జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా ఆ హీరో..?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత 17 రోజుల నుండి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మొదట లండన్ నుండి వచ్చిన డాక్టర్ ఆమెకు చికిత్స అందించగా... ఇప్పుడు ఎయిమ్స్ నుండి వచ్చిన వైద్య బృందం ఆమెకు చికిత్స అందించనున్నారు. ఇదిలా ఇప్పుడు తమిళనాట ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న జయలలిత కోలుకోని బయటకు చాలారోజులే పడుతుంది. ఈనేపథ్యంలో జయలలిత స్థానంలో ఎవరో ఒకరు బాధ్యతలు స్వీకరించాల్సిందే. ప్పటికే సుబ్రహ్మణ్యస్వామి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయడం కూడా మొదలు పెట్టారు. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో శూన్యత ఏర్పడిందని.. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి ట్వీట్ల యుద్ధం ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ హీరో పేరు వినబడుతుంది. ఆమె వారసుడిగా, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే రజనీకాంత్ తో చర్చలు జరిపారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి లేదు కాబట్టి.. ఆయన ఒప్పుకోలేదట. అయితే ఇప్పుడు మరో స్టార్ పేరు వినబడుతోంది. అతనెవరో కాదు అజిత్. ఈ మేరకు ఆమె వీలునామా రాశారని, డాంబికాలకు దూరంగా ఉంటూ సామాన్యుడిలా ఉండే అజిత్ పట్ల జయలలిత అభిమానం చూపించేవారని, ఆమె వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు అజిత్ స్వీకరించనున్నాడంటూ తమిళనాడు, సోషల్ మీడియా వేదికల్లో మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అజిత్ ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని, యువత మొత్తం అన్నాడీఎంకే వెన్నంటి ఉంటారని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జయలలితకు ఆప్తులైన పన్నీర్ సెల్వం, శశికళ ఉండగా ఆ అవకాశం అజిత్ కు దక్కుతుందా..? అసలు అజిత్ కు ఇంట్రెస్ట్ ఉందా.. ? తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.