English | Telugu

శృతి హాసన్ పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు!

'బాహుబలి' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమాలతో నిరాశపరుస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ఆయన నటించిన 'సాహో' సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడంతో.. శ్రీరాముడు, ప్రభాస్ ఇమేజ్ కలిసొచ్చి ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని భావించారంతా. కానీ నాలుగో రోజు కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి.

'గుంటూరు కారం' నుంచి ఆ ఇద్దరు ఔట్.. అసలేం జరుగుతుంది?

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న మూడో సినిమా 'గుంటూరు కారం'ని ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ ఆ సినిమాకి అడుగడుగునా బ్రేక్ లు పడుతున్నాయి. ఏవో కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఒకానొక సమయంలో అసలు సినిమా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి, ఆ డౌట్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. ఇక అంతా సాఫీగానే సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ని, హీరోయిన్ ని తప్పించారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.