English | Telugu

రాజకీయాల్లోకి దిల్ రాజు?

సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్లడం సహజం. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే దిల్ రాజు మాత్రం రాజకీయాలు తన వల్ల కాదని అంటున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన 'బలగం' సినిమా మార్చి 3న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రాన్ని.. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక షోలు వేసుకొని మరీ అందరూ కలిసి చూస్తున్నారు. 'బలగం' సినిమా ప్రేక్షకులకు ఇంతలా చేరువ అవ్వడంతో.. తాజాగా మూవీ టీమ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

"రాజకీయాల్లోకి రమ్మని నన్ను అడుగుతున్నారు. అయితే వెళ్లాలా వద్దా అనేది ఇంకా నాకే క్లారిటీ లేదు. సినీ పరిశ్రమలో నాపై విమర్శలు వస్తేనే తట్టుకోలేను. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అది నా వల్ల కాకపోవచ్చు. దీనిలోనే మీకు కావాల్సిన సమాధానం ఉంది" అంటూ దిల్ రాజు తనదైన శైలిలో పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.