English | Telugu

నిఖిల్ 'స్పై' వాయిదా.. 'సామజవరగమన' అంటున్న శ్రీవిష్ణు!

'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందని తెలుస్తోంది.