కొత్త చిక్కుల్లో ఆదిపురుష్.. ముంబైలో కేసు
ప్రభాస్, కృతిసనన్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా మేకర్స్ మీద ముంబైలో కేసు ఫైల్ అయింది. సినిమాలో నటించిన ప్రభాస్, కృతిసనన్, దర్శకుడు ఓం రవుత్, సినిమా నిర్మాతల మీద సకినక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముంబై హైకోర్టు లాయర్లు ఆశిష్ రాజ్, పంకజ్ మిశ్రా ద్వారా సంజయ్ దిననాథ్ తివారి ఈ కేసు ఫైల్ చేశారు.