బాధితుల మధ్య బాబు.. తాడేపల్లి ప్యాలస్ లో జగన్

నాయకుడంటే ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వారి మధ్యన నిలవాలి.. వారి కష్టాలను స్వయంగా వినాలి.. చేతనైనంత సాయం సాయం చేయాలి.. లేదంటే కనీసం కాస్త ఓదార్పు అయినా ఇవ్వాలి.. ఇవి కదా నాయకుడనిపించుకోవాల్సినవాడు చేయాల్సిన పనులు..? ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందే ఉంటారనడంలో సందేహమే లేదు. రాష్ట్రంలోని ప్రజలకు ఎప్పుడు ఎలాంటి కష్టం ఎదురైనా ముందుగా పరుగెత్తుకుని వెళ్లి అండగా నిలుస్తుండడం చంద్రబాబు నైజం. మరి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజలకు సీఎం జగన్ రెడ్డి చేస్తున్నదేంటి? ఒక్కసారి అవకాశం ఇవ్వండని గత ఎన్నికలకు ముందు అమ్మా, అయ్యా, అవ్వా, తాత, అన్నా, తమ్ముడు, అక్కా చెల్లెమ్మల ముందు ప్రాధేయపడిన జగన్ ఏపీ ప్రజలకు ఇప్పుడు వచ్చిపడిన భారీ వరద కష్టం సమయంలో చేస్తున్నదేంటి? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ వస్తోంది. అటు చంద్రబాబు- ఇటు జగన్ మధ్య ఉన్న తేడా గురించి బేరీజు వేసుకుంటున్నారు. ఏపీలో 1986లో వచ్చిన అతి భారీ వరదల తర్వాత ఇంచుమించు అంతే స్థాయిలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వందలాది లంక గ్రామాలను ముంచెత్తింది. వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఇంకా  అనేక లంక గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. గ్రామంలో ఉండే వీలు లేక, సర్వం కోల్పోయిన స్థితిలో తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న తమకు అరకొరగా ఆహారం సరఫరా చేసి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్ తీరును వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంకో పక్కన వెళ్లేందుకు ఇప్పటికీ సరైన దారీ తెన్నూ లేని వరద ముంపు లంక గ్రామాల్లో స్వయంగా పర్యటించి, బాధితులను పరామర్శించేందుకు, వారికి అండగా నిలిచేందుకు  టీడీపీ జాతీయ అధ్యక్షుడు హుటాహుటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల పర్యటకు రావడాన్ని   బాధితులు  స్వాగతిస్తున్నారు. జగన్ తీరును చంద్రబాబు తీరుతో బేరీజు వేసుకుంటున్నారు.  వరద బాధిత ప్రాంతాల్లో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులను పురమాయించిన చంద్రబాబు, అక్కడితో ఆగకుండా  తానే స్వయంగా బాధితుల మధ్యకు వెళ్ళడం గమనార్హం.  చంద్రబాబు కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొలిరోజు లంక గ్రామాల పర్యటనలో భాగంగా సిద్ధాంతం నుంచి కరుగోరుమిల్లి చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న అయోధ్యలంక గ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలిపాలెం చేరుకుని తర్వాత రోడ్డు మార్గంలో మానేపల్లిపాలెం వెళ్తారు. గోదావరి వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత అప్పనపల్లి వెళ్లి బాధిత కుటుంబాలను పలకరిస్తారు. సాయంత్రానికి రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి రాత్రికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేరుకునేలా షెడ్యూల్ వేసుకుని పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వరద బాధితులకు సాయం అందిస్తారు. నాయకుడనేవాడు బాధితులకు భరోసా ఇవ్వాలని, మాటల్లో కాకుండా ఆ భరోసాను చేతల్లో చూపించాలని పలువురు ప్రత్యక్షంగానే చంద్రబాబబును ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా చంద్రబాబు చేసేది అదే అని వారు గుర్తు చేస్తున్నారు. సీఎం కుర్చీలో కూర్చునేదాకా తమ చుట్టూ తిరిగిన జగన్ రెడ్డి ఇలాంటి కష్టకాలంలో తమను గాలికి వదిలేశారని, తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. వరద ముంపు ఒక్క రాత్రిలో తమ జీవితాను తారుమారు చేసేసిందని, అష్ట కష్టాల్లో ఉన్న తమను ఆదుకునేవాడు, భరోసా ఇచ్చేవాడు లేడని బాధితులు బావురుమంటున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే.. వరదల్ని నివారించే శక్తి లేకపోయినా ప్రజల్లో కచ్చితంగా భరోసా నింపేవారని చెప్పుకుంటున్నారు. గతంలో విశాఖపట్నాన్ని హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసినప్పుడు విశాఖ నగరంలోనే మకా వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన చంద్రబాబు ఎక్కడ? తామంతా ఇంత కష్టంలో ఉంటే ప్యాలెస్ కే పరిమితం అయిన జగన్ ఎక్కడ అని జనమంతా బేరీజు వేసుకుని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల నుంచి కొందరిని సహాయ శిబిరాలకు తరలించి, అరకొరగా భోజనం, అల్పాహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఇంకా వరదనీటిలోనే ఉన్న  తమకు ప్రుభుత్వం అందజేసిన నాలుగు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చిలు, నాలుగు దొండకాయలు, నాలుగు వంకాయలు, ఐదు కిలోల బియ్యంను ఏం చేసుకోవాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

కేంద్రంతో రాష్టం మళ్ళీ కయ్యం

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ , కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే రాజకీయ మంటలు భగ్గుమంటున్నాయి. నిత్యం ఏదో ఒక వివాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కయ్యం నడుస్తూనే వుంది. ముఖ్యంగా జులై మొదటి వారంలో హైదరాబాద్ నగరంలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ  సమావేశాలు నేపధ్యంగా, బీజీపే, తెరాసల మధ్య భగ్గుమన్న రాజకీయ రగడ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని పతాక స్థాయికి తీసుకుపోయింది. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.  ఇతర విషయాలు, వివాదాలు ఎలా ఉన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం మొదలైనప్పటి నుంచి ధాన్యం సేకరణ అంశం చుట్టూనే రాజకీయం నడుస్తోంది. గతం విషయం ఎలా ఉన్నా, తాజాగా తెరపైకొచ్చిన  బియ్యం వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్’ను బోనులో నిలబెట్టింది, ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద, పేద ప్రజలకు పంపిణీ చేయవలసిన ఉచిత బియ్యాని, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌, మే నెలల్లో పంపిణీ చేయలేదు. నిజానికి, పేదల ఉచిత బియ్యం పంపిణీ జరగక పోవదానికి  సంబంధించి చాలా కాలంగా, రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. మంత్రు;లు, తెరాస నాయకులు ఆ చర్చను పక్కదారి పట్టించారు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నీ వివరాలను బయట పెట్టింది. ఒక విధంగా  రాష్ట్ర ప్రభుత్వాన్ని  కార్నర్ చేసిందని, తెరాస నాయకులే అంగీకరిస్తున్నారు.  ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీతో పాటుగా, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ తప్పుల చిట్టాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే,సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపివేయవలసి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం సవివరంగా వివరించింది.అంతే కాదు, బ్లాక్ అండ్ వైట్’లో ఇచ్చిన వివారాలకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మరింత వివరంగా వాటి గురించి చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పుల గురించి వివరించారు.  ఈసందర్భంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు,.రాష్ట్ర ప్రభుత్వానికి తల వంపులు తెచ్చేలా ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల కారణంగానే రాష్ట్రంలో ధాన్యం సేకరణ నిలిపివేయవలసి వచ్చిందని పేర్కొంటూ, బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టడం, ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద ఏప్రిల్‌, మే నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు ఆయన ఇచ్చిన వివరణ, అలాగే, జూన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలుపెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు యాన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ డొల్ల తనాన్ని బయట పెట్టిందని అంటున్నారు.

తండ్రి మాట కోసం కోట్ల ఎస్టేట్‌కి దూరంగా బ్రౌన్‌

తండ్రి అనారోగ్యంతో బాధ‌ప‌డుతూంటాడు, కొడుకులూ, కోడ‌ళ్లూ వీలునామా మీద సంత‌కంకోసం ఆయ న్ను ఇబ్బందిపెడుతూంటారు.. ఇది అనాదిగా చాలా క‌థ‌ల్లో, సినిమాల్లో చ‌దివిన‌, చూసిన దృశ్యం. అయినా  కోట్ల రూపాయ‌లు మురుగుతూ పడి ఉంటే పెద్దాయ‌న ఆరోగ్యం గురించి చుల‌క‌న భావంతోనే వ్య‌వహ‌రించే కాలంలోనే ఉన్నాం. కానీ సిడ్నీకి చెందిన క్లారా బ్రౌన్ మాత్రం త‌న తండ్రి ఆనందంగా అంగీ క‌రిస్తూ ఇస్తేనే కోట్ల ఆస్తి తీసుకుంటాన‌న్న‌ది.  నిజానికి ఆమె ప‌రిస్థితిలో ఎవ‌రున్నా పెద్దాయ‌న్ను ఇబ్బంది పెట్టి లాక్కునేవారే. కానీ బ్రౌన్ అలా చేయ‌లేదు. కార‌ణం ఆమెను ముందు మంచి చ‌దువు చ‌దివి మంచి ఉద్యోగం సంపాదించాల‌ని ఆమె తండ్రి కోరిక‌. అది తీర్చ‌డానికి ఆ సంప‌ద వేపు ఆమె ఆస‌క్తి చూప‌డం లేదు.  బ్రౌన్ కి సుమారు 12 మిలియ‌న్ డాల‌ర్ల ఖ‌రీద‌యిన ఎస్టేట్ వార‌సురాలిగా దాన్ని స్వాధీనం చేసుకోను అవ కాశం, హ‌క్కూ ఉంద‌ని సిడ్నీవాసులే చెబుతున్నారు. తండ్రి త‌న‌కు చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పించా రు. క‌నుక మంచి స్థాయిలో ఉన్నాన‌న్న‌ది తండ్రికి తెలిసేలా చేస్తేనే ఆయ‌న కోరిక తీరిన‌ట్టు అవుతుది, క‌నుక బ్రౌన్ కి ఎస్టేట్ రాయించేసుకోవాల‌ని అనిపించ‌లేదు. ఆమె ప్ర‌స్తుతం సిడ్నీ స‌రిహ‌ద్దు ప్రాంతంలో త‌న ఏడాదిన్న‌ర పిల్లాడితో చిన్న ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె ఏమాత్రం ప్ర‌శాంతంగా మాత్రం లేదు. కార‌ణం తండ్రి వ‌ద్ద‌కి రోజూ వెళ్ల‌లేక‌పోతోంది, చేసే ఉద్యోగం అంతంత మాత్ర‌మైన‌దే. అదేమీ ఆర్ధికంగా ఆమెకు ధైర్యాన్నివ్వ‌డం లేదు. అనారోగ్యంవ‌ల్ల అదీ  స‌రిగా చేయ‌లేక‌పోతోంది.  ఆమె చాలారోజులుగా ఆటిజంతో బాధ‌ప‌డుతోంది. ఆమెకు పిల్లాడిని చూసుకోవాలి, ఆస్ప‌త్రి చుట్టూ తిర‌గా ల్సిన అవ‌స‌రమూ ఉంది. ఆమెకు నిజానికి ఎంతో డ‌బ్బు అవ‌స‌రం ఉంది. పిల్లాడిని చూసుకోవడానికి  ఒక న‌ర్సును పెట్టుకోవాలి, ఆమె ఇంట లేని స‌మ‌యంలో పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునేవారు దొర‌క‌డం ఆమె ఉన్న ప్రాంతంలో చాలా క‌ష్టంట‌.  క్లారా బ్రౌన్  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను తెలుసుకున్న ఆమె తండ్రి స్నేహితులు, హితులూ ఆమెను తండ్రి ఎస్టేట్‌కి తిరిగి వ‌చ్చేయ‌మ‌ని చెబుతున్నారు. చాలామంది వ‌చ్చి మ‌రీ బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. కానీ ఆమె మాత్రం తండ్రి నుంచి ర‌మ్మ‌ని ఒక్క మాట, ఎలాంటి స‌మాచారం లేకుండా తాను ఎస్టేట్ స్వాధీనం చేసుకోలేన‌ని అది త‌న మ‌న‌సుకు నచ్చ‌ద‌ని, త‌న తండ్రిని మోసం చేసిన‌ట్టే అవుతుంద‌ని వ‌చ్చిన వారికి స‌మాధానంగా చెబుతోంది. మ‌రి ఇలాంటి కూతురు ఉన్నందుకు పెద్దాయ‌న గ‌ర్వ ప‌డాలా, అంత‌టి ఎస్టేట్ దూరం చేసుకుంటున్నందుకు క్లారా బ్రౌన్‌ను దుర‌దృష్ట‌వంతురాలు అనాలా?  ఏమ‌ యినా ఆమె మ‌న‌సు బంగారం.

జగన్ సర్కార్ కేంద్రం మధ్య బియ్యం లొల్లి

వైసీపీ, బీజేపీ సయోధ్యకు ఫుల్ స్టాప్ పడింది. అందుకు తార్కానాలు ఒక్కటొక్కటిగా  బయటపడుతున్నాయి. నిన్న కాక మొన్న అఖిల పక్షంలో ఏపీ అప్పులను వేలెత్తి చూపిన కేంద్రం ఇప్పుడు కేంద్రం అందిచే ఉచిత బియ్యం పంపిణీ ఏపీలో నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ ఉచిత బియ్యం పంపిణీ గత నాలుగు నెలలుగా నిలిచిపోయినా ఇప్పటి వరకూ కిమ్మనని కేంద్రం.. రాష్ట్ర పతి ఎన్నిక ముచ్చట ముగియగానే వైసీపీ సర్కార్ పై బియ్యం పంపిణీ నిలిపివేతపై సీరియస్ అయ్యింది. బియ్యం లేవన్న సాకుతో ఏపీ సర్కార్  ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. ఇప్పుడు జూలై నెలలో కూడా పరిస్థితి అదే. ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేతపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ఇంత కాలం కిమ్మనకుండా ఊరుకున్న కేంద్రం ఇప్పుడు మాత్రం సీరియస్ గా తీసుకుంది. మరో వైపు ఏపీ బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచి విమర్శల తీవ్రతను పెంచారు. అక్కడితో ఊరుకోకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కేంద్రం పేదల కోసం ఉచితంగా బియ్యం అందిస్తుంటే.. ఆ పేదల బియ్యాన్ని కూడా వైసీపీ సర్కార్ బొక్కేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చేస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ స్పందించడం లేదు. కానీ పేదల బియ్యాన్ని వైసీపీ సర్కార్ నొక్కేస్తోందన్న విమర్శల వల్ల ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాలలో వ్యక్తమౌతోంది. అసలు సంగతి ఏమిటంటే కోవిడ్ తో నష్ట పోయిన ప్రజలకు కొంత ఊరట కలిగించే ఉద్దేశంతో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కంద  ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. 2022 మార్చితో ఉచిత పంపిణీ పథకం ముగిసినప్పటికీ దానికి కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఈ పథకం కొనసాగుతుంది. అయితే  ఏపీలో మాత్రం ఉచిత బియ్యం పంపిణీ పథకం ఏప్రిల్ నుంచే నిలిచిపోయింది. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ 5 కిలోల చొప్పున ఈ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి ఇందుకకోసం బియ్యం సకాలంలో ఎలాంటి జాప్యం లేకుండా రాష్ట్రానికి చేరుతోంది. అయితే జగన్ సర్కార్ మాత్రం గత నాలుగు లెలలుగా బియ్యం నిల్వలు లేవనో.. సాంకేతిక సమస్యలనో సాకులుగా చూపుతూ బియ్యం పంపిణీకి తిలోదకాలిచ్చేసింది.  దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా ఉచిత బియ్యం పథకం అమలులో ఉన్నా, ఏపీలో మాత్రం మొండి చేయి చూపుతుండడం పట్ల   కేంద్రం సీరియస్ అయ్యింది. ఉచిత బియ్యం పేదలకు అందించకుంటే రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణతో పాటు బియ్యం పంపిణీని సైతం నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో అధికార వైసీపీని ఇరుకున పెట్టే విధంగా   బీజేపీ   రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారని నినాదంతో నిరసన కార్యక్రమాలకు తెరలేపింది. ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం అందిస్తుంటే జగన్ సర్కారు అడ్డుకుంటోందని    ఇలా ఉండగా కేంద్ర  ఉచిత బియ్యం పంపీణీని నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్ని రాష్ట్రాల్లో అందించి ఇక్కడ మాత్రం మొండిచేయి చూపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. అటు లబ్దిదారులు సైతం ప్రభుత్వం తీరును గర్హిస్తున్నారు.

175 కాదు 13 స్థానాల్లో గెలిస్తే గొప్పే .. రఘురామ కృష్ణం రాజు

గతం మరిచిన జగన్ సీఎంగా తాను  సూపర్ మేన్ గా ఊహించుకుంటున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. అందుకే జనం ఆగ్రహ జ్వాలలను గమనించి కూడా వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలోనూ విజయం సాధిస్తామని చెబుతున్నారని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా విషయంలో జగన్ వైఫల్యాన్ని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి ఏం సాధించుకోగలమన్నది యోచించాలనీ, ప్రత్యేక ఆర్థిక ప్యాకేసీ కోసం గత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే చేశారని వివరించారు.  గత ముఖ్యమంత్రి కేసులకు భయపడి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించిన జగన్ ఈ మూడేళ్లలో చేస్తున్నది ఏమిటని నిలదీశారు. వైసీపీ నేతలు వేసిన ఒకటీ ఆరా కేసులు కొట్టివేసిన తరువాత చంద్రబాబుపై అసలు కేసులే లేవన్న రఘురామ రాజు.. ఏ కేసులూ లేని చంద్రబాబే భయపడ్డారని విమర్శించిన జగన్ 32 ఆర్థిక నేరాల కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ భయంతో వణికిపోతుండటం వల్లే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం వద్ద నోరు విప్పడం లేదని జనం భావిస్తే తప్పేముందని ప్రశ్నించారు.   పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారని, కానీ వైసీపీ  వారు అలా ఆందోళనలు చేసిన దాఖలాలే లేవన్నారు.  కేవలం ఒకే ఒక్కసారి సొంత పార్టీ ఎంపీ అయిన  తనపై అనర్హత వేయాలని కోరుతూ మాత్రమే ఆందోళన చేశారంని ఆంధ్రప్రదేశ్  జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో , అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు.   నీటిపారుదల శాఖ మంత్రి వ్యక్తి , 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా   ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 2024 జులై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడంలో అర్ధమేమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి   చిత్తశుద్ధి లేదనడానికి ఇంత కంటే నిదర్శనమేముంటుందని రఘురామరాజు అన్నారు.  ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు డిప్రెషన్ లోకి వెళ్లొద్దనీ రఘురామకృష్ణం రాజు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సభను చూసిన తర్వాత ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పారు.. తన గ్రాఫ్ మాత్రమే బాగున్నదని, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగాలేదన్న ముఖ్యమంత్రి తన గ్రాఫ్ గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అని జగన్ అంటున్నారని,   13 స్థానాలలో గెలిస్తే గొప్పేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డుమీదే కాల్చండి… బంగాళాఖాతంలో కలపండి… చెప్పులతో కొట్టండి అని జగన్ విపక్ష నేతగా చేసిన వ్యాఖ్యలకు అప్పటి  టిడిపి ప్రభుత్వం ఎన్నిసార్లు 41ఏ నోటీసులను జారీ చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు విమర్శించకుంటే ముఖ్యమంత్రిని పొగుడుతారా అంటూ ప్రశ్నించారు 

వ‌ర‌ద‌బాధితుల ప‌రామ‌ర్శ‌కు చంద్ర‌బాబు ప‌య‌నం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక కే  ప్ర‌జాభిమానాన్ని పొంద‌డం కేవలం రాజకీయాలు చేయడంతోనే సాధ్యం కాదు. ప్ర‌జా నాయ‌కునిగా, ప్ర‌జ‌ల‌ ప‌క్షాన నిల‌వ‌గ‌లిగిన‌వారే నాయ‌కుడిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలుస్తారు. అందుకు అధికారంలోనే ఉండ‌న‌వ‌స‌రం లేదు, విప‌క్ష నేత‌గా ఉన్నా ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించి ప్ర‌జ‌ల‌ వ‌ద్ద‌కు వెళ్లి వారి ప‌రిస్థితులు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పి, స్వాంతన కలిగించడం నిజమైన ప్రజానాయకుడు చేయాల్సిన పని. ఆ పని చంద్రబాబు చేస్తున్నారు. ఇపుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో   ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అనేక గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. జనం జీవ‌నాధారం కోల్పోయి దీనావ‌స్థ‌లో ఉన్నారు. వారికి ప్ర‌భుత్వం నుంచి సహాయం అందడం లేదన్న విమర్శలు  ఇప్ప‌టికే వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి హెలికాప్ట‌ర్‌లో తిరిగి ప‌రిస్థితుల‌ను పరిశీలించి వెళ్లిపోయారు అందుకే వాస్త‌వ ప‌రిస్థితులు తెలుసుకునేందుకు రాష్ట్ర విప‌క్ష తెలుగు దేశం నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌కు సహాయం అందించడంలో ఘోరంగా విఫలమైన తరుణంలో  టీడీపీ అధినేత వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారికి   ప్ర‌భుత్వం నుంచి కేంద్రం నుంచీ  కూడా స‌హా యం అందేలా ఒత్తిడి తీసుకువస్తానని చెబుతున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురు, శుక్రవారా ల్లో చంద్రబాబు పర్యటిస్తారు.   కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. ఆచంట, పి. గన్న వరం, రాజోలు, పాలకొల్లు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బం దులను తెలుసుకుంటారు.  ఈ మేరకు గురువారం ఉద‌యం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్ర బాబు బయల్దేరారు.  ఆయోధ్య లంక, నాగుల్లంక, మానేపల్లి, అప్పనపల్లి, రాజోలు, దొడ్డిపట్ల, అబ్బిరాజు పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, పొన్నపల్లి గ్రామాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది.  మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గతంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం ఏరియల్ సర్వే చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాలికి బురద అంట కుండా హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా అని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోవడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. వరదలపై సీఎం జగన్ సీరియస్ గా లేరన్న చంద్రబాబు.. క్యాబి నెట్‌, అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో ఉన్న విపత్తు నిర్వ హణ వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.  

తప్పులెన్నడమే కాదు.. కేంద్రం తన తప్పులూ గుర్తించాలి!

కేంద్రం తన అధికార పరిధిని రాజకీయ అవసరాలకు అనుగుణంగా కుదించుకుని మరీ రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ ఇష్టారీతిన అప్పులు చేయడానికి అనుమతులు ఇచ్చేసింది. అందుకు చక్కటి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణ కూడా ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని అతిక్రమించి పరిమితికి మించి అప్పులు చేసింది. అది కూడా కేంద్రం చలవే.  ఎందుకంటే రాష్ట్రాల అప్పులను నియంత్రించాల్సింది కేంద్రమే. ఆ బాధ్యతను గాలికొదిలేసి రాష్ట్రాలు యథేచ్ఛగా.. వచ్చే ఎన్నికలలో విజయం వ్యూహింగా ఉచిత పథకాల కోసం అభివృద్ధిని, ఉత్పాదకతను కూడా ఫణంగా పెట్టి అప్పులు చేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చున్నకేంద్రం ఇప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చినట్లు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేసి రాష్ట్రాల అప్పులపై హెచ్చరికలు జారీ చేయడం హాస్యాస్పదం. నిజమే శ్రీలంక పరిస్థితులు ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించేవిగానే ఉన్నాయి. అధికారంలో ఉండటమే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వాలు సంక్షేమం అంటూ ప్రజలకు పని చేయాల్సిన అవసరం లేదు.. మీ అవసరాలన్నీమేమే తీరుస్తాం అంటూ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తుంటే ఏం జరుగుతుందో శ్రీలంక పరిస్థితులు తేటతెల్లం చేశాయి. తెలగు రాష్ట్రాల అడ్డగోలు అప్పుల వెనుక కేంద్రం బాధ్యత కాదు కాదు కేంద్రం తప్పు కూడా ఉందన్నది నిర్వివాదాంశం. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్ల రాష్ట్రపతి ఎన్నికలో అవసరం కనుక ఏపీ కోరడమే ఆలస్యం అప్పులకు అనుమతులిచ్చేసిన కేంద్రం.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి కొంత ఇబ్బందులు పెట్టినా.. ఆ రాష్ట్రంలో అధికారంపై కన్నేసింది కనుక చివరికి మేం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తున్నాం అని చెప్పుకోవడానికి అభ్యంతరాలు చెబుతూనే అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ తప్పులన్నీ అటకమీద దాచేసి ఇప్పుడు ఓ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలకు అప్పుల మీద క్లాస్ తీసుకోవడం ఏ విధంగా చూసినా సబబు కాదు. ముందు అద్దంలో చూసుకున్న తరువాతే ఎదుటి వారి అందంపై కామెంట్లు చేయాలి. కేంద్రానికి మాత్రం ఆ అలవాటు లేదు. తప్పులెన్ను వారు  తమ తప్పులెరుగరన్నట్లు ఎంత సేపూ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల తప్పులెన్నడంతోనే మోడీ సర్కార్ కు కాలం గడిచిపోతోంది. తెలుగు రాష్ట్రాల పరిమితి లేని అప్పులతో భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నా చూస్తూ కూర్చున్న మోడీ సర్కార్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక పబ్బం గడిచిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్రాలపై నెపం నెట్టేయడానికి చూడటం దారుణమని వివిధ రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. రాష్ట్రాల అప్పులపై అఖిల పక్షంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు ముందే మోడీ రాష్ట్రాల ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు.   చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఎనిమిదేళ్ల పాటు కేంద్రంలో మోడీ సర్కార్ కళ్లు మూసుకుందా? స్వయంగా కేంద్రం ప్రకటించిన ఉచితాల సంగతి మాట్లాడకుండా.. ఇప్పుడు పరిస్థితి విషమించడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడం, జనంలో అసహనం పెరుగుతున్న చ్ఛాయలు కనిపించడంతో మోడీ సర్కార్ తనను తాను రక్షించుకోవడానికి రాష్ట్రాల అప్పులను వేలెత్తి చూపుతోందని పరిశీలకులు అంటున్నారు.   నిజమే ఏపీ వంటి రాష్ట్రాలు వేల కోట్లు అప్పులు తెచ్చి అనుత్పాదక వ్యయం చేస్తున్నాయి. దానిని నియంత్రించాల్సిన కేంద్రం ఇంత కాలం ఎందుకు మిన్నకుంది. రాష్ట్రాలు అప్పుల భారంలో మునిగి దివాలా దశకు చేరుకుంటే…అందుకు ముందుగా తప్పుపట్టాల్సింది కేంద్రాన్నే.  శ్రీలంక పరిస్థితులను బూచిగా చూపి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చి ఊరుకుంటే చేసిన తప్పిదాలు సమసిపోవు.  ఈ పరిస్థితిని మార్చే బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.  

మిసెస్ ప్లానెట్ విజేత ... మ‌న  బెజ‌వాడ మ‌ల్లిక‌

 అందానికి అందం ఈ పుత్త‌డి బొమ్మా... అంటూ ఓ పాత సినిమాలో చెల్లెలి గురించి అన్న డ‌ప్పు కొడుతూ మ‌రీ పాడి ప‌ర‌వ‌శించిపోతాడు. ఆమెది కేవ‌లం మామూలు అందం కాదు, శారీర‌క మాన‌సిక సౌంద‌ర్యం కూడా లెక్క‌లోకి వ‌స్తుంది. అస‌లు అందం అంటేనే లోక‌జ్ఞానంతో కూడిన అందం, అదే అస‌లు సౌంద ర్యం. పోతే అందం అన‌గానే  మిల్కీ బ్యూటీ  అనే  భ్ర‌మ‌లు ఈరోజుల్లో  అమ్మాయిలు వ‌దులుకోవాలి. అందం అనేది వ‌య‌సుతో ప‌నిలేనిది. అమ్మ‌లూ, అమ్మ‌మ్మ‌లూ అందంగానే ఉంటారు, వారిలో గొప్ప హుందాత‌నం ఉం టుంది. వారి ఆలోచ‌న‌, మాన‌వ‌త్వ‌పు విలువ‌లు వెర‌సి వారి అందాన్ని ఎన్నింత‌లైనా పెంచుతుంటాయి.   అందాల పోటీ అన‌గానే అమ్మాయిల‌కే కాదు వివాహితుల‌కూ నిర్వ‌హిస్తున్నారు చాలా కాలం నుంచే. అయితే  విదేశాల్లో జ‌రిగే పోటీల్లోనూ భార‌తీయ సంత‌తికి చెందిన‌వారు ఆ పోటీల్లో కిరీటం సాధించ‌డం మ‌న‌కు అందునా తెలుగువారికి మ‌రింత గ‌ర్వం. ఇప్పుడు తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన  దుర్గ శివ నాగ మ‌ల్లిక బిల్లుపాటి అనే మ‌హిళ అంత‌ర్జాతీయ అందాల‌పోటీలో పాల్గొన్న‌ది. బర్గాస్  సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో జులై 6 నుంచి 15 వరకూ జరిగాయి.  వివాహితల విభాగంలో 60 మంది ఇత‌ర దేశాల వారితో ఏడు రౌండ్ల త‌ర్వాత విజేత‌గా నిలిచి మిసెస్ ప్లానె ట్ టైటిల్ సాధించింది. ఇక ఇప్పుడు తెలుగు మ‌హిళ‌లు, ముఖ్యంగా వివాహిత‌లంతా ఎంతో గ‌ర్వ‌ప‌డ వ‌చ్చు. త‌మకు ఇలాంటి పోటీల్లో విజేత  ఉంద‌ని అంద‌రికీ చెప్పుకుని ఆనందాన్ని పంచుకోవ‌చ్చు. విజ‌యవాడ‌కు చెందిన మ‌హిళ గెల‌చి తెలుగువారి ఖ్యాతి మ‌రోసారి చాటింది.    గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్న మల్లిక 2022 సంవత్సరానికి మిసెస్ ప్లానెట్ పోటీలో నెగ్గి కిరీటాన్ని స్వంతం చేసుకున్నారు. ఎంబిఏ చదివిన మల్లిక బిజినెస్ మ్రాన్ జితేంద్రను వివాహం చేసుకున్నారు. వీరికి 6 వతరగతి చదువు తున్ప ఓ కుమారుడు ఉన్నాడు. మ‌ల్లిక అందాల‌రాణి విజేత‌గా విజ‌య‌వాడ‌కు తిరిగి వ‌చ్చారు. ఆమెకు ఘ‌న‌స్వాగతం ఇవ్వ‌డానికి మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చారు. 

రాష్ట్రంలో శ్రీలంక ప‌రిస్థితులు.. చంద్ర‌బాబు

ఇంటి గుట్టు వీధికెక్క‌ కూడ‌దంటారు. వైసీపీ ప్ర‌భుత్వం ఇంటి గుట్టునే ముందుగా బ‌య‌ట‌పెట్టుకుంది. రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితుల గురించి ప్ర‌తీ ఒక్క‌రూ చ‌ర్చించుకునే స్థితికి తీసుకు వచ్చింది. బీజేపీ నాయ‌కులు ఎవ‌రు రాష్ట్రానికి వ‌చ్చినా ముందుగా వెట‌కారం జోడించి ప్ర‌శంసించేది  ఇలానే.  రాష్ట్రం దాదాపు శ్రీ‌లంక ప‌రిస్థితుల్లో ఉంద‌నే. ఇక్క‌డి నాయ‌కులు స‌రే స‌రి. వారంతా రాజ‌కీయ‌ప‌రంగా ఎద్దేవా చేసిన‌వారు. అయితే ఇప్పుడు నిజంగానే సీరియ‌స్‌గా తీసుకోవాల్సింది టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు వ్యాఖ్య‌.  ఆయ‌న స్వ‌యంగా ఆర్ధిక‌ వేత్త ఆర్ధిక‌ ప‌రిస్థితుల మీద సంపూర్ణ అవ‌గాహ‌న  ఉన్న వ్య‌క్తి  మ‌రి  ఆయ‌నే  మ‌న రాష్ట్రం లో  శ్రీ‌లంకలో ఉన్న దుర్భ‌ర ప‌రిస్థితులు ఇప్ప‌టికే ఉన్నాయ‌న్నారంటే న‌మ్మి తీరాలి.  ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించడం లేదని  టీడీపీ అధినేత అన్నారు. జీపీఎఫ్‌ కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేదన్నారు.  పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు సక్ర మంగా చేయలేక‌పోవ‌డం రాష్ట్ర ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంద‌న్నారు.  కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థి తీ లేదు.  చేసిన అప్పులకు వడ్డీలు కట్టే దిక్కులేక  కొత్త అప్పులు చేస్తుండ‌డం రాష్ట్ర ఆర్ధిక స్థితికి అద్దం ప‌డుతుంద‌న్నారు.  మూలధన వ్యయం ఎక్కడా లేదు. రహదారులకు మరమ్మతులు చేయడానికి కూడా నిధులూ లేవ‌ని ఎద్దే వా చేశారు.  ఇవన్నీ శ్రీలంకలో ఉన్న పరిస్థితులను త‌ల‌పించ‌డం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం ఎవరిదో  కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించిందని , రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు.   ఇదిలా ఉండ‌గా,    రూ.350 కోట్ల వార్షిక  టర్నో వర్‌ ఉన్న తిరుపతి కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ బోర్డు డైరెక్టర్‌ పదవుల ఎన్నికల్లో అక్రమాలు  జరిగాయన్నా రు.  దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిక‌లు ర‌ద్దు చేయాలంటూ బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ నాయకులు పోలీసులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ మద్దతు అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి.వలముని అనే అభ్య ర్థిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు.  రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తిరుపతి టౌన్‌ బ్యాంకు ఎన్నికల్లో జగన్‌ రెడ్డి దొంగ బతుకు మరోసారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమ యంలో టీడీపీ నాయకులను గృహనిర్భందం చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. దొంగ ఓట్లు వేయ డానికి వచ్చిన వారిని పట్టుకుంటే, వారిని వదిలేసి టీడీపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగ అంటారే తప్ప నాయకుడనరని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.

కేసీఆర్ కు కాళేశ్వరం కష్టాలు

ఇంజనీరింగ్ అద్భుతంగా కేసీఆర్ పదే పదే అభివర్ణిస్తున్నకాళేశ్వరం ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తనకు ఏటీఎంగా మార్చేసుకున్నారన్న విమర్శలు గతం నుంచీ వినిపిస్తున్నా.. ఇటీవలి వరదకు ప్రాజెక్టు పంపులు, మోటార్లు ముంపునకు గురైన నేపథ్యంలో మరో సారి విమర్శల దాడి పెరిగింది. ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్ధకమయ్యివందా అన్న స్థాయిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన కాళేశ్వరంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. పంపులు, మోటార్లు మునకపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం, విమర్శలకు సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్లు, పంపుల మునకతో  అవి మళ్లీ పని చేస్తాయా, వాటి పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుంది వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, నీటి పారుదల శాఖ నుంచి మౌనమే సమాధానం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చిన్న పాటి విమర్శకే భారీ స్థాయిలో స్పందించి ఎదురుదాడికి దిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు పన్నెత్తి మాట్లాడడానికి కూడా ముందుకు రాకపోవడంతోనే కాళేశ్వరం ఎత్తిపోయిందా అన్న సందేహాలకు కారణమౌతున్నది.  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి. అయినా  అక్కడేం జరగనట్లుగానే రాష్ట్ర్ర ప్రభుత్వ వైఖరి ఉంది.   కాళేశ్వరం ఉనికిపై ముసురుకున్న సందేహాలకు వివరణ ఇస్తే చర్చ విస్తృతంగా జరిగి లోపాలు మరంతగా బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం మౌనం వహించిందని పరిశీలకులు అంటున్నారు. ఇక వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఇప్పటి వరకూ ఇరిగేషన్ శాఖ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.  దానికి తోడు అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌ పహారా ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల వైపునకు ఎవరినీ, కనీసం మీడియాను  కూడా అనుమతించడం లేదు.  కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదని చెబుతూ భారీ వరదల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. కానీ ఆ వాదనలో పస లేదనడానికి   దేవాదుల ప్రాజెక్టు ముంపునకు గురి కాకపోవడమే తార్కనమని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందనీ, వైఫల్యాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతోందనీ విమర్శకలు అంటున్నారు,  దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి అబద్దాలన్న వాదనకు కారణం అవుతోంది. కాళేశ్వరంపై విమర్శల దాడిని, చర్చకు పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్   క్లౌడ్ బరస్ట్, అంతర్జాతీయ కుట్ర, పోలవరంతో భద్రాచలానికి ముప్పు వంటి అంశాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ జీవనాడి పోలవరంపై రాజకీయ దాడి

ఏపీకి జీవ‌నాడి పోలవరంపై రాజకీయ దాడి ప్రారంభమైంది. పోలవరం ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్యా వివాదం రగులు కొంది. రాజకీయ లబ్ధి కోసమే ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ఈ వివాదాన్ని లేపాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జూలై నెలలోనే భారీ వరదలు భద్రాచలాన్ని ముంచెత్తాయి. గోదావరి వరద ప్ర్తతి ఏటా సాధారణంగా వచ్చేదే.   అయతే  ఈ ఏడాది ఆ వరద ఉదృతి ఒకింత తీవ్రంగా ఉంది. అయినా వరద పరిస్థితి, ప్రవాహ వేగం అంచనాలలో ప్రభుత్వాల వైఫల్యాన్ని పోలవరం మీదకు నెట్టివేయడాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. పోలవరం  జాతీయ ప్రాజెక్టు. బ్యాక్ వాటర్ తో భద్రాచలానికి ముంపు ముప్పు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండానే డిజైన్ చేశారా?  ఆ డిజైన్ కు కేంద్రం ఆమోద ముద్ర వేసిందా? దానికి రాష్ట్ర్ర విభజన సమయంలో ఎటువంటి అభ్యంతరాలూ చెప్పకుండానే కేసీఆర్ సహా తెలంగాణ నేతలందరూ ఆమోదించేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు అంటున్న వారు సమాధానాలు చెప్పాలి.  ఇప్పటి వరకూ రాజకీయ నాయకులే పోలవరం విషయంలో తమతమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ నీటి పారుదల శాఖను ఆ రాష్ట్ర్ర  ప్రభుత్వం రంగంలోకి దింపింది.   పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా తెలంగాణ‌లో ఏకంగా ల‌క్ష ఎకరాల మేర పొలాలు మున‌కకు గుర‌వుతాయ‌ని తెలంగాణ నీటిపారుద‌ల శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ల‌క్ష‌ల ఎకరాల్లో పంట‌ల‌తో పాటు భ‌ద్రాచ‌లం, ప‌ర్ణ‌శాల నీటిలో మునిగిపోతాయ‌ని తెలంగాణ నీటి పారుద‌ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ అన్నారు.  పోల‌వ‌రం వ‌ల్లే భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని తెలంగాణ‌కు చెందిన మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో ర‌జ‌త్ కుమార్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇంతకీ అసలు వాస్తవమేమిటంటే..  అన్ని దారులూ మూసుకుపోయి చివరకు గోదారే దిక్కు అయినట్లుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలకు. గోదావరి వరద సాక్షిగా సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపాయి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు. ఇరు రాష్ట్రాలలోని ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తత, యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో విఫలం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాలలో వరదలు అపార నష్టానికి కారణమయ్యాయి.  ముఖ్యంగా రెండు రాష్ట్రాలూ కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యయి. అందుకే ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడంలోనూ, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలోనూ సకాలంలో స్పందించలేకపోయాయి. దీంతో జనం రోజుల తరబడి వరద ముంపులో నానా ఇబ్బందులూ పడ్డారు. ఇప్పుడు, అసలే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సమయంలో జనంలో వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి వారు వరద రాజకీయాలకు తెరతీశారు. దాంట్లోనూ సెంటిమెంటును రంగరించి మరీ కలుపుతున్నారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల నాటి అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి సెంటిమెంట్ పండించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట మరొకడు. అలాగుంది తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల పరిస్థితి. జనం వరదల్లో భారీగా నష్టపోయి నిలువ నీడ లేక అల్లాడుతుంటే.. వారిని ఆదుకోవడం పక్కన పెట్టి ముంపునకు కారణాలను రాష్ట్ర విభజనతో ముడిపెడుతున్నారు. ముందుగా ఈ క్రీడను తెరాస ఆరంభిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా వైకాపా వచ్చి చేరిపోయింది. పోలవరం కారణంగానే భద్రాచలం మునిగిపోయిందంటూ పువ్వాడ విమర్శల పర్వానికి తెరతీసి విలీన మండలాల అంశం లేవనెత్తారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేస్తే కరకట్ట ఎత్తు పెంచుకుని ముంపు ముప్పును శాశ్వతంగా పరిష్కరించుకుంటామన్నది పువ్వాడ వ్యాఖ్య. అయితే మేమేం తక్కువ తినలేదంటూ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తెలుగు రాష్ట్రాలు రెంటినీ విలీనం చేసి సమైక్య ఆంధ్ర కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఆగిపోలేదు. హస్తినలో ఇరు పార్టీల ఎంపీలూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇక మళ్లీ పువ్వాడ వ్యాఖ్యల వద్దకు వస్తే..పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం మునిగిపోతుందని భద్రాచలంలోకి వరద నీరు ప్రవేశించకుండా, భద్రాచలం రామాలయం మునిగిపోకుండా కరకట్టలు నిర్మిస్తామని.. ఇందుకు దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వెంటనే   వరదలు వచ్చినప్పుడు ముంపు సహజమేనని.. ఇందుకోసమే ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని అంబటి అన్నారు. ఐదు గ్రామాలు కావాలంటే తామూ భద్రాచలం కావాలంటామన్నారు. ఇక బొత్స అయితే  రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఆదాయాన్ని తాము కోల్పోయామని.. మరి ఆ నగరాన్ని ఏపీలో విలీనం చేయాలంటే చేసేస్తారా అని ప్రశ్నించారు. ఇలా ఇరు రాష్ట్రాలలోని అధికార పార్టీలూ ప్రజల కష్టాలను, వరదల్లో వారు పడుతున్న ఇబ్బందులనూ వదిలేసి.. రాజకీయ లబ్ధి కోసం విభజన నాటి అంశాలను తెరమీదకు తీసుకురావడం వెనుక మరో సారి అధికారం చేపట్టాలంటే ప్రజలలో సెంటిమెంట్ రగల్చడమొక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతున్నది. అందుకే కూడబలుక్కునే ఈ విమర్శలు, ప్రతి విమర్శలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు మండలాలు ముంపునకు గురవుతాయి కనుకనే వాటిని అప్పట్లో ఏపీలో విలీనం చేశారన్నది జగద్వితం. ఆ మండలాల విలీనం తరువాతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో విస్ఫష్టంగా కేంద్రానికి చెప్పి సాధించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ విలీన మండలాలు తెలంగాణలో కలపాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ సమస్యను పక్కదారి పట్టించి సెంటిమెంటును రగల్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు భద్రాచంల, హైదరాబాద్, సమైక్యాంధ్ర అంటూ చేస్తున్న వాదనలు కూడా ఇక్కడి సమస్యలను పక్కదారి పట్టించి మళ్లీ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యా విభజన నాటి సెగలు రేపే ప్రయత్నం తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఇక ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఎగువ కాపర్ డ్యాం ను ఆఘమేఘాల మీద మీటర్ ఎత్తును పెంచేశామనీ, దాని వల్లే పెనుముప్పు తప్పిందనీ చెప్పడం నేల విడిచి సాము చేశాం అని చెప్పుకోవడమే తప్ప ఒక్క రోజులో ఒక మీటర్ ఎత్తు పెంచామనడం ఏ విధంగానూ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్వయంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ అంగీకరించారని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటు వేదికగా పోలవరం నిర్మాణంలో జాప్యానికి ఏపీలోని జగన్ సర్కార్ నిర్వాకమే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటించిన రోజునే ఏపీ సర్కార్ పోలవరం పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయని ఏపీ చెప్పుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరొకందుకు కాదని, అలాగే పోలవరం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందనీ, భద్రాచలం రామాలయం ఉనికే ప్రశ్నార్థకమౌతోందని తెలంగాణ గుండెలు బాదుకోవడం కూడా జనంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడానికేననీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఏపీ సర్కార్ హైదరాబాద్ ఆదాయం కోల్పోయామనీ, కేసీఆర్ సర్కార్ ఆంధ్రాపాలకుల దోపిడీ ఇంకా ఆగడం లేదనీ సెంటిమెంట్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు జనానికి కావలసింది సెంటిమెంట్ డ్రామాలు కాదనీ, బాధల్లో  ఉన్న వారికి తక్షణ సాయం అందించడమనీ అంటున్నాయి. మొత్తంగా గోదావరి వరదను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల డ్రామాపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

యూపీ సీఎం యోగికి అసమ్మతి సెగ.. మంత్రి రాజీనామా

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు  రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల   అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.   బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.   ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్   మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు.  చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు. దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.   అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో  ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.

వైసీపీలో అసమ్మతి భగ్గు.. పెరుగుతున్న రెబల్స్ సంఖ్య!

జ‌గ‌న్ సార‌థ్యంలోని వైసీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. పార్టీ కోసం, పార్టీ ప్ర్తిష్ట కోసం ప్రాణం పెట్టయినా పని చేస్తామనే వారి సంఖ్య తగ్గిపోతోంది.   పార్టీ నాయ‌కుడికే షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మామూలుగా ఎక్క‌డ‌యినా అధికార ప‌క్షానికి విప‌క్షాల నుంచి ఒత్తిడి ఉంటుంది, స‌మ‌స్య‌లూ ఉంటాయి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైసీపీలో వ్య‌వ‌హారం రివర్స్ లో  ఉంది. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేసే వారు, పార్టీపై వ్యతిరేక కామెంట్లు చేసేవారు ఎక్కువ‌వుతున్నారు. ఇంటి గుట్టు ఇంటి వారే బ‌య‌ట‌ ప‌డేసుకుంటున్నారు. పార్టీలో రెబెల్ వ్య‌వ‌హారా లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  పార్టీపై. అధినేత జగన్ పై  ఎంపీ రఘురామ రాజు మొద‌టి తిరుగు బావుటా ఎగుర వేశారు.   ఎంపీ ర‌ఘురామ‌రాజు బాట‌లోనే కొంద‌రు వైసీసీ సీనియ‌ర్ నాయ‌కులు అడుగులు వెస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ప్ర‌స్తుతం ర‌ఘురామ‌రాజు వైసీపీలో ‘రెబెల్ స్టార్‌’గా అంద‌రి గుర్తింపు పొందారు. గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా పార్టీకి ఆయ‌న‌కూ మ‌ధ్యలో ఏది ప‌డినా అది భ‌గ్గుమంటోంది.  నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారు. నాయ‌కుని పాల‌నా తీరు ప‌ట్ల అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.   జ‌గ‌న్  క్యాబినెట్ పునర్వవస్థీకరణ అనంతరం  మంత్రిపదవులు కోల్పోయిన వారు, ఆశించి భంగపడిన వారు చాలామంది బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. అనేకమంది ఎమ్మెల్యేలు ఇత‌ర పార్టీల వైపు చూపులు సారించారు. తాజాగా వైసీపీ నాయ‌కులు కొందరు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీలో దీన్ని గురించి త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఎవ‌రికి వారు క‌ళ్లు మూసుకున్న పిల్లిలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీలో ఏమి జ‌రుగుతోంద‌న్న‌ది అంద‌రికీ ఆలోచించే, మాట్లాడుకునే క‌థ‌గా మారింది.  త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్దికి ఒక్క  పైసా కూడా ప్ర‌భుత్వం నుంచి అంద‌లేద‌న్న బాధ‌తో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా మురికి కాల‌వ‌లోకి వెళ్లి నిల‌బ‌డి నిర‌స‌న వ్య‌క్తం చేసిన సంగతి విదితమే. ఇంత‌క‌న్నా తీవ్రంగా పార్టీ ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి ప‌ట్ల నిర‌స‌న‌ను ఎవ‌రూ వ్య‌క్తం చేయ‌లేరు. ఆయ‌న ప్ర‌భుత్వ తీరు తెన్నుల‌పై ఘాటుగానే విమ‌ర్శించారు. రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి సంగ‌తి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న చాలా కాలం నుంచే  జ‌గ‌న్ ప‌ట్ల విముఖ‌త‌తో వున్నారు. పైగా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత‌ను పొగుడుతూ రోజూ స్వ‌పార్టీ ప‌ట్ల నిర‌స‌న‌ను తెలియ‌జేస్తున్నారు. అలాగే ద‌ర్శి ఎమ్మెల్యే విసుర్లు మ‌రీ హాట్ గా ఉన్నాయి. మ‌ద్ది శెట్టి  వేణుగోపాల్ విమ‌ర్శ‌లతో పార్టీ ప‌రువు గంగ‌లో క‌లుస్తోంది. వీరే కాదు, ప్ర‌భుత్వ ప‌ని తీరుప‌ట్ల విసిగెత్తిన వారి సంఖ్య వైసీపీలో రోజు రోజుకూ సంఖ్య పెరుగుతోంది. చాలాకాలం మౌనం వ‌హించి మూడేళ్ల పాల‌న ముగిసిన సంద‌ర్భంగా ఆ ఆవేద‌న‌ను, నిరాస‌క్త‌త‌ను ఒక్కొ క్క‌రూ బ‌య‌టికి వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గానికి అభివృద్దికి నిధులు ఇవ్వ‌క‌పోతే ఎవ‌రు మాత్రం సీఎం ఆదేశా ల‌ను శిర‌సావ‌హిస్తారు.  జగన్ తీరు వల్ల ఇటు నియోజకవర్గంలో ప్రజల వద్ద ప్రతిష్ట మసకబారి, నిధుల గురించి అడిగితే జగన్ ఆగ్ర్హహానికి గురై రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మా పరిస్థితి అని పలువురు ఎమ్మెల్యేలు  అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారు. జగన్ తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరైతే.. అసంతృప్తిని లోలోనే ఉంచుకుని సమయం కోసం చూస్తున్న వారు మరెందరో ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

వైసీపీలో మరో ట్రబులా‘ర్’!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు, ఒకటొకటిగా బయట పడుతున్నాయి. వైసీపీ  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి చాలా కాలంగా, ప్రభుత్వ పనితీరును, ఎక్కడి కక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజులా నేరుగా  కాకుండా, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే, తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కు పెట్టారని అంటున్నారు.   ఈ నేపధ్యంలో అయన, అధికారులు మంచివారేన‌ని, కానీ ఎక్క‌డో తేడా ఉందంటూ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయ. రాష్ట్రంలో ఒక్క ప‌ని కూడా ముందుకు సాగ‌డంలేద‌ని, అభివృద్ధి ఎక్క‌డా లేద‌ని,  మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని, కొంచే ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు.  నిజానికి, గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచీ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇత‌ర నేత‌ల‌తో మొద‌టి నుంచి ఆయ‌న‌కు సఖ్యత లేదంటూ వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అయన దూరంగానే ఉంటున్నారు. మరో వంక వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో, తెలుగు దేశం సహా అన్నిపార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు.  నిజానికి ఇటు అధికారుల నుంచి, అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటఫై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. అయితే, మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, పార్టీ నాయకులు, అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి, చెప్ప వలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి, అని చెప్పినట్లు సమాచారం.  ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపధ్యంలో, అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో, ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా ?  లేరా ? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవొద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో మాగుంట వైసీపీ త‌ర‌ఫున పోటీచేసే అవ‌కాశాలు లేనట్లేనని,  ఆయ‌న తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా  ఉంటే ఎంపీలు , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా  ఒకరొకరు పార్టీకి దూరం అవుతున్న నేపధ్యంలో, వైసీపీ నిట్టనిలువునా చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

పిల్ల‌డికి  హిందీ నేర్పుతున్న కొరియా త‌ల్లి

పిల్లాడు ప‌రుగున లోప‌లికి వ‌చ్చి మ‌మ్మీ అన‌గానే పొంగిపోతుంది త‌ల్లి. మ‌మ్మీ గిమ్మీ ఏమిటే.. చ‌క్క‌హా అమ్మా అని పిల‌వ‌డం నేర్పించ‌కుండా.. అంటూ పిల్లాడి అమ్మ‌మ్మ‌గారు గొంతుచించుకుంటుంది... ఇది దాదాపు అంద‌రి ఇళ్ల‌లోనూ ఇటీవ‌లి కాలంలో క‌నిపించే సీన్‌. నిజ‌వే మ‌న భాష‌లో ప‌ల‌క‌రించుకోవ‌డం, తిట్టుకోవ‌డం లో అందం వేరు. చిత్ర‌మేమంటే విదేశీయులు చ‌క్క‌గా తెలుగు నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నారు. భార‌తీయుల‌ను స్నేహం చేసుకోవ‌డమే కాకుండా వారికి తెలిసిన భార‌తీయ భాష‌ను  కూడా  నేర్చుకోవడంలో వారికి అదో ఆనందం. ఇపుడు కొరియా వాళ్లూ హిందీ  నేర్చుకుని, వారి పిల్ల‌ల‌కూ మెల్ల‌గా నేర్పు తున్నార‌ట‌. అందుకు ఉదాహ‌ర‌ణ కిమ్‌.  ఇంగ్లీషు వ్యామోహం మ‌రీ పెచ్చు మీరిపోతోంద‌ని స్కూళ్ల‌లో ఉపాధ్యాయులూ అంటున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవ‌డం వేరు, అదే రోజూవారీ జీవితంగా చేసుకోవ‌డం ఎంతో వేరు. పెద్ద‌వారంటే ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఆంగ్లం మాట్లాడ‌టం త‌ప్ప‌నిస‌రి. కానీ పిల్ల‌ల‌కూ అదే నేర్పి అదో అద్బుతం  అని ఉప్పొంగిపోతే ఎలా? ఇక మ‌న భాష పిల్ల‌ల‌కు ఎలా వ‌స్తుంది? మ‌న భాషా రావాలి, అటు ఇంగ్లీషూ  రావాలి క‌దా?! కానీ కొరియాకు చెందిన కిమ్ అనే అమె త‌న పిల్ల‌వాడికి చిన్న‌చిన్న‌ప‌దాలు నేర్పుతోంది. మొన్నా మ‌ధ్య ప‌కోడీ కూడా త‌యారు చేసింది. ఏ ప‌కోడీ హై అంటూ చిన్న‌ముక్క‌ను ప‌ట్టుకుని ఫోటో కూడా తీయిం చుకుంది.  విదేశీ భాష నేర్చుకోవ‌డంలో ఉన్న ఆస‌క్తి మ‌న భాష మీద లేక‌పోవ‌డం విచార‌క‌రం. మ‌న భాష మీద వారికి ఉన్న ఆస‌క్తి హ‌ర్ష‌ణీయ‌మే.. కానీ వారు వారి మాతృ భాష‌ను మాత్రం మ‌ర్చిపోవ‌డం లేదు. ఇది మ‌న‌వాళ్లు గుర్తుంచుకోవాలి. 

అవును ..అ ఇద్దరూ దగ్గరయ్యారు !

కాంగ్రెస్, తెరాస పార్టీలు దగ్గరవుతున్నాయా? అ రెండు పార్టీల  మధ్య దూరం తరుగుతోందా?  అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరం అయితే, చేతులు కలిపేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే, రెండు వైపుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటి పార్టీగానే భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించడం పెద్ద కష్టం కాదనే సత్యాన్ని  అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.   2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రస్ ఎమ్మెల్యేలులో మూడొంతులకు పైగా సంవత్సరం తిరగకుండానే తెరాస గూటికి చేరిపోయారు  గులాబీ కడువా కప్పుకున్నారు.  సో.. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తెరాసకు ప్రత్యర్ధి పార్టీగా గతంలో భావించలేదు ఇప్పుడూ భావించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీగా  కంటే ఫ్రెండ్లీ పార్టీగానే ట్రీట్  చేస్తూ వచ్చారు. ఇది అందిరకీ తెలిసిన నిజం. జగమెరిగిన సత్యం.  అయితే, రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం కొంత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పై దాడి చేస్తున్నారు. అటు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు అదే స్థాయిలో దాడి కొనసాగించారు.అయితే ఇప్పుడు, కేసీఆర్ కాంగెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారని ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో కీడెంచి మేలెంచడం మంచిదనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, సోనియా, కేసీఆర్ మధ్య స్నేహ బంధాన్ని పెంచేందుకు కాంగ్రెస్, తెరాస పార్టీలలలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షులు ఇద్దరు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలను నిర్వహించిన   ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర్ ప్రదేశ్’కు చెందిన ఇంద్దరు మాజీ ఎంపీలతో  కూడిన ఒక బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ పార్టీల మధ్య ప్రత్యక్ష పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటేనే, తెరాస గెలుపు సులువు అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ, బ్యాలెన్సు చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో  రెండు జాతీయ పార్టీలను  ఒకే గాటన కట్టేసి   విమర్శిస్తూ  వచ్చారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి / పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు ప్రాంభించారు, అయితే, ప్రయత్నాలు ఫలించక పోగా, రాష్ట్రంలోనూ పరిస్థితులు తల్లకిందులు  అయ్యే సంకేతాలు స్పష్టం కావడంతో, కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి విషయంలో, కాంగ్రెస్ ఉన్న కూటమిలో తెరాస ఉండదని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలో 18 జాతీయ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాను  సమర్ధించడమే కాకుండా, ఆయనకు ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ ఇవ్వని స్థాయిలో హైదరాబాద్ లో  గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. కటవుట్లు పెట్టి, బ్యానర్లు కట్టి, బైక్ ర్యాలీ నిర్వహించి ఘన  స్వాగతం పలికారు. అఫ్కోర్స్ అందుకు, మోడీని అవమానించడం అనే వేరే కారణం ఉన్నా, ఉభయతారకంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యే దూరాలోచన కూడా లేకపోలేదని, తెరాస వ్యూహ బృందం సమాచారం.  అలాగే, యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ పక్కన చేరి ముచ్చట్లాడారు. ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో  కానీ, ఆ తర్వాత నుంచి కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్  జోలికి వెళ్ళడం లేదు. రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టిన రండు నిముషాలు అయినా కాంగ్రెస్ పార్టీకి కేటాయించలేదు. ఇక ఇప్పుడు  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేరుగా, కాంగ్రెస్ పార్టీ అడగక ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాకు తెరాస మద్దతు ప్రకటించింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, తెరాస దగ్గరవుతున్నాయి అనేందుకు సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు.   అదలా ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మీడియా సాక్షిగా కుండ బద్దలు కొట్టారు.  అంతే కాదు, రెండున్నర సంవత్సరాలు తెరాస (కేసీఆర్/కేటీఆర్), రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉంటారని  చెపుతున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఢిల్లీ వేదికగా కదులుతున్న రాజకీయ ఎత్తుగడలు, అనివార్యతల దృష్ట్యా కాంగ్రెస్ అవసరం తెరాసకుంది, తెరాస అవసరం కాంగ్రెస్ పార్టీకి వుంది. సో .. రేవంత్ రెడ్డి ఎంతగా కాదన్నా, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదన్నా చివరకు కాంగ్రెస్, తెరాస కల్సి కాపురం చేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.

వ‌ర‌ద‌బాధితుల సంగ‌తి ప‌ట్ట‌ని బీజేపీ, టీఆర్ ఎస్‌

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే. ఎదురిళ్ల‌వారు స‌హాయానికి వెళ్లి కొట్టుకున్నార‌ట‌. అదుగో ఆలా ఉంది బీజేపీ, టీఆర్ ఎస్ వారి తంతు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో గూడూ, గోతం న‌ష్ట‌పోయి  జ‌నం బాధ‌ప‌డుతున్నారు.  జ‌నానికి  ప్ర‌భుత్వం స‌హాయ స‌హ‌కారాలు అందించాలి. కానీ బీజేపీ, టీఆర్ ఎస్ నేత‌లు గొడ‌వ‌ల‌కు దిగారు. మంచిర్యాల ఐబీలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు. అయితే జీఎస్టీ  పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు  కూడా నిరసన తెలిపారు. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు కొట్టు కున్నారు. రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు.  జిల్లాలో గతవారం రోజులనుంచి కురిసిన భారీవర్షాలు వరదల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కార ణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకు న్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు.  ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బ తినడంతో ఇక మళ్లీ ఆ పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యం  కానున్నం దున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు.

నాగబాబు, నారాయణ వివాదం టీ కప్పులో తుపాను

మెగా స్టార్  చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఉవ్వెత్తున లేచిన వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోయింది. నటుడు చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ ఇటీవల విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవిల్లితో పోల్చారు.   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరైన సంగతి విదితమే.  ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఊసరవిల్లిలా రంగులు మార్చే చిరంజీవిని కాకుండా అల్లూరి సీతారామరాజుపై సినిమా నిర్మించి, నటించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. దీంతో నారాయణపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత తీవ్రంగా స్పందించారు. సీపీఐ నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలమైందనని అంటూ ఆయన కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారంటూ విమర్శించారు.   మెగా అభిమానులంతా కలిసి ఆయన చేత గడ్డి తినడం మాన్పించి అన్నం తినడం అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తను చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీపీఐ నారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.   అదే సమయంలో తన వ్యాఖ్యలను కేవలం భాషా దోషంగా భావించి మన్నించాలని కోరారు. నారాయణ క్షమాపణులు కోరి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో మోగా బ్రదర్ పవన్ కల్యాణ్ శాంతించారు. క్షమాగుణం జనసైనికుల ధర్మం అని పేర్కొన్నారు. అలాగే తప్పు ఎవరు చేసిన క్షమించమని కోరితే క్షమించాలని పేర్కొన్నారు. సీపీఐ నారాయణ వయస్సును దృష్టిలోఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికులకు పిలుపు నిచ్చారు.  

తోపుడుబండి వ్యాపారి.. గ‌న్‌మెన్‌ల ప‌హారా! 

మొన్నామ‌ధ్య అదేదో సినిమాలో బ్ర‌హ్మానందానికి ఇద్ద‌రు తుపాకులు ధ‌రించిన బాడీగార్డుల‌ను చూసి జ‌నం తెగ‌న‌వ్వుకున్నారు. ఈయ‌న‌కెందుకా అని. అది సినిమా కాబ‌ట్టి ఏదో స‌ర‌దా సీన్‌. కానీ అంత‌కంటే విచిత్ర‌మేమంటే తోపుడు బండి వ్యాపారికి కోర్టు గ‌న్‌మెన్‌ల‌ను ఏర్పాటుచేయ‌డం. ఇది వాస్త‌వం. అస‌లు తోపుడు బండివాడికి అంత సీన్ ఎందుకా అని ఇప్ప‌టికే తెగ ఆలోచిస్తున్నారుగ‌దా. అత‌గాడికి కాదు ఆయ‌న ఊళ్లో భూమి త‌గాదా ఆయ‌న‌కు గ‌న్‌మెన్‌ల‌తోటే తిర‌గాల్సిన ప‌రిస్థితి క‌ల్పించింది.  ఆయ‌న పేరు రామేశ్వ‌ర్ ద‌యాళ్‌.  ఉత్త‌రప్ర‌దేశ్ ఎటా జిల్లా నివాసి. ఆయ‌న తోపుడు బండి మీద దుస్తు లు అమ్ము తూంటాడు. అలా రోజంతా ఊళ్లో తిరుగుతూ రోజుకు 200 నుంచి 300 రూపాయ‌లు సంపాదిస్తాడు. ఇటీవ‌ల రామేశ్వ‌ర్ అక్క‌డి ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వ‌ర్ సింగ్ సోద‌రుడు జుగేంద్ర సింగ్‌ను క‌లిశాడు. త‌న భూమికి ప‌ట్టా ఇప్పించాల‌ని కోరాడు.   వాస్త‌వానికి భూమికి ప‌ట్టా ఇప్పించ‌డం అనేది మాజీ ఎమ్మెల్యే త‌మ్ముడికి పెద్ద లెక్కేమీ కాదు. కానీ భూమిని కాజేద్దామ‌ని ఆలోచ‌న వ‌చ్చే ఉంటుంది. అందుకే ఏదో ఒక గొడ‌వ‌పెట్టుకోవాల‌నుకున్నాడు. రామేశ్వ‌ర్‌ను కులం పేరుతో తిట్టాడు. అంతే కులం మాట ఎత్త‌గానే వారి మ‌ధ్య చిన్న‌గొడ‌వ చిలికి చిలికి  గాలివానై ఏకంగా క‌న‌ప‌డితే చంపుతాన‌ని బెదిరించేదాకా పోయింది. భ‌యంతో రామేశ్వ‌ర్ ద‌యాళ్ ప‌రుగున పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ జుగేంద్ర అక్క‌డితో ఆగ‌క అస‌లా భూమి నాదే అంటూ హైకోర్టును ఆశ్ర యించాడు. రామేశ్వ‌ర్‌ను కోర్టువారు ర‌మ్మ‌న్నారు. అత‌ను ఒక్క‌డే భ‌యం భ‌యంగా వెళ్లాడు. అత‌నితో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం సంగ‌తి  విని కోర్టు  అత‌నికి వెంట‌నే  భ‌ద్ర‌త  క‌ల్పించ‌ మ‌ని పోలీసుల‌ను  ఆదేశిం చింది. కోర్టు ఆదేశాన్ని శిర‌సావ‌హించి పోలీసులు రామేశ్వ‌ర్‌కు ఇద్ద‌రు బాడీగార్డుల‌ను నియ‌మించారు. అంతే కాదు వారిద్ద‌రికి ఏకే 47 రైఫిళ్ల‌నూ ఇచ్చారు. రామేశ్వ‌ర్ ఇపుడు తోపుడు బండి మీద దుస్తులు అమ్ముతూ రాజ‌కీయ‌నాయకుడిలా నిటారుగా  తిరుగుతున్నాడు. మ‌రి ఏకే 47 తో వున్న‌వారిని వెంటేసుకుని తిర‌గ‌డం అంత ధైర్యాన్నిస్తుంది క‌దా!