English | Telugu

నాని విజయ్ ని అందుకోవడం కష్టమేనా!

టాలీవుడ్ టైర్-2 హీరోలలో టాప్ ఎవరంటే నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ పేర్లు వినిపిస్తాయి. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొని వరుస విజయాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి నాని బాగా చేరువ కాగా, విజయ్ కొద్ది కాలంలోనే సంచలన విజయాలు అందుకొని యూత్ కి బాగా చేరువయ్యాడు. ఇలా ఇద్దరు హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా పరంగా మాత్రం నాని కంటే విజయ్ ముందున్నాడు.

విజయ్ కెరీర్ లో 'గీత గోవిందం' సినిమా దాదాపు రూ.70 కోట్ల షేర్ రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. అయితే నాని కెరీర్ లో ఇప్పటిదాకా రూ.50 కోట్ల షేర్ మూవీ లేదు. మొన్నటిదాకా రూ.40 కోట్ల షేర్ తో 'MCA'(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ నాని కెరీర్ లో టాప్ గ్రాసర్ గా ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి 'దసరా' మూవీ వచ్చింది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. నేడో రేపో రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకొని, రూ.60 కోట్ల దిశగా పయనించే అవకాశముంది. అయితే ఈ సినిమా 'గీత గోవిందం' వసూళ్లను క్రాస్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'గీత గోవిందం' యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది కాబట్టి, రిపీటెడ్ ఆడియన్స్ తో 70 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. 'దసరా' ఊర మాస్ సినిమా కావడంతో ఓపెనింగ్స్ అయితే రికార్డు స్థాయిలో వచ్చాయి కానీ.. 'గీత గోవిందం' స్థాయిలో లాంగ్ రన్ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ రన్ ఉండాలంటే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఉండాలి. పైగా ఏప్రిల్ 7న 'రావణాసుర', 'మీటర్' మొదలుకొని ఏప్రిల్ లో పలు సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే విడుదలైన వారం రోజుల నుంచే ఇతర సినిమాల నుంచి దసరాకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. మరి వీటిని దాటుకొని దసరా ఏ స్థాయిలో వసూళ్ళు రాబడుతుందో చూడాలి. రూ.60 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి. కానీ రూ.70 కోట్ల షేర్ రాబట్టి 'గీత గోవిందం' వసూళ్ళను దాటాలంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతం జరగాలి. మరి దసరా.. గీత గోవిందంను దాటేసి టైర్-2 హీరోల అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్టులో టాప్ లో నిలుస్తుందో, రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.