English | Telugu

'మహేంద్రగిరి వారాహి' గ్లింప్స్.. తెలుగు 'కాంతార' వచ్చేస్తోంది!

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సుమంత్. త్వరలో ఆయన మరో విభిన్న చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మహేంద్రగిరి వారాహి'.

రాజశ్యామల బ్యానర్‌పై జాగర్లపూడి సంతోష్‌ దర్శకత్వంలో కాలిపు మధు, ఎం సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతోంది. ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకుడు సంతోష్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సంతోష్‌ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్యపురం', 'లక్ష్య' వంటి సినిమాలొచ్చాయి. ముఖ్యంగా సుమంత్, సంతోష్ కలయికలో మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు 'మహేంద్రగిరి వారాహి'తో ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారు.

ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఒంటి మీద గాయాలతో ఉన్న సుమంత్.. చీకటిలో నిర్మానుష ప్రాంతంలో కాగడా పట్టుకొని వెళ్తుండగా.. అక్కడ వారాహి అమ్మవారు ఉన్నట్టుగా శబ్దాలు వినిపిస్తుంటాయి. అమ్మవారి దర్శనమైనట్లుగా సుమంత్ ఆశ్చర్యపోయి చూస్తుండగా.. 'మహేంద్రగిరి వారాహి' టైటిల్ తో గ్లింప్స్ ని ముగించిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి గ్లింప్స్ చూస్తుంటే, కన్నడ 'కాంతార' తరహాలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనిపిస్తోంది.

సుమంత్‌, మీనాక్షి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.