార్లు తాను తగ్గానని.. ఇక   తనకు ఈసారి అవకాశాన్ని వదిలేయాలని ఆయన సూటిగా కాకపోయినా పరోక్షంగానైనా బీజేపీకి తెలియజేశారు. అదే సమయంలో తెలుగుదేశానికి అన్యాపదేశంగా అదే సూచన చేశారు. దీంతో జనసేనతో పొత్తు అన్న విషయంలో తెలుగుదేశం ఆచి తూచి అడుగేస్తోంది. పొత్తు ఉంటుందని కానీ ఉండదని కానీ చెప్పడం లేదు. అయినా  మహానాడు తరువాత ఆ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపించింది. పవన్ ప్రస్తావనే లేకుండా తన పని తాను చేసుకుని పోతోంది.  బీజేపీ కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంగా పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని జనసేన శ్రేణుల నుంచి డిమాండ్ ను పట్టించకోకపోవడం అటుంచి, ఆయన పర్యటన మొత్తంలో కనీసం జనసేన పేరును కానీ, పవన్ కల్యాణ్ ఊసు కానీ రానీయ లేదు.  అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడి జనసేనకు అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే జనసేనానికి ఆహ్వానాలు, తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోవడాలు అని పరిశీలకులు అంటున్నారు. 

ఆపన్నులను ఆదుకోవడంలో బాబు తగ్గేదేలే!

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు   మాస్టర్ ప్లానే వేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతలు చేస్తున్న పనికిమాలిన పనులన్నింటినీ వరుసపెట్టి ఏకేస్తున్న చంద్రబాబు ప్రతి సందర్భాన్నీ టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా సరే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధించిపెట్టడం ద్వారా అసెంబ్లీలో  తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. తన సతీమణిని వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా విమర్శించినప్పుడు ఆవేదనతో మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అంటూ బయటికి వచ్చేశారు.  భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి, బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి, టీడీపీ తరఫున భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులకు తక్షణమే సాయం చేసి, అండగా ఉండాల్సిన సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయారని విమర్శించారు. అలా గాల్లో వస్తే.. బాధితుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు స్వయంగా వరదనీటిలో పడవలపైన, బురద నిండిన గ్రామాల్లో కూడా పర్యటించారు. కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబును చూసి గోదావరి జిల్లాల ప్రజల్లో చెప్పలేనంత సంతోషం వ్యక్తం అయింది. ఆయనకు నీరాజనాలు పట్టి మరీ స్వాగతం పలికారు. వరద బాధితులకు పక్కరాష్ట్రం తెలంగాణలో పది వేలు పరిహారం ఇస్తే.. ఏపీలో కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ ఇస్తున్న రెండు వేల రూపాయలు వరదలో మునిగిపోయిన ఇళ్లలోని బురద తొలగించుకోడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం తథ్యం అని, బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి పాలన సరిగా లేదు కాబట్టే పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలిసిపోతామంటూ తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వరదనీరు నిండి ఉన్న లంక గ్రామాల్లో చంద్రబాబు నాయుడు సాహసం చేసి మరీ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై, పలువురు నేతలు వరదనీటిలో పడిపోయారు. ఇలాంటి ప్రమాదాలకు కూడా ఏమాత్రం వెనుదిరగకుండా చంద్రబాబు తన పరామర్శ యాత్రను కొనసాగించారు. బాధితుల పక్షాన నిలిచారు. వైసీపీ ప్రభుత్వం పెంచేసిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులపై ‘బాదుడే.. బాదుడు’ పేరిట ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఏడు పదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు విసుగు, విరామం, అలసట లేకుండా జిల్లాల యాత్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి దాష్టీకాలు, వైసీపీ నేతల దుర్మార్గాలపై ఎప్పకటికప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి రెండు విషయాలు చెప్పాల్సి ఉంది. సాధారణంగా వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయ నేతలు బాధితులను ఒక చోట చేర్చి పరామర్శించడం, తోచినంత సాయం చేస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం వరదలో చిక్కుకున్న మారుమూల గ్రామాలకు కూడా స్వయంగా వెళ్లడం, రోజంతా బాధితుల సమస్యలు వింటూ.. వారితో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో ఎంతో ఓపికతో వ్యవహరించారు. రోజంతా విరామం లేకుండా బాధితుల పక్షాన నిలిచేందుకు చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. ఆయన ఓపిక, స్టామినాను చూసిన వరద బాధితులు కూడా అవాక్కయ్యారు. వరద బాధితులను గాలికి వదిలేసి, గాల్లో వచ్చిన జగన్ గాల్లోనే చూసి వెళ్లిపోతే.. చంద్రబాబు మాత్రం సమస్య మూలాల్లోకి వెళ్లి, బాధిత జనం కోసం జనం మధ్యకే వెళ్లి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇవ్వడం విశేషం. ఏదేమైనా తాను చేసిన శపథం ప్రకారం చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టే సూచనలో ఏపీలో సర్వత్రా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈయ‌న మామూలోడు కాదు

మామూలు వాటికి విరుద్దం ఏద‌యినా వింతే. ఎడంచేత్తో రాస్తూంటే వింత‌గా చూస్తారు. అదెలా వ‌చ్చిందా అని. వెన‌క్కి న‌డుస్తుంటే, కాస్తంత పిచ్చ‌నే అనుకుంటారు. రెండుచేతుల‌తో రాస్తుంటే  క‌న్నార్ప‌కుండా చూస్తారు. ఇది వింత‌ల్లో వింత అని.  ఇక్క‌డో పెద్ద మ‌నిషి రెండు చేతుల‌తోనూ ఒకేవిధంగా అద్భుతంగా బొమ్మ‌లు వేస్తున్నాడు. ఇదో ఊహించ లేని నైపుణ్యం. పూర్వం ఒక ప్ర‌పంచ ప్ర‌ముఖ ఆర్టిస్టు ఒక చ‌ర్చి లోప‌లి భాగంలో చాలా పెద్ద పెయింటింగ్ వేశాడ‌ట‌. దానికి  ఆయ‌న‌కు సంవ‌త్స‌ర కాలం ప‌ట్టింద‌ని చ‌రిత్ర‌. తిండి, నిద్రాహారాలు మానేసి వేసిన  ఆ పెయింటింగ్ ప్ర‌పంచ చిత్ర‌క‌ళా చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ‌మైన‌దిగా నిలిచిపోయింది.  ఈ విచిత్ర చిత్ర‌కారుడు ఎవ‌రన్న‌ది స‌మాచారం లేదు. కానీ ఆయ‌న క్లాస్ బ్లాక్ బోర్డు మీద వేస్తున్నాడు గ‌నుక స్కూలు టీచ‌ర్ అయి ఉండ‌వ‌చ్చు. కానీ రెండు చేతుల‌తో ఒకే విధంగా శివాజీ బొమ్మ‌ని గీయ‌డం, అస‌లే బొమ్మ‌నైనా అంత బాగా గీయ‌డం అనేది చిన్న‌విష‌యం మాత్రం కాదు. అది స్వ‌త‌హాగా ఉండే క‌ళా నైపుణ్యం తాలూకు చిన్న ప్ర‌ద‌ర్శ‌న‌. కానీ ఆయ‌న్ను ఆ స్కూలు వారు స‌త్క‌రించాలి. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను గొప్ప‌క‌ళాకారునిగా గుర్తించాలి. ఇలాంటివారే ఆయా ప్రాంతాల్లో మంచి ఆర్టిస్టుల‌ను త‌యారు చేయ‌గ‌ల‌రు.  ఆయ‌న బొమ్మ వేయ‌డం చూసిన ఒక అభిమాని వీడియో తీసి అంద‌రూ ఆయ‌న గురించి తెలుసుకునేట్టు చేశారు. ఈ ఆర్టిస్ట్ ఎవ‌రో గాని, వెన‌క్కి తిర‌గ‌కుండానే అంత మంచి బొమ్మ‌వేశారు. నిజంగా సూప‌ర్ అని వీడియో ప్రేక్ష‌కులంగా మ‌న‌స్పూర్తిగా మెచ్చుకుంటున్నారు.

వెంక‌టేశా.. నీ  కొండ‌మీదా హ‌త్యాకాండ‌!

 తిరుమ‌ల తిరుప‌తి  అన‌గానే  భ‌క్తి పార‌వ‌శ్యంలో మునుగుతారు జ‌నం. ప్ర‌తీ ఏడూ వెంక‌న్న‌ను ద‌ర్శ‌నా నికి వెళ్లకుంటే తోచ‌ని జ‌నాలున్నారు. అక్క‌డంతా భ‌క్తి, సామ‌ర‌స్య భావ‌న త‌ప్ప మ‌రోటి ఎన్న‌డూలేదు.  తిరు మ‌ల అంటేనే సామాజిక సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కి ప్ర‌తీక‌. ఎంతో క‌ట్టుదిట్ట‌మైన ర‌క్ష‌ణ‌వ్య‌వ‌స్థ‌నే గ‌మ‌ని స్తుంటాం. పిల్ల‌లు త‌ప్పిపోయినా  త‌మ‌వ‌ద్ద‌కు చేర్చ‌గ‌ల పోలీసు వ్య‌వ‌స్థ ఉంది.  అలాంటి వెంక‌న్న స‌న్నిధిలో ఏకంగా హ‌త్య జ‌ర‌గ‌డం యావ‌త్ తెలుగు లోకాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తిరుమ కొండపై హత్య జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలం రేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం దగ్గర వ్యక్తి మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. తిరుమలలో హత్య తో ఒక్కసారిగా కలకలంరేగింది. ఆలయానికి సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా బండ రాయితో మోది హత్య చేశారు. అయితే ఈ దారుణానికి చిన్నపాటి గొడవ కారణమని తిరుమల వన్ టౌన్‌ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఆరణి జిల్లాకు చెందిన కె.శరవణన్‌, వేలూరుకు చెందిన భాస్కర్‌ ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. అయితే రాత్రిళ్లు అక్కడే పడుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర భాస్కర్‌ వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత శరవణన్‌ అక్కడికి వచ్చి తన చోటులో ఎందుకు పడుకున్నావంటూ గొడవపడ్డాడు. బలవంతంగా భాస్కర్‌ను అక్కడి నుంచి పంపించాడు. దీంతో కోపం పెంచుకున్న భాస్కర్‌ శరవణన్‌పై పగ తీర్చుకోవాలనుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సిమెంట్‌ రాయిని తీసుకొచ్చి నిద్రపోతున్న శరవణన్‌ తలపై మోదాడు. తీవ్ర గాయాలైన అతడు చనిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.. తర్వాత హత్య ఉదంతం బయటపడింది.. మృతదేహం కనిపించింది. అనంతరం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అర్థ రాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా భాస్కర్‌ను అరెస్ట్ చేశారు. అయితే తిరుమలలో హత్య జరగడం హాట్ టాపిక్ అయ్యింది. తిరుమలలో ఎవరైనా నివాసం ఉండాలంటే స్థానికులకైతే ఆధార్‌కార్డు, పని చేసేందుకు వచ్చేవారికైతే గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. కానీ కరోనా ఆంక్షలు తొలగించడంతో.. భక్తులను టీటీడీ అనుమతిస్తుండటంతో పనిచేసేందుకు వస్తున్న వారు కొందరు గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల వస్తున్నారు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తి, హత్యకు పాల్పడిన వ్యక్తి స్థానికంగా ఓ ప్రైవేటు హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

శాస్త్రి, హోమీబాబా మ‌ర‌ణాల గుట్టు విప్పిన  క్రౌలీ

బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించే ఓ పెద్ద హెచ్చ‌రిక‌.  ఇంట్లో మొద‌టి సంతా నానిదే పై చేయి. ప్ర‌పంచ‌రాజ‌కీయాల్లో పెద్ద‌న్న అమెరికాదే పెద్ద‌రికం. అమెరికా కా అంటే కా, కీ అంటే కీ. వీటిలో ఎవ‌రు ఏది కాద‌న్నా త్వ‌ర‌లో మూడింద‌నేది కూడా అమెరికానే నిర్ణ‌యించి మ‌రీ చెబుతుంది. అమె రికా వ్య‌వ‌హారాల‌కు ప్ర‌మాద‌క‌రం అని తోచిన ప్ర‌తీ శ‌క్తిని అణ‌చివేయ‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. అన్ని రంగాల్లోనూ అమెరికా నిజంగానే అంత క్రూరంగానూ వ్య‌వ‌హ‌రిస్తుంది. త‌న మాటే చెల్లుబాటు చేసు కోగ‌ల దిట్ట‌.  భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభా,   భార‌త మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హదూర్శాస్త్రిది అస‌హ‌జ‌మ‌ర‌ణ‌మ‌ని వారు మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచీ అనుమానాలు ఉన్నాయి. కానీ వారివి  స‌హ‌జ‌మ‌ర‌ణాలేన‌ని అమెరికా ముద్ర వేసిన త‌ర్వాత ఏ దేశాధ్య‌క్షుడు, మ‌న దేశంలో ఏ నాయ‌కుడూ ఇక నోరెత్త‌లేదు. కానీ ఇటీవ‌ల మాజీ సిఐఏ అధికారి క్రౌలీ  రాసిన పుస్త‌కం అస‌లు ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్టింది. చాలాకాలం భార‌తప్ర‌భుత్వం వారిద్ద‌రి మ‌ర‌ణాల గురించిన అస‌లు స‌మాచారం తెలుసుకోను తీవ్ర య త్నాలే చేసింది. కానీ ఒక్క ముక్క‌కూడా భార‌త్‌కు తెలియ‌లేదు. పోనీ పెద్ద‌న్న అమెరికానే తెలియ‌నీయ లేద‌న్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్యపోన‌క్క‌ర్లేదు. తెగించిన‌వారు దేనిక‌యినా సిద్ధ‌ప‌డ‌తార‌న్న నానుడి అమెరికాకి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. అమెరికా ప్ర‌పంచ రాజ‌కీయాల్లో త‌మ పూర్ణ ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డా నికి తానే బాస్ అనిపించుకోవ‌డానికి ఎంత‌టి హ‌డావుడ‌యినా, భ‌యాన్న‌యినా ప్ర‌చారం చేస్తుంది.  అయితే అబ‌ద్ధాలు ఆట్టే కాలం నిల‌వ‌వు. స‌త్యాన్ని ఏదీ నిలువ‌రించ‌లేద‌ని వేదాంతులు చెప్పే మాట  నిజంగానే నిజం. ఇటీవ‌ల భారత మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయంలో సంచ లన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆయనది అనుమానాస్పద మృతి కాదని అగ్రరాజ్యం అమెరికానే పథకం ప్రకారం చేసిన హత్య అని వెల్లడైంది. శాస్త్రితో పాటు భారత అణుశాస్త్ర పితా మహుడు హోమి జహంగీర్ భాభాను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ హత్య చేసింది. ఈ విషయాలను సీఐఏ  మాజీ అధికారి రాబర్ట్ క్రౌలీ తన పుస్తకంలో వెల్లడించారు. శాస్త్రి, భాభా మరణించినప్పుడు  క్రౌలీ సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రి, భాభా నేతృత్వంలో అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న భారత్‌.. తమ శత్రు దేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని తన పుస్తకంలో వివరించారు. భారతీయులు ఎంతో తెలిలైనవారని, వాళ్లు  ప్రపం చంలో గొప్ప శక్తిగా ఎదగబోతున్నారనే విషయాన్ని తాము కోరుకోలేదని చెప్పారు.  1966 జనవరి 11న పాకిస్థాన్  అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్  రాజధానిలో తాష్కెంట్‌ ఒప్పందంపై శాస్త్రి  సంతకం చేశారు. అదే రోజు  అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మరణిం చడం వెనక సీఐఏ హస్తం ఉందని క్రౌలీ పేర్కొన్నారు. హోమీ భాభా ఎయిర్ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చినట్టు క్రౌలీ తెలిపారు. చాలా కష్టపడి ఆ విమానంలోకి పేలుడు పదా ర్థాలు పంపామన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని తొలుత వియన్నా గగనతలంలో పేల్చే ద్దామ నుకు న్నామని చెప్పారు. కానీ, విస్పోటనం తర్వాత విమానం ముక్కలుముక్కలు కావడానికి ఎత్తైన పర్వత ప్రాంతంలో కూలిపోయేలా చేశామని తెలిపారు.