రేపటి నుండి బ్రిక్స్ సమావేశాలు.. భారీ భద్రత
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) 8వ సదస్సుకు సర్వం సిద్దమైంది. గోవా వేదికగా రేపు, ఎల్లుండి సదస్సు జరగనుంది. ఈ సమావేశాలకు ఐదు దేశాలు హాజరుకానున్నారు. మరోవైపు అసలే ప్రస్తుతానికి పరిస్థితి బాగుండక పోవడంతో గోవాలో అత్యాధునిక ఆయుధాలతో కూడిన పోలీసు బలగాలను మోహరించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు భారత్ వస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా భారత్, రష్యా మధ్య ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.