English | Telugu

బోల్డ్ సీన్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ వదులుకున్న శివాని రాజశేఖర్!

కొత్త వాళ్ళతో మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన 'ఉప్పెన' సినిమా 2021లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంతో హీరోగా వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్ గా కృతి శెట్టి, డైరెక్టర్ గా బుచ్చిబాబు పరిచయమయ్యారు. ఈ సినిమాతో అందరికీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి యూత్ కి బాగా దగ్గరై, వరుస సినిమా అవకాశాలను పట్టేసింది. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివాని రాజశేఖర్ కి వచ్చింది. కానీ బోల్డ్ సీన్స్ ఉన్నాయని ఆమె ఆ ఛాన్స్ వదులుకుంది.