English | Telugu

విజ‌య్‌తో మ‌ళ్లీ స‌మంత జోడీక‌డుతున్నారా?

కొన్ని జోడీల‌కు ఎప్పుడూ విప‌రీత‌మైన క్రేజ్ ఉంటుంది. అలాంటి జంట‌ల్లో విజ‌య్ - స‌మంత జంట ఒక‌టి. సామ్‌తో విజ‌య్ జోడీ క‌డితే చూడ్డానికి మేం రెడీ అంటూ హింట్స్ ఇస్తున్నారు ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్. ఇటీవ‌ల ఈ త‌ర‌హా విష‌య‌మే సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. ఆయనికి వెల్క‌మ్ చెబుతూ అల్ఫోన్స్ పుత్రేన్ పోస్టు పెట్టారు. అల్ఫోన్స్ పేరు చెప్ప‌గానే అంద‌రికీ ప్రేమమ్ సినిమా గుర్తుకొస్తుంది.

స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌గా పేరున్న ఆయ‌న‌కు లాస్ట్ ఇయ‌ర్ మాత్రం చేదుఫ‌లితాన్నే అందించింది. పృథ్విరాజ్ సుకుమార‌న్‌, న‌య‌న‌తార క‌లిసి న‌టించిన సినిమా గోల్డ్. ఈ మూవీని డైర‌క్ట్ చేశారు అల్ఫోన్స్. ప్రేక్ష‌కులు, విమర్శ‌కులు ఒకే మాట మీద నిల‌బ‌డిన‌ట్టు ఈ సినిమాను ఫ్లాప్ చేశారు. దీని త‌ర్వాత మ‌ల‌యాళంలో సినిమాలు చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టున్నారు అల్ఫోన్స్. త్వ‌ర‌లోనే త‌మిళ్‌లో ఓ సినిమా చేస్తానంటూ ఆ మ‌ధ్య హింట్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్‌, స‌మంత జంట‌గా ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కించ‌మ‌ని విజ‌య్ ఫ్యాన్స్ త‌ర‌ఫున రిక్వ‌స్టులు అందాయి అల్ఫోన్స్ కి. మంచి ప్రేమ‌, యాక్ష‌న్ ఉన్న స‌బ్జెక్టుని ఈ ఇద్ద‌రితో తెర‌కెక్కించ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు అల్ఫోన్స్. ``నాకు వ్య‌క్తిగ‌తంగా విజయ్ అంటే చాలా ఇష్టం. అలాగే స‌మంత‌లో ఉన్న పొటెన్షియ‌ల్ చాలా ఇష్టం.

వారిద్ద‌రి మీద ల‌వ్ ఎంత‌గా వ‌ర్క‌వుట్ అవుతుందో, క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ స‌బ్జెక్ట్ కూడా అంతే ఎఫెక్టివ్‌గా వ‌ర్క‌వుట్ అవుతుంది. అందుకే నేను చేయ‌డానికి రెడీగా ఉన్నాను`` అని అన్నారు. రోమియో పిక్చ‌ర్స్ లో ఓ త‌మిళ సినిమా చేయ‌డానికి ఆల్రెడీ అసోసియేట్ అయ‌న‌ట్టు తెలిపారు. అల్ఫోన్స్ త‌ర‌హా స‌బ్జెక్టుల‌కు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది. నేచురాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటే విష‌యాల‌తో సినిమాలు తీస్తార‌నే పేరుంది అల్ఫోన్స్ కి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.