లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 145.47 పాయింట్లు పెరిగి 0.52 శాతం లాభంతో 28,129.84 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 40.30 పాయింట్లు పెరిగి 0.47 శాతం లాభంతో 8,699.40 పాయింట్ల వద్దకు చేరాయి. బ్యాంకులు లాభాల్లో పయనించగా, ఐటీ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.
ఇంకా అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కో, ఐడియా సెల్యులర్, భారతీ ఇన్ఫ్రాటెల్ లాభపడగా, హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, టాటామోటార్స్(డి), టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి.