'ఆదిపురుష్'గా నాకు కనిపించింది ప్రభాస్ మాత్రమే!
ప్రభాస్ టైటిల్ రోల్ పోషించగా ఓం రౌత్ డైరెక్ట్ చేసిన 'ఆదిపురుష్' మూవీ భారత్లో బాక్సాఫీస్ దగ్గర రూ. 240 కోట్ల మార్కును దాటింది. సినిమా కథా కథనాలు, క్యారెక్టరైజేషన్స్, వీఎఫ్ఎక్స్, సంభాషణలు, కాస్ట్యూమ్స్ వంటి వాటిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా, 'ఆదిపురుష్'లో రాఘవ్ పాత్రకు ప్రభాస్ తప్ప మరో చాయిస్ ఎవరూ లేరని ఓం రౌత్ చెప్పాడు. నేటి తరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని తీశామని.. ఎవరైనా కానీ నమ్మకంతో, అవగాహనతో దాని ప్రెజెంట్ చేయగలరని కూడా ఆయన అన్నాడు.