English | Telugu

ముందుగానే వచ్చేస్తున్న 'పుష్ప-2' టీజర్!

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలలో 'పుష్ప-2' ఒకటి. 'పుష్ప-1'తో పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నాయి.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆరోజు పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ విడుదల కానుందని ఇటీవల న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు ఒకరోజు ముందుగానే ఈ టీజర్ రాబోతున్నట్లు వినికిడి. ఏప్రిల్ 7న పుష్ప-2 కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారట. మొత్తానికి కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ లుక్ తో బన్నీ ఫ్యాన్స్ కి వెంటవెంటనే అదిరిపోయే గిఫ్ట్స్ రాబోతున్నాయన్నమాట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.