నితీష్ నాయ‌క‌త్వంతో విప‌క్షాల‌ఐక్యత క‌ష్టం...సుశీల్ మోదీ

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పాత పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక  తర్వాత బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరోసారి కలవాలనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్షంగా ఏర్పడే అవకాశాలను బీజేపీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క‌ష్ట‌మ‌న్నారు. బీహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ (యు నైటెడ్) నాయ కుడు నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ తాత్కా లిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె 10 జనపథ్ నివాసంలో కలిసిన నిమిషాల తర్వాత ఆయన ప్రకటన వెలువడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతి పక్షాల ఐక్య తపై గాంధీతో వీరిద్దరూ భేటీ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలకు చాలా భిన్నమైన ఆసక్తులు ఉన్నాయని, అలాగే "ప్రతి రాష్ట్ర రాజకీయ  పరిస్థి తులు భిన్నంగా ఉంటాయి" అని బిజెపి ఎంపి అన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బాస్ అరవింద్ కేజ్రీవాల్‌ను నితీష్ కుమార్  కలిసి కూర్చోబెట్టగలరా అని బిజెపి నాయకుడు అడిగారు. నితీష్ కుమార్ ఓపీ చౌతాలా (ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్) కాంగ్రెస్‌ను కలిసి ఉంచగలరా?  సీపీ ఎం, కాంగ్రెస్‌లను 'కేరళలో కలిసి కూర్చునేలా చేయగలిగితే' అని మోదీ అన్నారు. కేరళలోని కాంగ్రెస్, సిపిఎం, బిజెపికి  'ఎ టీమ్' అని చెబుతోంది...కుమార్, యాదవ్ లు కోరుకున్నప్ప టికీ, వారు అన్ని పార్టీలను ఏకం చేయలేర‌ని ఈమ‌ద్య‌నే మోదీ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లోని పాత పార్టీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పడగొట్ట డంతో, కాంగ్రెస్ మరియు ఆప్‌ తరచుగా వివిధ సమస్యలపై విభేదిస్తాయి. కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ దక్షిణాది రాష్ట్రంలోని వివిధ సమస్యలపై అధికార సీపీఎంతో విభేదిస్తూనే ఉంది. కుమార్ యాదవ్ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు వ్యూహం గురించి చర్చించడానికి గాంధీని కలిశారు. ఐదేళ్లలో ముగ్గురి మధ్య ఇది ​​మొదటి సమావేశం, మరియు కుమార్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీ ఏ) నుండి నిష్క్రమించిన తర్వాత, బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత కూడా ఇది మొదటి సమా వేశం. తరువాత, బీహార్ సిఎం, ఆర్జెడి చీఫ్ అందరూ చిరునవ్వుతో కనిపించారు మరియు మీడియా ప్రతి నిధుల ముందు బలప్రదర్శనలో చేతులు ఎత్తారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాత మళ్లీ కలవాలని గాంధీ కోరినట్లు నేతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ శిబిరాన్ని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాల్సిన అవస రాన్ని కుమార్ మరియు యాదవ్ ఇద్దరూ హైలైట్ చేశారు. అంతకుముందు రోజు, హర్యానాలోని ఫతేహా బాద్‌లో జరిగిన ఐఎన్‌ఎల్‌డి ర్యాలీలో, కుమార్, ఎన్‌సిపి బాస్ శరద్ పవార్ మరియు ఆర్‌జెడి తేజస్వి యాదవ్తో సహా పలువురు ప్రతిపక్ష నాయకులు మరో బల ప్రదర్శనలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా, కుమార్ 2024లో తాను ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడనే చర్చల గురించి గాలిని క్లియర్ చేసాడు. అతను అభ్యర్థిని కాదని, మూడవ ఫ్రంట్ లేదని చెప్పాడు. కాంగ్రెస్‌తో సహా ఒక ఫ్రంట్ ఉండాలి, అప్పుడు మేము 2024 లో బిజెపిని ఓడించగలము" అని బీహార్ సిఎం జోడించారు.

హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ట్వీట్ల జోరు.. వైసీపీ మంత్రుల స్పందన దిగజారు!

రాజకీయ అజెండాలను నిర్దేశించి అత్యంత ప్రముఖమైన మాధ్యమం(మీడియా)గా ట్విట్టర్ అవతరించిందనడంలో సందేహం లేదు. రాజకీయ నాయకులు తన అభిప్రాయాలను, భావాలను ప్రజలలో వాయువేగంతా వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ ని వేదిక చేసుకోవడం ఇటీవల కాలంలో మామూలు అయిపోయింది. అలాగే ఒక రాజకీయ వివాదంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కూడా ట్విట్టర్ ఒక సాధనంగా మారిపోయింది. సామాజిక మాధ్యమం ప్రాధాన్యత పెరుగుతున్న కొద్దీ  ఒక్క ట్వీట్ రాజకీయ నేతల వ్యాఖ్యల్లోని బలాన్ని, డొల్ల తనాన్ని ఇట్టే బయటపెట్టేస్తోంది. ఇంతకీ ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఏపీలో జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయం పెను వివాదం సృష్టించింది. రాజకీయ, సామాజిక, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ట్విట్లర్ వేదికగా తమ స్పందనను తెలియ జేశారు.  ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో వైసీపీ నేతల సమర్థన ట్వీట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ట్రోల్ అవుతున్నాయి. ఎలాంటి హేతుబద్ధతా లేని ఆ సమర్థింపు వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మంత్రుల లోకజ్ణానమిదేనా అని నిలదీస్తున్నారు.అయితే ఒకే ఒక్క ట్వీట్ జగన్ సర్కార్ నిర్ణయంలోని ఔచిత్యాన్ని నిలదీసింది, నిగ్గదీసి అడిగింది. కడిగి పారేసింది. బదులివ్వనేనంతగా కార్నర్ చేసేసింది. అదే హిందుపురం ఎమ్మెల్యే, నందమూరు తారకరామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసిన ట్వీట్. రాజకీయ నాయకుడిగా మారిన బాలకృష్ణ సినిమాలు పంచ్ డైలాగులకు, భారీ యాక్షన్ డ్రామాకు పెట్టింది పేరు. ఆయన ఇంత వరకూ ఎన్నికల ప్రచారంలో తప్ప విడిగా ఎక్కడా బయట పెద్దగా ప్రసంగాలు చేసింది లేదు. అలాగే సామాజిక మాధ్యమంలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నదీ లేదు. కానీ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఆయన స్పందించిన తీరు మాత్రం మహామహా రాజకీయ వేత్తలను సైతం సంభ్రమాశ్చర్యలకు గురి చేసింది. సినిమా షూటింగ్ కోసం ఆయన విదేశాలలో ఉండటంతో నేరుగా స్పందించే అవకాశం లేకపోవడంతో ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును ఖండిస్తూ బాలయ్య చేసిన ట్వీట్ అధికార వైసీపీ కాళ్ల కింద నేతను కదిపేసింది. జగన్ నిర్ణయంలోని డొల్ల తనాన్ని, రాజకీయ దివాళాకోరు తనాన్ని వెల్లడించింది. ఈ విషయంపై అనుకూల వాదనే తప్ప ప్రతికూల వాదనలకు అవకాశమే లేని కచ్చితత్వం ఈ ట్వీట్ ద్వారా వచ్చింది. వైసీపీలోనే ఎన్టీఆర్ హెల్త వర్సిటీ పేరు మార్పు నిర్ణయం పట్ల వ్యక్తమౌతున్న వ్యతిరేకతకు ఈ ట్వీట్ బలాన్నిచ్చింది.  ఇక వైసీపీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ మంత్రులు  రోజా, విడదల రజనీ, తదితరులు చేసిన ట్వీట్లు కానీ, కర్రా విరగొద్దు, పామూ చావద్దు అన్నట్లుగా బీజేపీ నాయకుడు జీవీఎల్ చేసిన ట్వీట్ కానీ ట్రోలింగ్ కు గురి కావడం వినా సాధించిందేమీ లేదు.  న్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ తప్పుపడుతున్నాయి. సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలన్న సంకుచితత్వంతో ఒక యుగపురుషుడిని అవమానించేందుకు చేసిన దుస్సాహసంగా అభివర్ణిస్తున్నాయి. అయితే బాలకృష్ణ ట్వీట్ కు కౌంటర్ గా కొందరు రాష్ట్ర మంత్రులు చేసిన ట్వీట్ లను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భిక్ష పొంది..  ఇప్పుడు ఆ మహానుభావుడి పేరు మార్పును సమర్ధించడం.. పదవి కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారే వారి మనస్తత్వాన్ని ఎత్తి చూపుతోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.  ‘మార్చేయడానికీ, తీసేయడానికీ  ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి  వెన్నెముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు కొడుకు గద్దెనెక్కి హెల్త్ వర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచ భూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’అంటూ బాలకృష్ణ చేసిన ట్వీట్ లో రాజకీయ ప్రస్తావన కంటే ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నదే ప్రధానంగా ఉటంకించారు. రాజకీయాలతో సంబంధం లేకండా తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీకగా నిలువెత్తు తేజోమయ మూర్తిగా ఎన్టీఆర్ కు జనం గుండెల్లో ఉన్న స్థానం ఏమిటన్నది చెప్పారు.  అయితే హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని సమర్ధిస్తూ బాలయ్య సినిమాలోని డైలాగులతో రోజా చేసిన ట్వీట్ ఖాళీ డబ్బాలో గులకరాళ్ల మాదిరిగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏ పర్యటనకు వెళ్లినా రహదారులకు పరదాలు కప్పుకుని జనానికి మొహం చాటేసే జగన్ ను గన్ అనడమేమిటని ఎద్దేవా చేస్తున్నారు. ఇక విడదల రజనీ ట్వీట్ విషయానికి వస్తే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రోగులను ఎలుకలు కొరికిన సంఘటన ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా అని నిలదీస్తున్నారు. ఇక మరో మంత్రి కారుమూరి వ్యాఖ్యలు కూడా ఆడ లేక మద్దెలు ఓడు సామెతనే గుర్తుకు తెస్తున్నాయంటున్నారు. ఆరోగ్య శ్రీ వైఎస్సార్ అనడానికి ఇదేం సందర్భం అని నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కంటే ఎంతో ముందుగానే దార్శనికతతో ఆలోచించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని స్థాపించారని వారు గుర్తు చేస్తున్నారు. కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చిన ఆరోగ్య శ్రీతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని పోల్చడం దిగజారుడుతనానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహరావు అయితే కర్రా విరగొద్దు, పామూ చావోద్దు అన్నట్లుగా స్పందించారని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.  ఒక వైపు బీజేపీ నేతలంతా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై నిప్పులు చెరుగుతుంటే.. జీవీఎల్ మాత్రం ఎవరి మెప్పు కోసం అటూ ఇటూ కాని ధోరణి అవలంబిస్తున్నారని నిలదీస్తున్నారు.

రాజకీయ అవినీతిని రూపుమాపాలి!

జగన్ ఆర్థిక నేరాల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నో బెదరింపులను ఎదుర్కొన్నారు. కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదరింపుల లేఖలు వచ్చాయి. ఒక సారైతే ఆయనపై ఏకంగా దాడి యత్నమే జరిగింది. అయితే నాడు కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఈ విషయాలను స్వయంగా ఎన్నడూ ఎక్కడా బయటపెట్టలేదు. నిజాయితీగా పని చేయడమే ముఖ్యమనుకున్నారు. అన్ని బెదరింపులను, దాడి యత్నాలనూ మౌనంగానే ఎదుర్కొన్నారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. జగన్ అరెస్టు కూడా అయ్యారు. అదంతా గతం. అయితే తాను గతంలో ఎదుర్కొన్న బెదరింపుల విషయాన్ని జేడీ తాజాగా బయటపెట్టారు. అది కూడా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో తనకు ఆదివారం జరిగిన సత్కార కార్యక్రమంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నిజాయితీగా ఉండాలనుకునే వారికి కష్టాలు తప్పవని చెప్పారు. నిజాయితీగా ఉన్న తనకూ ఆ బాధలు తప్పలేదని వెల్లడించారు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సందర్భంగా అప్పట్లో తనకు తీవ్రంగా బెదరింపులు వచ్చాయనీ, దాడి యత్నాలు కూడా జరిగాయనీ వెల్లడించారు. తననే కాదు, తన కుటుంబాన్ని కూడా చంపేస్తామంటూ రెడ్ ఇంక్ తో రాసిన బెదరింపు లేఖలు వచ్చాయన్నారు. రాజకీయ అవినీతిని రూపుమాపితే తప్ప సమాజంలో మార్పు రాదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాలలో ప్రజా సేవ కంటే అవినీతి, స్వార్థం పెచ్చరిల్లాయనీ, వాటిపై దృష్టి సారించాలని అన్నారు. రాజకీయ అవినీతిని రూపు మాపితే అన్నీ దారిలోకి వస్తాయన్నారు.    

మహిళల క్రికెట్ లో మన్కడింగ్ వివాదం!

ఐసీసీ ఎన్ని సార్లు వివరణ ఇచ్చినా క్రికెట్ లో మన్కడింగ్ వ్యవహారం మాత్రం వివాదాస్పదంగానే ఉంటోంది. మన్కడింగ్ అంటే బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటి బయటకు వెళితే బౌలర్ బాల్ డెలివరీ చేయడానికి ముందే స్టంప్ చేసి రనౌట్ చేయడం. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని క్రీడా పండితులు, ఆటగాళ్లు అంటుంటారు. కానీ నిబంధనల మేరకు బౌలర్ బంతి విసరడానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ క్రీజ్ దాటడానికి వీల్లేదు. అలా దాటితే బౌలర్ స్టంప్ చేసి ఔట్ చేయవచ్చు. అయితే ఇది బౌలర్ నైపుణ్యానికీ, బ్యాటర్ వైఫల్యానికీ సంబంధించిన ఔట్ కాదు కనుక ఇలా ఒక బ్యాటర్ ను ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని అంటుంటారు. నిబంధనల మేరకు ఇది సరైనదే అయినా, ఇలాంటి ఔట్ చేసిన బౌలర్ పై విమర్శలు వెల్లువెత్తడం సాధారణమైపోయింది. ఇంతకీ ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అని ఎందుకంటారంటే.. 1947-48లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ బిల్ బ్రౌన్ ను భారత్ బౌలర్ వినూమన్కడ్ ఈ రీతిలోనే ఔట్ చేశాడు. క్రికెట్ చరిత్రలో ఈ తరహాలో ఒక బ్యాటర్ రనౌట్ కావడం ఇదే మొదటి సారి. దీంతో ఈ తరహా రనౌట్ ను మన్కడింగ్ అంటారు. తాజాగా ఈ మన్కడింగ్ మహిళల క్రికట్ లో నూ వివాదాన్ని రేపింది. ఇంగ్లండ్ తో చివరి వన్డే సందర్భంగా భారత్ బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేసింది. దీనిపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ వ్యవహరించారని నిందలేస్తున్నారు. వాస్తవానికి ఈ తరహాలో ప్రత్యర్థి బ్యాటర్ ను ఔట్ చేయడంలో అనుచితమేమీ లేదనీ క్రికెట్ నిబంధనలు విస్పష్టంగా చెబుతున్నాయి. పైగా క్రికెట్ జంటిల్ మెన్ గేమ్ నుంచి ప్రొఫెషనల్ గేమ్ గా మారిపోయిన తరువాత ప్రతి పరుగూ, ప్రతి బంతీ, ప్రతి వికెట్ జట్లకు అత్యంత ప్రాధాన్యమైపోయాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డాల్సిన అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ తెరపైకి స్లెడ్జింగ్ వచ్చింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను చెడగొట్టడానికి నోటికి పని చెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ స్లెడ్జంగ్ లో ఆస్ట్రేలియా, ఆ తరువాత ఇంగ్లాండ్ సిద్ధ హస్తుల్లా పేరొందాయి. స్లెడ్జింగ్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కానప్పుడు.. నిబంధనల ప్రకారం తప్పుకాని మన్కడింగ్ విషయంలోనే క్రీడాస్ఫూర్తి అంశాన్ని ఎందుకు బయటకు తీసుకువస్తారన్నది అర్ధం కాని విషయం. ఎందుకంటే.. ప్రతి పరుగూ విజయాన్ని నిర్దేశించేటంత పోటీ తత్వంతో జరుగుతున్న మ్యాచ్ లో బౌలర్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి వెళ్లి వేగంగా ఎక్సట్రా రన్ సాధించేందుకు ప్రయత్నించడం ఎందుకు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదో మన్కడింగ్ ను విమర్శించే వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మన్కడింగ్ ఎంత మాత్రం వివాదం కాదని ఐసీసీ విస్పష్ట వివరణ ఇచ్చిన తరువాత కూడా వివాదాన్ని కొనసాగించడం అర్ధరహితమని క్రీడా పండితులు అంటున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ చార్లీ డీన్ ను మన్కడింగ్ చేయడంపై నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్..ఇదే సిరీస్ లో  ఇంగ్లాండ్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ఎమీ  జోన్స్‌.. స్మృతి మంధాన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి గ్రౌండ్ కు తాకినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా స్ట్రాంగ్ అప్పీల్ కేసింది. స్మృతి మంథాన  ఔట్‌ అయ్యానని డిసైడ్ అయి పెవిలియన్ వైపు కదిలినా ఏమీ జోన్స్ తాను క్యాచ్ డ్రాప్ చేసిన విషయం చెప్పి ఆమెను వెనక్కు పిలవలేదు.  అయితే రీప్లేలో విషయం బయటపడటంతో అంపైర్లు స్మృతిని వెనక్కు పిలిచారు అది వేరే సంగతి. మరి క్యాచ్ డ్రాప్ చేసినా అప్పీల్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదా? అన్న ప్రశ్నకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జవాబు చెప్పాలి. తాము చేస్తే రైట్..ప్రత్యర్థులు చేస్తే రాంగ్ అనే తీరే   క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని తెలుసుకోవాలి. 

వికేంద్రీకరణ అంటే పంచాయతీ నిధులను దారి మళ్లించడమేనా?

నోటితో వికేంద్రీకరణ అంటూ చేతల్లో అధికారాలన్నీ గంపగుత్తగా అధీనంలో ఉంచుకుంటున్నది జగన్ సర్కార్. స్థానిక సంస్థల నిధులు, విధులను హరించేసి.. పంచాయతీలను నిర్వీర్యం చేయడం ద్వారా స్థానిక ప్రజా ప్రతినిథులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తోందని తెలుగుదేశం ధ్వజమెత్తింది. అమరావతిని నిర్వీర్యం చేయడానికే వికేంద్రీకరణ పాట పాడుతోంది కానీ వాస్తవానికి జగన్ సర్కార్ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శిస్తున్నది.  కేంద్రం రాష్ట్రంలోని పంచాయతీలకు పంపిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రహస్యంగా దొడ్డిదారిన మళ్లించి, నిలదీస్తే కరెంటు బిల్లులు కట్టామంటూ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని నిలదీస్తోంది. తెలుగుదేశం నాయకుడు బూబా రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ ల సమావేశంలో మాట్లాడుతూ..ఆర్ధిక సంఘం నిధులను దొడ్డిదారిన డ్రా చేసి,  నిజంగానే విద్యుత్ బిల్లులు కట్టి ఉంటే ఆ రసీదులను సర్పంచ్ లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిగా అప్పులు చేయడం, నిధులను దారి మళ్లించడం, ఏ పని చేయాలన్నా సొమ్ములు లేవంటూ బీద అరుపులు అరవడం ఈ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయిందని రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు.   పంచాయతీల నిధులను దారి మళ్లించి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు కట్టామన్న మాట శుద్ధ అబద్ధమనీ, ఇప్పటికీ బకాయిల కోసం విద్యుత్ అధికారులు సర్పంచ్ లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం చరిత్రలో వైసీపీ ఒక్కటేననీ, బుకాయింపులు వినా ఈ మూడేళ్ల కాలంలో జగన్ సర్కార్ రాష్ట్రం కోసం చేసినదేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు.  సర్పంచుల సంతకాలు లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులు దొడ్డిదారిన దారి మళ్ళించడం నిబంధనల ఉల్లంఘనేనని ఆయన అన్నారు.   అసలు  గ్రామపంచాయితీలలో నిధులు సర్పంచ్ సంతకం లేకుండా మీరు ఎలా డ్రా చేశారు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిథులకు కేంద్రం మీకు సమాచారం లేకుండా దొడ్డిదారిన డ్రా చేస్తే మీరు అంగీకరిస్తారా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అంతే కదా? మరి సర్పంచ్ ల సంతకం లేకుండా, సర్పంచ్ కు సమాచారం లేకుండా నిధులు ఎలా డ్రా చేశారో వివరణ ఇవ్వాలని రాజేంద్ర ప్రసాద్ నిలదీశారు. గత ముఖ్యమంత్రులు మైనర్ పంచాయతీలకు విద్యుత్ ఉచితంగా ఇచ్చిన సంగతి మీకు తెలుసా ఆర్థిక మంత్రిగారూ అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం పంపిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.    ఆర్థిక సంఘం నిధులు రూ. 7660 కోట్ల ను వెంటనే   గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. 

బొత్స కన్నెర్ర చేస్తే అమరావతి రైతుల యాత్ర ఆగిపోతుందా?

గిల్లి జోల పాట పాట పాడుతున్నట్లు ఉంది మంత్రి బొత్స తీరు. విశాఖలో ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రైతుల మహాపాదయాత్రపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని హెచ్చరించారు. అదే నోటితో పాదయాత్రలను అడ్డుకోవడం సరికాదంటూ జోలపాట పాడారు. ఒక వైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే మరో వైపు యాత్రలను అడ్డుకోవడం సరికాదని బొత్స అంటున్నారు. అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలనుకుంటే తమకు ఐదు నిమిషాలు చాల మంత్రి బొత్స సత్యనారాయణ  అది ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న ఉద్దేశంతోనే తామా పని చేయడం లేదని  ‘వికేంద్రీకరణకు మద్దతుగా’ అన్న అంశంపై  జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు.   అమరావతి రైతులు చేస్తున్నది ఏ యాత్రో తనకు అర్ధం కావడం లేదన్నారు. అది రాజకీయ యాత్రా, పాదయాత్రా.. రియల్‌ ఎస్టేట్‌ యాత్రా అన్నది తెలియడం లేదనీ.. ఎందుకంటే అమరావతినే రాజధాని చేయాలన్న ఒప్పందం ఏమీ లేదని బొత్స సూత్రీకరించారు. అయినా అసలు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తే ఎవరికైనా వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. దోచుకోవడమే తమ విధానమైతే ఇప్పటికి సగం విశాఖ తన ఖాతాలోనే ఉండేదని బొత్స అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతితో తాము రైతుల పాదయాత్రను అడ్డుకోవడం లేదని.. రైతులు కూడా అలాగే రెచ్చగొట్టే ధోరణి విడనాడి శాంతియుతంగా ముందుకు సాగాలని హితవు పలికారు. అదే సమయంలో మూడు రాజధానులకు, వికేంద్రీకరణకు అనుగుణంగా పోరాటానికి సిద్ధం కావాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు   వీధి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, అవసరమైతే యాత్రలు నిర్వహించాలని బొత్స అన్నారు. అయితే బొత్స వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడుతున్నాయి. అమరావతి రైతుల యాత్రకు పోటీగా విశాఖలో ర్యాలీల నిర్వహణ ద్వారా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా చేసి రైతుల యాత్రను అడ్డుకోవాలన్నదే బొత్స పిలుపు వెనుక ఉన్న కుట్ర అని ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమరావతి యాత్రను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. బొత్స తీరు నోటితోనూ, నొసటితోనూ వెక్కిరింపే అన్నట్లుగా ఉందని అభివర్ణిస్తున్నారు.  

ఉప్ప‌ల్‌లో  రెచ్చిపోయిన కింగ్ కోహ్లీ, సూర్య‌.. భార‌త్ విజ‌యం

చాలా రోజుల త‌ర్వాత హైద‌రా బాద్ క్రికెట్ అభిమానుల‌కు ఆదివారం భార‌త్‌, ఆస్ట్రేలియా మ్యాచ్ పండ‌గ ఆనందాన్ని చ్చింది. మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి భార‌త్ ఈ సిరీస్ కైవ‌సం చేసుకుంది. నాగ‌పూర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో సునాయా సంగా గెలిచిన భార‌త్ హైద‌రాబాద్‌ లోనూ పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే గెలిచింది. ముఖ్యంగా కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, పాండ్యా ల వీర‌బాదుడుతో ఆసీస్పై ఆరు వికెట్ల తేడాతో భార‌త్ మూడో మ్యాచ్ గెలిచింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ గ్రీన్‌, టిమ్ డేవిడ్‌లు విజృం భించి ఆడ‌టంతో 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ముఖ్యంగా గ్రీన్ అద్బుత బ్యాటింగ్ నైపుణ్యంతో కేవ‌లం 21 బంతుల్లో 52 ప‌రుగులు చేసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. మొద‌ట బ్యాట్ చేసిన ఆసీస్ ఆరంభం నుంచే ఫించ్, గ్రీన్‌లు వీరావేశంతో ఆడేరు. భార‌త్ పేస‌ర్ల ప‌ని ప‌ట్టార‌నాలి. సునాయాసంగా ఫోర్లు కొట్ట‌డంతో వారిని అడ్డుకునేందుకు చేసిన య‌త్నాలు విఫ‌లమ‌య్యాయి. మొద‌టి 3 ఓవ‌ర్ల‌లోనే 35 ప‌రుగులు దంచారు. నాలుగో ఓవ‌ర్లో స్పిన్న‌ర్ అక్ష‌ర్ ఆసీస్ కెప్టెన్‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అప్ప‌టికి కాస్తంత ఊపిరిపీల్చుకున్నారు. ఫించ్ 7 ప‌రుగులే చేసాడు.కానీ మ‌రో ఎండ్‌లో గ్రీన్ వీర‌బాదుడు కొన‌సాగించి 50 ప‌రుగులు పూర్తిచేశాడు. కాగా 5వ ఓవ‌ర్ భువీ చేతిలో గ్రీన్ వెనుదిరిగాడు. గ్రీన్ కేవ‌లం 19 బంతుల్లో 52 దంచాడు. ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యే స‌రికి ఆసీస్ 2 వికెట్ల న‌ష్టానికి 66 ప‌రుగుల చేసింది. త‌ర్వాత వ‌చ్చిన స్మిత్ మొద‌టి బాల్ నుంచి ఎంతో దూకుడుగా ఆడి జ‌ట్టుస్కోర్ 71కి చేర్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో మాక్స్ వెల్ ని చాహ‌ల్ అవుట్ చేయ‌డంతో ఇక పెద్ద‌గా భారీ షాట్స్ ఆడేవారు ఉండ‌ర‌న్న ధైర్యం వ‌చ్చింది. ప‌దో ఓవ‌ర్లో స్మిత్ కూడా  వెనుదిర‌గ‌డం బౌల‌ర్ల విజ‌యంగా భావించాలి. స్మిత్ 9 ప‌రుగులేచేశాడు. 10 ఓవ‌ర్ల‌కి ఆసీస్ 4 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగు లు చేసింది. 12ఓవ‌ర్లో ఆసీస్ 100 రుగులు పూర్తిచేసింది. కాగా, అక్ష‌ర్ వేసిన 14ఓవ‌ర్లో రెండు వికెట్లు తీయ‌డంతో ఆసీస్ భారీ స్కోర్ అవ‌కాశాలు త‌గ్గాయ‌నాలి. అంత‌కుముందు మ్యాచ్‌లు ధాటిగా ఆడిన వేడ్ కేవ‌లం ఒక్క‌ప‌రుగుకే వెనుదిర‌గ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఆసీస్ 15 ఓవ‌ర్ల‌కి 6 వికెట్ల న‌ష్ట‌పోయి 123 ప‌రుగులు చేసింది. అయితే చివ‌ర్లో సామ్స్‌, డేవిడ్‌లు ఎంతో నిల‌క‌డ‌గా ఆడి 28 బంతుల్లో 56 పుగులుచేసి జ‌ట్టు స్కోరు 180కి చేర్చ‌గ‌లిగారు. 19వ ఓవ‌ర్లో బుమ్రా ఊహించ‌నివిధంగా ఏకంగా 18 ప‌రుగులు ఇచ్చి నిరాశ‌ప‌రిచాడు. చివ‌రిది 20వ ఓవ‌ర్లో డేవిడ్ వెనుదిరి గాడు.  డేవిడ్ 54 రుగులు చేశాడు.  187 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటిం గ్‌కి దిగిన భార‌త్ మొద‌టి ఓవ‌ ర్లోనే రాహుల్ వెనుదిరిగాడు. అత‌ను ఒక్క ప‌రుగే చేశాడు. 4వ ఓవ‌ర్లో కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. శ‌ర్మ 14 బంతుల్లో 17 రుగులు చేశాడు. అప్ప‌టికి జ‌ట్టు స‌కోర్ 2 వికెట్ల న‌ష్టానికి 30 ప‌రుగులే ఉంది. 6 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 50 ప‌రుగులు చేసింది. అక్క‌డ నుంచి కింగ్ కోహ్లీ, డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌కుమార్ రెచ్చి పోయి ఆడారు. ఆసీస్ బౌల‌ర్ల‌కు ఏమాత్రం అంద‌కుండా వీర బాదు డుతో జ‌ట్టుస్కోరును ప‌రు గులు పెట్టించారు. కోహ్లీ చూస్తుండ‌ గానే సూర్య వేగంగా ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. 11వ ఓవ‌ర్‌ కొ భార‌త్ 100 ప‌రుగులు పూర్తి చేసింది. 13వ ఓవ‌ర్లో సూర్య‌ కుమార్ వెనుదిరిగాడు. అప్ప‌టికి అతను కేవ‌లం 29 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. కోహ్లీ, సూర్య‌ల జోడి 61 బంతుల్లో 104 ప‌రుగులు చేయ‌డం ప్రేక్ష‌కు లకు ఫుల్ పైసా వ‌సూల్ అయిం ది. సూర్య స్థానంలో వ‌చ్చిన పాండ్యా వ‌స్తూనే దూకుడుగా ఆడాడు. 14వ ఓవ‌ర్‌కి భార‌త్ 134 ప‌రుగులు చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్లో కోహ్లీ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. కింగ్ త‌న అర్ధ‌సెంచ‌రీని 31 బంతుల్లో చేశాడు. కాగా 18వ ఓవ‌ర్ క‌మిన్స్ వేసిన ఓవ‌ర్లో భార‌త్ అత్య‌ధికంగా 21 పరుగులు సాధించింది. పాండ్యా వీర‌బాదుడుతో క‌మిన్స్‌కు ఏమీ అర్ధంకాలేదు. 19వ ఓవ‌ర్లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 20 ఓవ‌ర్లో రెండో బంతికి కోహ్ల వెనుదిర‌గ‌డంతో ప్రేక్ష‌కులు కాస్తంత ఖంగారు ప‌డ్డారు. కింగ్ 48 బంతుల్లో 63 ప‌రుగులు చేశాడు.  అత‌ని స్థానంలో ఫినిష‌ర్ కార్తీక్ వ‌చ్చాడు. కానీ అప్ప‌టికే పాండ్యా మంచి దూకుడు మీద ఉండ‌డంతో జ‌ట్టు విజ‌యానికి కావ‌ల‌సిన ప‌రుగులు అత‌నే చేయ‌గ‌లిగాడు. పాండ్యా 16 బంతుల్లో 25 ప‌రుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజ‌యంతో ఈ సిరీస్ 2-1 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది.

గోవాలో గెల‌వ‌డానికి కోట్లు కుమ్మ‌రించారు...ఎన్నిక‌ల సంఘం

అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం..త‌లా ఓ చేయి వేస్తే కానిచ్చేయ‌చ్చు అని మామ్మ‌గారు కొడుకుల‌కు ఉత్త‌రాలు రాసింది. చిన్న ప్ప‌టి నుంచి మ‌న పిల్ల‌ల‌తోనే పెరిగిన గారాల‌ప‌ట్టీ అనుకుంటూనే చెల్లి కూతురు పెళ్లికి ల‌క్ష‌లు కుమ్మ‌రించి కానిచ్చేశారు. అందులో ఆనందం ఉంది. బంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. గోవా ఎన్నిక‌ల్లో కోట్లు కుమ్మ‌రించిన పార్టీల‌కు ఏం మిగిలిందో తెలియ‌దు గాని తృణమూల్ 47 కోట్లు, బీజేపీ 17 కోట్లు ఖర్చుచేసిన‌ట్టు ఎన్నికల సంఘం  లెక్క‌లు బ‌య‌ట‌పెట్టింది. ఎన్నికల వ్యయ వివరాలను ఆయా రాజకీయ పార్టీలు ఇటీవల ఎన్నికల సంఘానికి సమర్పించాయి. గోవా అసెంబ్లీ ఎన్నిక లలో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ టోపీలను బరిలోకి దింపడంతో తీవ్రంగా పోరాడాయి, అయితే ఎన్నికల ఖర్చు విషయానికి వస్తే, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 47.54 కోట్లు ఖర్చు చేసింది.. గోవాలో ముఖ్య మంత్రి ప్రమోద్‌ సావంత్‌తో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు కోసం 17.75 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ గోవాలో దాదాపు 3.5 కోట్లు ఖర్చు చేసింది, అక్కడ వరుసగా రెండవ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. గోవాలో బీజేపీని అధికారం నుంచి గద్దె దించాలని భావిస్తున్న కాంగ్రెస్, గోవా ఎన్నికలకు దాదాపు 12 కోట్లు ఖర్చు చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం తాను పోటీ చేసిన 11 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఖర్చు చేసింది. పార్టీ కేంద్ర నిధి. ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులను నిలబెట్టిన శివసేన ఎన్నికల ఖర్చు కోసం దాదాపు 92 లక్షలు ఖర్చు చేసింది. విస్తరణపై దృష్టి సారించిన తృణమూల్ కాంగ్రెస్ గోవాలో ఎన్నికల మెరుపుదాడిని ప్రారంభించింది, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో పార్టీకి పట్టు సాధించే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 23 మంది అభ్యర్థులను నిలబెట్టింది, అయితే వారిలో ఎవరూ గెలవలేదు, దాని మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఇద్దరిని గెలిపించగలిగింది. ఆప్‌ 39 మంది అభ్యర్థులను నిలబెట్టింది. రెండు స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో తన ఖాతా తెరవగలిగింది. గోవాలో ఎన్నికల పోరులో తృణమూల్ కాంగ్రెస్ మరియు ఆఫ్‌ ప్రవేశంపై కాంగ్రెస్ ఘోరంగా ఏడ్చింది, బిజెపి వ్యతిరేక ఓట్లను విభజించిం దని ఆరోపించింది. 40 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లు గెలుచుకుని ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గు రు స్వతంత్ర శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఈ నెల ప్రారంభంలో, ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా 11 మంది కాంగ్రెస్ ఎమ్మె ల్యే లలో ఎనిమిది మంది బిజెపిలోకి ఫిరా యించారు.

బాలయ్య ఫైర్ జగన్ రెడ్డి షేక్ ఆగని పేరు మార్పు ప్రకంపనలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిజానికి రాష్ట్రంలోనే కాదు, జాతీయ  స్థాయిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయ మీడియా ఇదే వార్తను ప్రధాన వార్తగా ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ కుమారుడు, నటుడు , హిందూపురం ఎమ్మెల్యే, అభిమానులు బాలయ్య బాబుగా పిలుచుకునే నందమూరి బాల కృష్ణ, స్పందనను జాతీయ మీడియా ప్రముఖంగా, పదే పదే ప్రసారం చేస్తోంది. ఆయన చేసిన ఘాటు విమర్శలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొందరపాటు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది.  విదేశాల్లో ఉండడం వలన వెంటనే స్పందిచలేని బాలయ్య నిన్న శనివారం(సెప్టెంబర్24) జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. కేవలం యూనివర్సిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదని... ఆయనను ప్రజల మనసుల్లోంచి చెరిపివేయలేరని. మహనీయుడి పేరు మార్చిన మిమ్మల్ని  మార్చడానికి ప్రజలు సిద్దంగా వున్నారని బాలయ్య చేసిన హెచ్చరిక  ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక  జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు గౌరవాలను గుర్తు చేస్తూ మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు జాతీయ పార్టీల నాయకులను కదిలిస్తున్నాయి. జాతీయ నాయకుల స్పందనలు జగన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.  నిజానికి, కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ముఖ్యమంత్రులను పదేపదే మారుస్తూ, ఆంద్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఎంత తప్పు చేసిందో జగన్ రెడ్డికి తెలియక పోవచ్చును. కానీ, ఒక్కసారి చరిత్రను గుర్తు చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న దురహంకార నిర్ణయమే,ఆ పార్టీని భూస్తాపితం చేసింది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ప్రజల, తెలుగు వారి ఆత్మ గౌరవానికి చెరగని చిరునామాగా నిలిచిన ఎన్టీఆర్ ని అవమానించిన జగన్ రెడ్డిని ఎప్పటికీ క్షమించరు. ఇది ఎవరో ఒకరిద్దరు అంటున్న మాట, కాదు.  మొత్తం తెలుగువారి ఆత్మ ఘోష. నిజం, పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండి అన్నట్లుగా జగన్ రెడ్డి దురహంకారంతో తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగు ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు. బాధ పడుతున్నారు.    నిజానికి, ఎన్టీఆర్ అంటే బాలయ్య అన్నట్లుగా, ఒక వ్యక్తి కాదు, ఒక పేరు కాదు, అదొక  సంస్కృతి.. ఓ నాగరికత, ఇంకా చెప్పాలంటే ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవానికి శాశ్వత చిరునామా. అవును, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్. జగన్ రెడ్డి మరిచి పోవచ్చును కానీ, ఎంతో ఘన చరిత్ర ఉన్న తల్లి కాంగ్రెస్ పార్టీనే  కేవలం 11 నెలల కాలంలో కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసిన  మహా నాయకుడు, ఎన్టీఆర్. అందుకే, తల్లి కాంగ్రెస్ కు పట్టిన గతే పిల్ల కాంగ్రెస్ కు తప్పదని అంటున్నారు. అలాగే,  వైఎస్సార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు అదే దారిలో  జగన్ రెడ్డి ఎన్టీఆర్ విద్యాలయం పేరు, మార్చారు. అందుకు వైఎస్సారే కాదు , కాంగ్రెస్ పార్టీ కూడా మూల్యం చెల్లించింది. ఇప్పుడు జగన్ రెడ్డి, వైసీపీ వంతు వచ్చిందని, ప్రజలు అంటున్నారు.  అవును, బాలయ్య అన్నట్లుగా, ప్రజలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్నే మార్చేందుకు సిద్దంగా ఉన్నారు..అయితే ఈ విషయాన్ని,జగన్ రెడ్డి చూడలేక పోతున్నారు. బహుశా, దురహంకారపు పొరలు ఆయన చూపును పక్క దారి పట్టిస్తున్నాయి కావచ్చును. అయినా, జగన్ రెడ్డి చేసిన తప్పు సామాన్యమైన తప్పు కాదు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే తప్పు జగన్ రెడ్డి చేశారు. అందుకు ఆయన మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషకులే కాదు, వైసీపీ నాయకులు కూడా అంటున్నారు.  నిజానికి, వైసీపీలోనూ ముఖ్యమంత్రి తాబేదార్లు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్న మంత్రులు, ఇతర నేతలు కొద్ది మంది మాత్రమే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. మిగిలిన మంత్ర్రులు ఇతర నేతలు మింగలేక కక్కలేక మధన పడుతున్నారు. నిజానికి, మూడొంతుల వరకు మంత్ర్రులు, ఎమ్మెల్యేలు కూడా, జగన్ రెడ్డి నిర్ణయాన్ని ఛీ కొడుతున్నారని, వైసీపీ నాయకులే గుస గుసగుసలాడుతున్నారు.   ఎవరి దాకానో ఎందుకు, అదే  వైఎస్సార్ రక్తం పంచుకు పుట్టిన జగన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల, అన్న ముఖాన,... ఛీ కొట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి, తమ తండ్రి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని షర్మిల తప్పు పట్టారు. జగన్ రెడ్డి అవమానించింది ఒక్క ఎన్టీఅర్ నే కాదు, తండ్రి వైఎస్సార్ ను కూడా అవమానించారనే అర్ధం వచ్చేలా షర్మిల తమదైన రీతిన  ఫైరయ్యారు. చీవాట్లు పెట్టారు. అధికారం ఉంది కదాని, వైఎస్సార్ పేరున అడ్డమైన పనులు చేస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుందని  షర్మిలే కాదు వైఎస్సార్ అభిమానులు, ఆత్మీయులు కూడా ఆక్షేపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రేపు అధికారం చేతులు మారిన తర్వాత వైఎస్సార్ పేరును అవమాన పరిచేలా జగన్ రెడ్డి నిర్ణయం ఉందని, ఆవేదన వ్యక్తపరుస్తున్నారు, నిజానికి, రాజకీయ నాయకులకు ఉండకూడని, లక్షణాలలో మొదటిది అహంకారం. కానీ  అదేమీ దురదృష్టమో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వళ్ళంతా ఉన్నదే ఆదని అంటారు. ఈ దురహంకారంతోనే జగన్ రెడ్డి ఎవరిని తాక కూడదో, ఎవరిని తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా చూస్తారో ఆ,మహనీయుని తాకారు.. అందుకే, ఈ రోజు  రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడి గుండె భగ్గుమంటోంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఇప్పటికే భగ్గుమంటున్న ప్రజాగ్రహం ఇప్పడు,మరింతగా రగులుతోందని, జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని   సాగనంపే సుముహూర్తం కోసం ప్రజలు ఎదురు చూస్తునారని, అంటున్నారు. నిజం, తెలుగు ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం క్షమించరు. అందులోనూ అన్న ఎన్టీఆర్ ను అవమాన పరిస్తే అసలే క్షమించరని , అంటున్నారు.

ప‌ప్పీ చ‌లాకీ అయ్య‌క చెప్పండి..!

పిల్లాడికి త‌క్కువ‌మార్కులు వ‌చ్చాయ‌ని, లెక్క‌ల్లో మ‌రీ సున్నాయేనా.. అంటూ తండ్రి కొట్టాడు..గ‌దిలో ఓ మూల కూర్చుని ఏడుస్తున్నాడు. అంత‌ లో తోక ఊపుకుంటూ కుక్క‌పిల్ల వెళ్లి వాడి ఒళ్లో కూచుం ది..ఏడ‌వ‌ద్ద‌ని చెప్ప‌లేదుగ‌దా! దాన్ని హ‌త్తుకుని వాడు మ‌రింత ఏడుస్తూ నాకు లెక్క‌లు రావ‌డం లేద‌ని ఏడ్చాడు. మ‌ర్నాడు కుక్క‌పిల్ల త‌న చెప్పు మీద పాస్ పోసింద‌ని ఆ పెద్ద మ‌నిషి చ‌చ్చే ట్టు కొట్టాడు. పిల్ల‌డు అడ్డుప‌డి బ‌య‌టికి తీసికెళ్లాడు. త‌నకు ఇల్లుంది, అమ్మా ఉంది. ప‌ప్పీకి ఎవ‌రున్నారు.. అందుకే పిల్ల డే బాక్స్‌లో పెట్టి ఎవ‌ర‌న్నా తీసికెళ్లం డ‌ని బ‌య‌ట‌పెట్టాడు!  ఇది క‌థ కాదు. ప‌చ్చి నిజం. వాస్త‌వ చిత్రం. జీవితంలో కొన్ని మ‌న‌సు నొప్పించే నిర్ణ‌యాలూ తీసుకోవాల్సి వ‌స్తుంది. ప‌న్నెం డేళ్ల పిల్లాడికి ఆ ప‌రిస్థితి వ‌చ్చిం ది. అందుకే ప‌ప్పీని దూరంగా పంపించేసేడు. న‌గ‌రం మెక్సికో.. ఆ 12ఏళ్ల పిల్లాడి పేరు ఆంద్రెస్‌. తండ్రి పెద్ద ఉద్యోగి. పిల్ల‌డిని బాగా చ‌దివించి మంచి ఉద్యోగిలా చేయాల‌ని త‌ల్లి ఆకాంక్ష‌. పిల్ల‌డు బాగానే చ‌దువుతుంటాడు. ఇంటి ద‌గ్గ‌ర మాత్రం ప‌ప్పీని వ‌ద‌ల‌డు. దానితోనే ఆట‌పాట‌లంతా. తిండికి త‌ల్లి పిలిస్తేనే వెళుతూంటాడు. చీక‌టిప‌డ్డాక త‌ల్లి ఓ గంట చ‌దివిస్తుం టుంది. తండ్రికి ఇంట్లో ప‌ప్పీ ఉండ‌డంవ‌ల్ల‌నే వాడికి అల్ల‌రి ఎక్కువై మొండిగా త‌యార‌య్యాడ‌ని న‌మ్మ‌కం. అందుకే దాన్ని వాడికి దూరం చేయాల‌నుకున్నాడు. ఒక‌రోజు ఆఫీసుకు వెళ్లేందుకు సిద్ద‌ప‌డ్డాడు. షూ త‌డిగా ఉండ‌డం గ‌మ‌నించి భార్య‌ను తిట్టాడు. త‌ర్వాత ప‌ప్పీ పాస్‌కి వెళ్లింద‌ని ఆమె చెప్పింది. అంతే దాన్ని చచ్చేట్టు కొట్టాడు. తోక‌కి బాగానే గాయాల‌య్యాయి. అది కుయ్యో..మొర్రో అంటూ చిన్న అయ్య‌గారి గ‌దిలోకి పారిపోయి గ‌ట్టిగా మొర‌గ‌డం మొద‌లెట్టింది.  సాయింత్రం బ‌డి నుంచి పిల్ల‌డు రాగానే కుంటుతూ ప‌డుతూ వ‌చ్చి ప‌ప్పీ వాడి కాళ్ల‌మీద‌ప‌డింది. వాడికి న‌వొ్చ్చింది. అదేదో న‌టిస్తోంది. త‌ర్వాత చూస్తే గాయాల‌మ‌యం. వాడికి ఏడుపు ఆగలేదు. తండ్రిని తిట్టుకున్నాడు. ఇక్క‌డుంటే క‌ష్ట‌మ‌ని దాన్ని బాగా చూసుకోమ‌ని కోరుతూ ఒక జంతుసంర‌క్ష‌ణ సంస్థ‌కు లేఖ రాశాడు. ఆ కాయితం, త‌న‌కు మ‌రింత ఇష్ట‌మైన బొమ్మ‌తో పాటు ప‌ప్పిని ఒక అట్ట‌పెట్టెలో పెట్టి గుమ్మం బ‌య‌ట‌పెట్టి, ఆ సంస్థ‌వారికి ఫోన్ చేయించాడు త‌ల్లిచేత‌.  వారొచ్చి తీసికెళ్లారు. వారు పిల్ల‌డి ఉదార‌త్వాన్ని మెచ్చుకున్నారు. అంత‌కంటే ఆ ఉత్త‌రం చ‌దివి క‌న్నీళ్లూ పెట్టుకున్నారు. ఇంత‌కీ అందులో ఏముంది.. స‌ర్‌,  ఇది నా ప్రాణం. మా నాన్న దుర్మార్గుడు, తాగుబోతు కూడా. న‌న్ను కొడుతున్నాడు. పాపం ప‌ప్పీని మాత్రం చ‌చ్చేట్టే కొడుతున్నాడు, కొట్టాడు. దీన్ని నేను రక్షించుకోలేను. నాకు ఇల్లుంది, అమ్మా ఉంది... వీడికి ఏమీ చేయ‌లేని, ర‌క్ష‌ణ అస్స‌లు ఇవ్వ‌లేని నేనున్నాను.. నిష్ర్ప‌యోజ‌కుడిని.. అందుకే మీరు జాగ్ర‌త్త‌గా పెంచండి... అన్న‌ట్టు వెంట‌నే దాని తోక గాయానికి క‌ట్టు గట్టండి.. అది బాగా తిరుగుతూ, అల్ల‌రి చేస్తున్న‌పుడే మ‌ళ్లీ నాకు ఇన్‌ఫామ్ చేయండి..ఉంటా! .. అని.  

ప్రపంచ ఆర్థిక సంక్షోభం.. ప్ర‌స్థావిస్తున్న‌ది మాత్రం భార‌త్‌! 

ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సంక్షోభం ఉందని, భారతదేశం తప్ప ఎవరూ ఈ ఆందోళనలను వ్యక్తం చేయడం లేదని విదేశాంగ మంత్రి ఎస్జైశంకర్ ఆదివారం ఉద్ఘాటిం చారు. నేటి ఆర్ధికాంశాలే కేంద్రం గా ఉన్న‌ ప్రపంచంలో భారతదేశం వారధిగా, ప్ర‌స్థావించే ధైర్యంగ‌ల ఛానెల్‌గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. జైశంకర్ ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిఏ)ని సందర్శించి ప్రసంగించారు.  జైశంకర్ యుఎన్‌జిఏలో  ప్రసం గించారు.వివిధదేశాల నాయకు లతో తన చ‌ర్చ‌ల‌ గురించి  మీడియాకు వివరించారు. యుఎన్ జిఎ ప్రపంచ స్థితిని ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదని అన్నారు. మేము నేడు ప్రపంచ ద‌క్షిణాది ప్ర‌తినిధిగా విస్తృతంగా గుర్తించబడుతున్నాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆహారం, ఇంధనం, ఎరువులు, అప్పుల పరిస్థితి తీవ్ర ఆందోళనలతో కూడిన సంక్షోభం ఉంది. ఈ సమస్యలను వినడం లేదని నిరాశ ఉంది. ఎవరూ లేరు. భారతదేశం తప్ప మ‌రేదేశ‌మైనా సంక్షోభాల గురించి మాట్లాడ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్థలపై  పెరుగుతున్న భార‌త్ ప్ర‌భావం గురించి మాట్లాడుతూ, జనరల్ అసెంబ్లీలో ఒక దేశ అధ్యక్షులు, పిఎంలు లేదా ఎఫ్‌ఎమ్‌లు మరొక దేశాన్ని సూచిం చడం సాధారణం కాదని, అయితే చాలా మంది భారతదేశం కోసం అనేక సందర్భాల్లో మాట్లాడారని, ఇది భారతదేశ విషయా లను మరింత పునరుద్ఘాటిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రయత్నాలను హైలైట్ చేస్తూ, ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, వాతావరణ  అత్యవ సర పరిస్థితులు సవాలుగా మారాయి, దక్షిణాసియా, యూరప్‌లో జరిగాయి. ఇందులో భారతదేశం చూపిన నాయకత్వం మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని పెంచింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో విజన్‌ని అమ‌ల‌య్యేవిధంగా  అమ‌లుచేయ‌డం ప్ర‌ధాని మోదీ బలమైన అంశమ‌న్నారు. ఉక్రెయిన్ ప్రధానితో చర్చల గురించి చెబుతూ, పెద్ద ఆందోళన అనేది సంఘర్షణ. అతను నాకు ఉక్రెయిన్ గురించి తన అవ గాహన, ఆందోళనలను అందించాడు. భారతదేశం పరంగా, మేము మా స్థానం గురించి చర్చిం చామని. తాము సంఘర్ష ణను కొనసాగించడానికి, సంభాషణ, దౌత్యానికి తిరిగి రావడానికి మేము వ్యతిరేకం అని  ఆయన ప్రశం సించారన్నారు. తన రష్యా ప్రత్యర్థితో సంభాషణలో, విదేశాంగ మంత్రి, చర్చించిన ద్వైపాక్షిక సహకారం, యుఎన్‌ సంస్కరణ, ఉక్రెయిన్‌కు సంబం ధించిన సమస్యలపై మాట్లాడారు. రష్యా దృక్కోణం నుండి పరిణామాల గురించి ఆయన నాకు వివరించారు. కొన్ని నెలల్లో జీ 20 పై చర్చ జరగనుంది.

స్ఫూర్తిదాయ‌క నైపుణ్యానికి  మ‌రో పేరు..ఝుల‌న్‌!

1997లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఝులన్ గోస్వామి బాల్ గర్ల్‌గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ పేసర్ క్యాథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ నైపుణ్యాలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ రోజు భారత్‌ తరఫున ఆడాలని నిర్ణయించుకుంది. శనివారం లార్డ్స్‌లో ఇంగ్లండ్ మహిళలు, భారత మహిళల మధ్య జరిగే మూడో వన్డే జులన్‌కి చివరిది. మహిళల ఇంటర్నేషన ల్స్‌లో ఫార్మాట్‌లలో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా ఆమె అంతర్జాతీయ వేదిక‌ను విడిచిపెట్టింది -  జనవరి 2002లో ప్రారంభమైన అంతర్జాతీయ కెరీర్ 354 వ‌న్డేల్లో అద్భుత నైపుణ్యాన్ని ఆట‌ప‌ట్ల అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శించి ఆనందాన్ని పొందిం ది. అయితే మరీ ముఖ్యంగా, ఈ ఏడాది ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్‌తో పాటు, మహిళల క్రికెట్ పట్ల ఉదాసీన తతో పోరాడాల్సిన తరానికి, మహిళల క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రస్తుత తరం స్మృతి మంధానలకు మధ్య ఝులన్ వారధిగా పనిచేసింది. ఝులన్ ప్రారంభించినప్పుడు, మహిళల క్రికెట్ బీసీసీఐ గొడుగు కింద లేదు. చివరకు 2023లో మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐకి తగినంత మార్పులు వచ్చాయి. వర్చువల్‌గా జరిగిన ఇండియా కలర్స్‌లో జులన్ చివరి ప్రీ-గేమ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు చాలా బాగా హాజరైనం దుకు ఆశ్చర్యం లేదు. నాగ్‌పూర్‌లో భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండవ పురుషుల టీ 20ని ట్రంప్ చేయడం ద్వారా ఆమె ఈ రోజు భారత క్రికెట్‌లో అతిపెద్ద కథ. 39 ఏళ్ల వ్యక్తి హృదయపూర్వ కంగా మాట్లాడాడు. గత రెండు మూడేళ్లుగా కొన్ని గాయాలయ్యాయి. ఝులన్ వారితో పోరాడింది, కొన్నిసార్లు నొప్పితో ఆడింది. “గత రెండు సంవత్సరాలుగా, ప్రతి సిరీస్ నా చివరిది అని నేను అనుకుంటున్నాను, ముఖ్యంగా కోవిడ్-19 క్రికెట్‌ను 2021కి వాయిదా వేయడంతో. నేను చాలా గాయాలతో సతమతమవుతున్నాను. నేను సీరీస్ వారీగా తీస్తున్నాను. (2022 వ‌న్డే) ప్రపం చ కప్ తర్వాత శ్రీలంక పర్యటన నా చివరిది అని అనుకున్నాను. కానీ ప్రపంచ కప్ సమయంలో, నేను గాయపడ్డాను శ్రీలంక పర్యటనకు సరిపోయేంత ఫిట్‌ని కలిగి లేను అని  ఝులన్ అన్నారు: “ఇది టీ20 ప్రపంచ కప్‌కి ముందు చివరి వ‌న్డే సిరీస్, కాబట్టి నేను వెళ్ళాలని అనుకున్నాను. ఎన్‌సిఏ, చాలా పునరావాసం చేయండి మరియు నా చివరి సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు రండి. మెరుస్తున్న కెరీర్‌లో ఒక శూన్యం ఉంది, ప్రపంచ కప్ గెలవకపోవడం బాధిస్తుంది. 2005లో, ఆపై 2017లో భారత్ చివరి అడ్డంకి లో తడబడినప్పుడు, రెండుసార్లు ఝులన్ కిరీటాన్ని అందుకోవడానికి దగ్గరగా వచ్చింది. లార్డ్స్‌లో జరిగిన 2017 ఫైనల్ ఒక బాధాకరమైన జ్ఞాపకం, ఆమె జట్టు తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది - చాలా దగ్గరగా , ఇంకా ఇప్పటివరకు. మేము వాటిలో ఒకటి గెలిచినట్లయితే, అది టీమ్ ఇండియా మరియు మహిళల క్రికెట్‌కు గొప్పది. ప్రతి అథ్లెట్‌కి అదే అంతిమ లక్ష్యం. మీరు చాలా కష్టపడి పనిచేసినప్పుడు, మీరు నాలుగు సంవత్సరాలు సిద్ధమయ్యారు మరియు మీరు ట్రోఫీని గెలిస్తే, అది ఒక కల నిజమైంది. దురదృష్టవశాత్తూ మేము టీ20 (2020 ప్రపంచ కప్)తో సహా మూడు ఫైనల్స్ ఆడాము కానీ ఫైనల్ గెలవలేకపోయాము. ఇది బాధాకరమైన భావాలను కలిగి ఉంది మరియు అది ఒక విచారం, ”ఆమె చెప్పింది. రాంచీ కుర్రాడు ఎంఎస్ ధోనీకి చెప్పని కథ ఉంటే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఝులన్ 20 ఏళ్ల ప్రయాణం కూడా బయోపిక్‌కి అర్హమైనది. చక్దా ఎక్స్‌ప్రెస్ తయారీలో ఉంది, ఇది చక్దాహా అమ్మాయి యొక్క మూలాలకు తిరిగి వెళుతుంది - జిల్లా పట్టణం నుండి మొదటి రైలులో - కోల్‌కతా నుండి 80 కిలోమీటర్ల దూరంలో శిక్షణ కోసం మైదాన్‌కు రావడానికి. ఝులన్ ఎల్లప్పుడూ వేగంగా బౌలింగ్ చేయాలనుకునేది మరియు ఆమె గరిష్ట స్థాయి వద్ద, ఆమె గంటకు 130 కి.మీ. "నేను ప్రారంభించినప్పుడు, నేను చాలా కాలం పాటు ఆడటం గురించి ఆలోచించలేదు. ఆ రోజుల్లో మేము డ‌బ్ల్యుసిఏఐ (ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)కి ప్రాతినిధ్యం వహించాము. 2006 నుండి మేము బీసీసీఐ ప‌రిధిలో (ఉన్నాము). నేను చక్దాహా నుండి రెండున్నర గంటల వన్-వే రైలు ప్రయాణాన్ని చేపట్టాను, ప్రాక్టీస్ చేసి ఇంటికి తిరిగి వెళ్లి, మరుసటి రోజు ప్రాక్టీస్ కోసం తిరిగి వెళ్తాను. అయితే, నేను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అత్యుత్తమ జ్ఞాపకం; నా కెప్టెన్ (అంజుమ్ చోప్రా) నుండి నా భారత క్యాప్‌ని పొంది, నా కెరీర్‌లో మొదటి ఓవర్ బౌలింగ్ చేసాను. అది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం' అని ఝులన్ చెప్పింది. “1997 మహిళల ప్రపంచ కప్‌లో బాల్ గర్ల్‌గా, నేను ఆస్ట్రేలియా మరియు న్యూజి లాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్‌ను చూశాను, మరియు ఆ రోజు నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని కలలు కన్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను అలా ప్రారంభించాను మరియు చాలా ప్రయత్నం చేసాను. ఇదిలా ఉండ‌గా, దేశంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్లు అభిమానులు ఆమె భ‌విష్య‌త్ జీవితం కూడా ఇంతే గొప్ప‌గా విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తూన్నారు. కొద్ది రోజుల క్రితం, భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవజ్ఞుడైన సీమర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు, ఎన్‌సిఏ నెట్స్‌లో ఆమెను ఎదుర్కొన్న తన అనుభవాన్ని వివరించాడు మరియు జులాన్‌ను స్టాల్‌వార్ట్ అని పిలిచాడు. "దేశం కోసం ఆమె చేసిన పనుల విషయంలో ఆమె భారతదేశానికి చెందిన ప్రముఖులలో ఒకరని నేను భావిస్తున్నాను" అని రోహిత్ చెప్పాడు. ...... మ‌హిళ‌ల క్రికెట్ లెజెండ్‌, ప్ర‌ముఖ పేస‌ర్ ఝుల‌న్ గోస్వామి రాబోయే సంవత్సరాల్లో మహిళా క్రీడా కారిణులకు రోల్ మోడల్‌గా ఉంటుంది. అద్భుతమైన కెరీర్.. అది విజయవంతమైన నోట్‌తో ముగియడానికి తగినది. వ్యక్తి గతంగా సిరీస్ .. రాబోయే దశా బ్దాల పాటు మహిళా క్రీడాకారులకు  రోల్ మోడల్‌గా నిలుస్తుందని బిసిసిఐ అధ్య‌క్షుడు, మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ అభినందించారు. ఝుల‌న్ గోస్వామి త‌ప్ప‌కుండా ముందు తరం క్రికెటర్లకు స్ఫూర్తినిస్తూ, రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు అసమానమైన అంకితభావం, సంకల్పంతో సేవలందించినందుకు బౌలర్‌కు బీసీసీఐ సెక్రటరీ జే షా కృతజ్ఞతలు తెలిపారు.  మహిళా క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా సుదీర్ఘ‌కాలం ఆట‌లో ఉండ‌డం నమ్మశక్యం కానిది, నమ్మలేనిది. మేము అండర్-19 రోజుల నుండి కలిసి ఆడుతున్నాము, గేమ్ పట్ల మా నిబద్ధత ఆమె శాశ్వతమైన ఆశావాదం అందరికీ పాఠాలు. ఇండియన్ జెర్సీ మిమ్మల్ని మిస్ అవుతుంది. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు, జూలు అని ఎంతో అభిమానంతో శుభాకాంక్ష‌లు తెలిపింది మిథాలీ. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, ఝులన్ “క్రీడలో ఆడిన గొప్ప వారిలో ఒకరు. ఆట పట్ల మీ ప్రేమ, అభిరుచి అంకిత భావం చాలా మందికి ప్రేరణ. అన్ని అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు. భారత స్పిన్ గ్రేట్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేస్తూ, “భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరికి అభినందనలు, అద్భుతమైన కెరీర్‌లో బాగా చేసారు. మీరు చాలా మంది అమ్మాయిలను క్రీడలో పాల్గొనడానికి ప్రేరేపించారని చెప్పనవసరం లేదు. జీవితంలో కొత్త అధ్యాయం వైపు అడుగులు వేస్తున్న మీకు శుభాకాంక్షలు” అని అన్నారు. భారత మాజీ బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా ఝులన్ గురించి దేశం గర్విస్తోందని అన్నాడు. మీరు తరాలకు స్ఫూర్తినిచ్చారు 20 సంవత్సరాలుగా మీరు కష్టపడి దేశం కోసం ఉత్తమ ఆట‌ను అందించారు. మీవంటి గొప్ప ప్లేయ‌ర్‌ని చూసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాం. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు, బంగారు భ‌విష్య‌త్‌కు శుభాకాంక్షలు! అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు. గోస్వామి 12 టెస్టుల్లో 44 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లు తీశారు.

తరుమల కొండపైకి సొంత వాహనాలతో నో ఎంట్రీ

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం(సెప్టెంబర్ 26) అంకురార్పణ జరగనుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించని సంగతి తదెలిసిందే. దీంతో ఈ ఏడు తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.   శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.  ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల దర్శనాన్ని రద్దుచేయడం, వీవీఐపీలు, వీఐపీ దర్శనంలోనూ పరిమితులు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే   తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మంది సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో కొండపైకి సొంత వాహనాలలో వచ్చే వారి విషయంలోనూ ఆంక్షలు విధించింది. భక్తులు కొండపైకి ద్విచక్రవాహనాల్లో రావడానికి అనుమతించరాదని నిర్ణయించింది. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకూ కొండపైకి ద్విచక్రవాహనాలను అనమతించబోమని టీటీడీ స్పషం చేసింది. అలాగే కార్లలో వచ్చే వారి విషయంలో కూడా పరిమితులు విధించింది. రోజుకు 12 వేల కార్లకు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందనీ, ఆ సంఖ్య దాటితే ఎవరైనా సరే తమల వాహనాలను తిరుపతిలోనే టీటీడీ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో పార్క చేసి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే కొండపైకి వెళ్లాలన్న నిబంధన విధించింది.  ఈ ఆంక్షలు బ్రహ్మోత్స వాలు జరిగే తొమ్మది రోజులూ అమలులో ఉంటాయి.   

చైనాలో సైనిక తిరుగుబాటు.. జిన్ పింగ్ గృహ నిర్బంధం!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తిరుగుబాటు జరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జిన్ పింగ్ ను గృహ నిర్భందం చేసింది. ఇప్పుడు బీజింగ్ మోత్తం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో ఉందనీ, పెద్ద ఎత్తున దళాలు మోహరించి ఉన్నాయనీ, ఇతర దేశాల నుంచి వచ్చే, ఇతర దేశాలకు వెళ్లే విమానాలను పెద్ద ఎత్తున రద్దు చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.  అయితే సైనిక తిరుగుబాటు, జిన్ పింగ్ నిర్బంధం వార్తలను చైనా మీడియా కవర్ చేయలేదు. అలాగే ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.  ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా  ఎదుగుతున్న చైనాలో సైనిక తిరుగుబాట జరిగిందన్న వార్తలు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. దురాక్రమణ కాంక్ష, వరుసగా మూడో సారి కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయం కారణంగానే సైనిక తిరుగుబాటు జరిగినట్లు చెబుతున్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే సైనిక తిరుగుబాటుకు అంకురార్పణ జరిగిందంటున్నారు. అధ్యక్షుడి భద్రతను చూసే అ సీజీబీ ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహించిందని చెబుతున్నారు.  పదేళ్ల కిందట అంటే 2012లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ తన సొంత బలాన్ని పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేశారనీ,   ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై   ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణశిక్షలు కూడా విధించారు. అలాగే  మరి కొందరికి యావజ్జీవ శిక్షలు విధించారు. ఈ కారణంగానే సైన్యంలో అసంతృప్తి పెచ్చరిల్లిందని అంటున్నారు. జిన్‌పింగ్‌పై సైనిక చర్యకు ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు.   అయితే చైనా రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించినట్టు ఉన్న వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి.  80 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్ బీజింగ్ దిశగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  అలాగే సామాజిక మాధ్యమంలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుందని, సైనికాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టారనీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్ కు ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయనీ, అంతర్జాతీయ విమానరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ చెబుతున్నారు. ఉజ్బెకిస్థాన్‌లో  జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొని తిరిగి స్వదేశానికి చేరుకున్న జిన్ పింగ్ ను విమానాశ్రయంలోనే సైనం నిర్బంధంలోకి తీసుకుందని చెబుతున్నారు. 

రష్యా గబ్బిలాల నుంచి మరో ప్రాణాంతక వైరస్ ఖోస్టా వ్యాప్తి?

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా విముక్తి లభించలేదు. ఇంకా కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మానవాళిపై కరోనా వైరస్ దాడి కొనసాగిస్తూనే ఉంది. అయితే దాని ఉధృతి తగ్గిందనీ, ఇక కరోనా వైరస్ ప్రాణాంతకమెంతమాత్రం కాదనీ వైద్య నిపుణులు, సైంటిస్టులు నిర్ధారంచడంతో ఊపిరి పీల్చుకున్నాం. అయితే అంతలోనే కరోనా కంటే ప్రమాదకరమైన మరో వైరస్ లోకాన్ని చుట్టేసే ప్రమాదం ఉందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కూడా గబ్బిలాల నుంచే మనుషులకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ సారి ఈ వ్యాప్తికి కారణం చైనా గబ్బిలాలు కావు. రష్యా గబ్బిలాలు. ఖోస్తా-2 గా పిలిచే ఈ వైరస్ రష్యా గబ్బిలాల్లో కనుగొన్నారు. రష్యా గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే ఈ ఖోస్తా-2 వైరస్ కరోనా కంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్ల మందిపై ప్రభావం చూపించి లక్షల మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు  ఖోస్తా-2 వైరస్ వ్యాప్తి వార్త నిజంగా  షాకింగే.  రష్యా గబ్బిలాల నుంచి ఖోస్టా 2 వైరస్ మనుషుల్లోకి వ్యాపిస్తున్నట్లు అమెరికా సైంటిస్టులు గుర్తించారు.  ఖోస్టా2 వైరస్ కూడా కరోనా తరహాలోనే ప్రాణాంతకమనీ, ఒక విధంగా చెప్పాలంటే ఇది కరోనా కంటే మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఖోస్తా వైరస్ నియంత్రణకు ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లేవీ పని చేయడం లేదని నిర్ధారించారు.  

ఝుల‌న్‌కి గొప్ప వీడ్కోలు..లార్డ్స్ లో భార‌త్ విజ‌యం

భార‌త్ మ‌హిళా క్రికెట్ సీనియ‌ర్ సూప‌ర్‌స్టార్ బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామికి భార‌త్ జ‌ట్టు గొప్ప కానుక‌నే అందించింది. గోస్వామి ఆడిన చివ‌రి మ్యాచ్‌లో భార‌త్ ఇంగ్లండ్‌పై విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా సిరీస్ క్లీన్ స్వీప్ చేయ‌డం నిజంగా గొప్ప కానుకే అవుతుంది. అందులోనూ ప్ర‌పంచ క్రికెట్ మ‌క్కాగా పేర్కొనే లార్డ్స‌లో ఆడిన మ్యాచ్ అద్భుత విజ‌యంతో ఆమె ఎంతో సంతృప్తిప‌డింది. ఇంత‌టి ఘ‌న వీడ్కోలు ఇటీవ‌లికాలంలో ఎవ‌ రికీ జ‌ర‌గ‌లేదు. భార‌త్ ఈ మ్యాచ్‌ లో 169 ప‌రుగు చేయ‌గా ఇంగ్లం డ్ విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చినా 16 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.  ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 106 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేసి సందర్శకులకు అత్యధిక స్కోరు చేసింది, ఓపెనర్ స్మృతి మంధాన 79 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో, మీడియం పేసర్ కేట్ క్రాస్ 4/26తో అద్భుతమైన గణాంకాలతో తిరిగి రాగా, ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్‌లకు తలో రెండు వికెట్లు తీసుకు న్నారు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 103 పరుగులకే కుప్పకూలింది. అయితే, కెప్టెన్ అమీ జోన్స్  చార్లీ డీన్ భారత బౌలర్లను నిరాశపరిచారు. జోన్స్‌ను రేణుక 28 పరుగుల వద్ద అవుట్ చేసింది, ఆమె పేరుకు నాలుగు వికెట్లతో బౌలర్లలో ఎంపికైంది. అయితే డీన్, దీప్తి శర్మ చేతిలో 47 పరుగుల వద్ద వివాదాస్పద రీతిలో రనౌట్ కావడానికి ముందు, భారత్ నుండి గేమ్‌ను తీసివేస్తానని బెదిరించాడు. అంతకుముందు స్మృతి మంధాన, దీప్తి అర్ధసెంచరీలు చేసిన ప్పటికీ ఇంగ్లండ్‌ భారత్ ను 169 పరుగులకే కట్టడి చేసింది. స్మృతి 50 పరుగులు చేయగా, దీప్తి 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అదే సమయంలో, జులన్ గోస్వామి తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటి బంతికే డకౌట్ అయింది. ఇంగ్లండ్ తరఫున, కేట్ క్రాస్ 26 పరుగు లకు 4 వికెట్లు పడగొట్టగా, ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు తీశారు. లండన్‌ లోని లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టుకు ఇంగ్లండ్‌పై సిరీస్‌ను పూర్తి చేయడానికి, దశాబ్దానికి పైగా భారత బౌలింగ్‌లో సీనియ‌ర్ స్థానంలో ఉన్న గోస్వామికి చిరస్మరణీయ వీడ్కోలు పలికేందుకు సువర్ణావకాశాన్నిచ్చింది. మరోవైపు, ఇంగ్లండ్ భారత ఎక్స్‌ప్రెస్‌ను నిలువరించేందుకు సంతోషకరమైన నోట్‌లో విషయాలను ముగించడానికి ఈ చివ‌రి మ్యాచ్‌లోనైనా  విజయాన్ని పొందాలని చూసింది. తొలి గేమ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు రెండో గేమ్‌ను 88 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్‌ కావడంతో టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది. చార్లీ డీన్ అత్యధికంగా 47 పరుగులు చేయగా, కెప్టెన్ అమీ జోన్స్ 28 పరుగులు చేశాడు. భారత్ తరఫున రిటైర్ అయిన గోస్వామి రెండు వికెట్లు పడగొట్టగా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్ వరుసగా నాలుగు, రెండు వికెట్లు తీశారు. కాగా మ్యాచ్ మొత్తం మీద విజ‌యంతో పాటు చ‌ర్చ‌నీయాం శంగా మారింది మ‌న్‌క‌డింగ్ సంఘ‌ట‌న‌.  మ్యాచ్ గెలవడానికి బంతి వేయ డానికి ముందు నాన్-స్ట్రైకర్ ఎండ్‌ను విడిచిపెట్టినందుకు బౌలర్ దీప్తి శర్మ ఆమెను రనౌట్ చేయడంతో షార్లెట్ డీన్ కన్నీళ్లు పెట్టుకుంది. కొత్త ప్లేయింగ్ కండి షన్స్ 'రన్ అవుట్' సెక్షన్ (చట్టం 38) కింద నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రన్ అవుట్‌కి ప్రయత్నించే బౌలర్ చర్యను జాబితా చేస్తుంది. గతంలో, ఇది 'అన్‌ఫెయిర్ ప్లే' (చట్టం41)క్రింద జాబితాచేర్చారు. 170 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 119 పరుగుల వద్ద ఆలౌటైంది, అయితే షార్లెట్ డీన్ (47) మరియు ఆఖరి బ్యాటర్ ఫ్రెయా డేవిస్ ధాటికి అవుటయ్యారు. ఆట ఉత్కంఠభరితంగా సాగడం తో 153 పరుగు లకు చేరుకు న్నారు. అది అప్పుడు జరిగింది. దీప్తి శర్మ, ఆఫ్ స్పిన్నర్, 44వ ఓవర్ యొక్క నాల్గవ బంతికి తన యాక్షన్‌ను పూర్తి చేయకుండా నిష్క్రమించింది, ఆమె బంతిని విడుదల చేయడానికి ముందు క్రీజు నుండి బయటకు వచ్చిన షార్లెట్‌ను గుర్తిం చింది. అంపైర్ అకారణంగా డెడ్ బాల్‌ని సూచిస్తున్నప్పటికీ, ప్రశాంతంగా ఆమె బెయిల్‌లను తీసివేసింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మిడ్-ఆఫ్ నుండి ఆమెతో జతకట్టింది మరియు ఒక క్షణంలో భారతీయులు అప్పీల్‌తో ఉన్నారని స్పష్టమైంది. దీనికి బౌలర్ పేరును జోడించాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని ఇప్పుడు రన్ అవుట్ అని పిలవవచ్చు. కొత్త ప్లేయింగ్ కండిషన్స్ 'రన్ అవుట్' సెక్షన్ (చట్టం 38) కింద నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో రన్ అవుట్‌కి ప్రయత్నించే బౌలర్ యొక్క చర్యను జాబితా చేస్తుంది. గతంలో, ఇది 'అన్‌ఫెయిర్ ప్లే' (చట్టం 41) క్రింద జాబితా చేయబడింది. ఆస్ట్రేలియా పర్యటనలో క్రీజు వెలుపల నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో బిల్ బ్రౌన్‌ను బెయిల్‌లు తొలగించి రెండుసార్లు ఔట్ చేసిన భారత మాజీ బౌలర్ వినూ మన్‌కడ్ తర్వాత 'మన్‌కడింగ్'గా పేర్కొన్నాడు, ఈ చర్య చాలా దుర్మార్గంగా ఉంది. కానీ వ‌చ్చే ఒక‌టో తేదీ నుంచీ మ‌హిళ‌ల క్రికెట్లో కూడా దీని్న ఉప‌యోగించ‌రు. 

ఫెద‌ర‌ర్‌... ప్ర‌పంచ టెన్నిస్‌కి  స్విస్ కానుక‌!

ఒక మార‌డోనా, ఒక స‌చిన్, ఒక సెరెనా విలియ‌మ్స్‌, ఒక రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌! ఎప్పుడోగాని చూడ‌లేము ఇలాంటి అత్యంత ప్ర‌తి భావంతుల‌ను. యావ‌త్ క్రీడాలోకానికి ఆరాధ్యులుగా మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. అది వారిలోని ప్ర‌త్యేక‌త‌, ఆట‌లో ప్ర‌ద‌ ర్శించిన అద్భుత ప్రొఫెష‌న‌లిజం, మ‌నిషిగా అత్యంత మ‌ర్యాద‌, సౌమ్య‌తా, స్నేహ‌భావం.. అన్నీ వెర‌సి టెన్నిస్ సూప‌ర్ స్టార్ ఫెద‌ర‌ర్‌! ఒక్కోరికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంటుంది. కానీ వారిలో మ‌రింత ప్ర‌త్యేకంగా ఉండేవారే జీవితాంతం వీరాభిమానాన్ని గౌర‌వాన్ని పొందగ‌లిగేది. అలాంటి అత్యుత్త‌ముడు ఫెద‌ర‌ర్‌.  అత‌ని చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి రాఫెల్ నాద‌ల్ కూడా ఎంతో అభిమానించే వ్య‌క్తిత్వం ఫెద‌ర‌ర్‌ది. ఆట‌లో గొప్ప టెక్నిక్‌, సుల‌భ‌సాధ్యంగా క‌నిపించే ఆ ఫోర్ హ్యాండ్‌ స్ట్రోక్‌.. అది వేరేవారివ‌ల్ల కాదు.  లండన్‌లోని 02 ఎరీనాలో 2022 లావర్ కప్‌లో రాఫెల్ నాదల్‌తో కలిసి డబుల్స్ టైలో ఓడిపోయిన రోజర్ ఫెదరర్ శనివారం టెన్నిస్కు వీడ్కోలు పలికాడు. అతని కెరీర్‌లో చివరి మ్యాచ్ అయిన ఓటమి తర్వాత, ఫెడరర్‌ను అతని సహచరులు కౌగిలించు కున్నారు, అతను మ్యాచ్‌పై, క్రీడపై  అభిమానులతో చివరిసారిగా మాట్లాడాడు,  స్విస్ లెజెండ్ చేయలేక క‌న్నీళ్ల‌లో మాట‌లు మింగేసాడు. అతని సుదీర్ఘమైన, భావోద్వేగ వీడ్కోలు ప్రసంగంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. దుఖాన్ని మనం ఎలాగైనా అధిగమించగలం అవునా?! చూడండి, ఇది అద్భుతమైన రోజు. నేను సంతోషంగా ఉన్నాను, నేను విచారంగా లేనన్నాడు. అన్ని మ్యాచ్‌లు అబ్బాయిలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇక్కడ ఉండటం చాలా ఫన్నీగా ఉంది, ఏదో జరగబోతోందని నేను భావించినప్పటికీ, నేను అంత ఒత్తిడిని అనుభవించలేదు - ఒక దూడను పాప్ చేయండి లేదా వెనుకకు లేదా ఏదైనా నిరోధించండి మ్యాచ్. నేను విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ అద్భుతంగా ఉంది  నేను సంతోషంగా ఉండలేను. ఇది చాలా అద్భుతంగా ఉంది. మరియు అదే జట్టులో రాఫాతో ఆడటం, ఇక్కడ కుర్రాళ్లందరూ మరియు లెజెండ్‌లు అందరూ ఉన్నారు, రాకెట్ [రాడ్ లావర్], స్టెఫాన్ ఎడ్‌బర్గ్ కు ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది నిజంగా [షేర్ చేయడానికి రాఫా ఇతరులతో కోర్టు]. బయట ఒంటరిగా అనిపించడం నాకు ఇష్టం లేదు జట్టు, నేను ఎప్పుడూ హృదయ పూర్వకంగా జట్టు ఆటగాడిగానే  భావించాను. ఫెద‌రర్ నాదల్ ఓపెనింగ్ సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్నారు  41 ఏళ్ల అతను లండన్‌లో పరిపూర్ణ స్వాన్‌సాంగ్‌ను కలిగి ఉన్నట్లు అనిపించింది. కానీ టీమ్ వరల్డ్ యొక్క ఫ్రాన్సిస్ టియాఫో , జాక్ సాక్ క్లచ్ క్షణాలలో తమ నరాలను బిగ‌పట్టుకుని ఎరీనాలో వినోదభరితమైన టైగా ఉన్న సమయంలో కలత చెందారు. అత్యధిక వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిళ్లలో ఆల్-టైమ్ రికార్డ్ సొంతం చేసున్నాడు. ఫెద‌రర్ 24 సంవత్సరాలకు పైగా 1,500 మ్యాచ్‌ల తర్వాత ప్రో గా-వారం రోజుల క్రితం, ఇది తన చివరి మ్యాచ్ అని పేర్కొన‌డంతో టెన్నిస్ లోకం ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్య‌పోయింది. ఇంత‌టి అత్య‌ద్భుత ప్లేయ‌ర్‌ని, గొప్ప మ‌ర్యా ద స్తుడిని మ‌ళ్లీ క‌ళ్లారా చూడ‌గ‌ల‌మా అని ఎంతోమంది చాలాబాధ‌ప‌డ్డారు.  రోజర్ ఫెదరర్ 8 ఆగస్టు 1981న జన్మించిన స్విస్  ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను 310 వారాల పాటు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ద్వారా ప్రపంచ నం.1అయ్యాడు, ఇందులో రికార్డు 237 వరుస వారాలు, ఐదుసార్లు సంవ త్సరాంతపు నం.1గా నిలిచాడు. గణాంకపరంగా, ఫెదరర్ "బెస్ట్ ఎవర్" టైటిల్ కోసం రెజ్యూమ్‌ని కలిగి ఉన్నాడు. అతని పదహారు గ్రాండ్-స్లామ్ టైటిల్స్ ఓపెన్ ఎరాలో అత్యధికం. అతను ఆల్ టైమ్ అత్యంత గ్రాండ్ స్లామ్ పోటీలను గెలుచుకున్నాడు. అతను వరుసగా ఐదు U.S. ఓపెన్ టైటిల్స్, రికార్డు కూడా. రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్ట్‌లో నమ్మశక్యం కాని టెక్నిక్, తన ప్రాణాం తకమైన ఫోర్ హ్యాండ్‌తో బేస్‌లైన్ నుండి ఆధిపత్యం చెలాయించడం, తన స్లైస్ షాట్స్‌, అతను నెట్ వ‌ద్ద ప్ర‌తిభావంతంగా ఆడ‌టం బ‌హు చూడ‌ముచ్చ‌టేస్తుంది. అందుకే ప్ర‌త్య‌ర్ధులు సైతం అత‌నితో త‌ల‌ప‌డ‌డమే ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు.  రోజర్ ఫెదరర్ అద్భుతాల‌కు, గొప్ప ఆట‌కు నిద‌ర్శ‌నం అత‌ను ఎనిమిది ప‌ర్యాయాలు ..2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017..ల్లో వింబుల్డ‌న్ చేజిక్కించుకోవ‌డ‌మే! 

జగన్ పాలనపై ‘చిరు’ రాజకీయ విస్ఫోటనం ‘గాడ్ ఫాదర్’?

ఓ వంక చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది. ఉహాగానాలు వినిప్స్తునాయి. మరో వంక త్వరలో ( అక్టోబర్ 5) విడుదల కానున్న చింరజీవి తాజా చిత్రం, ‘గాడ్ ఫాదర్’  ముందస్తు ప్రచారం, (ప్రమోషన్స్) రాజకీయ వేడి పుట్టిస్తోంది. చిరంజీవి నోటి నుంచే వచ్చే పొలిటికల్ డైలాగ్స్, రాజకీయ విస్ఫోటనం సృష్టిస్తాయని అంటున్నారు.   కేరళలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన, మలయాళ చిత్రం 'లూసిఫర్' సినిమాకి రీమేక్’గా తెరకెక్కిస్తున్నఈ చిత్రం కథను చిరంజీవి ఉద్దేశ పూర్వకంగా ఎంచుకున్నారో లేక యాదృచ్ఛికంగా అలా జరిగిందో కానీ, సినిమా కథకు చిరంజీవి పొలిటికల్ బాక్ గ్రౌండ్ కు కొన్ని పోలికలు ఉన్నాయని అంటున్నారు. అందుకే, చిరంజీవి రాజకీయ గతాన్ని, భవిష్యత్ ఉహాలను ‘గాడ్ ఫాదర్’తోముడివేసి సోషల్ మీడియా క్రియేటివ్ రైటర్స్, మానస పుత్రికలుగా  చాలా చాలా కథలు పుట్టుకొస్తున్నాయి.  ఇందులో ఏది నిజమో, ఏది కాదో, కానీ, గాడ్ ఫాదర్ ముచ్చట్లు అయితే  సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. నిజానికి, సోషల్ మీడియాలో పురుడు పోసుకున్నచిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ స్టొరీకి, గాడ్ ఫాదర్ కూడా ‘గాడ్ ఫాదర్’ సినిమానే.  చిరంజీవి  పొలిటికల్ రీఎంట్రీ గురించి  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు”అనే  వాయిస్ క్లిప్’ ఈ సినిమాలోని డైలాగే.  అయితే, చిరంజీవీ హీరో టర్న్ డ్ పోలిటిషియన్  టర్న్ డ్ హీరో కావడం వల్ల  సోషల్ మీడియానే కాదు, పొలిటికల్, సినిమా సర్కిల్స్ లోనూ గాడ్ ఫాదర్ కథలు  సంచలనం సృష్టిస్తున్నాయి.  అదలా ఉంటే, మోహన్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న‘గాడ్ ఫాదర్’ చిత్రం కథలో ఏపీ పాలిటిక్స్ ని మిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతోంది. అలాగే, గాడ్ ఫాదర్. చిత్రంలో చిరజీవి డైలాగ్స్ కొన్ని రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతాయని అంటున్నారు. నిజానికి, ఇంకెవరో కాదు స్వయంగా, చిరజీవి  గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే, రొటీన్ తెలుగు సినిమాకు, ముఖ్యంగా చిరంజీవి మార్క్, అమ్మడు .. కుమ్ముడు  టైపు  సినిమాలకు భిన్నంగా  ఉంటుందని అంటున్న ఈ మూవీ సక్సెస్, ప్రధానంగా పొలిటికల్ మసాలా మీదనే ఆధారపడిందనీ, అంటున్నారు, అదే నిజమైతే, గాడ్ ఫాదర్ చిరంజీవి చెప్పినట్లుగా విప్ఫోటనమే అవుతుందని అంటున్నారు.  గాడ్ ఫాదర్ చిత్రం గురించి జరుగుతున్న చర్చ నిజమే అయితే, ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ల సుందర ముదనష్ట పాలనపై, మరీ ముఖ్యంగా, ముఖ్యమంత్రి మూడు రాజధానుల ముతక ఆలోచనపై సెటైర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.అదే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారమే పరమావధిగా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి అమలు చేస్తున్న ఉచిత పథకాల గురించి కూడా సరదా సెటైర్లు చాలానే ఉన్నాయని అంటున్నారు. కథలో అంతర్భాగంగానే, మిడిమిడి రాజకీయ అవగాహనతో, రాజకీయాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న. హీరో కథలు కూడా జత చేసినట్లు చెపుతున్నారు.  అయితే ఇందులో నిజమెంత అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. కానీ  జరుగతున్న ప్రచారం నిజమే అయితే మాత్రం, ‘గాడ్ ఫాదర్’ సంచలన చిత్రమే అవుతుంది.  రాష్ట్ర రాజకీయాలపై  సినిమా ప్రభావం ఉంటుందనీ అంటున్నారు.   అయితే, నిజానికి, తెలుగు సినిమాకు రాజకీయ వాసనలు కొత్త కాదు. గతంలోనూ ’ఈనాడు’ వంటి రాజకీయ చిత్రాలు అనేకం వచ్చాయి.అలాగే  రక్తకన్నీరు నాగభూషణం, రావు గోపాల రావు నటించిన చిత్రాల్లోనూ రాజకీయ పంచ్ డైలాగులు సంచలనంసృష్టించాయి. అదే  విధంగా నిన్న మొన్న వచ్చిన కశ్మీర్ ఫైల్స్ , సీతా రామం  చిత్రాలు  దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం సృష్టించాయి.  అలాగే, ఈ మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియా  ‘బాయ్’కాట్’ ప్రచారానికి బలయ్యాయి. ఈ నేపద్యంలో మరో పది రోజుల్లో, అక్టోబర్ 5 ఐదున  విడుదల అవుతున్న,పొలిటికల్ ‘గాడ్ ఫాదర్’ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుందో .. వెండి తెరపై చూద్దాం.

రేపే టీ-20 పండ‌గ‌... క్రికెట్ వీరాభిమానులు పారాహుషార్‌!

భార‌త్‌, ఆస్ట్రేలియా టీ-20  మూడు మ్యాచ్‌ల సిరీస్ చెరో ఒక‌టీ గెలిచి స‌మ‌మ‌యంది. ఇక క‌ప్పో, నొప్పో తేల్చే చివ‌రి మ్యాచ్ ఆదివారం(సెప్టెంబ‌ర్ 25) హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. నాగ‌పూర్ మ్యాచ్ వ‌ర్షం, గ్రౌండ్ ఆడ‌టానికి పెద్ద‌గా అనుకూలించ‌క‌పోయింది. అయినా ప్రేక్ష‌కుల‌ను నిరాశ పెట్ట కుం డా మొత్తాన్ని 16 ఓవ‌ర్ల‌కు కుదించి ఆడించారు. అందులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సిక్స్‌ల మోత‌తో భార‌త్ గెలిచింది. అందువ‌ల్ల‌, ఉప్ప‌ల్ మ్యాచ్‌ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే చాలా కాలం త‌ర్వాత ఒక అంత‌ర్జాతీయ మ్యాచ్ మ‌ళ్లీ చూడ్డానికి క్రికెట్ ప్రేమికులు టిక్కెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు.  ఆదివారం మ్యాచ్ చూసేందుకు వెళ్లేవారు ఏదో సినిమాకు వెళ్లిన‌ట్టు మంచిదుస్తుల్లో వెళ్ల‌డానికి  ధైర్యం చేయ‌కండి. ఎందుకంటే స్టేడియం అంతా మురికి మ‌యంగా ఉంది. కూర్చునే  సీట్లు  చూస్తే వాంతులు వ‌స్తాయి. అలా ఉంది స్టేడియం నిర్వ‌హ‌ణ‌. దీన్ని గురించి ప‌ట్టించుకున్న నాథుడే లేన‌ట్టుగా త‌యార యింది. కేవ‌లం ఇలా అంత‌ర్జాతీయ మ్యాచ్ జ‌రుగుతుందంటేనే స్టేడియం క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మం చేప‌డ‌తారేమో! కానీ ఇప్ప‌టికిప్పుడు స్టేడియం ద‌ర్శించాలంటే మాత్రం చాలా దారుణంగాఉంది. ఈ సీట్ల లో కూచుని మ్యాచ్ చూడాలా? ఎందుకంత ఖ‌ర్మ‌, హాయిగా ఇంట్లో టిఫిన్ చేస్తూ  టీవీలో  చూడ్డ‌మే మేల‌ను కునే ప‌రిస్థితుల్లో ఉంది అక్క‌డి ప‌రిస్థితి.  టిక్కెట్ల  విక్ర‌యంలో లోపాల కార‌ణంగా అదంతా ర‌సాభాస‌మైంది. ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తామని ఒకసారి, పే టీ ఎంలో అంటూ మరోసారి అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. టికెట్ల కోసం జింఖానా మైదానా నికి వచ్చిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ప‌లువురు గాయ‌ప‌డ్డారు.  ఇంతా జరిగితే , టికెట్లు దక్కించుకున్నది కొంత మందే.  ఉప్పల్ స్టేడియం  సామర్థ్యం 39 వేలు. వీటిలో కాంప్లిమెంటరీ టికెట్లు పోగా మిగిలిన వాటిని విక్రయిం చి నట్టు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. అమ్మిన టికెట్ల కంటే కాంప్లిమెంటరీగా ఇచ్చిన టికె ట్లే ఎక్కువని నిగ్గు తేల్చారు. టికెట్ల విక్రయాల్లో గందరగోళం నేపథ్యంలో నిన్న మీడియా ముందుకొచ్చిన హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్.  టికెట్ల విక్రయాల లెక్కలు బహిరంగ పరిచారు. 15వ తేదీన పేటీఎంలో 11,450 సాధారణ టిక్కెట్లు, 4 వేలు కార్పొరేట్‌ టిక్కెట్లు, 23న సికింద్రాబాద్‌ జింఖానా కౌంట ర్లలో 3 వేలు, అదేరోజు ఆన్‌లైన్‌లో 2,100 టిక్కెట్లు విక్రయించినట్టు చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తంగా విక్రయించినవి 20,550 గా లెక్కతేలింది. మిగిలిన 12,450 టికెట్లు ఏమయ్యా యన్న ప్రశ్నలు వినిపిస్తు న్నాయి.   ఏదేమ‌యినా, ఉప్ప‌ల్ స్టేడియంలో మ్యాచ్ చూడాల‌నుకునేవారు చేతులూపుకుంటూ వెళ్ల‌కుండా క‌నీసం  వాట‌ర్ బాటిల్స్‌తో పాటు తువ్వాలు, వీల‌యితే బ‌ట్ట‌లు ఉతికే స‌బ్బో వెంట తీసికెళితే మంచిది. క‌నీసం చ‌ర్మవ్యాధి బారిన‌ప‌డ‌కుండా ఉంటారు. మ్యాచ్ ఆనంద‌లో ఇలాంటి ద‌రిద్రాలు అంటకుండా ఉంటాయి.