English | Telugu

అసలు 'పుష్ప' ఎక్కడ?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప-2' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. 'Where is Pushpa?' పేరుతో బుధవారం ఉదయం 20 సెకన్ల నిడివి గల గ్లింప్స్ ను విడుదల చేశారు. 2004 లో కథ జరుగుతున్నట్లుగా వీడియోలో చూపించారు. "తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప" అనే వాయిస్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. 'అసలు పుష్ప ఎక్కడ?' అనే ప్రశ్నతో, జనాల ధర్నాలు, పోలీసుల లాఠీఛార్జ్ తో అదిరిపోయే విజువల్స్ తో గ్లింప్స్ రూపొందింది. పూర్తి వీడియోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) కానుకగా ఒకరోజు ముందుగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 కి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 20 సెకన్ల గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న 'పుష్ప-2' టీమ్.. ఫుల్ వీడియోతో ఇంకెంతలా మెప్పిస్తుందో చూద్దాం.

'పుష్ప-1' తో పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో పుష్ప రెండో భాగంగా వస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.